వేప వంట చెఱకు గాను, పశుగ్రాసం గాను, పనిముట్లకు కలప గాను మరియు క్రిమిసంహారక మందుల తయారీలో ఉపయోగపడుతుంది.
ఎటువంటి నెలలోనైనా పెరుగుతుంది. ఇసుక నేలలు, నీరు నిలువ వుండే నేలలు, నీటి ముంపుకు గురయ్యే నేలలు, చౌడు భూములు అనుకూలం కావు. ఉండజని సూచిక 6.2 - 8.0 వరకు వున్న భూములలో బాగా పెరుగుతుంది.
వేపనునే క్రిమిసంహారక మందుగా ఉపయోగపడుతుంది. ఎప్పటి వరకు వేప నుండి 60 రకాలయిన క్రిమిసంహరక మందులు వేరు చేయడం జరిగినది. అవి మోలామిన్, ట్రయాల్, సెలవిన్, అజడిరాక్టన్. వేపనునెను సబ్బులు, ఔషధాల తయారీలో వాడతారు. వేప పుచ్చ పట్టడం లేదా చెదలు పట్టడం గాని జరుగదు. వేప కాండం నుండి బంక కూడా లభిస్తుంది.
విత్తనం ద్వారా ప్రవర్ధనం చేయవచ్చు. కాయలు పండుటాకు కొద్ది రోజుల ముందే పసుపు ఆకుపచ్చ రంగులో వున్నపుడు కొమ్మలను విదిల్చి రాల్చి ఏరాలి. విత్తనాలను కాయల నుంచి వేరు చేసి నీటిలో కడిగి, 4-5 రోజులు ఆరబెట్టాలి. విత్తనాలను నేరుగా నాటిగాని, నారు పెంచిగాని లేదా పాలిధిన్ సంచుల్లో పెంచికాని నాటవచ్చు. విత్తనాలు 1-2 వారాలలో మొలుస్తాయి. మొక్కలు 15-30 సెం. మీ. పెరిగిన తర్వాత పొలంలో కావల్సిన చోట నాటుకోవచ్చు.
6 నుండి 8 మీ. పూర్తిగా పెరుగుటకు 8-10 సంవత్సరాలు పడుతుంది. చెట్ల మధ్య తక్కువ కాల పరిమితి గల ఆహార ధాన్యాలు, పప్పు ధాన్యాలు అలాగే కూరగాయలు పండించుకోవచ్చు.
10 సంవత్సరాలు ఆపైపడిన వేప చెట్టు సంవత్సరానికి 50-100 కిలోల కాయలు కాస్తుంది. ప్రతి కిలో విత్తనం నుండి 200 గ్రా. నూనె, 800 గ్రా. చెక్క (పిండి) వస్తుంది. కిలో విత్తనానికి రూ. 5/- చొప్పున 80-100 చెట్ల నుండి విత్తనం ద్వారా 4-5 వేల ఆదాయము వస్తుంది. పెరిగిన చెట్ల నుండి ఎక్కరకు 16 టన్నుల వరకు కలప లభిస్తుంది. ఒక టన్నుకు 2 వేల రూపాయల చొప్పున ఎకరానికి 32 వేల వరకు ఆదాయము వస్తుంది.
అటవీ వ్యసాయ విభాగం, రాజేంద్రనగర్ వారు వివిధ ప్రాంతాలలో నిర్వహించిన పరిశోధనల ఆధారంగా “లైన్ నం. ఎల్-115” అనే వేప రకము అధిక విత్తన దిగుబడి (చెట్టుకు 10 కిలోల 10 సంవత్సరాలకు) నివ్వడమే కాక అత్యధిక అజడిరెక్టన్ 0.53 శాతం ఉన్నట్లుగా గుర్తించడమైనది. భవిష్యత్తులో దీనిని ఎక్కువ మొత్తంలో పెంచి రైతుకు అందిచడానికి ప్రయత్నిస్తాం.
ఆధారం: వ్యవసాయ పంచాంగం
చివరిసారిగా మార్పు చేయబడిన : 1/7/2021