సాగునీటి వాడకంపై సరైన అవగాహన లేకపోవడం వల్ల, నీరు అవసరానికి మించి వాడినందువల్ల, నీరు అవసరానికి మించి వాడినందువల్ల లాభమేమి లేకపోగా, అత్యంత విలువైన నీటిని మరియు పోషకాలను వృధాచేయడమేకాక మంచి భూములు క్రమంగా చైడు భూములుగా మారుతాయి. ఏ పైరు నుండి అయినా పూర్తి స్థాయిలో ప్రతిఫలం రావాలంటే, ఆ పంట ఏ దశలోను నీటి ఎద్దడికి గురికారాదు. ముఖ్యంగా పైరు అవసరాన్ని బట్టి నీరు కట్టాలి. ముఖ్యంగా పంట సున్నిత దశలో మొక్క వేరు వ్యవస్థకు నీరందేటట్లు చూసుకోవాలి. ఏ పైరుకు ఎన్ని తడులు ఇవ్వాలి, తడులు మధ్య ఎంత కాల వ్యవధి ఉండాలి. అనేది ముఖ్యంగా నేల స్వభావం, పైరు గుణగణాలు మరియు వాతావరణ పరిస్థితులపై ఆధారపడి వుంటుంది. సాధారణంగా నేలలో పంట వేరు మండలంలో మొక్కలకు ఉపయోగపడే నీరు 50 శాతం కంటే తగ్గిపోక ముందే పైరుకు నీరు పెట్టాలి. నేలలో పైరుకు లభంచే తేమ 75 శాతం వరకు తగ్గినప్పుడు, మొక్కలకు కావలిసినంత నీరు లభ్యంకాక వరపు (నీటి ఎద్దడి) కలుగుతుంది. దీని వలన పంట దిగుబడి తగ్గుతుంది. మరీ తొందరగా నీరు పెట్టినా పంటకు ప్రాణ వాయువు దొరకక నష్టం కలుగుతుంది.
సాధారణంగానే పైపొరలలో 15-20 సెం.మీ. లోతు వరకు మట్టిని పరిశీలించి, నీరు పెట్టవలసిన సమయాన్ని నిర్ణయించాలి. ఇందుకు గాను మట్టిని చేతితో పట్టుకొని చూసి దానిలోని తేమ యొక్క హెచ్చు తగ్గులను కనుగొనవచ్చు.
ఏఏ నేలల్లో ఎప్పుడు నీరు పెట్టాలని తెలుసుకోవడానికి ఇసుక గుంత పద్ధతిని, ఇసుక నేలలను మరియు వరి పైరుకు తప్ప, ఇతర అన్ని రకాల నేలలకు మరియు పైరులకు అన్ని దశల్లో నీరు పెట్టడానికి ఉపయోగపడవచ్చును. ఈ పద్ధతిలో పంటను సులువుగా తనిఖీ చేయటానికి వీలయ్యే చోట్ల మూడడుగుల వెడల్పు, మూడడుగుల పొడవు, మూజజుగుల లోతు గల గుంతను తీయాలి. గుంట నుండి తీయగా వచ్చిన మట్టిలో (పరిమాణాన్ని బట్టి) ఇసుక బాగా కలిపి, కలియబెట్టాలి. ఈ విధంగా కలిసిన ఇసుక, మట్టితో గుంటను ఆరు అంగుళాల మేరకు నింపాలి. ప్రతి 6 అంగుళాల మట్టి వేసిన పిమ్మట మట్టిని బాగా దిమ్మెన చేస్తూ గుంటను నింపాలి. మామూలుగా పొలంలో ఓ పైరును పెట్టవలెనో ఆ పైరునే పెట్టాలి. ఇసుక కలిపిన గుంటలలో మట్టి నీటిని ఇమడ్చుకునే శక్తి తక్కువగా ఉండటం వలన, నీరు తక్కువైనప్పుడు గుంట ఉన్న చోట మొక్కలు వాడిపోయే లక్షణాలను, తక్కిన పోలంలోని మొక్కలు ముందుగానే సూచించడం వలన పైరుకు ఎప్పుడెప్పుడు నీరు కావలసినది తెలుసుకొని నీరు కట్టవచ్చు. ఇసుక ఎంత కలపాలన్నది నేల స్వభావాన్ని బట్టి ఉంటుంది. కనుక నేలను బట్టి ఇసుక పరిమాణం 5 శాతం నుండి కొంచెం అటో ఇటో మార్చుకోవాలి.
సాగునీరు పొదుపుగా వాడుకోవాలంటే పోలం చదునుగా వుండాలి. పొలాన్ని చిన్న మడులుగా విభజించి ఆ మడుల్లో నేలను బాగా చదునుగా చేసుకోవాలి.
పోలాన్ని చిన్నచిన్న గట్లతో చతురస్రాకారపు మడులుగా విభజించాలి. మడులు 18 x 15 మీటర్ల నుండి 6 x 6 మీటర్ల విస్తీర్ణంలో ఉంటాయి. గట్ల ఎత్తు నీటిని ఎంతవరకు నిలపాలో దానిని బట్టి వుంటుంది. మడుల్లో వుండే నేల బాగా చదునగా గాని లేక ఒక వైపుకు కొంచెం వాలుగా వుండేటట్లు గాని తయారు చేయాలి. పొలానికి ఎత్తు వైపు నుండి కొంచెం పెద్ద కాలువలు ఏర్పాటు చేయాలి. ఈ కాలువల నుండి చిన్న చిన్న కాలువల ద్వారా కయ్యలకు కావలసినంత నీరు పెట్టాలి. కయ్యలలో పెట్టిన నీరు బయటికి పోకుండా అందులోనే ఇంకుపోయేలా చూడాలి. వరిపైరుకు చాలా పెద్ద మడులు చేస్తారు. వేరుశనగ, రాగి, కూరగాయలు, పశుగ్రాసాలు మొదలైన పైర్లకు చిన్న చిన్న మడులు చేస్తారు. గట్లు తెగిపోకుండా బాగా వేయాలి. ఎక్కువ వాలుగా ఉండే పొలాలకు ఈ పద్దతి పనికి రాదు.
దీనినే “బోదెలు కాలువల పద్దతి” అంటారు. ఈ పద్దతిలో రెండు వరుసల మధ్య సన్నని కాలువలు చేసి ఈ కాలువల గుండా నీరు పెట్టాలి. ఈ చిన్న కాలువల గుండా నీరు పారేటప్పుడు నీరు నేలలోకి ప్రక్కలకు యింకి వేళ్ళ దగ్గర నేలను తడుపుతుంది. వరుసల్లో వేసే పంటలకు అంటే చెఱకు, ప్రత్తి, మొక్కజొన్న, జొన్న, సజ్జ, పొగాకు మొదలైనవి ఉపయోగపడుటుంది. ఇసుక నేలలు, విస్తారంగా పగుళ్ళు పారు నేలలకు తప్ప మిగితా అన్ని నేలలకు సరిపోతుంది. ఈ పద్దతి వలన పొలంలోని నేలనంతా తడపవలసిన పనిలేదు. నీరు ఎక్కువగా వృధా కాదు. నీటిని నిదానంగా పీల్చుకునే నేలలో కాలువలు వెడల్పుగా ఉండి లోతు తక్కువగా వుంటే బాగుంటుంది. నీటిని త్వరగా పీల్చుకునే తేలిక భూముల్లో కాలువల వెడల్పు కంటే లోతు తక్కువగా ఉంటే బాగుంటుంది. నీటిని త్వరగా పీల్చుకునే తేలిక భూముల్లో కాలువల వెడల్పు తక్కువగా వున్నా పరవాలేదు. కాలువలు నిండే దశను బట్టి నిర్ణయించుకోవాలి. ఈ చిన్న కాలువలను నాగళ్ళతోగాని, బోదెగుంటకతో గాని సులభంగా వేయవచ్చు.
