ఉష్ణమండల ప్రాంతాలలో పండించే ముఖ్యమైన పండ్లలో అరటి ఒకటి. తెలంగాణా రాష్ట్రంలో అరటి దాదాపు 2058 హెక్టార్ల విస్తీర్మంలో సాగు చేయబడుతూ, 72,995 మెట్రిక్ టన్నుల దిగుబడితో, మామిడి, నిమ్మ తరువాత మూడవ స్ధానం ఆక్రమించుకొని ఉన్నది. మన రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, వరంగల్ (రురల్), జయశంకర్, రంగారెడ్డి, నిర్మల్ జిల్లాల్లో విస్తేరంగాను, ఆదిలాబాదు, జోగులాంబా, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కొమరంభీం, యాదాద్రి జిల్లాల్లో తక్కువ విస్తీర్ణంలో అరటి సాగువుతున్నది.
వాతావరణం : సరాసరి 25 - 30 డిగ్రీల సెం. ఉప్నోగ్రత మిక్కిలి అనుకూలం. శీతాకాలంలో ఉప్నోగ్రత 15 డిగ్రీల సెం. కన్నా తక్కువ ఉండకూడదు.
నేలలు : సారవంతమైన, తగినంత నీటి వసతి కలిగి, నీరు ఇంకిపోయే గుణంతో పాటు తగినంత సేంద్రియ పదార్ధాలు గల నేలలు మిక్కిలి అనుకూలం. సారవంతమైన ఒండ్రు నేలలు శ్రేష్టం. నెల లోతు 75 సెం. మీ. లకు తక్కువ కాకుండా, భూమికి నీటి మట్టము 1.0 నుంచి 1.3 మీ. దిగువన ఉంది, ఉదజని ముచిక 6.5 నుంచి 7.5 ఉండటం అనుకూలం.
రకాలు : అరటిలో వివిధా రకాలు సాగులో ఉన్నవి. వాటిలో కొన్ని పండుగ, మరికొన్ని కూరగాను ఉపయెగించు కొంటున్నాము. సాగులో ఉన్న రకాలు ఒక్కొకటి ఒక్కొక ప్రత్యేకత కలిగి ఉన్నాయి.
కూర రకాలు :
కోప్వురు బొంత : కూర రకాలలో ఈ రకం ముఖ్యమైనది. సగటును 18- 20 కిలోల బరువు ఉండి 5-7 హస్తాలతో 70-80 కాయలు కలిగి ఉంటాయి. కాయలు పెద్దవిగా లేత ఆకుపచ్చ రంగు కలిగి ఆకర్షమియంగా ఉండటం వల్ల ఎక్కువ ధర వచ్చే అవకాశం ఉంది. కాలపరిమితి 13 మాసములు. ఆకూ మచ్చ తెగులును తట్టుకొంటుంది. నీటి ఎద్దడిని తట్టుకొంటుంది. కానీ దుంప కుళ్ళుని తట్టుకోలేదు. కార్శి తోటలు పెంచుకోవడానికి అనుకూలం.
నేల తయారీ : భూమిని వేసవిలో 30 - 40 సెం. మీ. లోతుగా దున్నాలి. తొలకరి వర్షాలకు 3-4 సార్లు దున్ని రకానికి బట్టి నిర్ణయంచిన దూరంలో 45*45*45 ఘ. సెం. మీ. పరిమాణం గల గుంటలు తీయాలి.
రకాలు |
దూరం (మీ) |
దూరం (మీ) |
పెద్ద పచ్చ అరటి/గ్రాండ్ నేన్ |
1.8*1.8 |
3086 |
పొట్టి పచ్చ అరటి |
1.5*1.5 |
4444 |
తెల్ల చక్కెర కేళి |
1.8*1.8 |
3086 |
అధిక సాంద్ర (జంట వరుసల) పద్దతి : అరటి రకాల సాంద్రతలో నాటి తద్వారా భామిని సమర్ధవంతంగా ఎదుగుదల లక్షణాల కనుగుణంగా వీలైనంత అధిక ఉపయేగించి అధిక ఫలసాయాన్ని పొందవచ్చు.
రకాలు |
జంట వరసలో దూరం (మీ) |
రెండు జంట వరసలో దూరం (మీ) |
మాములు కన్నా అధికి శాతం |
పెద్ద పచ్చ అరటి గ్రాండ్ నేన్ |
1.2*1.2 |
2.0 |
69% |
పొట్టి పచ్చ అరటి |
1.0*1.0 |
1.8 |
68% |
తెల్ల చక్కెర కేళి |
1.2*1.2 |
2.0 |
69% |
జంట వరసలో నాటేటప్పుడు వరుసల మధ్య దూరం తక్కువగా (1.0 లేదా 1. 2> మీ.) ఉండాలి. రెండు జంట వరసల మధ్య దూరం ఎక్కవగా (2. 0 లేదా 1.8 మీ.) ఉండాలి. ముందు వరస మొక్కలకు రెండవ వరుసలో మొక్కలు ఎదురుగా కాకుండా మందు వరుస మొక్కల మధ్య వచ్చే విధంగా నాటాలి.
