తెలంగాణలో పండించే నూనె గింజల పంటలలో వేరుశనగ చాలా ప్రధానమైనది. రాష్ట్రంలో సుమారుగా 2 లక్షల హెక్టార్లలో సాగు చేయబడుతూ 1.60 లక్షల టన్నుల కాయ ఉత్పత్తి, 1.45 టన్నులు హెక్టారుకు ఉత్పాదకత కలిగి ఉంది. ఖరీఫ్ లో వర్షాధారంగా, రబీ, వేసవిలో నీటి పారుదల కింద సాగవుతోంది. మన రాష్ట్రంలో ముఖ్యంగా మహాబూబ్ నగర్, నల్గొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో పండిస్తున్నారు.
ఖరీఫ్ లో వర్షపాతం తగినంత నమోదు కాకపోవడంతో భూగర్భ జలాలు అంటడిగి (తగ్గిపోయి) బావులు, బోర్లు సైతం నీళ్ళు తగ్గిపోవడంతో రైతులు అందరూ ఆరుతడి పంటలు వేసుకోవడం ఉత్తమం, అందువలన ఆరుతడి పంట అయిన వేరుశనగను, ముఖ్యంగా ఎర్రనేలలు కలిగిన రైతులు ఎంచుకుంటే అధిక దిగుబడి సాధించి లాభాలను పొందవచ్చు.
కదిరి-6, ధరణి, జె. సి. -88. కదిరి-9, కదిరి-7
మంచి - నాణ్యత, మొలకెత్తే శక్తిని (85 శాతం) కలిగిన విత్తనాలను ఎంపిక చేసుకోవాలి. సాధారణంగా విత్తనం 5 కొరకు వేరుశనగకు కాయల రూపంలో నిలువ ఉంచి విత్తేముందు గింజలను వేరుచేయాలి. గింజలను వేరు చేసేటప్పుడు గింజ పై పొర బాగా ఉండి రంగు సమానంగా ఉన్న విత్తనాలను ఎన్నుకోవాలి.
మంచి విత్తనాన్ని ఎన్నుకొని, కిలో విత్తనానికి 1 గ్రా. కార్బండిజమ్ లేదా 3 గ్రా. మాంకోజెబ్ తో శుద్ధి చేసి నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. వేరు పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో కిలో విత్తనానికి 6.5 మి.లీ. క్లోరిఫైరిఫాస్ లేదా 2 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్ తో కలిపి శుద్ధి చేయాలి. కొత్తగా వేరుశనగ వేసే నేలల్లో 60 కిలోల విత్తనానికి 1 కిలో రైజోబియం కల్చరుతో కలిపి విత్తుకోవాలి.
రబీ - సెప్టెంబరు 15 నుండి అక్టోబరు 15 వరకు.
వేసవి - జనవరి 15 నుండి ఫిబ్రవరి మొదటి వారం వరకు.
వరుసల మధ్య 22.5 - 80.0 సెం.మీ, మొక్కల మధ్య 10.0 - 15.0 సెం.మీ. విత్తనాన్ని 5 సెం.మీ. కంటే ఎక్కువ లోతులో పడకుండా నాగలితో విత్తుకోవాలి.
ఎకరానికి 4-0 టన్నుల బాగా మాగిన పశువుల ఎరువు, ఎకరానికి 27 కిలోల యూరియా, 100 కిలోల సింగిల్ సూపర్ పాస్పేట్, 33 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను దుక్కిలో వేయాలి. మిగిలిన 9 కిలోల యూరియా పైపాటుగా విత్తిన 30-35 రోజులకు వేయాలి. ఎకరానికి 20 కిలోల జింక్ సల్ఫేటను ఫాస్పేట్ ఎరువులతో కలుపకుండా ఆఖరి దుక్కిలో వేయాలి.
200 కిలోల జిప్సంను పైరు పూత, ఊడ దిగే సమయంలో మొక్కల మొదళ్ళ దగ్గర 50 సెం.మీ. లోతులో వేసి మట్టి ఎగదోయాలి. జిప్సంలోని కాల్షియం కాయలు బాగా ఊగడానికి, గంధకం గింజలలో నూనెశాతం పెరగడానికి దోహదపడుతుంది.
పంటకాలంలో 8 - 9 నీటి తడులను వాతావరణ పరిస్థితులను బట్టి 7 - 12 రోజుల వ్యవధిలో తడులు ఇవ్వాలి. ఊడ దిగే దశ నుండి గింజ గట్టి/కాయ గట్టి పడే వరకు నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి.
నిత్తిన 3 రోజులలో ఎకరానికి 0.8 లీ. అల్లాక్లోర్ లేదా 1.3 - 1.6 లీ పెండిమిథాలిన్ 200 లీటర్ల నీటిలో కలిసి తడి నేలపై పిచికారీ చేసి కలుపును నివారించవచ్చు.
గుత్తి రకాలు 110-115 రోజులకు కోత వస్తుంది. తీగ రకాలు (పాక్షిక తీగ) 120-130 రోజులకు పక్వమవుతాయి. 70-80 శాతం మొక్కల ఆకులు, కొమ్మలు పసుపు వర్ణంగా మారినప్పుడు 80-90 శాతం కాయ లోపలి పెంకు భాగం నల్లగా మారినప్పుడు పైరును తీయాలి. పంట తీసిన తర్వాత కాయలు కోసి 9 శాతం తేను వచ్చే వరకు బాగా ఆరబెట్టాలి. నిలువ చేసే ముందు కాయలపై మలాథియాస్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపిన ద్రావణాన్ని పిచికారీ చేసి నిలువ చేయాలి.
చివరిసారిగా మార్పు చేయబడిన : 7/1/2020