సాగు నీరు తక్కువగా ఉన్నప్పుడు, ఒక సాలు తప్పించి ఒక సాలుకు నీరందించాలి. తదుపరి నీరు పెట్టేటప్పుడు మొదటిసారి తప్పించిన సాలుకు నీరు పెట్టి, ఇంతకు ముందు నీళ్ళు పెట్టిన పాలును తప్పించాలి. అదేవిధంగా పంటను జంట సాళ్ళ పద్దతిలో విత్తుకొని, రెండు జంటసాళ్ళ మధ్య కాలువ ద్వారా నీరందించాలి. రెండు జంట సాళ్ళ మధ్య దూరం ఎక్కువగా ఉంచి, సాళ్ళ మద్య దూరం తక్కువగా ఉంచి కావలసిన మొక్కల సాంద్రతను సాధించవచ్చును.
పొలాన్ని సమానమైన పొడవైన కయ్యలుగా 15 సెం.మీ. గట్లతో విభజించాలి. ఈ మళ్ళ వెడల్పు 6 నుండి 30 మీటర్ల వరకు వుంటుంది. మళ్ళ పోడవు 60 నుండి 300 మీటర్ల వరకు నేలను బట్టి, నీటి ప్రవాహ పరిమాణాన్ని బట్టి వుంటుంది. గట్ల మధ్య నేలను ఎత్తు పల్లాలు లేకుండా చదును చేయాలి. ఒక వైపు నుండి మరో వైపు 0.05 నుండి 0.5 శాతం వాలు కలిగించాలి. పొలం పైభాగాన పెద్ద కాలువ చేసి, ఈ కాలువల నుండి మడుల లేనికి పొడవాటి గొట్టాల ద్వారా నీరు వదలాలి. నీరు పొడవాటి మడిలో ఎత్తు నుండి పల్లానికి ప్రవహించి నేలను బాగా తడుపుతుంది. ఈ పద్దతిలో నీరు కొంత ఎక్కువగా పడుతుంది. పర్షపు నీరు పోవడానికి అంత అవకాశం వుండదు. దగ్గరగా విత్తే పైర్లు అనగా కొర్ర, గోధుమ, బార్లీ, పశుగ్రాసం మొదలైన వాటికి ఈ పద్దతి బాగా అనుకూలిస్తుంది. మడులు వేయడానికి చాలా తక్కువ ఖర్చవుతుంది. ఎక్కువ పరిమాణం గల నీటి ప్రవాహాన్ని సులభంగా ఉపయోగించుకోవచ్చు.
సాధారణంగా పండ్లకోతకు నీరు పెట్టేటప్పుడు ఈ పద్దతి అవలంభిస్తారు. చెట్టు చుట్టూ పాదులను గుండ్రంగా గాని లేక చదరంగా గాని తయారుచేసి ఆ కాలువల ద్వారా పాదులకు నీరు పెట్టాలి. మొక్కలు దూరంగా ఉంటే రెండు మూడు మొక్కలకొక పాదుచొప్పున తయారు చేయాలి. పాదుల నిండా నీరు పెట్టి ఆ నీరు పూర్తిగా ఇంకిపోయే వరకు అట్లే ఉంచాలి. చెట్లు పెరిగే కొలది పాదులను పెద్దవిగా చేయాలి. ఈ పాదులను మిట్ట మధ్యాహ్నం, చెట్టు నీడ ఎంత ఉంటుందో అంత వెడల్పు చేయాలి.
నీరు తక్కువగా ఉండే ప్రాంతాల్లో మామిడి, నారింజ మొదలైన పండ్ల మొక్కలను పెంచడానికి ఈ పద్దతి బాగా ఉపయోగపడుతుంది. ఇరుపది లీటర్లు పట్టే కుండలను తీసుకొని వాటికి అడుగున కొంచెం ప్రక్కగా పెన్సిలు పట్టేటంతటి రంధ్రం చేయాలి. ఈ కుండలను మొక్కకు రెండు వైపుల చెట్టు మొదలుకు కొంచె దూరంగా మెడ వరకు నేలలోనికి పాతాలి. కుండలు పాతేటప్పుడు వాటి రంధ్రం మొక్క వేర్ల వైపు పుండేటట్లు చూడాలి. ఈ కుండల నిండా నీరు పోసి పైన మూతలు పెట్టాలి. కుండలలో నీరు కన్నం గుండా చిన్నగా నేలలోకి పోతుంది. అప్పుడు వేర్ల దగ్గర తడిచి మొక్క వేర్లు సులభంగా నీటిని పీల్చుకుంటాయి. అవసరమైనప్పుడల్లా అనగా వారానికొకసారి కుండలను నింపుతూ వుండాలి. అందువలన కొంచె నీటితోనే మొక్కలను ఎండాకాలంలో బ్రతికించవచ్చు. ఆవిరిరూపంగా నీరు వృధా పోదు. పాదుల్లో కలుపు మొక్కలు కూడా ఎక్కువ వుండదు. నీటిలో కరిగే ఎరువులను కూడా పరిమితంగా కుండల్లో వేయవచ్చు. సాధారణంగా మొక్కకు పాదులలో పోసే నీటిలో 1/3 భాగం ఈ పద్దతిలో సరిపోతుంది.
వేసిన పంటను మరియు నీటి లభ్యతను అనుసరించి నీటి పారుదల పద్దతిని నిర్ణయించుకోవాలి.
నీటి వనరుల నుండి కాలువల ద్వారా పొలానికి తీసుకొని పోయేటప్పుడు దాదాపు 20 శాతం నీరు నేలలో ఇంకిపోవడం మూలంగాను, ఆవిరి అవడం ద్వారాను వృధా అవుతుంది. అంతేకాకుండా కాలువలు తెగిపోవడం, కలుపు మొక్కలు పెరిగి నీటి ప్రవాహాన్ని అడ్డుకొనటం, ఇవన్నీ జరుగుతూ వుంటాయి. ఇసుక నేలలో నీరు ఇంకా ఎక్కువగా ఇంకిపోతుంది. ఈ నష్టాన్ని తగ్గించడానికి క్రింద తెలిపిన మార్గాలు ఆచరించాలి.
పైన తెలియజేసిన ప్రాచీన సాంప్రదాయ పద్దతులతో నీటిపారుదల చేయడం వలన సాధారణంగా మొక్కలకు కాకుండా భూమికి నీరు ఇవ్వడం జరుగుతుంది. మొక్కలకు కావలసిన దాన్ని కన్నా అధిక మోతాదులో నీరివ్వడము వలన మొక్కల వేరు వ్యవస్థ దగ్గరలో ఉన్న గాలి రంధ్రాలన్ని నీటితో నిండి పోవడం వలన మొక్కల వేర్లు సరిగా గాలి ప్రసరణ జరగదు. అంతేకాకుండా మొక్కల వేర్ల దగ్గర ప్రాణవాయువు (ఆక్సీజన్) లేని పరిస్ధితులలో మొక్కల ఎదుగుదల సరిగా ఉండదు. అంతేకాకుండా చెడు చేసే సూక్ష్మక్రిములు, బాక్చీరియా వృద్ధి చెంది కొన్ని హానికర రసాయనాలు విడుదల చేయడం వలన మొక్కల పెరుగుదల దెబ్బతింటుంది. అధిక మొత్తంలో అందజేసిన నీరు ఆవిరి రూపంలోను, అధిక ఉపరితల ప్రవాహ రూపంలోనే కాకుండా నేలలో వేర్లకు అందకుండా భూగర్భములోకి చేరి, నీటిలోని కరిగే పోషకాలు నీటితో పాటు వృధా అవుతాయి. అందువలన ఈ పద్దతులలో మొత్తం పంటకు అందించిన నీటిలో 35-40 శాతము నీటిని మాత్రమే పంట ఉపయోగించుకుంటుంది.