అధిక సాంద్రతలో నటినప్పుడు వంట కాలపరిమితి 40-50 రోజులు పెరుగుతుంది. ఎక్కవ ఎత్తు పెరుగుతుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు పాటించాలి. జంట వరసల మధ్య ఉన్న ఖాళీ భూమిని 100-120 రోజుల కాలపరిమితి గల అంతర పంటలు (ఆకుకూరలు, క్యాబేజి, కాలిప్లవర్ మొదలగునవి) సాగు చేసి అదనపు ఆదాయం పొందవచ్చు.
పిలకలు ఎంపిక మరియు సిద్ధం చేయడం : వైరస్ తెగలు సోకని ఆరోగ్యవంతమైన తోటల నుంచి మూడు మసాలా వయస్సు కలిగి, రెండు లేదా మూడు కోతలు పడిన సూది పిలకలు మాత్రమే ఎన్నుకోవాలి. చీడపీడలకు సంబంధించి అవగాహన లేకుండా ఇతర రాప్ట్రలనుండి పిలకలు సేకరించరాదు. పిలకలు పై చర్మాన్ని పలుచగా చెక్కివేసి లీటరు నీటికి 2 . 5 మీ.లి. మెనోక్రోటోపాస్ మరియు 5 గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ కలిపినా ముందు ద్రావణంలో 15 నిముషాలు ముంచి తర్వాత నాటుకోవాలి.
పిలక నాటడం : పిలక నాటటానికి గుంట నుండి త్రవ్విన మట్టికి 300 గ్రా. సింగిల్ సూపర్ పసుపేటు మరియు 5 కిలోలు బాగా చివికిన పశువుల ఎరువు చేర్చి బాగా కలపాలి. శుద్ధి చేసిన విత్తనపు పిలకలు చదును చేసిన నెలకు 5.0-7.5 సెం. మీ. లోతు ఉండేలా నాటుకోవాలి. పిలకలు నాటిన తరువాత మెదుటి సరి నీటిని కడవలతో పోయాలి. పిలకలు నాటి, తడిపిని 2-3 రోజుల తర్వాత పిలకు చుట్టూ గాలి చొరబడకుండా గట్టిగ తొక్కాలి.
తిఘ్యకల్చర్ (కణజాల వర్ధనం) అరటి మొక్కలు : తిఘ్యకల్చర్ అనగా నాణ్యమైన, బలమైన, ఆరోగ్య వంతమైన పిలకలు నుంచి సేకరించిన కణజాలంను ప్రయేగాశాలలో అవసరమైన వెలుతురు, ఉప్నోగ్రత, తేమ, పోషకపదార్ధాలను అందుచేసి తెగుళ్ళు లేని ఆరోగ్యవంతమైన ఎక్కవ అరటి మొక్కలను ఉత్పత్తి చేయడమే. తిఘ్యకల్చర్ అరటి మొక్కలను పొలంలో నటినప్పుడు వేగంగాను, బలగాను ఎదిగి మాములు పిలక పంట కన్నా 35 - 45 శాతం వరకు అధిక దిగుబడినిస్తాయి. తోటలో మొక్కలన్నీ ఒకే సారి గెలవేస్తాయి. ఆలా వేసిన గెల లన్ని అతి తక్కువ అవ్యవధిలోనే కోయడం పూర్తి అగుటచే తోట యాజమాన్యం ఖర్చు తక్కువ అవుతుంది. 2-3 కార్శి పంటలు కూడా బలంగా ఎదిగి అధిక దిగిబడినిస్తాయి.
టిగ్యకల్చర్ అరటి రకాలు : ఎక్కవ సంస్ధలు గ్రాండ్ నేన్ రకాన్ని ఎక్కవగా సరఫరా చేస్తున్నాయి. ఈ రకం అధిక దిగుబడి ఇవ్వడమే కాకుండా, దూర ప్రాంతాలకు రవాణా చేయడం కూడా కొని శులభం. దీనితో పాటు పొట్టి పచ్చ అరటి రకాన్ని కూడా కొన్ని సంస్ధలు ఉత్పత్తి చేస్తున్నాయి.
