మన రాష్ట్రంలో మొక్కజొన్న పంటను అన్ని కాలాలలోను (వర్షాకాలం, చలికాలం మరియు వేసవికాలం) పండించు కొనవచ్చు. తక్కువ రోజులలో ఎక్కువ దిగుబడినిచ్చే పంటలలో మొక్కజొన్న ముఖ్యమైనది. ఒక ఎకరం పండించటానికి అవసరమైన నీటిలో 2.5 ఎకరాల మొక్కజొన్నను పండించవచ్చు. ఈ మధ్యకాలంలో ప్రత్యక (తీపి, బేబీ కార్న్ మరియు పేలాలు) మొక్కజొన్న రకాలకు మార్కెట్ లో గిరాకీ చాలా ఏర్పడింది. కావున రైతులు ప్రత్యక రకాల సాగు పద్దతులను తెలుసుకొని అధిక లాభాలను సాధించటానికి అవకాశం ఉంది.
పట్టణ పరిసర ప్రాంతాలలో మొక్కజొన్న కండెలకు బాగా గిరాకీ ఉంటుంది. గింజ పాలు పోసుకునే దశలో సాధారణ మొక్కజొన్న కండెలతో పోలీసై తీపి మొక్కజొన్న కండెలలో చక్కర శాతం (25-30%) మరియు పోషక విలువలు ఎక్కువ. కావున ఈ మధ్య పట్టణ ప్రాంత ప్రజలు విరివిగా తీపి కంద్రాకాన్ని మార్కెట్ లో కొంటున్నారు. రెండు తీపి కండెల ప్యాకెట్ సుమారు రూ. 10/- వరకు మార్కెట్ ధర పలుకుచున్నది. ఎకరానికి 30 వేల మొక్కల వరకు ఉండే అవకాశం ఉన్నది. కావున రమారమి 30 వేల బుట్టలు వచ్చినచో రూ. 3/- చొప్పున రూ.90/-వేల రూపాయలు. ఎకరానికి ఖర్చు పోను నిఖారాదాయం రూ.60/- వేల వరకు వచ్చే అవకాశం ఉన్నది. మాములు మొక్కజొన్న కన్నా నిఖారాదాయం రెండింతలు ఎక్కువ. కావున నగర మరియు పట్టణ ప్రాంత రైతులు మార్కెట్ సౌకర్యం చూసుకొని ఈ పంటను సాగు చేసుకున్నట్లయితే అధిక లాభం పొందవచ్చు. తీపి మొక్కజొన్నను నీటి పారుదల కింద మాత్రమే సాగు చేసుకోవాలి. తీపి కండెను అవసరాన్ని బట్టి బేబీకార్న్ గా కూడా మార్కెట్ చేసుకోవచ్చు.
తీపి మొక్కజొన్న సాగుకు మురుగు నీటి పారుదల సౌకర్యం అన్ని రకాల నేలలు అనువైనవి.
ఘుగర్ - 75, బ్రైట్ జిన్ అనే హైబ్రిడ్, విన్ ఆరంజ్ రకాలు మరియు మాధురి, ప్రియ, ఆల్ మేరా తీపి మొక్కజొన్న లంతా కంపోజిట్ రకాలు అందుబాటులో ఉన్నాయి. ఖరీఫ్ లో 80-85 రోజులు మరియు రోబోలో 85-95 రోజులకు కోతకు వస్తుంది.
తీపి మొక్కజొన్నను మార్కెట్ అనుకూలతను బట్టి సంవత్సరం పోసావుగా విత్తుకొనవచ్చును. ముఖ్యంగా మార్కెట్ అవసరాలకు అనుగుణంగా దఫాలుగా విత్తుకొన్నచో అధిక లాభాలను పొందవచ్చును. కానీ ఖరీఫ్ లో జూన్ 15 నుండి జులై 15 లోపల అలానే రబీలో అక్టోబర్ 15 నుండి నవంబర్ 15 లోపల విత్తినచో అధిక దిగుబడులు సాధించవచ్చును.
సాధారణంగా ఎకరానికి 3-3.5 కిలోల విత్తనము సరిపోతుంది (సాధారణ రకాలు) కానీ ప్రయివేట్ హైబ్రిడ్ రకాలకు ఎకరానికి 2-2.5 కిలోల విత్తనం సరిపోతుంది.
కిలో విత్తనానికి 3.0 గ్రా. మ్యంకోజెబ్ లేదా ధైర్యమ్ లేదా కాప్టాన్ తో విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే తొలి దశలో మొక్కలను ఆశించే తెగుళ్ళ బారి నుండి కాపాడుకోవచ్చును.
దుక్కిలో ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు వేయాలి. దుక్కి బాగా దున్ని, చదును చేసుకొని బోదె నాగలితో 60 సెం.మీ. ఎడంతో బోదె కాలువలు చేసుకోవాలి. మొక్కల మధ్య 20 సెం.మీ. దూరం ఉండునట్లు విత్తనాన్ని వోడేకు ఒక ఒక వైపున పై నుండి 1/3 వంతు ఎత్తులో విత్తినచో నీటిపారుదల సులభంగా ఉండడమే కాక, వర్షపాతం ఎక్కువైనప్పుడు నీరు బయటకు పొవాసానికి వీలుంటుంది. విత్తిన పది రోజుల తరువాత కుదురుకు ఒక్క మొక్కను మాత్రమే ఉంచి మిగతా మొక్కలను తీసివేయాలి. తీపి మొక్కజొన్నను కందుల తీపిదనను మరియు ఇతర నాణ్యత ప్రమాణాల కొరకై వేరే మొక్కజొన్న రకాల నుండి 250 మీటర్ల దూరంలో లేదా 14 రోజుల పూత అంతరం ఉండేలా సాగు చేసుకోవాలి.
