వర్షాధారంగా నల్లరేగడి నేలలు. నీటి వసతి క్రింద తేలిక, ఒండ్రు నేలలు ప్రత్తి సాగుకు అనుకూలం.
వీణ ఉత్తర తెలంగాణా ప్రాంతాలలో తేలిక మధ్యస్థ, బరువు నేలలో 4 – 5 క్వింటాలు ఒక ఎకరాకు దిగుబడినిస్తుంది. దీని పంట కాలం 160 రోజులు. అమెరికన్ సూటి రకాలు: ఎమ్ .పి.యు.5, ఎల్ .ఆర్ .ఎ.5166, కాంచన, ఎల్ . కె.861, ఎల్ .369, నరసి0హ, ఎల్ . 603, ఎల్ .604, ఎల్ . 761 ఇవి అన్ని ప్రాంతాలకు అనువైనవి.
హెచ్ .8, ఎల్ .ఎ.హెచ్ .హెచ్ .4, 5, 7, సవితా ఇవి అన్ని ప్రాంతాలకు అనువైనవి. బిటి ప్రత్తి: శనగ పచ్చ పురుగును తట్టుకోనే రకాలు – రాశి బిటి – 2, రాశి బిటి – 20, ఎన్ .సి.హెచ్ .- 145(బన్ని) బిటి., ఎన్ . సి.హెచ్ . -207 (మల్లిక) బిటి, ప్రొఅగ్రో- 368 బిటి.
తెలంగాణా ప్రాంతాలలో దేశవాళీ, అమెరికన్ మరియు సంకర జాతి రకాలు జూన్ – జూలై నెలల్లో విత్తుటకు అనువైనవి. విత్తే మోతాదు
దేశవాళీ, అమెరికన్ రకాలు ఎకరాకు 3 – 4 కిలోలు మరియు సంకర జాతి రకాలు ఎకరాకు 0.75-1 కిలో.
దేశవాళీ రకాలు వరుసల మధ్య 60 మరియు మొక్కల మధ్య (22), అమెరికన్ రకాలు వరుసల మధ్య 90-105 మరియు మొక్కల మధ్య 45 – 60, సంకర జాతి రకాలు మధ్య 90 – 120 మరియు మొక్కల మధ్య 60 -90.
దేశవాళీ రకాలు గొర్రుతో విత్తాలి, అమెరికన్ మరియు సంకర జాతి రకాలు అచ్చుతో విత్తాలి.
తెలంగాణా ప్రాంతాలలో దేశవాళీ రకాలకు నత్రజని, భాస్వరం, పొటాష్ 16 : 8 : 8, అమెరికన్ రకాలకు 36 : 18 : 18, మరియు సంకర జాతి రకాలకు 48 : 24 : 24, సిఫార్సు చేసిన భాస్వరం ఎరువులు ఒకేసారి ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నాలి. అమెరికన్ రకాలకు మరియు హైబ్రిడ్స్ కు సిఫార్సు చేసిన నత్రజని మరియు పొటాష్ లను మూడు సమభాగాలుగా చేసి విత్తిన 30,60,90 రోజులకు మొక్క మొదళ్ళకు 7 – 10 సె.మీ. దూరంలో పాదులు తీసి వేయాలి.
కలుపు నివారించుటకు, విత్తే ముందు ప్లుక్లోరాలిన్ 45 శాతం ఎకరాకు లీటరు చొఫ్ఫున పిచికారి చేసి భూమిలో కలియదున్నాలి లేదా పెండిమిథాలిన్ 30 ఎకరాకు 1.3 నుండి 1.6 లీ లేదా అలాక్లోర్ 50 శాతం 1.5 నుండి 2.5 లీ విత్తిన వేంటనే కాని మరుసటి రోజున కాని పిచికారి చేయాలి. విత్తన 30 రోజులప్పుడు మరియు 50 రోజులప్పుడు గొర్రు లేదా గుంటకలతో అంతరకృషి చేయాలి.
ప్రత్తి పైరు ఎక్కువ నీటిని తట్టుకోలేదు. భూమిలో వున్న తేమను బట్టి 20 – 25 రోజులకొకసారి నీరు పెట్టాలి. నీటి వసతిని అనుసరించి ఎరువులు వేసిన వెంటనే మరియు పూత సమయంలో కాయ తయారయ్యే సమయంలో నీరు పెట్టాలి.
