অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

నువ్వులు

నువ్వులు

శాస్త్రీయ నామము : సెసేమమ్ ఇండికమ్

కుటుంబము : పిడాలియేసియే

భారత్లో సాగు చేయు ముఖ్యమైన, అతి ప్రాచీన నూనెగింజ పంటలలో ఈ పంట ఒకటి. ప్రపంచంలో భారతదేశం ఈ పంటకు ప్రధాన ఉత్పత్తి స్థానము. విస్తీర్ణంలో 86%, ఉత్పత్తిలో 25% ఆక్రమిస్తుంది.

మన రాష్ట్రంలో నువ్వు పంట సుమారు 1.18 లక్షల హెక్టారులలో ਹੇ చేస్తూ 0.27 లక్షల టన్నుల దిగుబడిని ఇస్తోంది. సగటు దిగుబడి 235 కిలోలు. హెక్టారుకి 2007-08 గణాంకాల ప్రకారం నువ్వులో నూనె శాతం 46 52%, ప్రొటీన్లు 20-25% ఉండటమే కాక విటమిన్లు, అమైనో ఆమూలు మరియు పాలి అన్సెట్యురేటిడ్ ఆమ్లాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఖరీఫ్పంటలు ఆలస్యంగా వేసే పరిస్థితులలో జనవరి, ఫిబ్రవరి నెలల్లో విత్తుకుని అతితక్కువ సమయంతో తక్కువ వనరులతో అధిక నికరలాభాన్ని పొందుటకు నువ్వుల పంట ఉపకరిస్తుంది. ఖరీఫ్, రబీలో వర్బాధారంగా వేసే కంటే రబీలో ప్రోక్త వేసవిలో ఆరుతడిగా వేస్తే చీడపీడలు తగ్గి, విత్తన నాణ్యత పెరిగి అధిక దిగుబడి పొందవచ్చు. మన రాష్ట్రంలో కోస్తా, రాయలసీమ, తెలంగాణాల్లో సాగవుతుంది.

మన రాష్ట్రంలో నువ్వు పంట షుమారు నాలుగు లక్షల ఎకరాల్లో సాగు చేయబడుతూ 50 వేల టన్నుల దిగుబడినిస్తున్నది. నువ్వుల్లో నూనె శాతం 46 - 55, ప్రోటీను 20-25 శాతం ఉండడమే కాకుండా విటమిన్లు, అమైనో ఆమూలు మరియు పాలీఅన్సాచురేటెడ్ ఫాటీ ఆమూలు కూడా సమృద్ధిగా ఉంటాయి.

ఖరీఫ్ పంటలు ఆలస్యంగా వేసిన పరిస్థితులలో రెండవ పంటగా జనవరి, ఫిబ్రవరి మాసాల్లో విత్తుకొని, అతి తక్కువ సమయంలో, తక్కువ వనరులతో అధిక నికర లాభాన్ని ఆర్థించేందుకు నువ్వుల పంట ఉపకరిస్తుంది. ఖరీఫ్ మరియు రబీలో వరాధారంగా పండించిన దానికంటె రబీ లేదా వేసవిలో ఆరుతడి పంటగా వేసినపుడు చీడ పీడల బెడద తక్కువగా ఉండి, విత్తన నాణ్యత పెరిగి, అధిక దిగుబడులు పొందవచ్చు. మన రాష్ట్రంలో నువ్వు పంటను ముఖ్యముగా కోస్తా, రాయలసీమ, తెలంగాణా జిల్లాలలో ఎక్కువగా పండించబడుచున్నది.

