శాస్త్రీయ నామము : సెసేమమ్ ఇండికమ్
కుటుంబము : పిడాలియేసియే
భారత్లో సాగు చేయు ముఖ్యమైన, అతి ప్రాచీన నూనెగింజ పంటలలో ఈ పంట ఒకటి. ప్రపంచంలో భారతదేశం ఈ పంటకు ప్రధాన ఉత్పత్తి స్థానము. విస్తీర్ణంలో 86%, ఉత్పత్తిలో 25% ఆక్రమిస్తుంది.
మన రాష్ట్రంలో నువ్వు పంట సుమారు 1.18 లక్షల హెక్టారులలో ਹੇ చేస్తూ 0.27 లక్షల టన్నుల దిగుబడిని ఇస్తోంది. సగటు దిగుబడి 235 కిలోలు. హెక్టారుకి 2007-08 గణాంకాల ప్రకారం నువ్వులో నూనె శాతం 46 52%, ప్రొటీన్లు 20-25% ఉండటమే కాక విటమిన్లు, అమైనో ఆమూలు మరియు పాలి అన్సెట్యురేటిడ్ ఆమ్లాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఖరీఫ్పంటలు ఆలస్యంగా వేసే పరిస్థితులలో జనవరి, ఫిబ్రవరి నెలల్లో విత్తుకుని అతితక్కువ సమయంతో తక్కువ వనరులతో అధిక నికరలాభాన్ని పొందుటకు నువ్వుల పంట ఉపకరిస్తుంది. ఖరీఫ్, రబీలో వర్బాధారంగా వేసే కంటే రబీలో ప్రోక్త వేసవిలో ఆరుతడిగా వేస్తే చీడపీడలు తగ్గి, విత్తన నాణ్యత పెరిగి అధిక దిగుబడి పొందవచ్చు. మన రాష్ట్రంలో కోస్తా, రాయలసీమ, తెలంగాణాల్లో సాగవుతుంది.
మన రాష్ట్రంలో నువ్వు పంట షుమారు నాలుగు లక్షల ఎకరాల్లో సాగు చేయబడుతూ 50 వేల టన్నుల దిగుబడినిస్తున్నది. నువ్వుల్లో నూనె శాతం 46 - 55, ప్రోటీను 20-25 శాతం ఉండడమే కాకుండా విటమిన్లు, అమైనో ఆమూలు మరియు పాలీఅన్సాచురేటెడ్ ఫాటీ ఆమూలు కూడా సమృద్ధిగా ఉంటాయి.
ఖరీఫ్ పంటలు ఆలస్యంగా వేసిన పరిస్థితులలో రెండవ పంటగా జనవరి, ఫిబ్రవరి మాసాల్లో విత్తుకొని, అతి తక్కువ సమయంలో, తక్కువ వనరులతో అధిక నికర లాభాన్ని ఆర్థించేందుకు నువ్వుల పంట ఉపకరిస్తుంది. ఖరీఫ్ మరియు రబీలో వరాధారంగా పండించిన దానికంటె రబీ లేదా వేసవిలో ఆరుతడి పంటగా వేసినపుడు చీడ పీడల బెడద తక్కువగా ఉండి, విత్తన నాణ్యత పెరిగి, అధిక దిగుబడులు పొందవచ్చు. మన రాష్ట్రంలో నువ్వు పంటను ముఖ్యముగా కోస్తా, రాయలసీమ, తెలంగాణా జిల్లాలలో ఎక్కువగా పండించబడుచున్నది.
మనదేశంలో మధ్యప్రదేశ్ మొదటి స్థానం, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్ విస్తీర్ణంలో రెండవ, మూడవ స్థానాల్లో ఉత్పత్తి విషయంలో ఒరిస్సా మొదటి స్థానం, ఉత్తర ప్రదేశ్ రెండవ స్థానం, మధ్యప్రదేశ్ మూడవ స్థానంలో ఉన్నాయి. ఉత్పాదకతలో పశ్చిమ బెంగాల్, ఒరిస్సా మొదటి, రెండవ స్థానాల్లో ఉన్నాయి.
మన రాష్ట్రంలో విస్తీర్ణంలో అదిలాబాద్, వరంగల్, తూర్పుగోదావరి జిల్లాలు వరుసగా మొదటి, రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఉత్పత్తిలో పశ్చిమగోదావరి జిల్లా, అదిలాబాద్ మొదటి, రెండు స్థానాలు, ఉత్పాదకతలో పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాలు మొదటి, రెండుస్థానాలలోఉన్నాయి.