టిగ్యకల్చర్ మొక్కల ఎంపికలో జాగ్రత్తలు : 25-30 సెం.మీ. కాండం చుట్టూ కొలత కలిగి ఉండాలి. కనీసం 4-5 ఆకులూ పూర్తిగా విచ్చుకొన్న మొక్కలను మాత్రమే ఎంచుకోవాలి. 45-60 రోజుల వయస్సు కలిగిన మొక్కలను ఎంపిక చేసుకోవాలి. ఆరోగ్యవంతమైన, నాణ్యత కలిగిన, చీడపీడలు ఆశించని మొక్కలను ఎన్నుకోవాలి. ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన ప్త్రెవేట్ సంస్ధలు నుంచి మొక్కలను ఎంచుకోవాలి.
ఎరువుల యాజమాన్యం : అరటికి ఎరువులను ప్రతి చెట్టుకి లెక్కించి వేయాలి. కొన్ని రకాలు తక్కువ, కొన్ని రకాలు ఎక్కువ సాంద్రతలో నాటటం వలన ఎకరాల లెక్కన ఎరువులు వేయడం సరైన పద్ధతి కాదు.
భాస్వరం ఎరుపు వేసే విధానం : అన్ని అరటి రకాల ఒక్కొక్క మొక్కకు 50 గ్రా. భాస్వరాన్ని ఇచ్చే ఎరువును వేయాలి. భాస్వరావు ఎరుపును, అరటి మొక్క నాటిన కొద్దీ కాలం వరకు మాత్రమే ఎపయెగించుకొంటుంది. కనుక కింద సూచించిన విధంగా భాస్వరపు ఎరువును 300 గ్రా. సూపర్ పాస్పెటు రూపంలో బాగా చివికిన 5 కిలోల పశువుల ఎరువుతో కలిపి గుంట నుండి తవ్విన మట్టికి కలిపి గుంతను వూడ్చుకోవాలి. సూపర్ పాస్పెటును వాడినప్పుడు అందులోని గంధకం మరియు కాల్షియం వంటి సుష్మపోషకాలు కూడా పాముకు లభ్యమవుతాయి. పై పాటుగా భాస్వరం ఇరువైను వేయరాదు. వేసినా ఫలితం ఉండుడు. కనుక కాంప్లెక్స్ ఎరువులు వాడరాదు.
నత్రజని, పోటాష్ ఎరువులు వేసే విధానం :
క్ర.సం |
రకము |
ఇవ్వవలిపిన ఎరువులు |
పైరుకు ఇవ్వవలిసిన మేతదులు |
ఒక్కొక్క మేతదుకు ఇవ్వవలసిన |
పిలక నాటిన తర్వాత ఎరువులు వేయవలసిన రోజులు |
|||
---|---|---|---|---|---|---|---|---|
నత్రజని గ్రా. |
పోటాష్ గ్రా. |
నత్రజని |
పోటాష్ |
|||||
సారవంతమైన సాధారణ భూములు |
||||||||
1 |
కర్పూర చక్కెర కేళి, కోప్వురు బొంత (దీర్ఘకాలిక రకాలు) |
200 |
200 |
4 |
50 |
50 |
45,90,135,180 |
|
2 |
పెద్ద పచ్చ అరటి పొట్టి పక్క అరటి (స్వల్ప కాలిక రకాలు) |
200 |
200 |
4 |
50 |
50 |
40,80,120,160 |
|
3 |
తెల్ల చక్కెర కేళి |
250 |
250 |
5 |
50 |
50 |
35,70,105,140,175 |
|
4 |
కార్శి పంటలకు పై మేతదులనే వ్యవధి తగ్గించి వేసుకొనవలెను |
200 |
200 |
5 |
40 |
40 |
35,70,105,140,175 |
|
ఎర్ర గారప నేలలు |
||||||||
1 |
కర్పూర చక్కెర కేళి, కోప్వురు బొంత (దీర్ఘకాలిక రకాలు) |
300 |
300 |
6 |
50 |
50 |
30,60,90,120,150,180 |
|
2 |
పెద్ద పచ్చ అరటి పొట్టి పక్క అరటి (స్వల్ప కాలిక రకాలు) |
300 |
300 |
6 |
50 |
50 |
25,50,75,100,125,150 |
నత్రజని, పోటాష్ ఎరువులను అరటి చెట్టుకు రెండు వైపులా 30 - 40 సెం.మీ దూరంలో 10 సెం.మీ. లోతు గుంటలలో వేసి మట్టితో కప్పాలి. ఎరువులు వేసిన ప్రతిసారి తేలికపాటి తడి ఇవ్వాలి. అలాకాక ఎక్కవ నీరు పెట్టినట్లయితే వేసిన ఎరువులు నీటిలో కరిగి నీటితో పాటు భూమి లోపలి పొరలలోకి పోయి మొక్కకు అందువు కాబట్టి తగిన పాలితం రాదు.