ఇతర నూనె గింజ పంటల కన్నా నువ్వు పంట వల్ల లాభాలు

  • ఇందులో నూనె శాతం అధికం (50%) తక్కువ కాలపరిమితి వల్ల రోజు ఒక్కంటికి నూనె దిగుబడి ఎక్కువ.
  • ఇందులో 18–20% ప్రోటీన్లుంటాయి. ఆవశ్యకఅమైనో ఆమూలు, విటమిన్లు ఉంటాయి.
  • విత్తన రేటు చాలా తక్కువ. ఎకరాకు 2 కేజీలు. ప్రత్యుత్పత్తి నిష్చత్తి నువ్వులో అధికం .ఫలితంగా కొద్ది కాలంలో మెరుగుపరచిన వంగడం క్రింద ఎక్కువ ప్రదేశాలను సాగుకు తీసుకురావచ్చు.
  • ఈ పంటకు అధిక స్థాయి అనుకూలత, జలాభావ నిరోధకత ఉంటాయి.
  • నూనె తీసిన పిండిని పశువుల దాణాగాను, ఎరువుగాను వాడవచ్చు. ఇందులో 6% నత్రజని, 2.2% భాస్వరం, 1.2% పొటాష్ ఉన్నాయి.
  • దక్షిణ భారతదేశంలో నువ్వుల నూనెను వంటనూనె గాను మరియు నిల్వచేసే పచ్చళ్ళకు నువ్వుల నూనె శ్రేష్టమైనది.

విస్తీర్ణం, ఉత్పత్తి

మనదేశంలో మధ్యప్రదేశ్ మొదటి స్థానం, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్ విస్తీర్ణంలో రెండవ, మూడవ స్థానాల్లో ఉత్పత్తి విషయంలో ఒరిస్సా మొదటి స్థానం, ఉత్తర ప్రదేశ్ రెండవ స్థానం, మధ్యప్రదేశ్ మూడవ స్థానంలో ఉన్నాయి. ఉత్పాదకతలో పశ్చిమ బెంగాల్, ఒరిస్సా మొదటి, రెండవ స్థానాల్లో ఉన్నాయి.

మన రాష్ట్రంలో విస్తీర్ణంలో అదిలాబాద్, వరంగల్, తూర్పుగోదావరి జిల్లాలు వరుసగా మొదటి, రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఉత్పత్తిలో పశ్చిమగోదావరి జిల్లా, అదిలాబాద్ మొదటి, రెండు స్థానాలు, ఉత్పాదకతలో పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాలు మొదటి, రెండుస్థానాలలోఉన్నాయి.

శీతోష్ణస్థితి

నువ్వులు ఉష్ణమండలాలకు, వెచ్చని సమశీతలాలకు చెందిన పంట, మైదానాలల్లో బాగా పెరుగుతుంది. కాని సగటు సముద్ర మట్టానికి 1250 మీటర్లు పైన దీనిని సాగు చేయవచ్చు. గరిష్ట దిగుబడికి దీనికి వెచ్చని పెరిగే వాతావరణం ఉండాలి. ఈ పంటకు యుక్తతమ ఉష్ణోగ్రత మొలకెత్తడం, ప్రారంభపెరుగుదల పప్పులు ఏర్పడు సమయంలో 25-27°C మధ్యఉండాలి. మొలకెత్తిన తర్వాత 18 °C కన్నా తక్కువ ఉష్ణోగ్రత ఉంటే పెరుగుదల మందగిస్తుంది. 40°C కన్నా ఎక్కువ ఉష్ణోగ్రత ఫలదీకరణను తీవ్రంగా ప్రభావితం చేయును. పుష్పించేప్పుడు తక్కువ ఉష్ణోగ్రత ఉంటే వంధ్య పుప్పొడి ఉత్పత్తి కావడం, పుష్పాలు పక్వానికి రాకముందే రాలిపోవడం జరగవచ్చు.

మన దేశంలో ఈ పంటను వరాధారంగా సాగుచేస్తారు. ఈ పంట ఎక్కువ తేమ, నీటి ముంపులను తట్టుకోలేదు. ఎక్కువ తేమ ఉంటే కొంత పరిమితి వరకు పెరుగుదల అధికంగా ఉంటుంది. పరిమితి దాటితే పంట సడలి పోతుంది.

