మన దేశంలో వరి, గోధుమ, మొక్కజొన్న తర్వాత చిరుధాన్యాల పంటలు ముఖ్యమైనవి. మిగిలిన పంటలతో పోల్చితే ఏ పంటల్ని తక్కువ నీటితో, తక్కువ పెట్టుబడితో తక్కువ రసాయన మందులతో పండించుకోవచ్చు. చీడపీడలు కూడా ఎక్కువగా ఆశించవు. వీటిలో పోషక విలువలు (ఐరన్, కాల్షియం, పీచుపదార్థం, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు) అధికంగా ఉండటం వలన పోషకాహార ధాన్యాలుగా చెప్పుకోవచ్చు. రాగిలో ఎక్కువగా కాల్షియం (344 మీ.గ్రా.) ఉన్నందువల్ల ఎదిగే పిల్లలకు, అన్ని వయస్సుల వారి ఆరోగ్యానికి చాల మంచి ఆహారం. రాగి పంటను ఇసుక, బరువు, చౌడు నీళ్లలో కూడా సాగు చేయవచ్చు.
విత్తే సమయం: ఖరీఫ్ లో జులై మొదటి వారం నుండి ఆగస్టు చివరి వారం వరకు మరియు రబీలో అక్టోబరు చివరి వారం నుంచి నవంబరు వరకు, వేసవిలో ఫిబ్రవరి మొదటి పాశంలోపు నాటుకోవాలి.
భారతి (అన్ని కాలాలకు) 105-110 రోజుల్లో కోతకు వస్తుంది. దిగుబడి ఎకరాకు 10-12 క్వింటాళ్లు అగ్గి తెగులును తట్టుకుంటుంది. హిమ (రబి) అనే తెల్ల గింజ రకం 105-110 రోజుల్లో కోతకు వస్తుంది. ఎకరాకు 10-12 క్వింటాళ్లు దిగుబడినిస్తుంది. అగ్గి తెగులును తట్టుకుంటుంది. మారుతీ అనే రాకను ఖరీఫ్, వేసవిలో పంపించవచ్చును. ఇది 85-90 రోజుల్లో కోతకు వస్తుంది. ఎకరాకు 9-10 క్వింటాళ్ళ దిగుబడినిస్తుంది. బెట్టాను మరియు అగ్గి తెగులును తట్టుకుంటుంది.
నారు నాటే పద్ధతి మరియు విత్తన మేతాడు: 85-90 రోజుల స్వల్పకాలిక రకాలకు 21 రోజుల వయస్సు కలిగిన మొక్కలను, 105-120 రోజుల దిర్శింకాలిక రకాలకు 30 రోజుల మొక్కలను నాటాలి. వరసల మధ్య 30 సెం.మీ. మొక్కల మధ్య 15 సెం.మీ. దూరం పాటించాలి. 2 కిలోల విత్తనంతో 5 సెంట్లలో పెంచిన నారు ఒక ఎకరా పొలంలో నాటడానికి సరిపోతుంది. వెదజల్లే పద్దతిలో ఎకరాకు 3-4 కిలోల విత్తనం అవసరమవుతుంది. కిలో విత్తనానికి 2 గ్రా. కార్బండజిమ్ లేదా 3 గ్రా. కష్టాం తో కలిపి విత్తన శుద్ధి చేస్తే తొలిదశలో చీడపీడలు రాకుండా నివారించవచ్చును.
ఎరువులు: ఎకరా పొలంలో 4 టన్నుల పశువుల ఎరువు ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నాలి. విత్తే ముందు ఎకరాకు 25 కిలోల డి.ఎ.పి., 15 కిలోల మ్యురేట్ అఫ్ పోటాష్ లోను వేయాలి. నాటిన 30 రోజులకు 25 కిలోల యూరియా పంటలో పై పాటుగా వేయాలి.
కలుపు నివారణ: విత్తిన తరువాత 30 రోజుల లోపు దంతెలతో అంతర సేద్యం చేసుకొని కలుపు నివారణ చేపట్టాలి.
నీటి యాజమాన్యం : పూత దశ, గింజ పాలు పోసుకొనే దశల్లో పైరు నీటి ఏడాదికి గురి కాకుండా చూడాలి.
అంతర పంటలు : ప్రతి 8 వరుసల రాగి పంటకు, రెండు వరసల కంది పంటను వేసుకోవాలి.
అగ్గితెగులు : నారుమడిలో తెగులు సోకితే లేత మొక్కలు మాడిపోతాయి. ఎదిగిన మొక్కల ఆకుల పై దారపు కండె ఆకారంలో మచ్చలు ఉంటాయి. కణుపుల మీద ఈ వ్యాధి నలుపు రంగు మచ్చల రూపంలో కనిపిస్తుంది. మెదవిరుపు ఆశించినప్పుడు కణుపు దగ్గర మొక్క విరిగిపోతుంది. వెన్నుపై ఆశించినప్పుడు ధాన్యపు గింజలు తలూగింజలుగా మారుతాయి. అధిక నత్రజని వాడినప్పుడు తెగులు ఎక్కువగా కనిపిస్తుంది. మొక్కల పై ఈ తెగులు ఆశించినపుడు 1 గ్రా. కార్బండజిమ్ లేదా మ్యంకోజెబ్ 2.5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి లేదా ట్రైసైక్లోజాల్ 0.6 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
పరిమాగాణుల్లో నేరుగా విత్తే రాగి సాగు : సాధారణంగా రాగి పంటను రబి కాలంలో కూడా ఖరీఫ్ లో వేసినట్లే నారు పోసుకొని, నాట్లు వెయ్యటం జరుగుతుంది. అలాకాకుండా వరి మాగాణుల్లో వరి కోతకు వారం రోజుల ముందు రాగి విత్తనాలను నానబెట్టి చల్లికుంటే ఖర్చు తగ్గుతుంది. రాగి విత్తనాలను పలుచగా నీడలో ఆరబెట్టాలి. ఇలాపొడిగా అయిన విత్తనాలను పొలంలో సమానంగా వెదజల్లుకోవాలి. దీనివల్ల నరు పోసుకొని నాట్లు వేసుకొనే ఖర్చు గణనీయంగా తగ్గి. అధిక నిఖారాదాయం వస్తుంది. విత్తిన 20 రోజులకు ఎకరానికి 20 కిలోల యూరియా మరియు 10 కిలోల మ్యురేట్ అఫ్ పోటాష్ వేసుకుంటే సరిపోతుంది.
చివరిసారిగా మార్పు చేయబడిన : 2/12/2020