ఎరువుల వాడకాన్ని అరటిలో రెండు రకాలుగా విభజించవచ్చు :
డ్రిప్ పద్దతిలో ఎరువులు వేసేటప్పుడు సారవంతమైన నెలల్లో సిపార్సు చేసిన ఎరువుల మేతదులో 60 శాతం, తేలిక నెలల్లో (ఎర్ర గారప) సిపార్సు చేసిన మేతదులో 75 శాతం ఎరువులు వేస్తే సరిపోతుంది.
సారవంతమైన నెలల్లో డ్రిప్ పద్దతిలో మూడవ వారం నుండి 25 వ వరం వరకు ప్రతివారం ప్రతి మొక్కకు 10 గ్రా. యూరియా 7 గ్రా. మ్యురేట్ ఆఫ్ పోటాష్ ఇవ్వాలి. మరల గెల వేసిన తరువాత అంటే 33 వ వరం నుండి 36 వ వరం వరకు ప్రతి వరం ప్రతి మొక్కకు 13 గ్రా. యూరియా 10 గ్రా. మ్యురేట్ మ్యురేట్ ఆఫ్ పోటాష్ డ్రిప్ పద్దతిలో ఇవ్వాలి.
టిగ్యకల్చర్ అరటి మొక్కలకు ఎరువులు వేయటం :
పాలిథిన్ సంచుల్లో పెంచిన టిగ్యకల్చర్ అరటి మొక్కల చిన్నివిగా ఉంటాయి. నాటిన వెంటనే ఎదుగుదల ప్రారంభిస్తేయ. మాములు మెక్కాలకంటే వేగంగా పెరుగుతాయి. కానీ మొక్కలు చిన్నివిగా ఉండి, పరిమితి వేరు మండలం కలిగి ఉండుటం వల్ల మాములుగా సిపార్సు చెందిన ఎరువుల మేతదును సమర్ధవంతంగా వినియెగించుకోవాలి. కనుక అరటిలో సిపారేసా చేసిన నత్రజని, పోటాష్ ఎరువులను తక్కువ మేతదులో ఎక్కువ ధపాలుగా వేయాలి.
పోషక లోపాలు - సవరణ
పోటాష్ ధాతు లోపం - నివారణ : అరటి ఆకుల అంచుల వెంబడి పసుపు రంగులోకి మరి, క్రమేసి ఆకూ మొత్తం పండిపోయి ఎండిపోవును. మొక్కకు 80 గ్రా. చొప్పున మ్యారేట్ అప్ పోటాష్ను నలభతే తోజుల వ్యవధిలో నాలుగు టపాలు వేసుకోవాలి. ఆకులూ పై 5 గ్రా. సల్పెటు అప్ పోతశ్ని 1 కితారు నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి.
టిగ్యకల్చర్ అరటి మొక్కలకు డ్రిప్ ద్వారా ఎరువులు వేసే విధానం :
రకం |
మొక్క ఒక్కింటికి ఇవ్వాల్సిన మేతాడు |
మొక్కలు నాటిన తరువాత వేయాల్సిన రోజులు |
|
---|---|---|---|
యూరియా (గ్రా.) |
మ్యురేట్ ఆఫ్ పోటాష్ (గ్రా.) |
||
సారవంతమైన సాధారణ భూములు |
|||
పచ్చ అరటి రకాలు (పెద్ద పచ్చ, పొట్టి పచ్చ, కర్పూర చక్కెర కేళి) |
32 |
25 |
15,30,45 |
40 |
30 |
60,75,90 |
|
65 |
50 |
110,130,150 |
|
కె,బి.యస్ - 8 |
32 |
25 |
15,30,45 |
55 |
40 |
6,80,100 |
|
85 |
70 |
120,160,180 |
|
65 |
50 |
140,170,200,230,260,290 |
|
ఎర్ర గరపా నేలలు |
|||
పచ్చ అరటి రకాలు (పెద్ద పచ్చ, పొట్టి పచ్చ, కర్పూర చక్కెర కేళి) |
32 |
25 |
10,20,30,40,50 |
55 |
40 |
60,75,90 |
|
85 |
70 |
110,130,150,170 |
|
కె,బి.యస్ - 8 |
32 |
25 |
10,20,30,40,50 |
55 |
40 |
60,75,90 |
|
85 |
70 |
110,130,150,170,200,130,260,290,320 |
జింకు ధాతు లోపం - నివారణ : ఆకుల ఈనెల నెంబడి తెల్లని చారలు ప్రారంభమై ఆకుల పాలిపోయినట్టు కనబడతాయి. ఆకుల అడుగు బాగానే ముదురు ఊదు రంగు ఏర్పుడుతుంది. దీని నివారణకు ఒక్కొక్క మొక్కకు 10 గ్రా. జింకు సల్పెటు భూమిలో వేయాలి. ఆకుల పై 2 గ్రా. జింక సల్పెతును లీటరు నీటిలో కలిపి 10 రోజుల వ్యవధిలో 2 - 3 సార్లు పిచికారి చేయాలి.