నేలలు

మరుగు నీరు పారుదల బాగా ఉన్న నల్లరేగడి, తేలిక నేలలు అనువు, మరుగు నీరు నిల్వని తేమ నిల్చే తేలిక నేలలు ශීඝ්රాට. నీరు నిలుచు ఆమ్ల, క్షార గుణాలు పనికిరావు, తగినంత తేమ గల ఇసుకలోమి నేలలు ఉత్తమమైనవి.

నేల తయారీ

తయారీ స్వభావం, నేల రకం, వర్షపాతం పై ఆధారపడి ఉంటుంది. నేలను బాగా పాడి చేసి సూక్ష్మ దుక్కి చేస్తే మొలకెత్తడం, పెరుగుదల బాగుంటుంది. విత్తనాలు బాగా చిన్నవి కావున మెత్తని టిల్త్ కావాలి. రెండు సార్లు దున్ని 2-3 సార్లు హేరోయింగ్ ప్లాంకింగ్ చేసి పొలం తయారు చేస్తారు. ఇలా చేస్తే నాటుటకు మంచి పదును ఏర్పడును.

విత్తనం, విత్తే పద్దతి

ఎకరానికి 2 1/2 కేజీలు విత్తనం సరిపోతుంది. విత్తనానికి 3 ఇంతల ఇసుకలేక మెత్తని మట్టి కలిపి గొర్రుతో వరుసల్లో విత్తాలి. సాధారణంగా రైతులు వెదజల్లె పద్ధతి పాటిస్తారు. దానిలో విత్తనం వెదజల్లిన తర్వాత మట్టి కప్పుటకు ముళ్ళ కంపను లాగుతారు. లేనిచో గుంటక తోలవచ్చు.

విత్తన శుద్ది

కేజీకి 3 గ్రా. ధైరమ్ / కేప్లాన్ / మాంకోజెబ్తో విత్తనశుద్ధి చేసి విత్తుట మంచిది

విత్తు లోతు

2-3 సెం.మీ కన్నా ఎక్కువ లోతు ఉండకూడదు.

విత్తు దూరం

30X15 సెం.మీ విత్తనం మీద మట్టి రేణువులు దట్టంగా ఉంటే విత్తనానికి నేలతో గట్టి స్మర్శ ఏర్పడి త్వరగా సరిగా మొలకెత్తుతాయి.

విత్తు సమయం

ప్రాంతం

ఎర్లీ ఖరీఫ్

లేట్ ఖరీఫ్

రబీ/వేసవి

1.

కృష్ణ, గోదావరి డెల్టా ఉత్తరకోస్తా

మే 15-31 వరకు

-

డిశంబర్ 15-జనవరి-15

2.

రాయలసీమ

మే, జూన్

-

జనవరి 2,3 వారాలు

3.

ఉత్తర తెలంగాణ

మే, జూన్

జూలై ఆఖరిపక్షం నుండి ఆగష్టుమొదటి పక్షం

జనవరి 2వ పక్షం – ఫెబ్రవరి మొదటి పక్షం

4.

దక్షిణ తెలంగాణ

మే, జూన్

ఆగష్టు 2 వ పక్షం

జనవరి 2 వ పక్షం

రకాలు

  • గౌరి, మాధవి, యలమంచిలి - 11,17, చందన, ఈ రకాలు ఖరీఫ్కు అనువైన గోధుమ రంగు రకాలు పంటకాలం 70-90 రోజులు 250-400 కెజీ / ఎ దిగుబడిని ఇస్తాయి. నూనె శాతం 50-51.
  • రాజేశ్వరి, శ్వేత తిలిల్, హిమ ఈ రకాలు రబీకి అనువైన తెలుపు రకాలు 200-480 కేజీ/ఎకరానికి దిగుబడి.
  • లేట్ ఖరీఫ్కు రాజేశ్వరి, శ్వేతా తేల్ అనుకూలం.
  • అధిక దిగుబడి రకాలు చందన, హిమ
  • వెర్రి తెగులును కొంత వరకు తట్టుకునేవి రాజేశ్వరి, చందన, హిమ
  • బూడిద తెగులును తట్టుకునేవి వై.యల్.యమ్ - 17, రాజేశ్వరి
  • గౌరి, మాధవి ఎలమంచలి – 11, 17, 66 రకాలు జిసెంబర్ 15 నుండి జనవరి 15 వరకు విత్తుటకు రూడ అనుకూలం.
  • తెలంగాణాలో ఖరీఫ్ పసుపు, మొక్కజొన్న తరువాత వేసవిలో మరియు వరి మాగాణుల్లో నిల్వ ఉన్న తేమ కింద నువ్వు పంటను సాగు చేయవచ్చు.
  • సస్యరక్షణ