నీటిని పొదుపు చేసి, ఆరోగ్యకరమైన మొక్కల పెరుగుదల కొరకు భూమికి కాకుండా మొక్కలకు నీరు అందించాలి.
అధిక దిగుబడులకై అధికంగా నీరు అందించాల్సిన అవసరం లేదు. పంటకు సరైన సమయంలో, సరైన మొతాదులో, సరైన రీతిలో, సరైన భాగంలో నీరు అందించినప్పుడు అధిక దిగుబడిని పొందవచ్చు. పర్యావరణ సమతుల్యాన్ని కాపాడుతూ ఆశించిన స్థాయిలో ఉత్పత్తిని మరియు ఉత్పాదకతలను సాధించటమే కాకుండా ఉత్పాదకత వ్యయాన్ని తగ్గించి సుస్థిరమైన అభివృధిని సాధించడం ముఖ్యము. ఇది సూక్ష్, నీటి పారుదల పద్దతి ద్వారా వీలుకలుగుతుంది. ఈ పద్దతి పెండు రకాలు. అవి బిందు (డ్రిప్) మరియు తుంపర ( స్ప్రింక్లర్) సేద్య పద్దతులు. ఈ పద్దతులలో నీటి వినియోగ సామర్థ్యము సాంప్రదాయ పద్దతుల (55 – 70%) కంటే ఎక్కువగా అనగా 55 - 70% తుంపర పద్దతిలో మరియు 90 – 90% వరకు బిందు సేద్య పద్దతిలో ఉంటుంది.
ప్రతి రోజు మొక్కకు కావలసిన నీటిని లేటరల్ పైపులకు అమర్చిన డ్రిప్పర్ల ద్వారా బొట్లు బొట్లుగా నేల ఉపరితలం మీద లేదా నేల దిగువన నేరుగా వేరు మండలములో అతిస్వల్ప పరిమాణంలో (గంటకు 1 నుండి 12 లీటర్ల వరకు) అందించే విధానాన్ని “బిందు సేద్యం” లేదా “డ్రిప్ పద్దతి” అంటారు. ఈ పద్దతిలో డ్రిప్పర్ల వరకు నీరు పీడనం ( ప్రెషర్)తో పైపులైన్ల ద్వారా సరఫరా చేయబడుతుంది. బిందు (డ్రిప్) సేద్య పద్దితిలో వేసే పంటను బట్టి ఐదు పద్దతులున్నాయి.
డ్రిప్ పద్దతిని వివిధ వాణిజ్య పంటలు, కూరగాయల పంటలు, దుంప పంటలు, గడ్డ పంటలు, ఆకు కూరలు, పండ్ల తోటలు, తోట పంటలు, సుగంధ ద్రవ్యాలు, కలప పంటలు, ఔషధ పంటలు, పూల పంటలు మొదలగు పంటలతో అమర్చుకోవచ్చు.
డ్రిప్ పద్దతి అమర్చుకోవటం పంట రకం మరియు మొక్కల సాంద్రత (స్పేసింగ్), మొక్కకు రోజువారి కావలసిన అత్యధిక నీటిపరిమాణం, పంటకాలం, నేల తీరు మరియు స్వభావం, ఏటవాలు (టోపోగ్రఫీ), పొలం విస్తీర్ణం, నీటి వసతి (బావి, కాలువ, చెరువు), లభ్యమయ్యే నీటి పరిమాణం (నీటి ఎద్దడి ఉన్నప్పుడు లభించే నీటి పరిమాణం), భూమి నుంచి నీటిలోతు (సక్షన్ లిఫ్ట్), నీటి నాణ్యత, పంపు సెట్ రకం (సెట్రీఫ్యూగల్, టర్బైన్, సబ్ మెర్సిబుల్), పంపుసెట్ సమకూర్చే నీటి పీడనం (ప్రెషర్ హెడ్), రోజుకు విద్యూత్ సరఫరా కాలం (గంటలలో), పంటల మార్పిడి విధానం, భూమి నిలువ ఉంచుకునే నీటి సామర్థ్యం, వాతావరణ పరిస్థితి మరియు రైతు ఆర్ధిక పరిస్థితి మొదలగు అంశాల మీద ఆధారపడి ఉంటుంది.
డ్రిప్ పద్దితికయ్యే ఖర్చు ముఖ్యంగా పంటలో వరుసల మధ్య, వరుసల్లో మొక్కల మధ్య దూరం, పొలానికి నీటివసతికి మధ్య గల దూరం మరియు నీటి నాణ్యత, పంట అవసరాలకు సరిపడే డ్రిప్ పరికరాల మీద ఆధారపడి ఉంటుంది.
బిందు సేద్యం రూపకల్పన చేస్తున్నప్పుడు పంటకు ఎంత నీరు అవసరము మరియు ఎంత నీరు బిందు పద్దతి ద్వారా పంపిస్తున్నామో తప్పకుండా తెలుసుకోవాలి.
భాష్పోత్సేకము మరియు నీరు ఆవిరిగా మారడం ఎండాకాలంలో ఎక్కువగా ఉంటుంది. అందువలన బిందు పద్దతిని ఎండాకాలంలో పంటకు అత్యధిక విధంగా రూపొదించాలి. డ్రిప్ పద్దతిలో ఒక్కో మొక్కకు లేదా పొలానికి ప్రతి రోజు పెట్టే నీటి పరిమాణం, ఉష్ణోగ్రత, సూర్యరశ్మి, గాలి వేగం, గాలిలో తేమ, చెట్ల మధ్య దూరం, పొలం విస్తీర్ణం , పంట రకం, పంట స్వభావం, పంట పెరుగుదల దశ మొక్కల భాష్పోత్సేకము, నీరు కట్టే ఋతువు మొదలగు అంశాలపై ఆధారపడి ఉంటుంది. నీటి ఆవిరి (Pan Evaporometer) ద్వారా ఆవిరి అయ్యే నీటి పరిమాణాన్ని మరియు మొక్క స్వభావం, పెరుగుదల దశలను పరిగణించి మొక్క యొక్క నీటి ఆవస్యకతను అంచనా వేసుకున్న తర్వాత డ్రిప్ వ్యవస్థను ఎంత సేపు నడిపించాలన్నది డ్రిప్పర్ల సంఖ్య మరియు గంటకు డ్రిప్పర్లు అందించే నీటి పరిమాణంపై ఆధారపడి వుంటుంది.
ఉదా: పంట – చెఱకు : నీటి పారుదల పద్దతి – బిందు సేద్యం
నాటిన తేది – ఫిబ్రవరి : సాళ్ళమధ్య దూరం – 5 అడుగులు : గరిష్ఠ నీటి ఆవిరి – 8.5 మి.మీ
వాతావరణ నీటి ఆవిరి = గరిష్ఠ నీటి ఆవిరి x పాన్ ఫాక్టర్ (0.7) = 5.95 మి.మీ./రోజుకు
పంట నీటి అవసరం (మొక్క భాష్పోత్సేకం) : వాతావరణ నీటి ఆవిరి x పంట ఫ్యాక్టర్ = 5.95 x 1.1 (పంట బాగా ఎదిగిన దశ) = 6.54 మి.మీ./రోజుకు
పంట గరిష్ఠ నీటి అవసరం = పంట భాష్పోత్సేకం/నీటి పారుదల పద్దతి సామర్థ్యం (డ్రిప్ – 90%) x 100 = 6.54/90 x 100 = 7.26 మి.మీ./రోజుకు
పంటను నీటి అవసరాన్ని బట్టి డ్రిప్ సిస్టమ్ (పంపు) ఎంతసేపు అనేది ఆధారపడి ఉంటుంది.