బోరాన్ ధాతు లోపం - నివారణ : ఆకుల ఈనెలు ఉబ్బెత్తుగా ఉండి, ఆకులూ బిరుసుగాను, పేశుసుగాను ఉండును. ఆకుల పై నిలువుగా (పెద్ద ఈనెకు సమాంతరంగా) చారలు ఏర్పడతాయి. 2 గ్రా. బోరాక్సు మందును లీటరు నీటికి కలిపి స్కూలు పై 10 రోజుల వ్యవధితో రెండు సార్లు పిచికారి చేయాలి.
ఇనుము ధాతు లోపం - నివారణ : ఇనుము ధాతువు లోపించినప్పుడు అరటి చెట్టు లేత ఆకులూ తెలుపు చర్యలతో ఉంటాయి. ధాతు లోపం అధికంగా ఉన్నప్పుడు లేత ఆకులూ పూర్తిగా తెలుపు రంగుకు మరి క్రమేపి ఎండిపోతాయి. అరటి చెట్టు పెరుగుదల తగ్గిపోతుంది. అన్నభేది 5 గ్రా. + నిమ్మ ఉప్పు 2 . 5 గ్రా. చొప్పున, 1 లి. నీటికి కలిపి అరటి ఆకులూ పూర్తిగా తడిసేలా 10 రోజుల వ్యవధిలో రెండు సార్లు ముదురు ఆకుల పై నిర్ణత ఆకారం లేని పానుపు రంగు మక్కలు ఎరుపుడతాయి. తర్వాత పసుపు రంగు మచ్చ మధ్యలో ఎండిపోతుంది. లోపం తీవ్రమైనప్పుడు ఆకులూ పూర్తిగా ఎండిపోతాయి. పిలకలు లేత ఆకులూ ఆకుమచ్చ చర్యలతో కూడిన తెలిపి రంగు ఆకులూ ఎండిపోతాయి. తల్లి చెట్టు ఎదుగుదల ఆగిపోతుంది. మాంగనీసు సల్పెటు 2 గ్రా. ఒక లీటరు నీటికి కలిపి ఆకులన్నీ తడిచేలా 10 రోజుల వ్యవధితో 2 - 3 సార్లు పిచికారీ చేసి మంగనిను లోపాన్ని సవరించవచ్చును.
నీటి యాజమాన్యం : అరటి పంటకు కలం, భూమి, వాతావరణం పరిస్ధితులను బట్టి సుమారు 30 - 40 సార్లు నీరు పెట్టాలి. ఆయా ప్రాంత పరిస్ధతులను బట్టి 7 - 10 రోజులకొకసారి తడి ఇవ్వాలి. ఉప్నోగ్రత 38 డిగ్రీల సెం. కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ప్రతి నాల్గవ రోజు తడికి ఇవ్వాలి. ఎరువులు వేసిన ప్రతిసారి తెలికిపాటి తడి ఇవ్వాలి. అరటికి డ్రిప్ ద్వారా నీరు ఇచ్చినప్పుడు దిగుబడి 20 శాతం వరకు నీటిని, 25 - 50 శాతం వరకు ఎరువులను ఆదా చేయవచ్చు. చీడపీడల సమస్యలు తగ్గుతాయి.
కలుపు నివారణ : హెక్టారుకు బూటకలోర్ 5 . 0 లి. లేదా అలకలా 2 . 5 లి. లేదా పెండిమిధలైన్ 2 . 5 లి. లేదా ఆక్సిప్లోర్ పెన్ 500 మీ.లి. ఏదైనా ఒక మందును, మారిన తరువాత మొదటి తడి ఇచ్చి నెల తేమగా ఉన్నప్పుడు నామానంగా పిచికారి చేసి కలుపు మెలవకుండా అరికట్టవచ్చు. తుంగ, గరిక మెదలైన మెండి జాతి కలుపు నిర్ములనకు హెక్టారుకు 5 . 0 లీటర్ల గైపోసేటు మోండును 500 లీటర్ల నీటికి కలిపి కలుపు పిచికారి చేసేటప్పుడు కలుపు ఎదిగి ఉండాలి. గైపోసేటు మందును అరటి మొక్కలు పైన పడకుండా పిచికారి చేయాలి.
