ఆంధ్రప్రదేశ్లో వంగ 26,564 హెక్షార్ల విస్తీర్ణంలో సాగుచేయబడుతూ, 5,31,280 టన్నుల దిగుబడినిస్తుంది.
వర్షాకాలపు పంట : జూన్-జూలైలో, శీతాకాలపు పంటను అక్టోబర్-నవంబరులో, వేసవి కాలపు పంటను జనవరి రెండవ పక్షం నుండి ఫిబ్రవరి మొదటి పక్షం వరకు నారు కోసం విత్తవచ్చు.
30-35 రోజుల నారును నాటుకోవాలి. వర్షాకాలం నారును జూలై-ఆగష్టులో చలికాలం నారును నవంబర్–డిసెంబరులో, వేసవికాలం నారును ఫిబ్రవరి-మార్చి మొదటివారంలో నాటవచ్చు.
బాగా నీరు ఇంకే నేలలు, ఒక మాదిరి నుంచి హెచ్చు సారవంతమైన నేలలు ఈ పంట సాగుకు అనుకూలమైనవి. చౌడు నేలలు పనికిరావు.
ఎకరాకు సూటి రకాలకు 260 గ్రా., సంకరజాతి రకాలకు 120 గ్రాముల విత్తనం కావాలి.
ప్రాంతీయ మార్కెట్లో వినియోగదారుల అభిరుచిని బట్టి రకాలు ఎంపిక చేసుకోవాలి. మన రాష్ట్రంలో ముఖ్యంగా కోస్తా ఆంధ్ర ప్రాంతానికి భాగ్యమతి, పూసాపర్పుల్ లాంగ్, పూసా పర్పుల్ క్లస్టర్, పూసా క్రాంతి, గులాబి రకాలు, తెలంగాణా ప్రాంతానికి పూసా క్రాంతి, పూసా పర్పుల్ క్లస్టర్, శ్యామల రకాలు, రాయలసీమ ప్రాంతానికి దేశవాళీ పచ్చవంగ రకాలు, దేశవాళీ చారల వంగ (రాయదుర్గ) రకాలు అనుకూలం.
సంకరజాతి రకాలు:
ఊదారంగు గుండ్రటి రకాలు : అర్మనవనీత్, పూసా హైబ్రిడ్-6, మహికో హైబ్రిడ్ నెం. 2, నెం. 54 ఉత్కర మోహిని, అగోరా, మంజు, సంజు, మ్యూ-మ్యూ.
ఊదారంగు గుత్తి రకాలు : మహికో-రవయ్య, మహికో హైబ్రిడ్ నెం. 3
ఊదారంగు పొడవ రకం : పూసా హైబ్రిడ్-5
పచ్చటి పొడవు రకాలు : మహికో హైబ్రిడ్ నెం. 9, గ్రీన్ లాంగ్, హరిత, హరిత్ర, బి.హెచ్. —0028,-1311, -1444
పచ్చటి గుండ్రటి రకాలు : మహికో హైబ్రిడ్ నెం. 56, గ్రీన్ బంచ్
ఊదారంగు చారల రకాలు : కల్పతరు, మహికో హైబ్రిడ్ నెం. 11, 16
రకం |
పంటకాలం (రోజుల్లో) |
గుణగణాలు |
దిగుబడి (ట/ఎ) |
భాగ్యమతి |
150 – 165 |
నీటి ఎద్దడిని, కాయ తొలుచు పురుగు మరియు వెర్రితల వైరస్ తెగులును బాగా తట్టుకొంటుంది. కోస్తా ఆంధ్ర ప్రాంతానికి అనుకూలం. |
12 - 14 |
శ్యామల |
130 – 150 |
మసాలా వంటకాలకు ప్రశస్త్రి. తెలంగాణా ప్రాంతానికి అనువైనది. |
6.5 – 8.0 |
గులాబి |
140 – 160 |
కాయలు మధ్యస్థ పొడవుగా ఉండి, 3-4 కాయలు గుత్తులుగా so ఆకర్పనీయంగా లేత గులాబి రంగులో నిగనిగలాడుతుంటాయి. తెలంగాణా, కోస్తా ఆంధ్రలకు అనుకూలం. |
13 - 14 |
పూసాపర్పుల్ క్లస్టర్ |
135 – 140 |
కాయలు ఊదారంగులో వుండి గుత్తులు గుత్తులుగా కాస్తాయి. ఎండుతెగులును బాగా తట్టుకొంటుంది. |
12 - 16 |
పూసాపర్పుల్ లాంగ్ |
134 - 140 |
కాయలు పొడవుగా (25-30 సెం.మీ.) ఊదారంగులో నవనవలాడుతూ ఉంటాయి. |
12 - 16 |
పూసాక్రాంతి |
135 - 150 |
కాయలు కొంచెం లావుగా మధ్యస్థ పొడవుతో వుండి ఊదారంగులో ఆకర్షణీయమైన ఆకుపచ్చ తొడిమకల్లి ఉంటాయి. |
14 - 16 |
నేలను 4-5 సార్లు బాగా దున్ని చదును చేయాలి. వర్షాకాలపు పంటకు బోదెలు, కాలువలు ఏర్పాటు చేయాలి. శీతాకాలం మరియు వేసవి పంటకు 4X5 చమీ. మళ్ళను తయారు చేసుకోవాలి.