ఉదా 1: సాళ్ళలో వేసే పంటకు కావాల్సిన నీటి అవసరము: 7.3 మి.మీ./రోజుకు, నీటి పైపుల మధ్య దూరం : 1.2 మి., డ్రిప్పర్ మధ్యన దూరం: 0.5 మీ.
డ్రిప్పర్ విడుదల సామర్థ్యము : ఒక గంటకు 4 లీటర్లు, ఒక గంటకు నీటి లభ్యత = డ్రిప్పరు నీటి విడుదల / నీటి పైపుల దూరం x డ్రిప్పర్ మధ్య దూరం= 4/(1.2 x0.5) = 4/0.6=6.67 లీ. / చ.మీ.
డ్రిప్ సిస్టమ్ నడపాల్సిన సమయం (నిమిషాలు):=7.3/6.67 x 60=65.67=66 నిమిషాలు.
ఉదా 2 :మామిడికి రోజుకు నీటి అవసరం 80 లీటర్ల ఒక మొక్కకున్న డ్రిప్పర్లు: 4
డ్రిప్పర్ల నీటి పారుదల సామర్థ్యం : 4 లీ/గం.
మొక్కకు విడుదలయ్యే నీరు: 4 X 4 = 16 లీ/గం.
డ్రిప్ పద్దతి (పంపు) నడపాల్సిన సమయం= నీటి అవసరం/ నీటివిడుదల = 80/16 = 5 గంటలు.
వాతావరణ పరిస్థితి | నేల స్వభావం | ||
---|---|---|---|
ఇసుక నేలలు | తేలికపాటి ఇసుక నేలలు | ఒండ్రు మట్టి నేలలు | |
ఎక్కువ వేడి మరియు పొడిగా ఉండే వాతావరణం (వేసవి కాలం) | రోజుకు మూడు సార్లు | 1 లేదా 2 రోజులకొకసారి | 2 - 3 రోజులకొకసారి |
మధ్యస్థ రక వాతావరణం (వర్షాకాలం) లేక వారానికి రెండు సార్లు | రోజుకు ఒకసారి | 2 - 3 రోజులకొకసారి | 3 రోజులకొకసారి |
తక్కువ ఉష్ణం/ శీతల వాతావరణం (శీతాకాలం) | రోజుకు ఒకసారి | వారానికి రెండు సార్లు | 4 రోజులకొకసారి |
డ్రిప్ పద్దతిలో నీటిలో కరిగే ఎరువులను కూడా పంటలకు అందించవచ్చు. ఈ ప్రక్రియనే ఫర్టిగేషన్ అంటారు. ఫర్టిగేషన్ లో ఎరువులను నీటిలో కరిగించి ఫర్టిలైజర్ ట్యాంక్ ద్వారా లేదా వెంచూరి పంప్ ద్వారా నేరుగా నీటితో పాటు మొక్కకు అందించడం జరుగుతుంది. సామాన్యంగా ఫర్టిగేషన్ లో యూరియా, పొటాషియం నైట్రేట్, ఫాస్ఫారిక్ ఆమ్లం, కాల్షియం నైట్రేట్, అమ్మోనియం ఫాస్ఫేట్, మోనో పోటాషియం ఫాస్ఫేట్, మ్యూరేట్ ఆఫ్ పొటాష్, సల్ఫేట్ ఆఫ్ పొటాష్ మరియు నత్రజని, భాస్వరం, పొటాష్ మిశ్రమంతో కూడిన ఎరువులను సమర్థవంతంగా ఉపయోగించవచ్చు. ఈ ఎరువులను తగు పరిమాణంలో నీటిలో కలిపి పంట యొక్క ఆవశ్యకతను మరియు పెరుగుదల దశను పరిగణలోకి తీసుకొని కొద్ది మోతాదులో నీటిలో ప్రవహింప చెసి మొక్కలకు అందించవచ్చు. ఈ విధంగా ఎరువులను మొక్కలకు అందించడం వల్ల రసాయనిక ఎరువుల వాడకంలో మరియు కూలీల ఖర్చులో ఆదా చేసుకోవచ్చు. ఎరువులను పంట పెరుగుదల దశను బట్టి పంట కాలంలో ఎప్పుడైన అందించవచ్చు.
ప్రస్తుతం ఫర్టిగేషన్ పద్దతి చాలా రకాల పంటల్లో, వైవిధ్య భరితమైన నేలల్లో, వాతావరణ పరిస్థితులలో విస్తృతంగా వాడుకలో ఉంది. భారతదేశంతో సహ ప్రపంచ వ్యాప్తంగా ఫర్టిగేషన్ క్రింద విస్తీర్ణం ఏయేటికాయేడు పెరుగుతూ వస్తుంది.
ప్రస్తుతం భారతదేశంలో మాత్రం ఫర్టిగేషన్ పద్దతి వాడకం ఇంకా శైశవ దశలోనే ఉంది. సూక్ష్మ సాగు నీటి పద్దతుల క్రింద ఉన్న మొత్తం విస్తీర్ణంలో మాత్రమే ఫర్టిగేషన్ ద్వారా ఎరువులు అందిస్తున్నారు. రైతులు ఇంకా ఎరువుల వాడకం సాంప్రదాయ పద్దతుల్లోనే అంటే, వెదజల్లడంగానీ, లేదా మొక్కల మొదళ్ళో వేయడంకాని చేస్తూ ఉంటారు. ఫర్టిగేషన్ పద్దతుల వల్ల పోషకాలను ఖచ్చితత్వంతో మొక్క వేరు వ్యవస్థను సూటిగా అందించే సౌలభ్యం ఉంది. ఫర్టిగేషన్ ద్వారా మొక్క ఎదుగుదల దశలను అనుగుణఁగా వాటి అవసరాలకు ఎప్పటికప్పుడు బేరీజు వేస్తూ వేరు ఎదుగుదల, కాండం అభివృద్ధి చెందే దశ, పూత మరియు కాపు దశల్లో సిఫార్సు చేసిన పోషకాలను అందించే అవకాశం ఉంది.
ఫర్టిగేషన్ వల్ల కలిగే లాభాలు :ఈ రకంగా ఫర్టిగేషన్ పద్దతి వల్ల అనేక రకములైన ప్రయోజనాలు ఉండడం వల్ల పంట దిగుబడులు దాదాపు 30 నుండి 70 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. అలాగే పంట ఉత్పత్తుల నాణ్యత కూడా చాలా బాగుంటుంది.
ఈ పద్దితిలో డ్రిప్పర్ల ద్వారా నీటితో పాటు ఎరువులు కూడ మొక్కల వేరు భాగంలో పడి మొక్కలకు అందుబాటులో ఉంటాయి. వీటిని డ్రిప్ నీటిలో కలిపేందుకు మూడు రకాల పరికరాలు ఉన్నాయి.
వెంచురీ : వెంచురీ డ్రిప్ సిస్టమ్ ను శుభ్రపరిచేందుకే కాకుండా, ఎరువుల్ని డ్రిప్ తో పారే నీటిలో కలిపేందుకు కూడా ఉపయోగించవచ్చు.