నువ్వులు ఉష్ణమండలాలకు, వెచ్చని సమశీతలాలకు చెందిన పంట, మైదానాలల్లో బాగా పెరుగుతుంది. కాని సగటు సముద్ర మట్టానికి 1250 మీటర్లు పైన దీనిని సాగు చేయవచ్చు. గరిష్ట దిగుబడికి దీనికి వెచ్చని పెరిగే వాతావరణం ఉండాలి. ఈ పంటకు యుక్తతమ ఉష్ణోగ్రత మొలకెత్తడం, ప్రారంభపెరుగుదల పప్పులు ఏర్పడు సమయంలో 25-27°C మధ్యఉండాలి. మొలకెత్తిన తర్వాత 18 °C కన్నా తక్కువ ఉష్ణోగ్రత ఉంటే పెరుగుదల మందగిస్తుంది. 40°C కన్నా ఎక్కువ ఉష్ణోగ్రత ఫలదీకరణను తీవ్రంగా ప్రభావితం చేయును. పుష్పించేప్పుడు తక్కువ ఉష్ణోగ్రత ఉంటే వంధ్య పుప్పొడి ఉత్పత్తి కావడం, పుష్పాలు పక్వానికి రాకముందే రాలిపోవడం జరగవచ్చు.
మన దేశంలో ఈ పంటను వరాధారంగా సాగుచేస్తారు. ఈ పంట ఎక్కువ తేమ, నీటి ముంపులను తట్టుకోలేదు. ఎక్కువ తేమ ఉంటే కొంత పరిమితి వరకు పెరుగుదల అధికంగా ఉంటుంది. పరిమితి దాటితే పంట సడలి పోతుంది.
మరుగు నీరు పారుదల బాగా ఉన్న నల్లరేగడి, తేలిక నేలలు అనువు, మరుగు నీరు నిల్వని తేమ నిల్చే తేలిక నేలలు ශීඝ්රాට. నీరు నిలుచు ఆమ్ల, క్షార గుణాలు పనికిరావు, తగినంత తేమ గల ఇసుకలోమి నేలలు ఉత్తమమైనవి.
తయారీ స్వభావం, నేల రకం, వర్షపాతం పై ఆధారపడి ఉంటుంది. నేలను బాగా పాడి చేసి సూక్ష్మ దుక్కి చేస్తే మొలకెత్తడం, పెరుగుదల బాగుంటుంది. విత్తనాలు బాగా చిన్నవి కావున మెత్తని టిల్త్ కావాలి. రెండు సార్లు దున్ని 2-3 సార్లు హేరోయింగ్ ప్లాంకింగ్ చేసి పొలం తయారు చేస్తారు. ఇలా చేస్తే నాటుటకు మంచి పదును ఏర్పడును.
ఎకరానికి 2 1/2 కేజీలు విత్తనం సరిపోతుంది. విత్తనానికి 3 ఇంతల ఇసుకలేక మెత్తని మట్టి కలిపి గొర్రుతో వరుసల్లో విత్తాలి. సాధారణంగా రైతులు వెదజల్లె పద్ధతి పాటిస్తారు. దానిలో విత్తనం వెదజల్లిన తర్వాత మట్టి కప్పుటకు ముళ్ళ కంపను లాగుతారు. లేనిచో గుంటక తోలవచ్చు.
కేజీకి 3 గ్రా. ధైరమ్ / కేప్లాన్ / మాంకోజెబ్తో విత్తనశుద్ధి చేసి విత్తుట మంచిది
2-3 సెం.మీ కన్నా ఎక్కువ లోతు ఉండకూడదు.
30X15 సెం.మీ విత్తనం మీద మట్టి రేణువులు దట్టంగా ఉంటే విత్తనానికి నేలతో గట్టి స్మర్శ ఏర్పడి త్వరగా సరిగా మొలకెత్తుతాయి.