    పురుగులు

    1. రసంపీల్చే పురుగులు (తెల్లనల్లి, తామరపురుగులు, పచ్చదోమ) : పిల్ల, తల్లి పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి ఆకుల నుండి రసాన్ని పీల్చి వేస్తాయి. పరుగులు ఆశించిన ఆకులు ముందుగా పాలిపోయి, తర్వాత దశలో ఎండిపోతాయి. తెల్లనల్లి ఆశిస్తే ఆకులు ముదురు ఆకుపచ్చ రంగుకు మారి ఈనెలు పొడవుగా సాగి క్రింది వైపుకు ముడుచుకొని పోయి, దోనె ఆకారంగా మారి పాలి పోతాయి.
    2. నివారణ : మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. లేదా డైమిధోయేట్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. తెల్లనల్లి నివారణకు డైకోఫాల్ 5 మి.లీ. లేదా డైమిధోయేట్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

    3. ఆకుముడత మరియు కాయతొలుచు పురుగు : తొలిదశలో చిన్న గొంగళి పురుగులు రెండు, మూడు లేత ఆకులను కలిపి గూడు కట్టి లోపలి నుండి ఆకుల్లోని పచ్చని పదార్ధాన్ని గోకి తినుట వలన ఆకులు ఎండిపోతాయి. పురుగులు ఎదిగిన కొలది ఎక్కువ ఆకులను కలిపి గూడుగా చేసికొని ఆకులను తింటాయి. మొగ్గ ఏర్పడే దశలో మొగ్గలను, పూతను, కాయల్లోని లేత గింజలను తింటూ పంటకు నష్టం చేస్తాయి.
    4. నివారణ : మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. లేదా ఎండోసల్ఫాన్ లేదా క్వినాల్ఫాస్ 2 మి.లీ. లేదా క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. పురుగు ఆశించిన ఆకులను పురుగులతో సహ ఏరి నాసనం చేయాలి.

    5. కోడుఈగ : చిన్న పురుగులు లేత మొగ్గ, పూత తినివేయటం వలన మొగ్గలు పువ్వుగా, కాయలుగా ఏర్పడక గింజ కట్టక తాలు కాయలు ఏర్పడతాయి. ఆశించిన మొగ్గ మరియు పూత వాడి రాలిపోతుంది.
    6. నివారణ : పురుగు ఆశించిన మొగ్గల్ని మరియు తాలు కాయల్ని ఏరి నాశానం చేయాలి. మొగ్గదశలో డైమిధోయేట్ 2 మి.లీ. లేదా ఎండోసల్ఫాన్ 2 మి.లీ. లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. లేదా ఎసిఫేట్ 1 గ్రా లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

    7. బీహారి గొంగళి పురుగు : తొలిదశలో చిన్న గొంగళి పరుగులు గుంపులుగా ఆకులలోని పత్రహరితాన్ని గోకి తిని జల్లెడాకులుగా చేస్తాయి. ఎదిగిన గొంగళి పరుగులు ఇతర మొక్కలపైకి ప్రాకుతూ మొగ్గలకు, పువ్వులకు మరియు కాయలకు రంధ్రాలను చేస్తూ విత్తనాలను తినేస్తాయి.
    8. నివారణ : పంటలో గ్రుడు లేక గొంగళి పురుగులను గమనించిన వెంటనే ఆకులతో సహా తీసివేసి నాశనం చేయాలి. ఎండోసల్ఫాన్ 2 మి.లీ. లేదా క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ. లేదా ఎసిఫేట్ 1 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