ప్రత్తి విత్తిన 60 రోజులలోపు రసం పీల్చే పురుగులైన పేనుబంక, పచ్చదోమ, తామర పురుగు, తెల్లదోమ ఆశి0చి ఎక్కువ నష్టం కలుగజేస్తాయి. వీటి యాజమాన్యానికి తెల్లదోమ తట్టుకునే రకాలు కాంచన, ఎల్ . కె. 861 మరియు పచ్చ్దోమను తట్టుకొనే రకాలు ఎం.సి.యు.5, ఎల్ .ఆర్ .ఎ. 166, ఎల్, 603, 604,ఎన్.హెచ్.హెచ్ .390,ఎల్. ఎ. హెచ్.హెచ్. 4,6,7 సాగు చేయాలి. కిలో విత్తనానికి తగినంత జిగురు కలిపి 5గ్రా.ఇమిడాక్లోప్రిడ్ 70 డబ్ల్యూ.ఎస్ .తో విత్తన శుద్ధి చేసి విత్తితే 45 రోజుల వరకు రసంపీల్చే పురుగులను నివారించవచ్చు. మోనోక్రోటోఫాస్ మరియు నీరు 1 : 4 నిష్పత్తిలో లేక ఇమిడాక్లోప్రిడ్ 200 యస్ .యల్ . మరియు నీరు 1 : 20 నిష్పత్తిలో కలిపి, విత్తిన 20,40,60 రోజుల్లో మొక్క కాండానికి బ్రష్ తో పూస్తే రసం పీల్చే పురుగులను అదుపులో వుంచవచ్చు. పురుగు నష్ట పరిమాణం దృష్టిలో వుంచుకొని అవసరాన్ని బట్టి లీటరు నీటికి మోనోక్రోటోఫాస్ 1.5 మి.లీ.లేదా ఇమిడాక్లోప్రిడ్ 200 యస్.యల్.0.4 మి.లీ ఎసిటామిప్రిడ్ 0.2 గ్రా.లేదా ఎసిఫెట్ 1.5 గ్రా.కలిపి పిచికరి చెయ్యాలి. తెల్లదోమను అదుపులో వుంచటానికి లీటరు నీటికి 2 మి.లీ ట్రైజోఫాస్ మరియు 5 మి.లీ. వేప నూనె కలిపి ఆకుల అడుగు భాగాన పడేటట్లు పిచికారి చెయ్యాలి. ఎర్రనల్లిని అదుపులో వుంచటానికి లీటరు నీటికి 3 గ్రా. నీళ్ళలో కరిగే గంధకం (50శాతం) లేక 5 మి.లీ.డైకోఫాల్ కలిపి పిచికరి చెయ్యాలి.
కాయతొల్చే పురుగులైన శనగపచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగు, నల్ల మచ్చల పురుగు, గులాబీ పురుగులు ప్రత్తి పంటను ఆశించి ఎక్కువ నష్టం కలుగజేస్తాయి. ప్రత్తిలో కాయతొల్చు పురుగులను అదుపులో వుంచటానికి సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటించడం ఎంతైనా మంచిది. అందుబాటులో ఉన్న ఇతర యాజమాన్య పద్ధతులు జోడించి పురుగుల నష్ట పరిమాణం దృష్టిలో ఉంచుకొని పురుగు మందుల వాడకం తగ్గించడం వలన సస్యరక్షణ ఖర్చు తగ్గడమే కాకుండా వాతావరణ కాలుష్యం అరికట్టడం జరుగుతుంది.
కిలో విత్తనానికి కార్బండైజిమ్ శిలీంధ్ర నాశని 2గ్రా. తో విత్తనశుద్ధి చేసి విత్తుకొవాలి.
ఉదృతిని బట్టి 3-4 పర్యాయములు 15రోజుల వ్యవధిలో 10 లీ. నీటికి 1 గ్రా. పౌషామైసిన్ లేక అగ్రిమైసిన్ మరియు రాగి ధాతు సంబంధిత మందులు (కాపర్ ఆక్సీక్లోరైడ) 30గ్రా చొఫ్ఫున కలిపి పిచికారి చేయాలి.
దీని నివారణకు లీ. నీటికి 2.5 గ్రా మాంకో జెబ్ లేదా రాగుధతు సంబంధిత (కాపర్ ఆక్సీక్లోరైడ) 3గ్రా. అవసరం మేరకు 15 రోజుల వ్యవధిలో పిచికారి చెయాలి.
దీని నివారణకు లీ. నీటికి 50 శాతం నీటొలో కరిగే గంధకం 3గ్రా లేదా 80 శాతం 1గ్రా. కార్బడైజిమ్ 2 నుంచి 3 పర్యాయములు 15 15 రోజుల వ్యవధిలో పిచికారి చేసుకోవాలి.
ప్రత్తిని నాలుగైదు సార్లు తీయవాలిసి వస్తుంది. బాగా ఎండినటువంటి ప్రత్తిని గుల్లల నుండి వేరు చేసి ఎండిన ఆకులు, కాయతొలుచు పురుగులు ఆశించిన ప్రత్తిని వేరు చేయాలి. తీసిన ప్రత్తిని నీడలో ఆరబెట్టి నిల్వ చేసిన ప్రత్తికి తేమ తగలకుండా చూడాలి.
ఆధారము: కృషి విజ్ఞాన కేంద్రము కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థ సంతోష్ నగర్ సైదాబాద్, హైద్రాబాద్.
చివరిసారిగా మార్పు చేయబడిన : 3/27/2023