|
ప్రాంతం |
ఎర్లీ ఖరీఫ్ |
లేట్ ఖరీఫ్ |
రబీ/వేసవి |
1. |
కృష్ణ, గోదావరి డెల్టా ఉత్తరకోస్తా |
మే 15-31 వరకు |
- |
డిశంబర్ 15-జనవరి-15 |
2. |
రాయలసీమ |
మే, జూన్ |
- |
జనవరి 2,3 వారాలు |
3. |
ఉత్తర తెలంగాణ |
మే, జూన్ |
జూలై ఆఖరిపక్షం నుండి ఆగష్టుమొదటి పక్షం |
జనవరి 2వ పక్షం – ఫెబ్రవరి మొదటి పక్షం |
4. |
దక్షిణ తెలంగాణ |
మే, జూన్ |
ఆగష్టు 2 వ పక్షం |
జనవరి 2 వ పక్షం |
నివారణ : మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. లేదా డైమిధోయేట్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. తెల్లనల్లి నివారణకు డైకోఫాల్ 5 మి.లీ. లేదా డైమిధోయేట్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
నివారణ : మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. లేదా ఎండోసల్ఫాన్ లేదా క్వినాల్ఫాస్ 2 మి.లీ. లేదా క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. పురుగు ఆశించిన ఆకులను పురుగులతో సహ ఏరి నాసనం చేయాలి.
నివారణ : పురుగు ఆశించిన మొగ్గల్ని మరియు తాలు కాయల్ని ఏరి నాశానం చేయాలి. మొగ్గదశలో డైమిధోయేట్ 2 మి.లీ. లేదా ఎండోసల్ఫాన్ 2 మి.లీ. లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. లేదా ఎసిఫేట్ 1 గ్రా లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
నివారణ : పంటలో గ్రుడు లేక గొంగళి పురుగులను గమనించిన వెంటనే ఆకులతో సహా తీసివేసి నాశనం చేయాలి. ఎండోసల్ఫాన్ 2 మి.లీ. లేదా క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ. లేదా ఎసిఫేట్ 1 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
నివారణ : పంట మార్పిడి తప్పకుండా చేయాలి. పంట అవశేషాలను నాశనం చేయాలి. కిలో విత్తనానికి 3 గ్రా. ధైరం లేదా కాప్లాన్ లేదా కార్బండైజిమ్ కలిపి విత్తన శుద్ధి చేయాలి. కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా మాంకోజెబ్ 3 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
నివారణ : తెగులు ఆశించిన పంట అవశేషాలను నిర్మూలించాలి. కిలో విత్తనాలకు 2 గ్రా. కార్బండైజిమ్ కలిపి విత్తనశుద్ధి చేయాలి. పంట దశలో కార్బండైజిమ్ 1 గ్రా. లేక మాంకోజెబ్ 2.5 గ్రా. లీటరు నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారి చేయాలి.
నివారణ : మాంకోజెబ్ గాని, కాపర్ ఆక్సిక్లోరైడ్ గాని 3 గ్రా లీటరు నీటితో కలిపి చల్లు కోవాలి.
నివారణ : రాజేశ్వరి, చందన, హిమ రకాలు ఈ తెగులును కొంత వరకు తట్టుకొంటాయి. తెగులు కనిపించిన వెంటనే తెగులు సోకిన మొక్కలను పీకి తగులబెట్టాలి. పైరుపై మిథైల్డెమెటాన్ 1 మి. లీ లేదా డైమిధోయేట్ 3. మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేసి దీపపు పరుగులను అరికట్టాలి.
నివారణ : నీటిలో కరిగే గంధకపు పొడి 8 గ్రా. లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.
ఈ పంటను సాధారణంగా, చిన్న కారు, సన్నకారు రైతులు సాపేక్షంగా సారహీననేలల్లో వరాధారంగా సాగు చేస్తారు. నువ్వు పంట, నేలను నిస్సారంగా చేయును. ఎరువును బాగా తీసుకుంటుంది. నేలలో సారం లేకుంటే పోషకాలను తగినంతగా వేయాలి. ఖరీఫ్లో ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువు, 16 కిలోల నత్రజని, 16 కిలోల పొటాష్, 24 కిలోల భాస్వరం వేయాలి. రబీ లేదా వేసవిలో, వీటితో పాటు 8 కేజీల నత్రజని వేయాలి. నత్రజనిలో సగం, మొత్తం భాస్వరం, పొటాష్లను ఆఖరి దుక్కిలో వేయాలి. మిగతా సగం నత్రజనిని విత్తిన నెలలోపు కలుపు తీసి, ఎరువులు వేయాలి. భాస్వరం ఎరువును. యస్.యస్.పి (సింగిల్ సూపర్ పాస్ఫేట్) రూపంలో వాడినపుడు కాలియం (సున్నము), గంధకము లభించి దిగుబడి పెరుగును. నత్రజని, భాస్వరం వేస్తే ఒక్కొక్క మొక్కకు గుళికల (కాయలు) సంఖ్య పెరుగును. గుళికలో గింజల సంఖ్య పెరుగును.