    తెగుళ్ళు

    1. వేరుకుళ్ళు, కాండం కుళ్ళు తెగులు : ఎండు తెగులు సోకిన మొక్కల ఆకులు పసుపు వర్ణానికి మారి వ్రేలాడుతుంటాయి. తదుపరి, ఆకుల అంచులు లోనికి ముడుచుకొని రాలిపోతాయి. కాండం మీద నల్లని చారలేర్పడతాయి. వేర్లను చీల్చి పరిశీలిస్తే గోధుమ రంగు చారలు కన్పిస్తాయి. వేర్లు పూర్తిగా లేదా పాక్షికంగా కుళ్ళిపోతాయి. ఎండుతెగులు సోకిన కాండం మీద, కాయలమీద గులాబి రంగు శీలీంధ్ర బీజాల సముదాయం కన్పిస్తుంది. తెగులు కల్లించే శీలీంధ్రం భూమిలోను విత్తనాలు మరియు పంట అవశేషాలపై జీవిస్తుంది. భూమిలో అధిక ఉష్ణోగ్రత తెగులు వృద్ధికి దోహదపడుతుంది.
    2. నివారణ : పంట మార్పిడి తప్పకుండా చేయాలి. పంట అవశేషాలను నాశనం చేయాలి. కిలో విత్తనానికి 3 గ్రా. ధైరం లేదా కాప్లాన్ లేదా కార్బండైజిమ్ కలిపి విత్తన శుద్ధి చేయాలి. కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా మాంకోజెబ్ 3 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

    3. ఆకుమచ్చ (ఆల్టర్నేరియా) తెగులు : మొక్క ఎదుగు దశలో గాలిలో తేమశాతం అధికంగా ఉన్నపుడు తెగులు అధికంగా వ్యాపిస్తుంది. ఆకులపై,కాండము మీద గోధుమరంగు మచ్చలు ఏర్పడతాయి. ముదురు గోధుమరంగు కలిగినటువంటి చిన్న చిన్న వలయాకారపు మచ్చలు ఆకు అంతా వ్యాపించి ఆకులు ఎండిపోయి, రాలిపోతాయి. తెగులు కలుగజేసే శిలీంధ్రం తెగులు సోకిన విత్తనాల్లోను, భూమిలోను, పంట అవశేషాలపై నివసిస్తుంది.
    4. నివారణ : తెగులు ఆశించిన పంట అవశేషాలను నిర్మూలించాలి. కిలో విత్తనాలకు 2 గ్రా. కార్బండైజిమ్ కలిపి విత్తనశుద్ధి చేయాలి. పంట దశలో కార్బండైజిమ్ 1 గ్రా. లేక మాంకోజెబ్ 2.5 గ్రా. లీటరు నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారి చేయాలి.

    5. కాండం ఎండుతెగులు : కాండం మీద గోధుమ రంగు మచ్చలు ఏర్పడి క్రమంగా గోధుమ రంగు నుండి నల్లగా మారుతుంది.
    6. నివారణ : మాంకోజెబ్ గాని, కాపర్ ఆక్సిక్లోరైడ్ గాని 3 గ్రా లీటరు నీటితో కలిపి చల్లు కోవాలి.

    7. వెర్రితెగులు (ఫిల్లోడి) : ఈ తెగులు పూత సమయంలో ఆశిస్తుంది. సాధారణంగా ఆలస్యంగా వేసిన పంటలో ఎక్కువగా వస్తుంది. తెగులు సోకిన మొక్కల్లో ఆకులు చిన్నవై, పువ్వులోని భాగాలన్నీ ఆకుల మాదిరిగా మారిపోయి కాయలు ఏర్పడవు. మొక్కల ఎదుగుదల తగ్గి భాగంలో చిన్న చిన్న ఆకులు గుబురుగా ఉండి వెర్రి తల మాదిరిగా ఉంటుంది. ఈ తెగులు దీపపు పరుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది.
    8. నివారణ : రాజేశ్వరి, చందన, హిమ రకాలు ఈ తెగులును కొంత వరకు తట్టుకొంటాయి. తెగులు కనిపించిన వెంటనే తెగులు సోకిన మొక్కలను పీకి తగులబెట్టాలి. పైరుపై మిథైల్డెమెటాన్ 1 మి. లీ లేదా డైమిధోయేట్ 3. మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేసి దీపపు పరుగులను అరికట్టాలి.