అంతరకృషి : అరటి నాటిన 3 - 4 నెలల నుండి పిలకలు వృద్ధి చెందుతాయి. అరటి గెల సగం తయారయ్యే వరకు పిలకలు 20 - 25 రోజులకొకసారి కేసి వేయాలి. పిలకలు ఎప్పటికప్పుడు కోయటం వాళ్ళ తల్లి చెట్టు బాగా ఎదిగి అధిక పాలసయం వస్తుంది. బాగా పెద్దవైన పిలకలు పదునైన గునపంతో కొద్దీ పాటి దుంపతో సహా త్రవ్వితీస్తే తిరిగి ఎదగదు. అరటి నాటికీ 6 - 8 నెలల్లో చెట్టు మెడలకు మట్టిని ఎగదోయడం వల్ల చెట్టు బలంగా ఎరుగుతుంది. గాలులు ఎక్కువగా ఉండే ప్రాంతాలతో అరటి చెట్టు గాలి తాకిడిని తట్టుకోవడానికి వీడారు గదులను పాటి ఊతం ఇవ్వాలి. గెలలు నరికిన చెట్లను ఎక్కడ ఉన్నవి అక్కడే చిన్నిచిన్న ముక్కలాగా నరికితే త్వరాగాఎండి కుళ్ళి భూమిలో కలిసి సేంద్రియ ఎరువుగా రూపంతరం చెంది భూసారం పెరుగుతుంది.
నాణ్యమైన గెలల దినుబడికి సూచునలు : అరటిలో పండ్ల పరిమాణము మరియు నాణ్యత పెంచుటకు గెలల్లోని ఆఖరి హస్తం విచ్చుకొన్న 5 వ రోజున మరియు 15 వ రోజున సల్పేట్ అప్ పోటాష్ 5 గ్రా. ఒక లీటరు నీటితో కలిపి గెలల పై పిచికారీ చేయాలి. దీనితో పాటు 2 శాతం రంధ్రములు చేసిన తెల్లని పారదర్శక పాలిథిన్ సంచులను గెలలకు తొడగటం వలన పండ్ల పరిమాణం పెరిగి లేత ఆకుపచ్చు రంగులో ఆకర్షణీయంగా తయారై నాణ్యమైన పండ్లు తయారై విదేశాలకు ఎగుమతి చేయుటకు అనుకూలంగా ఉంటాయి.
అంతర పంటలు : అరటి దీర్ఘకాలిక పంట. మొక్కల మధ్య న్వల్పకాలిక అంతర వాటాలు వండించి అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. అరటి రకాన్ని బట్టి, వేసే దూరాన్ని బట్టి వాతావరణ పరిస్ధితులను బట్టి అంతటా వంటలను ఎన్నుకోవాలి.అంతర వంటలను తగునిష్పత్తిలో మాత్రమే వేసుకోవాలి. ఎక్కవ సాంద్రతలో వాడితే అరటి పంట ఆలస్యమయ్యే అవకాశం ఉంది. కావున సూచించిన నిష్పత్తి లో మాత్రమే అంతర పంటలను సాగు చేయాలి. అదే విధంగా అరటికి చేసే ఎరువులతో సమాధాం లేకుండా అంతర పంటలకు నిర్దేశించిన ఎరువులను అదనంగా ఇవ్వాలి. దోస, టమాటా, వంగ, బెండ, పొగాకు పంటలను అరటిలో అంతర పంటగా వేయకూడదు. వీటి సాగు వల్ల నులి పురుగుల ఉధురత్తి పెరగటమే కాకుండా వెర్రి తెగుళ్ళు వ్యాప్తి అధిక మవుతుంది.
అరటిలో వేయదగిన అంతర పంటలు :
అంతర పంటలు |
నాటే విధానం |
|
---|---|---|
విత్తే దూరం (సెం.మీ.) |
వరుసల సంఖ్య |
|
బంతి, చామంతి అల్లం, పసుపు అలసంద, వేరుశనగ, ఉల్లి ఆకుకూరలు చేమ కంద
|
45*30 30*15 30*10 వరుసల మధ్య 15 సెం. మీ 45*45 60*60 |
2 4 4 7 2 2 |
గెలలు కోయటానికి ముందు తీసుకోవాల్సిన జాగ్రతిలు :
గెలలు వేసేనాటికి కనీసం 12 - 13 ఆకులూ కలిగి ఉంటాలి. ఆకుల సంఖ్య తక్కువైతేతే గెలలోని పండ్లు కోతకు ఆలస్యంగా వస్తాయి లేదా పురాయిగా ఏడుగవు. గెలవేయడం పూర్తయిన తరువాత గెల చివర ఉండే మగాపుల గుచ్చాన్ని తీసివేయాలి. లేకుంటే ఆహార పదార్ధాల కోసం గెలలోని కాయంతో పోటీపడి కాయల నాణ్యతను మగపులు దెబ్బతీస్తాయి. హస్తాల పై ఉండే రక్షక పాత్రలను (బ్రాక్ట్) ను తొలగించాలి. తొండం పై భాగాన ఎండు తగలకుండా ఎండు ఆకుతో కప్పాలి. వాలిన వైపుకు గెలకు ఊతం ఏర్పాటు చేయాలి.