ఫర్టిలైజర్ (బూస్టర్ పంపు) పంపు : ఒక ట్యాంకులో అవసరమైన ఎరువులను వేసి ట్యాంకుకు ఒక బూస్టరు పంపు బిగించి, పంపు యొక్క అవుట్ లెట్ ను స్క్రీన్ ఫిల్టర్ కు ముందుగాని, శాండ్ ఫిల్టర్ కు ముందుగా కాని అమర్చాలి. ఈ పద్దతిలో కూడా ద్రవ ఎరువులు ఒకే విధంగా, సమానంగా మొక్కలను లభ్యమవుతాయి.
పర్టిలైజర్ ట్యాంక్ : ద్రవ ఎరువును ఒక ట్యాంకిలో వేసి ట్యాంకు యొక్క అవుట్లెట్ ను మెయిన్లైన్ ఇన్లెట్ ను కలపాలి. మెయిన్లైన్ ఇన్లెట్ మరియు అవుట్లెట్ కు మధ్య కంట్రోల్ వాల్వును వెంచూరీలో అమర్చినట్టు అమర్చాలి. వాల్వును కంట్రోల్ చేయడం వలన మెయిన్ ఇన్లెట్ నుండి నీరు ద్రవ ఎరువులో కలిపి ట్యాంకు అవుట్లెట్ ద్వారా డ్రిప్పు సిస్టమ్ లోకి ప్రవేశించి డ్రిప్పర్ల ద్వారా మొక్కల వేర్లకు అందుబాటులోనికి వస్తుంది.
ఫర్టిగేషన్ పరికరం కంచ్రోల్ హెడ్ యొక్క అంతర్భాగంగా నిర్మింపబడి ఉంటుంది. ఇది సాధారణంగా రెండు ప్రధానమైన విడిభాగాలు – బైపాస్ ట్యాంకు మరియు వెంచూరీ ఇంజెక్టర్లను కలిగి ఉంటుంది. ఫర్టిగేషన్ పరికరం ఎంపిక ముఖ్యంగా వాడే ఎరువులను (పొడి లేదా ద్రవ రూపం) ఆధారిత శక్తి, పొలం విస్తీర్ణం, పరికరం యొక్క ఖరీదు తదితర అంశాలపై ఆధారపడి ఉంటుంది.
ఫర్టిగేషన్ పద్దితిలో ఉపయోగించే ఎరువులు నీటిలో పూర్తిగా కరిగే స్వభావాన్ని కలిగి ఉండాలి. లేకుంటే ఎరువుల అవక్షేపాలు డ్రిప్పరు రంధ్రాలకు అడ్డుపడి మూసివేస్తాయి.
ఫర్టిగేషన్ పద్దతిలో పొడి రూపంలో లేదా ద్రవ రూపంలో ఉన్న ఎరువులను వాడుకోవచ్చు. అయితే ఎరువులకు నీటిలో కలిసిన తక్షణం కరిగిపోయే స్వభావం ఉండాలి. మంచి నాణ్యత మరియు దిగుబడులను సాధించటానికి క్లోరైడ్ లేనటువంటి ఎరువులను ఎంపిక చేసుకోవలసి ఉంటుంది.
ఫర్టిగేషన్ కు అనుకూలమైన కొన్ని రసాయన ఎరువులు:
FeEDTA (13%), FeDTPA (12%), Fe EDDHA (6%), Zn EDTA (9.5%), Ca EDTA (9.7%), Rexolling రెక్సోలింగ్ (బోరాన్, కాపర్, ఐరన్, మాంగనీస్, జింక్, మెగ్నీషియం).
ఫర్టిగేషన్ ద్వారా పంటల యాజమాన్యంలో వివధ అంశాలను పరిగణలోకి తీసుకొని, వాటికి అనుగుణంగా పొషకాలను ఓ దశలో ఎంత మోతాదులో విడుదల చేయాలి అనే అంశాలను నిర్ణయించటం జరుగుతుంది.
పైన సూచించిన విధంగా ఫర్టిగేషన్ యాజమాన్యం వివిధ అంశాల ద్వారా ప్రభావితం అవుతుంది. కాబట్టి ఫర్టిగేషన్ ద్వారా పంటలకు పోషకాలను అందించే ప్రణాళికలను తయారు చేసేటప్పుడు క్రింద సూచించిన సాంకేతిక అంశాలను పరిగణలోకి తీసుకోవాలి.
వివిధ పంటలకు పర్టిగేషన్ ద్వారా అందించేందుకు అవసరమయ్యే వివిధ ఎరువుల మొతాదును క్రింద ఇవ్వబడిన పట్టికలో సూచించడం జరిగింది. ఈ సిఫార్సులు భాసారం మధ్యస్థంగా ఉండే భూములను దృష్టిలో ఉంచుకొని రూపొందించబడ్డాయి. అయితే ఈ సిఫార్సులను పాటించేటప్పుడు భూసారం, సాగునీరు వేసుకున్న పంట మరియు వాతావరణ పరిస్థితులకు సంభంధించిన వివిధ అంశాలను పరిగణలోకి తీసుకోవాలి.
సిఫారసు చేసిన పోషకాల మొతాదు: ఎకరాకు 80: 24:24 కిలోల న:భా:పొ (నత్రజని: భాస్లరం: పొటాషియం)
దశ | నత్రజని (కి/రోజుకు) | పొటాష్(కి/రోజుకు) | యూరియా(కి/రోజుకు) | సల్ఫేట్ ఆఫ్ (కి/రోజుకు)పొటాష్ |
---|---|---|---|---|
పెరుగుదల (10-30 రోజులు) | 0.6 | 0.2 | 1.33 | 0.4 |
మోకాలు దశ-జల్లు (30-55 రోజులు) | 0.2 | 0.4 | 2.6 | 0.8 |
జల్లు గింజ కట్టు (55-75 రోజులు) | 1.0 | 0.3 | 2.2 | 0.6 |
గింజ పెరుగుదల(75-90 రోజులు) | 0.8 | 0.2 | 1.8 | 0.4 |
సిఫారసు చేసిన పోషకాల మొతాదు: ఎకరాకు 40: 24: 16 కిలోల న:భా:పొ (నత్రజని: భాస్లరం: పొటాషియం)
దశ | నత్రజని (కి/రోజుకు) | పొటాష్(కి/రోజుకు) | యూరియా(కి/రోజుకు) | సల్ఫేట్ ఆఫ్ (కి/రోజుకు)పొటాష్ |
---|---|---|---|---|
పెరుగుదల (10-30 రోజులు) | 0.3 | 0.2 | 0.7 | 0.4 |
మోకాలు దశ-జల్లు (30-60 రోజులు) | 0.7 | 0.3 | 1.5 | 0.6 |
పూత - గింజ పెరుగుదల(60-80 రోజులు) | 0.6 | 0.15 | 1.3 | 0.3 |
సిఫారసు చేసిన పోషకాల మొతాదు: ఎకరాకు 12: 26: 12 కిలోల న:భా:పొ (నత్రజని: భాస్లరం: పొటాషియం)
దశ | నత్రజని (కి/రోజుకు) | పొటాష్(కి/రోజుకు) | యూరియా(కి/రోజుకు) | సల్ఫేట్ ఆఫ్ (కి/రోజుకు)పొటాష్ |
---|---|---|---|---|
పెరుగుదల (10-30 రోజులు) | 0.1 | 0.1 | 2.2 | 0.2 |
మోకాలు దశ-జల్లు (30-60 రోజులు) | 0.2 | 0.2 | 4.4 | 0.4 |
పూత - గింజ పెరుగుదల(60-80 రోజులు) | 0.1 | 0.1 | 2.2 | 0.2 |
సిఫారసు చేసిన పోషకాల మొతాదు: ఎకరాకు 100: 40: 48 కిలోల న:భా:పొ (నత్రజని: భాస్లరం: పొటాషియం)
దశ | నత్రజని (కి/రోజుకు) | పొటాష్(కి/రోజుకు) | యూరియా(కి/రోజుకు) | సల్ఫేట్ ఆఫ్ (కి/రోజుకు)పొటాష్ |
---|---|---|---|---|
గూడ దశ వరకు (10-45 రోజులు) | 0.4 | 0.15 | 0.9 | 0.2 |
గూడ దశ నుండి పూత దశ వరకు (45-65 రోజులు) | 0.80 | 1.30 | 1.8 | 0.6 |
పూత దశ నుండి కాయ పెరుగుదల (65-85 రోజులు) | 0.68 | 0.40 | 1.5 | 0.8 |
మొదటి కాయ పగులు నుండి కోత వరకు (85-116 రోజులు) | 0.56 | 0.15 | 3.4 | 0.3 |
పైన సూచించిన ఎరువులను కాకుండా ఇతర ఎరువులను వాడాలనుకుంటే సూచించిన పోషకాల మొతాదును బట్టి రోజువారీ ఎరువుల మొతాదును లెక్కించవలెను. భాస్వరపు ఎరువులను, దుక్కిలో వేసుకోవాలి.