    9. బూడిద తెగులు : లేత ఆకులపై తెల్లని బూడిద పొడి మచ్చలు ఏర్పడతాయి. తెగులు ఆశించిన ఆకులు మాడి రాలిపోతాయి.
    10. నివారణ : నీటిలో కరిగే గంధకపు పొడి 8 గ్రా. లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.

    ఎరువుల యాజమాన్యం

    ఈ పంటను సాధారణంగా, చిన్న కారు, సన్నకారు రైతులు సాపేక్షంగా సారహీననేలల్లో వరాధారంగా సాగు చేస్తారు. నువ్వు పంట, నేలను నిస్సారంగా చేయును. ఎరువును బాగా తీసుకుంటుంది. నేలలో సారం లేకుంటే పోషకాలను తగినంతగా వేయాలి. ఖరీఫ్లో ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువు, 16 కిలోల నత్రజని, 16 కిలోల పొటాష్, 24 కిలోల భాస్వరం వేయాలి. రబీ లేదా వేసవిలో, వీటితో పాటు 8 కేజీల నత్రజని వేయాలి. నత్రజనిలో సగం, మొత్తం భాస్వరం, పొటాష్లను ఆఖరి దుక్కిలో వేయాలి. మిగతా సగం నత్రజనిని విత్తిన నెలలోపు కలుపు తీసి, ఎరువులు వేయాలి. భాస్వరం ఎరువును. యస్.యస్.పి (సింగిల్ సూపర్ పాస్ఫేట్) రూపంలో వాడినపుడు కాలియం (సున్నము), గంధకము లభించి దిగుబడి పెరుగును. నత్రజని, భాస్వరం వేస్తే ఒక్కొక్క మొక్కకు గుళికల (కాయలు) సంఖ్య పెరుగును. గుళికలో గింజల సంఖ్య పెరుగును.

    నీటి యాజమాన్యం.

    నువ్వు పంటకు సాధారణంగా බීජා పెట్టరు. కాని రబీ / వేసవి పంటలకు నీరు పెడతారు. సరాసరి 500 మి.మి. నీరు కావాలి. విత్తిన వెంటనే మొదటి తడి ఇవ్వాలి. పూత, కాయ అభివృద్ధి, గింజకట్టు సమయంలో తడులివ్వాలి. విత్తిన తర్వాత 35-40 రోజుల నుండి 65-70 రోజుల వరకు నీటి ఎద్దడి లేకుండా చూడాలి.

    కలుపు నివారణ, అంతరకృషి

    విత్తు ముందు పూక్టోరలిన్ 40% ఎకరాకు 1 లీటరు చొప్పున పిచికారి చేసికలియదునాలి. లేదా పెండిమిధాలిన్ 30%, అలాక్లోర్ ఎకరాకు లీటరు చొప్పున ఏదో ఒకదానిని విత్తిన వెంటనే కాని మరుసటి రోజు కాని పిచికారి చేయాలి. మొక్కలు మొలచిన 10 రోజులకు అదనపు మొక్కలు తీసివేయాలి. విత్తిన 20-25 రోజులకు గొర్రుతో అంతర కృషి చేయాలి.

    పంట కోత

    ఆకులు, కాండం పసుపు రంగుకు మారి రాలడం ప్రారంభం అయ్యినపుడు 75% కాయలు లేత పసుపు రంగుకు వచ్చినపుడు పైరు కోయాలి. కోసిన పంటను కళ్లంపై వేసి కళ్లంను దట్టంగా చేసి నెరలు లేకుండా చేయాలి. కోసిన వెంటనే పంటను కట్టలుగా కట్టి తలక్రిందులుగా ఉంచాలి. 5-6 రోజులు ఎండిన తర్వాత కట్టెలతో కొట్టి నూర్పిడి చేయాలి.

