తేలికైన నేలలు, మురుగు నీరు నిలువని నేలలు అనుకూలం.
2 నుండి 4 సార్లు మెత్తగా దున్నాలి. 2 సార్లు గుంటకతోలి, చదును చేయాలి.
ఒక కిలో విత్తనానికి 3 గ్ర్రముల ధైరమ్ లేక కాప్టాన్ లేక మాంకోజెబ్ కలిపి విత్తటం మంచిది.
వరుసల మధ్య 30 సెం.మీ (అడుగు) మరియు మొక్కల మధ్య 15 సె0.మీ. (6 అంగుళాలు) ఉండేటట్లు విత్తుకోవాలి.
ప్రాంతము | ఖరీఫ్ | రబీ 1 వేసవి |
ఆంధ్రతీరం | మే నెల | డిసెంబర్ ఆఖరి వారం నుండి జనవరి చివరివారం వరకు |
రాయలసీమ | మే-జూన్ జనవరి | 2 – 3 వారాలు |
ఉత్తర తెలంగాణా | జూలై 2వ వారం | జనవరి 2వ వారం నుండి ఫిబ్రవరి మొదటి వారం |
దక్షిణ తెలంగాణా | జూన్ | జనవరి 2వ పక్షం. |
రకము | ఋతువు | పంటకాలం (రోజుల్లో) |
దిగుబడి (కి.ఎకరాకు) |
నూనె శాతం | గుణగణాలు |
గౌరి | ఖరీఫ్ | 90 | 200 | 50 | ముదురు గోధుమ రంగు విత్తనం కోస్తా జిల్లాలకు అనువైనది కోడు ఈగకు తట్టుకుంటుంది. |
మొదటిగా రబీ/వేసవి | 85 | 300 | |||
మాధురి | 70 | 200 | 50 | ముదురు గోధుమ రంగు విత్తనం | |
70 | 250 | 51 | |||
యెలమంచిలి - 11 | 85 | 250 | 52 | ముదురు గోధుమ రంగు విత్తనం పంట ఒకేసారి కోతకు వస్తుంది. |
|
యెలమంచిలి - 17 | 80 | 250 | 51 | కోస్తా జిల్లాలకు అనువైనది. | |
75 | 300 | బూడిద తెగులును తట్టుకుంటుంది. | |||
రాజేశ్వరి | ఖరీఫ్ | 90-100 | 250 | 50 | తెల్ల రంగు విత్తనం. తెలంగాణా ప్ర్రాంతాని అనుకూలం |
ఆఖరిగా, రబీ/వేసవి | 80-85 | 300 | 51 | కాండం కుళ్ళు, బూడిద తెగులును తట్టుకుంటుంది. |
|
శ్వేతాతిల్ | ఖరీఫ్ | 85 - 90 | 250 | 51 | కాండం కుళ్ళు, బూడిద తెగులును తట్టుకుంటుంది. |
ఆఖరిగా, రబీ/వేసవి | 85 | 450 | 52 | ఎగుమతికి ప్రాధాన్యత కలదు. | |
చందన | ఖరీఫ్ | 85 | 250 | 50 | గోధుమ రంగు విత్తనం. అన్నికాలాలకుఅనుకూలం.వెర్రితల తెగులును తట్టుకుంటుంది |
రబీ/వేసవి | 80 | 180 |
కాలము | ఎరువు | కిలోలు ఎకరాకు | వేయుసమయం |
ఖరీఫ్ | పశువుల ఎరువు | 4,000 | దుక్కిలో వేసి కలియదున్నాలి. |
నత్రజని | 16 | విత్తేటప్పుడు 81 కిలోలు విత్తన నెలకు 8 కిలోలు |
|
భాస్వరం | 24 | ఆఖరి దుక్కిలో వేయాలి. | |
పొటాష్ | 16 | ఆఖరి దుక్కిలో వేయాలి. | |
రబీ/వేసవి | నత్రజని | 8 | అదనముగా వేసుకోవాలి. |
గమనిక: భాస్వరం ఎరువు సింగల్ సూపర్ ఫాస్ఫేట్ పొలంలో వాడినపుడు పంటకు అధికంగా కాల్షియం, గంధకం అభించి దిగుబడి పెరుగుతుంది. |
పురుగుల నువ్వులు ఆశించే పురుగులలో ముఖ్యముగా
ఆకు అడుగు బాగాన చేరి రసాన్ని పీలుస్తాయి. దీని వలన ఆకులు ముడుచుకొని పోయి, దోనె ఆకారంగా మారి పాలిపోతాయి. నివారణ: నీటిలో కరిగే గంధకం 3 గ్రా. లేదా డైమిధోయేట్ 2 మి.లీ. ఒక లీటరు నీటిని కలిపి పిచికారి చేయాలి.
ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చి వేస్తాయి. ఆకులు ముందుగా పాలిపోయి, ఎండిపోతాయి.
నివారణ: మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ లేదా డైమిధోయేట్ 2 మి.లీ. ఒక లీటరు నీటిని కలిపి పిచికారి చేయాలి.
చిన్న గొంగళి పురుగులు రెండు – మూడు ఆకులను కలిపి గూడు కట్టి లోపల నుండి ఆకులను తినివేస్తాయి. కాండాన్ని కాయలను తొలచి గింజలను తినేస్తాయి.
నివారణ: మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ లేదా ఎండోసల్ఫాన్ 2 మి.లీ. లేదా క్లోరోఫైరిఫాస్ 2.5 మి.లీ. ఒక లీటరు నీటిని కలిపి పిచికారి చేయాలి.
లేత మొగ్గ, పూత తిని వేయడం వలన గి0జ కట్టక తాలుకాయలు ఎర్పడుతాయి. పూత రాలిపోతుంది.
నివారణ: కాపర్ ఆక్సీక్ర్లొరైడ్ లేదా మాంకోజెబ్ 3 గ్రా. ఒక లీటరు నీటిని కలిపి పిచికారి చేయాలి.
ఆకులపైన, కాండం పైన కాయల మీద ముదురు గోధుమ మచ్చ్లు ఏర్పడతాయి. నివారణ: కాప్టాన్ 2గ్రా. మా0కోజెబ్ 2 గ్రా. కార్బండైజిమ్ 1గ్రా.ఒక లీటరు నీటిని కలిపి 15 రోజుల వ్యవధిలో రెండు – మూడు సార్లు పిచికారి చేయాలి.
ఆకులు చిన్నవై పూలలోని భాగాలన్ని ఆకుల మాదిరిగా కాయలు ఏర్పడవు. వెర్రితల వలె అగుపడుతుంది.
నివారణ: తెగులు సోకిన మొక్కలను పూర్తిగా తగుల బెట్టాలి.
నీటి కరిగే గంధకపు పోడి 3గ్రా లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
ఆకులు పసుపురంగుకు మారి రాలటం ప్రారంభమయినపుడు 75 శాతం కాయలు లేత పసుపు వర్ణానికి వచ్చినపుడు పైరు కోయాలి. కోసిన పంటను కట్టలతో కొట్టి నూర్పిడి చేయాలి.
ఆధారము: కృషి విజ్ఞాన కేంద్రము కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థ సంతోష్ నగర్ సైదాబాద్, హైద్రాబాద్.
చివరిసారిగా మార్పు చేయబడిన : 11/17/2023