నువ్వు పంటకు సాధారణంగా බීජා పెట్టరు. కాని రబీ / వేసవి పంటలకు నీరు పెడతారు. సరాసరి 500 మి.మి. నీరు కావాలి. విత్తిన వెంటనే మొదటి తడి ఇవ్వాలి. పూత, కాయ అభివృద్ధి, గింజకట్టు సమయంలో తడులివ్వాలి. విత్తిన తర్వాత 35-40 రోజుల నుండి 65-70 రోజుల వరకు నీటి ఎద్దడి లేకుండా చూడాలి.
విత్తు ముందు పూక్టోరలిన్ 40% ఎకరాకు 1 లీటరు చొప్పున పిచికారి చేసికలియదునాలి. లేదా పెండిమిధాలిన్ 30%, అలాక్లోర్ ఎకరాకు లీటరు చొప్పున ఏదో ఒకదానిని విత్తిన వెంటనే కాని మరుసటి రోజు కాని పిచికారి చేయాలి. మొక్కలు మొలచిన 10 రోజులకు అదనపు మొక్కలు తీసివేయాలి. విత్తిన 20-25 రోజులకు గొర్రుతో అంతర కృషి చేయాలి.
ఆకులు, కాండం పసుపు రంగుకు మారి రాలడం ప్రారంభం అయ్యినపుడు 75% కాయలు లేత పసుపు రంగుకు వచ్చినపుడు పైరు కోయాలి. కోసిన పంటను కళ్లంపై వేసి కళ్లంను దట్టంగా చేసి నెరలు లేకుండా చేయాలి. కోసిన వెంటనే పంటను కట్టలుగా కట్టి తలక్రిందులుగా ఉంచాలి. 5-6 రోజులు ఎండిన తర్వాత కట్టెలతో కొట్టి నూర్పిడి చేయాలి.
గింజలో తేమ 8%కి తగ్గే వరకు ఎండలో ఆరబెట్టి గోనె సంచుల్లో నిల్వ చేయాలి. నిల్వ సంచుల్లో మలాథియాన్ చల్లాలి. మధ్యమధ్యలో పురుగు పట్టకుండా ఎండలో ఉంచాలి.
తెలంగాణాలో ఖరీఫ్లో పసుపు, మొక్కజొన్న తర్వాత నువ్వులు వేస్తారు. వరిమాగాణుల్లో నిల్వ ఉన్న తేమతో నువ్వు సాగు చేయవచ్చు. సిగరెట్ పొగాకు వేసే ప్రాంతాల్లో నువ్వు పంటను ఎక్కువ సారము ఆవశ్యకత ఉండుట వల్ల ముందు నువ్వు పంట వేసి తరువాత సిగరెట్ పొగాకు సాగు చేస్తారు.
కోస్తా జిల్లాలో ఈ పంటను మే నెలలో వచ్చే తొలకరి వానల్లో జల్లి ఆగష్టు నెలాఖరుకు పంట కోస్తారు. తొలకరి వానలు లేక జూన్ నెలాకరిలో జల్లితో పంటకు వెర్రి తెగులు వస్తుంది. అందువల్ల ఈ పరిస్థితుల్లో నువ్వు పంట బదులు వేరుశనగ వేస్తారు. ఈవిధంగా తొలకరి వానను బట్టి నువ్వుపంట విస్తీర్ణం పెరగుట, తగ్గుట జరుగును. ఉత్తర తెలంగాణాలో పరిస్థితి వేరుగా ఉంటుంది. ఈ జిల్లాల్లో విత్తనాలు ముందుగా జల్లితే రొట్టగా పెరిగి వెర్రి తెగులు వస్తుంది. అందువల్ల జూన్ నెలలో గాని ఆగష్టు నెలాఖరులో గాని విత్తుతారు. ఇక్కడ తెల్ల నువ్వు రకాలు సాగుచేస్తారు.
వర్వాభావం వల్ల చెరువులు నిండక వరినాట్లు సరిగా జరగనపుడు సెప్టెంబరు, అక్టోబరులలో నువ్వు పంట వేస్తారు. విశాఖ, శ్రీకాకుళం జిల్లాలలో గల వన్య ప్రాంతాల్లో ఆగష్టు సెప్టెంబరు లలో మాఘిపంటగా సాగు చేస్తారు.