    నిల్వ చేయుట

    గింజలో తేమ 8%కి తగ్గే వరకు ఎండలో ఆరబెట్టి గోనె సంచుల్లో నిల్వ చేయాలి. నిల్వ సంచుల్లో మలాథియాన్ చల్లాలి. మధ్యమధ్యలో పురుగు పట్టకుండా ఎండలో ఉంచాలి.

    ఎగుమతి ప్రాధాన్యత అంశాలు

    • గోధుమ వర్ణంగల రకాలను పొట్టతొలగించి, తెల్లగింజ రకాలను ఎగుమతి చేస్తారు.
    • ఒకే పరిమాణం గల నాణ్యమైన విత్తనం, పరుగు మందుల అవశేషాలు లేనివి ఎగుమతికి అనువు.

    పంటల సరళి

    తెలంగాణాలో ఖరీఫ్లో పసుపు, మొక్కజొన్న తర్వాత నువ్వులు వేస్తారు. వరిమాగాణుల్లో నిల్వ ఉన్న తేమతో నువ్వు సాగు చేయవచ్చు. సిగరెట్ పొగాకు వేసే ప్రాంతాల్లో నువ్వు పంటను ఎక్కువ సారము ఆవశ్యకత ఉండుట వల్ల ముందు నువ్వు పంట వేసి తరువాత సిగరెట్ పొగాకు సాగు చేస్తారు.

    నువ్వు విస్తీర్ణం హెచ్చు తగ్గులకు కారణాలు

    కోస్తా జిల్లాలో ఈ పంటను మే నెలలో వచ్చే తొలకరి వానల్లో జల్లి ఆగష్టు నెలాఖరుకు పంట కోస్తారు. తొలకరి వానలు లేక జూన్ నెలాకరిలో జల్లితో పంటకు వెర్రి తెగులు వస్తుంది. అందువల్ల ఈ పరిస్థితుల్లో నువ్వు పంట బదులు వేరుశనగ వేస్తారు. ఈవిధంగా తొలకరి వానను బట్టి నువ్వుపంట విస్తీర్ణం పెరగుట, తగ్గుట జరుగును. ఉత్తర తెలంగాణాలో పరిస్థితి వేరుగా ఉంటుంది. ఈ జిల్లాల్లో విత్తనాలు ముందుగా జల్లితే రొట్టగా పెరిగి వెర్రి తెగులు వస్తుంది. అందువల్ల జూన్ నెలలో గాని ఆగష్టు నెలాఖరులో గాని విత్తుతారు. ఇక్కడ తెల్ల నువ్వు రకాలు సాగుచేస్తారు.

    వర్వాభావం వల్ల చెరువులు నిండక వరినాట్లు సరిగా జరగనపుడు సెప్టెంబరు, అక్టోబరులలో నువ్వు పంట వేస్తారు. విశాఖ, శ్రీకాకుళం జిల్లాలలో గల వన్య ప్రాంతాల్లో ఆగష్టు సెప్టెంబరు లలో మాఘిపంటగా సాగు చేస్తారు.

    నువ్వు పంట రకాల వర్గీకరణ

    విత్తనం రంగు, పెరిగే ఋతువు, పక్వదశ, ఫలదళాల సంఖ్యను బట్టివివిధ రకాలుగా వర్గీకరించవచ్చు.

    • గింజ రంగు: తెలుపు, నలుపు లేక ముదురు గోధుమ
    • ఋతువుల ఆధారంగా : పునాస (ఖరీఫ్), పైరు (రబీ)
    • ఫలదళాల సంఖ్య : బై కార్పిల్లేటమ్ (2 బద్దలు), క్వాడ్రికార్పిల్లేటమ్ (4 బద్దలు)
    • పక్వదశ : ముందుగా, ఆలస్యంగా పక్వానికి వచ్చేవి.