ఎకరానికి 10 టన్నుల బాగా మాగిన పశువుల ఎరువు లేక కంపోస్టు ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నాలి. భూసార ఫలితాలను బట్టి ఎరువులను తగిన మేతదులో వాడాలి. ఎకరానికి 175 కిలోల యూరియా (నత్రజని), 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్పెట్ (భాస్వరం) మరియు 33 కిలోల మ్యురేట్ అఫ్ పోటాష్ (పోటాష్) అవసరం ఉంటుంది. యూరియాను మూడు ధపాలుగా 1/3 వ వంతు విత్తే సమయంలో, 1/3 వ వంత 30-35 రోజులకు మరియు మిగిలిన 1/3 వంతు 50-55 రోజులకు వేసుకోవాలి. ఆఖరి దుక్కిలో 1/3 వ వంత యూరియాతో పాటు మొత్తం భాస్వరం (ఎస్.ఎస్.పి) మరియు సగం పోటాష్ వేయాలి. మరలా 50-55 రోజులకు ఋరియుత్తో పాటు మిగతా సగం పోటాష్ ను వేయాలి.
మొక్కజొన్నలో మొదటి 3 నుంచి 4 వారాక వరకు పెరుగుదల నెమ్మదిగా ఉండటం వలన కలుపును ఏ మాత్రం తట్టుకోలేదు. కనుక 6 వారాల వరకు కులపు పెరుగుదలను అరికట్టి పంటకు నష్టం వాటిల్లకుండా చూడాలి. విత్తిన తరువాత అత్రజోన్ అనే కలుపు మందును ఎకరానికి 1-1.5 కిలోలు 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 48 గంటల లోపు నేల పై తగినంత తేమ ఉన్నప్పుడు పిచికారీ చేయడం వలన వెడల్పాటి ఆకులు గల కలుపు మొక్కలను దాదాపు ఒక నేల వరకు మెలవకుండా అదుపు చేయవచ్చు. విత్తిన 30 నుంచి 35 రోజులకు కల్టివేటర్ తో అంతరకృషి చేసి కలుపు మొక్కలను పూర్తిగా నివారించవచ్చు. దీని తరువాత అవసరాన్ని బట్టి సాళ్ళలో కలుపు తీయంచాలి.
కాండం తొలుచు పురుగు నివారణకు 10-12 రోజుల పైరు పై మెనోక్రోటోఫాస్ 1.6 మీ.లి. లేదా క్లొరంతరణిలోప్రోల్ 20 ఎస్.సి. 0.3 మీ.లి. లీటరు కలిపి పిచికారీ చేయాలి. ఆకుమాడు తెగులు నివారణకు మీయంకోజెబ్ 2.5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
మొక్కజొన్న నీటి ఎద్దడిని (ముఖ్యంగా పూత దశలో) మరియు నీటి ముంపును (ముఖ్యంగా లేత దశలో) తట్టుకోలేదు. విత్తిన తరువాత మరియు 30 నుంచి 40 రోజుల లోపు వున్నా లేత పైరుకు అధిక నీరు హానికరం కాబట్టి మురుగు నీరు బయటకు పోయే వసతి కల్పించాలి. రబి కాలంలో నేలను బట్టి 6-7 తడులు అలానే వేసవి కాలంలో అయితే 7-8 తడులు ఇవ్వవలసి ఉంటుంది.
కొంచెం ఎండిన పీచు, కండెపైన బిగుతుగా ఉన్న పచ్చని పొత్తు మరియు బాగా పెరిగిన కండె పరిమాణాన్ని బట్టి కోతకు సరైన సమయమని గుర్తించవచ్చు. గింజలు మెరుస్తూ, బాగా పెరిగి, గిల్లినచో పాలు కారును. చక్కర శాతం గింజ పాలు పోసుకునే దశ నుంచి 10 రోజుల వరకు స్ధిరపడి తరువాత క్రమంగా తగ్గుతుంది. కావున రైతాంగ సరైన సమయంలో పచ్చి కండెలను కోసి, గ్రేడింగ్ చేసుకొని మార్కెట్ కు తరలించాలి. తీపి మొక్కజొన్నను కోసిన వెంటనే పొలం నుంచి షెడ్ కి తరలించి చెక్క పెట్టెల్లో లేదా అట్టపెట్టాల్లో పెట్టి చల్లని ప్రదేశంలో (0-4 సెం.) నిల్వ చేయాలి. కండెలను పాలిథిన్ సంచుల్లో పెట్టి మార్కెట్లో అమ్మవచ్చు.
తీపిరకంలో ఎకరానికి 8-10 టన్నుల పచ్చి కందుల దిగుబడి సాధించవచ్చును. సుమారుగా 26-33 వేల కండెలు ఉండును. ఎకరానికి 10-12 టన్నుల పచ్చిమేత దిగుబడి వలన అధిక ఆదాయమును పొందవచ్చును.
ముఖ్యంగా పట్టణ పరిసర ప్రాంత రైతులు ఈ అవకాశాన్ని ఎపయెగించుకొని, వీలైనచో మార్కెట్ ఏజెన్నీస్ తో ఒప్పందం కుదుర్చుకొని, మంచి హైబ్రిడ్ రకాలను ఎన్నుకొని, మార్కెట్ అనుగుణంగా తీపి మొక్కజొన్న సాగు చేసి, అవసరమైతే 3-4 దఫాలుగా విత్తునం పెట్టి అధిక లాభాలను గడించవచ్చును.
చివరిసారిగా మార్పు చేయబడిన : 2/13/2020