విత్తనం రంగు, పెరిగే ఋతువు, పక్వదశ, ఫలదళాల సంఖ్యను బట్టివివిధ రకాలుగా వర్గీకరించవచ్చు.
రకం |
ఋతువు |
పంట కాలం (రోజుల్లో) |
దుగుబడి (కిలోలు ఎకరాకు) |
నూనె శాతం |
గుణగణాలు |
(01) |
(02) |
(03) |
(04) |
(05) |
(06) |
గౌరి |
ఖరీఫ్ |
90 |
250 |
50 |
ముదురు గోధుమ రంగు విత్తనం.కోస్తా జిల్లాలకు అనువైనది. కోడు ఈగకు కొంతవరకు తట్టుకుంటుంది |
మాధవి |
ఖరీఫ్ |
70-75 |
200 |
50-51 |
లేత గోధుమ రంగు విత్తనం. పలు పంటలు పద్ధతికి అనుకూలం . |
ఎలమంచిలి-11 |
ఎర్లీ ఖరిఫ్ |
80-85 |
360-400 |
52.5 |
ముదురు గోధుమ రంగు విత్తనం. కోస్తా జిల్లాలకు అనుకూలం. పంట ఒకేసారి కోతకు వస్తుంది. లేత గోధుమ రంగు విత్తనం. కోస్తా జిల్లాలకు అనుకూలం. బూడిద, అకుమచ్చ తెగుళ్ళను తట్టుకుంటుంది. |
ఎలమంచిలి-17 |
ఎర్లీ ఖరీఫ్ |
75-80 |
340 |
52.5 |
లేత గోధుమ రంగు విత్తనం. కోస్తా జిల్లాలకు అనుకూలం. బూడిద, అకుమచ్చ తెగుళ్ళను తట్టుకుంటుంది. |
ఎలమంచిలి-66 |
ఖరీఫ్ రబీ/వేసవి |
80 75 |
350 400 |
52.5 |
లేత గోధుమ రంగు విత్తనం.కోస్తా జిల్లాలకు అనుకూలం. బిడిడ, అకుమచ్చ తెగుళ్ళను తట్టుకుంటుంది. |
రాజేశ్వరి |
లేట్ ఖరీఫ్ రబీ/వేసవి |
90 80 |
200 300
|
50 |
తెల్లగింజ రకం. తెలంగాణా జిల్లాలకు అనుకూలం. కాండం కుళ్ళు, బూడిద తెగుళ్ళను తట్టుకొంటుంది. రబీ/వేసవిలో కోస్తాకు అనుకూలం. |
శ్వేతాతిల్ |
లాట్ ఖరీఫ్ రబీ/ వేసవి |
85-90 80 |
250 450
|
50-51 |
తెల్లగింజ రకం. తెలంగాణా ప్రాంతానికి అనుకూలం. వేసవిలో రాష్ట్రమంతటికి అనుకులం. కాండం కుళ్ళును తట్టుకొంటుంది. ఎగుమతి ప్రాధాన్యత కలదు. |
చందన |
ఖరిఫ్ రబీ/ వేసవి |
85 80 |
250 480 |
50-51 |
గోధుమరంగు విత్తనం. అన్ని కలాలకు అనుకూలం. వేర్ర్రితల తెగులును తట్టుకొంటుంది. తెలంగాణా ప్రాంతానికి అనుకూలం. |
హిమ (జె.సి యాన్ 9426) |
ఖరిఫ్ రబీ/ వేసవి |
80 75-80 |
280 480 |
51 51 |
స్వల్పకాలిక తెల్లగింజరకము, కాయలు పొడవుగా ఉంటాయి. వెర్రితల తెగులును తట్టుకొంటుంది. ఎగుమతి ప్రాధాన్యత కలదు. |
నువ్వుల సాగుపై మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన చిరునామా : అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, జగిత్యాల-505 327, కరీంనగర్ జిల్లా, ఫోన్ : 08724-277541 (లేదా) ప్రధాన శాస్రవేత్త (అగ్రానమి) & హెడ్, వ్యవసాయ పరిశోధనా స్థానం, కోక్కిరాపల్లి, ఎలమంచిలి - 531055, విశాఖ పట్టణం జిల్లా ఫోన్ : 08931-232441
చివరిసారిగా మార్పు చేయబడిన : 1/3/2024