ఫర్టిగేషన్ కొరకు వాడే నీటిలో కరిగే ఎరువుల కలయిక / అనుగుణ్యత
ఎరువులు | యూ | అనై | అస | మొఅఫా | మొపొఫా | పొనై | పొనైమై | పొనైభా | పొస | కానై | కాక్లో | మెనై |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
యూరియా (యూ) | - | - | - | - | - | - | - | - | - | - | - | - |
అమ్మౌనియం నైట్రేట్ (అనై) | క | - | - | - | - | - | - | - | - | - | - | - |
అమ్మౌనియం సల్ఫేట్ (అస) | క | క | - | - | - | - | - | - | - | - | - | - |
మోనో అమ్మౌనియం ఫాస్ఫేట్ (మొఅఫా) | క | క | క | - | - | - | - | - | - | - | - | - |
మోనో పొటాషియం ఫాస్ఫేట్ (మొపొఫా) | క | క | క | క |
- | - | - | - | - | - | - | - |
మల్టికె పొటాషియం నైట్రేట్ (పొనై) | క | క | మ | మ | క | - | - | - | - | - | - | - |
మల్టికె మెగ్నీషియం (పొనైమై) | క | క | మ | మ | మ | క | - | - | - | - | - | - |
మల్టికె నభాపొ(పొనైభా) | క | క | క | క | క | క | వ | - | - | - | - | - |
పొటాషియం సల్ఫేట్ (పొస) | క | క | క | క | క | క | క | క | - | - | - | - |
కాల్షియం నైట్రేట్(కొనై) | క | క | మ | వ | వ | క | క | వ | మ | - | - | - |
కాల్షియం క్లోరైడ్ (కాక్లో) | క | క | మ | వ | వ | క | క | వ | మ | క | - | - |
మ్యాగ్నిసాల్ (మెగ్నీషియం నైట్రేట్) (మెనై) | క | క | క | వ | వ | క | క | వ | క | క | క | - |
మెగ్నీషియం సల్ఫేట్ (మెస) | క | క | క | క | వ | మ | క | వ | క | మ | మ | క |
ఏదేని ఒక యంత్రము గాని, పనిముట్టును గాని దీర్ఘకాలము ఉపయోగించుకోవాలంటే వాటు సంరక్షణ చాలా అవసరము. అదేవిధంగా బిందు సేద్య పద్దతి కూడా నీటి సౌకర్యమును చేకూర్చే యంత్ర విషయంలో ఎంత శ్రద్ధ వహిస్తామో బిందు సేద్య పద్దతిలో కూడా వహిస్తే మనకు ఎటువంటి సమస్య తలెత్తదు.
బిందు సేద్యములో సాధారణంగా, నీరు కారడం, డ్రిప్పర్లలో ఉప్పు పేరుకొని లవణాలు మూసుకోవడం, ఎలుకులు, ఉడుతలు లాటరల్ పైపులను కొరకడం జరుగుతుంది.
నీటి మడుగు లేక బావులలోని నీరు లేక చెరవులోని నీరు ప్రధాన పి.వి.సి. పైపు (మెయిన్ లైను) గుండా శాండ్/ గ్రావెల్ ఫిల్టర్ లోనికి వస్తుంది. శాండ్ ఫిల్టర్ లో ఒక ప్రత్యేక రకమైన ఇసుక/ గ్రావెల్ ఉంటుంది. అంటే నీరు నీటి గుండా ప్రవహించివప్పుడు చెత్త చెదారము, నాచు ఈ ఇసుక /గ్రావెల్ పైన ఉండిపోతాయి. శుభ్రమైన నీరు ముందుకు సాగిపోతుంది. చెత్త చెదారము సరిగా వేరుచేయకపోతే నీటి ఒత్తిడి తగ్గిపోతుంది. అందుచేత ప్రతి వారము శాండ్ ఫిల్టరును శుభ్రపరుచుకోవడం ఎంతైన ముఖ్యం. ఈ ఫిల్టరును శుభ్రపరచడానికి ఈ క్రింది పద్దతులు పాటించాలి.
శాండ్ ఫిల్టర్ లాగే, జల్లెడ/ స్క్రీన్ ఫిల్టర్ శుభ్రం చేయుటకు మొదలగు జల్లడ/స్క్రీన్ ఫిల్టర్ శుభ్రం చేయుటకు మొదటగా జల్లెడ మూత తెరిచి లోపల ఫిల్టర్ ఎలిమెంట్ ను (స్క్రీన్) శుభ్రం చెయ్యాలి. శాండ్ ఫిల్టర్ నుండి వచ్చిన సన్నని మట్టి కణాలు, ఇసుక రేణులు, మురికి స్క్రీన్ ఫిల్టరులోకి ప్రవేశిస్తూనే ఆగిపోతుంది. నెమ్మది నెమ్మదిగా ఈ గోలాకారపు ఫిల్టర్ ఫిలమెంట్ దగ్గర ఒక దుమ్ము పొర ఏర్పడుతుంది. అందుచేత దీని సరైన సమయంలో శుభ్రం చెయ్యకపోతే నీటి ప్రభావం ఆగిపోతుంది.
స్క్రీన్ ఫిల్టరులోని ఎలిమెంట్ ను రెండు వైపులా ఉన్న రబ్బరు రింగులోకి తీసి ఎలిమెంటును తెరవాలి. తదుపరి జల్లెడను రబ్బరు సీళ్ళను బాగా శుభ్రపరిచి తిరిగి జాగ్రత్తగా గట్టిగా బిగించాలి. ప్రతి రోజు సిస్టం ను ఆన్ చేసిన్నప్పుడు స్క్రీన్ ఫిల్టర్ కు ఉన్నట్లయితే, ఫిల్టర్ కు వెలుపల ఉన్నటువంటి మురికి నీరు బయటకి వెళ్ళిపోతుంది.
ఇసుక/శాండ్ ఫిల్టర్, జల్లడ/స్క్రీన్ ఫిల్టర్ ఉన్నప్పటికి, చాలా సన్నటి మట్టి కణాలు, ఇతర సేంద్రీయ పదార్ధాలు వివిధ భాగాలు గల పి.వి.సి. పైపులే చేరి స్థిరపడుతాయి. పి.వి.సి. పైపులైనుకు చివరలో ఒక ప్రత్యేకమైన ఫ్లష్ వాల్వు బిగించబడి ఉంటుంది. ఈ ఫ్లష్ వాల్వును తెరిచి ప్రతి వారముకొకసారి పూర్తి స్పీడ్ తో నీటిని ఒకటి నుండి రెండు నిమిఫాలు వదిలినట్లయితే లోపల పేరుకున్న మొత్తం చెత్త, చెదారము, నీటి ప్రవాహముతో బయటకు వస్తాయి. శుభ్రమైన నీరు బయటకు వచ్చిన తరువాత ఫ్లష్ వాల్వు మూసివేయాలి.
లేటరల్స్ ట్యాబులను శుభ్రం చేయుట చాలా అవసరం. ఒకవేళ లేటరల్స్ ట్యూబును శుభ్రం చేయకపోతే నీటిలో వచ్చే చెత్త, చెదారం, సూక్ష్మమైన ఇసుక రేణువులు డ్రిప్పర్స్ లోని రంధ్రాల్లో నిండిపోతాయి. అప్పుడు మొక్కలకు ఖచ్చితమైన నీరు అందడం ఆగిపోతుంది. లేటరల్ బ్యూబుల శుభ్రం కోసము, ప్రతి ట్యూబ్ చివరన ఒక ఎండ్ కాప్ లేదా ప్లగ్ అమర్చబడి ఉంటుంది. దీనిని ప్రతి వారం లేదా ప్రతి 15 రోజులకొకసారి తెరచినట్లయితే మురికి చెత్త చెదారము, ట్యూబ్ ద్వారా ప్రవహించే నీటిలో తెరిచి ఉన్న ఎండ్ ప్లగ్ ద్వారా బయటకి వచ్చేస్తాయి. లేటరల్స్ ద్వారా మురికి నీరు వస్తున్నంత సేపు వాటిని తెరిచి ఉంచాలి. స్వచ్చమైన నీరు వస్తున్నప్పుడు ఎండ్ ప్లగ్ క్యాప్ తిరిగి బిగించాలి. లేటరల్స్ పైన ఏదైన కన్నం పడితే వాటిని గూఫ్ ప్లగ్ సమయంతో నీరు కారడాన్ని ఆపవచ్చును.
లేటరల్స్ పైన అమర్చిన డ్రిప్పర్ల ద్వారా నీరు రాకపోతే లేక ఎక్కువగా కారుతుంటే డ్రిప్పరును తెరిచి లోపలి డయాఫ్రమును శుభ్రపరిచి తిరిగి ఇంకోసారి సరిగా అమర్చాలి. అప్పుడు డ్రిప్పర్లలో ఏ ఇబ్బంది ఉండదు. నాచు లవణాలు బాక్టీరియా మొదలైనవి. ఫిల్చర్లను శుభ్రపరిచేటప్పుడు నీటి ప్రవాహంతో కొట్టుకుపోవును. కాని పాచి, లవణులు డ్రిప్పర్లో పేరుకుపోయి డ్రిప్పర్ల రంధ్రాల చివర్లలో చేసి నీటిని సరిగా బయటకు రానీయదు. డ్రిప్పర్లు లవణాల, పాచి ద్వారా మూయుకుపోయినప్పుడు ఆమ్లంలో (2 – 4 ఉదజని సూచి) లేదా క్లోరిన్ (20 మి.గ్రా/లీటరు నీటికి) బ్లీచింగ్ ద్వారా శుభ్రపరచాలి. బ్లీడింగ్ లేదా ఆమ్లంలో చికిత్స చేసిన్నప్పుడు, 24 గంటల పాటు ఆ నీటిని పైపులలో నిల్వ ఉండేటట్లు చూడాలి. మరుసటి రోజు కవాటా (వాల్వ్) లన్ని తెరిచి కొత్త నీటిలో ఫ్లష్ చెయాలి.
కావలసిన పరికరాలు: 1. కొలజారు, 2. గడియారం, 3. ప్లాస్టిక్ బక్కంట్, కొలజారును డ్రిప్పరు కిందగా పెట్టి ఒక లీటరు నీరు నిండటానికి పట్టిన సమయాన్ని గడియారంతో తెలుసుకోవాలి. ఆ విధంగా ఆ డ్రిప్పరు గంటకు ఎంత నీరు విడుదల చేస్తుందో తెలుసుకోవచ్చు. కావల్సిన పరిమాణం కన్నా తక్కువ విడుదల చేస్తే సబ్ మెయిన్ మీద వున్న కవాటాన్ని నియంత్రించి నీటి ప్రవాహ పీడన్నాన్ని ఎక్కువ చేయాలి. ఉదాహరణకు మొదటి డ్రిప్పరు గంటకు 4 లీటర్ల నీటిని విడుదల చేస్తే – అదే లేటరల్ మీద 100 మీటర్ల దూరంలో వున్న డ్రిప్పరు కనీసం గంటకు 3.6 కన్నా ఎక్కువ లీటర్ల విడుదల చేయగల్గి వుండాలి లేదా ఎక్కువగా ఉంటే ఆమ్ల చికిత్స చేయాలి.
తుంపర/ జల్లు (స్ప్రింక్లర్) సేద్యంలో నీటిని తుంపర్లుగా వర్షం వలె మొక్కలు లేదా భూమి ఉపరితలంపైన విరడిమ్మటం జరుగుతుంది. ఈ విధానంలో నీటిని ఒక క్రమమైన పీడనంలో (1.5 నుండి 3 కేజీలు/సెం.మీ.2 ) పైపుల్లో ప్రవహింపచేసినప్పుడు ఆ నీరు పైపులపై అనర్చబడిన స్ప్రింక్లర్ నాజిల్ గుండా తుంపర్లుగా విడిపోయి వర్షవు జల్లుగా నేలపైన పడుతుంది.
స్ప్రింక్లర్ పద్దతిలోని అతి ముఖ్యభాగాన్ని “స్ప్రింక్లర్ హెడ్” అంటారు. దీనిలో 2 రంధ్రాలు ఉంటాయి. ఒక రంధ్రం సైజు 4 నుండి 5.6 మి.మీ. వరకు, రెండవది 3.13 మి.మీ. ఉంటుంది. స్ప్రింక్లర్ హెడ్ సామర్థ్యం పంపు అందజేసే పీడనాన్ని బట్టి ఉంటుంది. ఎక్కువ పీడనం కలిగి 2 - 4 కేజీలు/సెం.మీ.2 , తక్కువ పీడనం కలది 0.34 – 2.72 కేజీలు/సెం.మీ.2 వరకు పనిచేస్తాయి. ఎక్కువ పీడనం గలది సుమారు 35 మీటర్ల వ్యాసం కలిగిన నేలను తడుపగలదు. తక్కువ పీడనం గలది 30 మీటర్ల వ్యాసం గల నేలను తడుపగలదు.
స్ప్రింక్లర్ నాజిల్ నుండి వెదజల్లబడే నీటి బిందువుల పరిమాణం పైపులోని పీడనం (ప్రెషర్) వల్ల మారుతుంటుంది. పీడనం తక్కువగా ఉన్నట్లయితే నీటి బిందువులు స్ప్రింక్లర్ నాజిల్ ద్వారా పెద్ద పరిమాణంలో విడుదలవుతుంది. అట్టి పరిస్థితులలో పంటకు మరియు నేలకు హాని కలుగుతుంది. అందుచేత అవసరమైన పీడనంతో స్ప్రింక్లర్ పద్దతిని నడపాలి.
నీటువసతి మరియు పంప్ స్టేషన్, పంప్ కనక్టర్, 6 మీటర్ల పొడవు ఎక్కువ సాంద్రత గల పాలీఅథైలిన్ (HDPE) గల పైపులు, (కఫ్లర్ లేదా ల్యాచింగ్ తో సహా), స్ప్రింక్లర్ సాడిల్, స్ప్రింక్లర్ బెడ్ లేదా నాజిల్, రైజరు పైపులు (20 మి.మీ. చుట్టుకొలతతో 76 సెం.మీ. పొడవు), పైపు బెండు (కఫ్లర్ లేదా ల్యాచింగ్ తో సహా) మరియు ఎండ్ క్యాప్.
శాశ్వతంగా ప్రధాన, ఉపప్రధాన పైప్ లైన్లను, లాటరల్స్ ను భూమిలో పాతిపెట్టి కదిలించేందుకు వీలు లేకుండా అమర్చవచ్చు. రెండో పద్దతి కొంతవరకు శాశ్వతంగా అమర్చే పద్దతి. దీనిలో ప్రధాన పైపులు మాత్రమే భూమిలో ఉండి మిగాతా పరికరాలు కదిలించేందుకు వీలవుతుంది. మీడో పద్దతి తాత్కాలికంగా అమర్చే పద్దతి. ఈ పద్దతిలో అన్ని పరికరాలను ఒక పొలం నుండి మరొక పొలానికి తీసుకొని పోయి అమర్చుకోవటానికి వీలవుతుంది.
స్ప్రింక్లర్లోని వివిధ రకాలు మరియు అవి ఉపయోగించే పంటల వివరాలు.
స్ప్రింక్లర్ వ్యవస్థను అమర్చేదుకు ఒక ఎకరాకు సుమారుగా రూ. 5,000 – 5,600, రెండు ఎకరాలకు రూ. 6,500 – 7,000, మూడు ఎకరాలకు రూ. 9,000 – 10,000, నాలుగు ఎకరాలకు రూ. 11,500 – 12,000 ఖర్చు అవుతుంది. స్ప్రింక్లర్ పైపుల సైజులను బట్టి ధరలలో కొద్ది మార్పులు ఉండవచ్చు.
స్ప్రింక్లర్లు పనిచేసేటప్పుడు, కొన్ని సమయాల్లో గొట్టాలలో పీడనము తగ్గిపోవడం జరుగవచ్చును. కావున సక్షన్ పైపులో గాలి చొరబడటము, పంపు ఇంపేల్లరులో లేదా ఫుట్ వాల్వ్ వద్ద చెత్త చేరడం లేదా నీటి వనరులో నీటి మట్టం కగ్గడం వలన పీడనం సంభవించవచ్చును. పంపు లేదా మొటరు బేరింగులు అరిగి పోయినప్పుడు లేదా పంపింగ్ హెడ్, దాన్ని డిజైన్ చేసిన ఎత్తు కంటే తక్కువగా ఉన్నప్పుడు మొటరు (పవర్ యూనిట్) వేడేక్కకుండా సంభవిస్తుంది. కనుక ఈ విషయంలో తగిన శ్రద్ద వహించి స్ప్రింక్లర్లను మంచి సమర్థతతో పని చేయించినప్పుడు మంచి ఫలితము ఉంటుంది.
ఫిల్టరుపై మూతను తీసి, జల్లెడ బయటకు తీసి, పైన మరియు క్రిందవున్న రబ్బరు సీళ్ళను జల్లెడ నుండి వేరు చేయాలి. జల్లెడను, రబ్బరు సీళ్ళపై పేరుకు పోయిన మట్టిని వేగంగా పారే నీటిలో కరగాలి. తరువాత జల్లెజను రబ్బరు సీలు వాటి స్థానములో అమర్చి ఫిల్టరులో బిగించాలి. జల్లెడను బ్రష్ తో రుద్దరాదు. సాధారణంగా మురికి ఇతర పదార్ధాల అడుగున ఉన్న ఫ్లష్ అవుట్ గేట్ వాల్వును ఉపయోగించి తీసివేయవచ్చును. ప్రతీసారి నీరు పెట్టేటప్పుడు, జల్లెడ ఫిల్టరు యొక్క డ్రైన్ వాల్వు కొద్ది సేపు తెరిచి వుంచునట్టయితే ఫిల్టరులో ఉన్నట్టువంటి మురికి నీరు బయటకు వెళ్ళిపోతుంది.
తరుచూ పైపులను మరియు కవ్లర్లను శుభ్రపరుచుకోవాలి. రబ్బరు వాషర్ పని తీరును గమనించి మార్చుకోవాలి. రబ్బరు వాషర్ పని తీరును గమనించి మార్చుకోవలెను. నట్ లు మరియు బొల్ట్ లను టైట్ గా బిగించాలి. పైపులను ఎట్టి పరిస్థితులలో ఎరువుల కుప్పలపై మరియు తడిగా ఉన్న కాంక్రీటు మీద వృధాగా పోతున్నదేమో గమనించి, లీకేజీలు ఉన్నచోట ఎమ్సీల్ తో బిగించాలి.
స్ప్రింక్లర్ పరికరాలను అటు ఇటు కదల్చినప్పుడు స్ప్రింక్లర్ హెడ్ పాడవకుండా జాగ్రత్త వహించాలి. ఎట్టి పరిస్థితులలో స్ప్రింక్లర్ కు నూనె, గ్రీడ్ మరియు ఇతర లూబ్రికెంట్లు వాడరాదు. అరిగిపోయిన వాటర్లను ఎప్పుటికప్పుడు మార్చాలి. స్ప్రింగ్ టెన్నన్ తగ్గిన ఎడల, పెంచేందుకు స్ప్రింగ్ ఆర్మ్ గట్టిగా బిగించి స్ప్రింగ్ చివరలను పైకి లాగి వంచాలి. మూసుకుపోయిన నాజిల్స్ శుభ్రపరిచెందుకు ఇనుప చువ్వలకు బదులుగా సన్నని పుల్లలను వాడాలి. పైపులను నేల మూద లాగకుండా మనుషులచే మోసుకుపోవాలి.
స్ప్రింక్లర్ నాజిల్, పంపు, ఇంపెల్లర్ మొదలగునవి సాధారణంగా అరుగుదలకు లోనవుతాయి. ప్రతి పంట అయిపోయిన తర్వాత వీటిని పరీక్షించి అవసరమైతే కొత్త భాగాలను మార్చుకోవాలి. పంట అయిపోయిన తర్వాత పైపులను కప్లర్స్ ను, స్ప్రింక్లర్లను పొడి ప్రదేశాలలో జాగ్రత్తగా పెట్టుకోవాలి. రబ్బరు, ప్లాస్టిక్ పైపులు వాటి వాషర్స్ ను ఎలుకల బారి నుండి రక్షించుకొవాలి.
కొన్ని సార్లు స్ప్రింక్లర్ల నాడిల్ తిరగకపోవడం జరుగుతుంది. ఇది పీడనము తగ్గినప్పుడు, పైపులలో లీకేజీలు (పగుళ్ళు) మరియు మట్లు వదులుగా ఉన్నప్పు జరుగుతుంది. ఈ లోపాలను సరిచేసి పీడనం ఉండునట్లు చూడాలి. స్ప్రింక్లర్ రంధ్రాలు (నాజిల్స్) మూసుకొని పోకుండా చూసుకోవాలి. పీడనము సరిగా ఉండేటట్లు చూడాలి. నీటి యొక్క విస్తరణ పద్దతిని మరియు పరిమాణమును పరిశీలించాలి. ఈ విస్తరణ గుణకము 0.83 కంటే ఎక్కువగా ఉన్నచో తుంపర వ్యవస్థ పనితీరు బాగున్నదని నిర్ధారించుకోవాలి.
ఆధారం: వ్యవసాయ పంచాంగం
చివరిసారిగా మార్పు చేయబడిన : 1/10/2023