6 అంగుళాలు ఎత్తు ఉండే 1X4 మీ. సైజుగల నారుమళ్ళను తయారు చేసుకోవాలి. ఒక ఎకరాకు 10-12 నారుమళ్ళ నారు సరిపోతుంది. 260 గ్రా, విత్తనాన్ని 10 సెం.మీ. వరుసల్లో విత్తుకోవాలి. అయితే వితే ముందు విత్తనాలను 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత గల నీటిలో 30 నిమిషాల పాటు నానబెట్టి, నీడలో ఆరనివ్వాలి. ఆ తర్వాత కిలో విత్తనానికి 3 గ్రాముల చొప్పన ధైరామ్ లేదా మాంకోజెబ్ అనే మందుతో విత్తనశుద్ధి చేయాలి. ఆ తర్వాత కిలో విత్తనానికి 4 గ్రా. ల చొప్పున టైకోడెర్మా విరిడి కల్బర్ను కూడా పట్టించి విత్తుకోవాలి. విత్తిన తరువాత మాగుడు తెగులు కనిపించిన వెంటనే (మాగుడు తెగులు వరాలు ఎక్కువగా ఉ న్నపుడు నీరు మళ్ళలో నిలిచనపుడు ఆశిస్తుంది. మొక్కల మొదళ్ళ వద్ద కుళ్ళి నారు చనిపోతుంది. నారు ఏ దశలోనయినా ఈ తెగులు ఆశిస్తుంది. కాపర్ ఆక్సీక్లోరైడ్ మందును లీటరు నీటికి 3 గ్రాముల చొప్పన కలిపి వారం రోజుల వ్యవధి ఇస్తూ 2-3 సార్లు నారుమడిని బాగా తడపాలి. నారును పీకటానికి వారం రోజుల ముందు 250 గ్రా. కార్బోఫ్యురాన్ గుళికలను 100 చ.మీ. నారుమడికి వేయాలి.
పొడవుగా, నిటారుగా పెరిగే రకాలకు (పూసా పర్పుల్ లాంగ్, పూసా పర్పుల్ క్లస్టర్, పూసా పర్పుల్ రౌండు, భాగ్యమతి, శ్యామల) 60x60 సెం.మీ. గుబురుగా పెరిగే రకాలకు (పూసా క్రాంతి, అర్క కుసుమాకర్, గులాబి) 75x50 సెం.మీ. దూరం పాటించి నాటాలి.
ఎకరాకు 200 కిలోల చొuన వేప పిండిని దుక్కిలో వేసుకోవాలి. బాక్టీరియా ఎండు తెగులు ఉండే ప్రాంతాల్లో ఎకరాకు 6 కిలోల చొuన బ్లీచింగ్ పొడిని వేసుకోవాలి. రసం పీల్చు పురుగులు ఆశించకుండా ఎకరాకు 10 కిలోల చొప్పన కార్బోప్యరాన్ గుళికలను నాటే ముందు వేసుకోవాలి.
ఎకరాకు 6-8 టన్నుల పశువుల ఎరువును ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నాలి. 24 కిలోల భాస్వరం (150 కిలోల సూపర్ ఫాస్ఫేట్), 24 కిలోల పొటాష్లనిచ్చే ఎరువులను (40 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్) చివరి దుక్కిలో వేయాలి. 40 కిలోల నత్రజనిని, (200 కిలోల అమ్మోనియం సల్ఫేట్ లేదా 85 కిలోల యూరియా), 3 సమభాగాలుగా చేసి నాటిన 30వ, 60వ మరియు 75వ రోజున పైపాటుగా వేయాలి. సంకరజాతి రకాలకు ఈ ఎరువుల మోతాదు 50% అధికం చేసి వేయాల్సివుంటుంది.
విత్తిన లేదా నాటిన 24-48 గంటలలో అలాక్లోర్ 1.0 లీ. (తేలిక నేలలు), 1.5 లీటర్లు చొప్పన (బరువు నేలలకు) ఎకరాకు పిచికారి చేయాలి. నాటిన 25, 30 రోజులప్పడు గొర్రు లేదా గుంటకతో అంతరకృషి చేయాలి. పైపాటు ఎరువులు వేసే ప్రతిసారి గొప్పత్రవ్వి బోదెలు సరిచేస్తే పంట బాగా పెరుగుతుంది.
నాటేముందు లేదా నాటిన వెంటనే నీరు పెట్టాలి. భూమిలో తేమను బట్టి శీతాకాలంలో 7-10 రోజులకొకసారి, వేసవిలో 4-5 రోజులకొకసారి, వర్షాకాలంలో అవసరాన్ని బట్టి నీరు ఇవ్వాలి. సాధ్యమైనంత వరకు వేసవిలో నీటి తడులు కాయలు కోయడానికి 1-2 రోజుల ముందు ఇవ్వాలి. లేకుంటే వంకాయలు ఎక్కువ చేదుగా ఉంటాయి. బరువైన నల్లరేగడి నేలల్లో తప్పనిసరిగా మరుగు నీటి పారుదల సౌకర్యం కల్పించాలి.
వంగ సాగుపై మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన చిరునామా : "సీనియర్ సైంటిస్ట్ (హార్టికల్చర్), ఉద్యాన పరిశోధనా స్థానం, అనంతరాజుపేట - 516 105, కడప జిల్లా", ఫోన్ నెం. 08566-200218
చివరిసారిగా మార్పు చేయబడిన : 12/21/2023