    నువ్వుల రకాల గుణగుణాలు

    రకం

    ఋతువు

    పంట కాలం (రోజుల్లో)

    దుగుబడి (కిలోలు ఎకరాకు)

    నూనె శాతం

    గుణగణాలు

    (01)

    (02)

    (03)

    (04)

    (05)

    (06)

    గౌరి

    ఖరీఫ్

    90

    250

    50

    ముదురు గోధుమ రంగు విత్తనం.కోస్తా జిల్లాలకు అనువైనది. కోడు ఈగకు కొంతవరకు తట్టుకుంటుంది

    మాధవి

    ఖరీఫ్

    70-75

    200

    50-51

    లేత గోధుమ రంగు విత్తనం. పలు పంటలు పద్ధతికి అనుకూలం .

    ఎలమంచిలి-11

    ఎర్లీ ఖరిఫ్

    80-85

    360-400

    52.5

    ముదురు గోధుమ రంగు విత్తనం. కోస్తా జిల్లాలకు  అనుకూలం. పంట ఒకేసారి కోతకు వస్తుంది. లేత గోధుమ రంగు విత్తనం. కోస్తా జిల్లాలకు అనుకూలం. బూడిద, అకుమచ్చ తెగుళ్ళను తట్టుకుంటుంది.

    ఎలమంచిలి-17

    ఎర్లీ ఖరీఫ్

    75-80

    340

    52.5

    లేత గోధుమ రంగు విత్తనం. కోస్తా జిల్లాలకు అనుకూలం. బూడిద, అకుమచ్చ తెగుళ్ళను తట్టుకుంటుంది.

    ఎలమంచిలి-66

    ఖరీఫ్ రబీ/వేసవి

    80

    75

    350

    400

    52.5

    లేత గోధుమ రంగు విత్తనం.కోస్తా జిల్లాలకు అనుకూలం. బిడిడ, అకుమచ్చ తెగుళ్ళను తట్టుకుంటుంది.

    రాజేశ్వరి

    లేట్ ఖరీఫ్ రబీ/వేసవి

    90

    80

    200

    300

     

    50

    తెల్లగింజ రకం. తెలంగాణా జిల్లాలకు అనుకూలం. కాండం కుళ్ళు, బూడిద తెగుళ్ళను తట్టుకొంటుంది. రబీ/వేసవిలో కోస్తాకు అనుకూలం.

    శ్వేతాతిల్

    లాట్ ఖరీఫ్ రబీ/ వేసవి

    85-90

    80

    250

    450

     

    50-51

    తెల్లగింజ రకం. తెలంగాణా ప్రాంతానికి అనుకూలం. వేసవిలో రాష్ట్రమంతటికి అనుకులం. కాండం కుళ్ళును తట్టుకొంటుంది. ఎగుమతి ప్రాధాన్యత కలదు.

    చందన

    ఖరిఫ్

    రబీ/ వేసవి

    85

    80

    250

    480

    50-51

    గోధుమరంగు విత్తనం. అన్ని కలాలకు అనుకూలం. వేర్ర్రితల తెగులును తట్టుకొంటుంది. తెలంగాణా ప్రాంతానికి అనుకూలం.

    హిమ (జె.సి యాన్ 9426)

    ఖరిఫ్ రబీ/ వేసవి

    80

    75-80

    280

    480

    51

    51

    స్వల్పకాలిక తెల్లగింజరకము, కాయలు పొడవుగా ఉంటాయి. వెర్రితల తెగులును తట్టుకొంటుంది. ఎగుమతి ప్రాధాన్యత కలదు.

    నువ్వుల సాగుపై మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన చిరునామా : అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, జగిత్యాల-505 327, కరీంనగర్ జిల్లా, ఫోన్ : 08724-277541 (లేదా) ప్రధాన శాస్రవేత్త (అగ్రానమి) & హెడ్, వ్యవసాయ పరిశోధనా స్థానం, కోక్కిరాపల్లి, ఎలమంచిలి - 531055, విశాఖ పట్టణం జిల్లా ఫోన్ : 08931-232441

చివరిసారిగా మార్పు చేయబడిన : 1/3/2024



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate