యూకలిప్టస్ లేదా జామాయిల్ లేదా నీలగిరి చెట్లు దాదాపు 25 మీ. ఎత్తు వరకు త్వరగా పెరగగల చెట్టు. దక్షిణ భారతదేశంలో యూకలిప్టస్ టేరిటికార్నిస్ లో ఒక రకమైన క్లోన్ లను విస్తారంగా పెంచుతున్నారు. దీని నుండి నాణ్యమైన గుజ్జు / పేపరు లభిస్తుంది.
నిస్సారమైన భూములకు కూడ అనువైన చెట్టు సుమారు 400-1250 మి. మీ. వర్షపాతం గల ప్రాంతాలలో పెరగగలదు. నీరు నిలువ ఉండే ప్రాంతంలో పెరగదు. మోకాలు ఇతర పశువులు యూకలిప్టస్ ఆకులను మేయవు.
జూలై
వివిధ యూకలిప్టస్ రకాలు (యూ.గ్రాండిస్, యూ.సిట్రోడోరా, యూ.క్లోబోలస్, యూ.కమాల్డులేనిస్, యూ.సెరిబ) రకాలు నుండి అభివృద్ధి పరిచిన క్లోన్ లు ప్రస్తుతం ఇండియన్ టోబాకో కంపెని (ఐ.టి.సి), భద్రాచలం ద్వారా రైతుకు ఇవ్వబడుతున్నాయి. దీని నుండి “జామాయిల్” అనే నూనె కూడా తీస్తారు. సుమారు 25-30 టన్నుల కలవ దిగుబడి లభిస్తుంది. ఐ.ఎఫ్.జి.టి.బి., కోయంబత్తుర్ వారు గొట్టాల పురుగు తట్టుకొనే శక్తి కలిగిన క్లోనల్ రకాలను (ఐ.ఎఫ్.జి.టి.బి – 1,2,3 మరియు 4) అభివృద్ధి చేశారు.
3 మీ. X 1.5 మీ. (ఒకే పంటగా వేసినపుడు)
900-1000 మొక్కలు
మొక్కలను 30 ఘ.సెం.మీ. గోతులను త్రవ్వి నాటే ముందు చెదలు పట్టకుండా ఫలిడాల్ 100% పొడిని వేయాలి. మొక్కల మధ్య దున్నితే మంచి లాభాలు ఉంటాయి. గట్లపై మీటరు దూరములో నాటవచ్చును. నిస్సారమైన భూములు, అటవీ ప్రాంతములో తోటలుగా పరిశ్రమల ఆవరనలోను నాటవచ్చును.
నీలగిరి చెట్టు శిఖరము ఎక్కువగా వ్యాపించదు. అందుకే నీడ ఎక్కువ ఎవ్వదు. మొదటి రెండు సంవత్సరములు నిరాటంకముగా అంతర పంటలు పండించావచ్చును.
నీలగిరి చెట్లకు 5 సంవత్సరాల వరకు ఎరువులను ఈ మోతాదులో వేయాలి. నత్రజని, భాస్వరం, పోటాష్ 30:20:20, 60:40:40, 90:60:60, 120:80:80 మరియు 150:100:100 గ్రా./ప్రతి చెట్టుకి (1-5 సంవత్సరాల వరకు) వేసుకోవాలి. మొత్తం భాస్వరం, పోటాష్ మరియు 1/3 నత్రజని జూన్ లో, 1/3 నత్రజని సెప్టెంబర్ లో, 1/3 నత్రజని డిసెంబర్ లో వేసుకోవాలి.
నాటిన తరువాత వర్షాకాలంలో రెండుసార్లు దున్నాలి. దీని వలన కలుపు నివారించబడి మొక్కలు ఏపుగా పెరుగుతాయి. సాధారణంగా నిస్సారమైన భూములలో నీలగిరి తోటలు పెంచునపుడు మొదటి, రెండవ సంవత్సరాలలో అంతర సేద్యం చేయాలి.
ఆశించిన దిగుబడులు సాధ్యం కావాలంటే విధిగా సంవత్సరం వర్షాలు లేనపుడు వారానికొకసారి నీరు కట్టాలి. డ్రిప్ పద్ధతిలో కూడా నీరు పెట్టవచ్చును.
30-40 టన్నులు/ఎకరానికి కలప దిగుబడి (4 సంవత్సరాల తర్వాత). ఈ రకంగా 10-11 సంవత్సరాలలో 3 కోతలు లభిస్తాయి.
యూకలిప్టస్ చెట్టు రాలిన ఆకులు మందం కలిగి ఉండుట వలన నేలపైన చాలా కాలము ఎండి తర్వాత కూడ చికకుండా అలాగే ఉంటాయి. కాబట్టి ఈ ఆకులను పోగుచేసి వానపాముల ఎరువును తయారు చేయవచ్చును. ఆగ్రోఫారెస్ట్రి విభాగము, రాజేంద్రనగర్ వారి పాట్ కల్చర్ పరిశోధన ఫలితాల ఆధారముగా కేవలం 130 రోజులలో వానపాముల ద్వారా నాణ్యమైన ఎక్కువ పోషకాలు గల ఎరువును తయారు చేయవచ్చునని నిరూపించబడినది. తయారైన సేంద్రీయ ఎరువులో పోషక విలువలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించడమైనది.
ఆధారం: వ్యవసాయ పంచాంగం
చివరిసారిగా మార్పు చేయబడిన : 1/7/2021