గెలలు కోయటం : అరటి గెల చేసిన తరువాత 2 . 5 నుండి 3 నెలల తర్వాత కోయవచ్చు. పురాయిగా తయారయిన పండ్లు గుండ్రంగా ఉంది, చేతిలో తట్టితే మంచి శబ్బం వస్తుంది. దూర ప్రాంతాలకు పంపేటప్పుడు జలాలను 75 - 80 శాతం పక్వానికి రగవే కోయటం మంచిది. గెల తోడం కురచగా ఉండేటట్టు నరకాలి. గెలల చుట్టూ పచ్చి ఆకులూ చుట్టి రవాణా చేయటం మంచిది.
మగ్గించడం : గాలి చొరబడని గదిలో ఉంచి పొగ బెట్టి, 24 గంటలు ఉంచితే గెలలు పండుతాయి. కోసిన గెలల పై 1000 పి.పి.యం (1 లీటరు నీటికి 1 మీ,లి. ముందు) ఇద్దరెల్ ద్రావణం పిచికారి చేస్తే అరటి పండ్లకు ఆకర్షమియమైన రాము వస్తుంది. ఆరోగ్యానికి కూడా మంచిది.
సస్యరక్షణ : పరిశోధన ఫిలితాల ఆధారంగా ఈ క్రీంది సస్యరక్షణ చర్యలు మరియు మందులు సూచించడమైనది.
పురుగులు :
నులి పురుగులు (నిమటోడాలు) : ఇవి అరటి మొక్కలు వేర్లను ఆశించి ఎక్కవ నష్టాన్ని కలుగచేస్తాయి. కొన్ని రకాల నులి పురుగులు వేర్లు లోకి జొరబడి రసం పీల్చి వేర్లు పై చర్యలను ఏర్పరుస్తాయి. మరిన్ని రకాల నులిపురులు ఆశించడం వలన వేర్లు పై కాయలవంటి బుడిపెలు (వేరు కాయలు) ఏర్పడతాయి. నులిపురుగులు ఆశించడం వలన వేర్లు, దుంప బలహీనపడి మొక్క నీటికి, పోషకాలను సరిగా తీసుకోలేదు. కండువాలను మొక్కలు వదిలినట్లు కనిపిస్తాయి. ఆకుల అంచుల వెంబడి నల్లగా మరి క్రమేపి ఆకుల ఎండిపోతాయి.
ఈ రెండు రకాల నీలి పురుగుల నీవర్మకు వేసవిలో 3 - 4 సార్లు లోతుగా దుక్కి దున్నాలి. వేళ్ళు పై చారలు ఏర్పరిచే నులిపురుగులు నష్టం ఎక్కవగా ఉన్న నెలలో జనము పంట పెంచి నెలలో కలియదున్నాలి. అలాగే వేరు కాయలు కలుగచేసే నులిపురుగులు ఎక్కువగా ఉంటే మే నెల రెండవ వారంలో బంతి విత్తనాలు చల్లి జూన్ నెలాఖరు వరకు తోటను పెంచి, తర్వాత భూముల కలియదున్నాలి. నులిపురుగులు స్కానటువంటి తోటలో నుండి పిలకలు సేకరించాలి. పిలకలు దుంప పై చర్మం పలుచగా చెక్కిన తరువాత ముందు ద్రావణం (కాపర్ ఆక్సీక్లోరైడు 5 గ్రా., మెనోక్రోటోపాస్ 2 .5 మీ. లి లను లీటరు నీటిలో కలిపి) లో 15 నిముషాలు ముంచి నాటుకోవాలి. పిలకలు నాటే గుంతలోని మట్టికి అరకిలో వేపపిండి కలపాలి. నులి పురుగులు ఆశించిన మొక్కలకు 40 గ్రా. కార్బొఫూరం 3 జి గుళికలు మెడలు వద్ద లోతుగా వేసి మట్టితో కప్పి నీరు పెట్టాలి. పండ్లలో కార్బొఫూరం అవశేషాలు మిగిలి ఉండే ప్రమాదం ఉన్నందున, గుళికలు గెలవేసిన తరువాత వేయరాదు. ఛేంకు, వరి వంటి పంటలతో పంట మార్పిడి చేస్తే నెలలో ఈ పురుగుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది.
దుంప పుచ్చు : ఈ పురుగు దుంపను తిలిచి నష్టం కలిగిస్తుంది. అరటి చెట్టు నీరు లేక వదలినట్లుగా కనిపిస్తుంది. ఆకులన్నీ నీటి ఎద్దడిని సూచిస్తాయి. ఈ లక్షణాలు కనిపించిని వెంటనే ఒక్కొక్క మొక్కకు 25 గ్రా. కార్బొఫూరం గుళికలు మొక్క మెడలు వద్ద లోతుగా మట్టిలో వేసి మట్టితో కప్పి నీరు పెట్టవలెను.
తెగుళ్ళు:
సిగటోక ఆకుమచ్చు తెగుళ్ళు : ఈ తెగులు అన్ని రకాల అరటి పై ఆశిస్తుంది. వర్షాకాలంలో (జులై నుండి నవంబరు వరకు) ఎక్కువగా ఉంటుంది. పెద్దపచు అరటి, పొట్టిపచ్చు అరటి, తెల్ల చక్కెర కేళి రకాలు ఈ తెగులును తట్టుకోలేవు. ఆకుల పై చిన్ని మచ్చలుగా ప్రారంభమై క్రమేసి పెరిగి పెద్దవై మధ్యలో గోధుమ రంగుకు మరి, ఒక దానితో ఒకటి కలిసిపోయి ఆకులూ పురాయిగా ఎండిపోతాయి. గెలలు తయారయ్యే సమయంలో తెగులు వల్ల ఎక్కువ నష్టం కలుగుతుంది. తెగులును తట్టుకిలేని రకాలను జూన్-ఆగష్టు నెలల మధ్య నాటడం ద్వారా తెగులు వల్ల కలిగే నష్టాన్ని చాలా వరకు తగ్గించవచ్చు. దీని నివారణకు తోటల్లో కలుపు లేకుండా శుభ్రంగా ఉంచెలి. తోటల్లో నీరు నిలవకుండా చూడాలి. ఎక్కువగా ఉన్న పీకలను తీసివేయాలి. తెగులు ఎక్కవ ఆశించే రకాల పై వర్షాకాలం ప్రారంభానికి ముందు 2 . 5 గ్రా. మాంకోజెబ్ లేదా క్లోరోధోలోల్ 2 గ్రా. లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి. వర్షాకాలంలో తెగులు వ్యాపి స్తే ప్రొపికోనజోల్ 1 మీ.లి. లీటరు నీటికి కలిపి 2 - 3 సార్లు 20 రోజుల వ్యవధిలో మర్చి పిచికారి చేయాలి.
పనామా తెగులు: ఈ తెగులు విత్తనపు పిలకలు ద్వారా మరియు మట్టి ద్వారా వ్యాపిస్తుంది. అమత పాణి రకం ఈ తెగులును ఏమాత్రం తట్టుకోలేడు. బొంత, తెల్ల చక్కెరకేళి రకాలు కూడా కొని అనుకూల పరిస్ధితులలో తట్టుకోలేవు. ఈ తెగులు సోకినా మొక్కల ఆకులూ క్రీంది నుండి పైకి పసుపు వర్ణంలోకి మరి ఎండిపోయి చెట్టు కందం వెంట వ్రేలాడతుంటాయి. నెల పై భాగంలో కందం పై నిలుపు పేగులు ఏర్పడుతుంది. ఇటువంటి మొక్కలు దుంపలను కోసి గమనిస్తే లోపల గోధుమ రంగు మచ్చులు కనబడతాయి. ఈ తెగులును రసాయన మందులు ద్వారా నివారించడం సాధ్యపడదు. కనుక ఈ తెగులును తట్టుకొనే రకాలను సాగు చేయాలి.
బ్యాక్టీరియా దుంప కుళ్ళు తెగులు : తెల్ల చక్కెరకేళి, పెద్ద పచ్చ అరటి మరియు పొత్తు పచ్చ అరటి రకాలను ఈ తెగులు అధికంగా ఆశిస్తుంది. ఈ రకాల మొక్కలు చిన్నివిగా ఉన్నప్పుడు ఉప్నోగ్రత ఎక్కవ ఉంటే తెగులు ముద్రతి ఎక్కువగా ఉంటుంది. పెద్ద మొక్కలలో కూడా ఈ తెగులు అధిక నష్టం కలుగచేస్తుంది.
కండ మెడలిలో భూమికి దగ్గరగా (కందం మరియు దుంప కలిగే భాగంలో) కుళ్ళు మచ్చలు ఏర్పడి క్రమేపి దుంప కుళ్లిపోతుంది. కొత్తగా నాటిన పిలకాలలో చిన్న మొక్కలలో మొవ్వ ఆకూ కూడా కుళ్ళి మొక్క చనిపోతుంది. పెద్ద మొక్కలలో కండ పై నిలుపుగా పగుళ్ళు ఏర్పడతాయి. దుంప పైభాగం కుళ్ళిన వాసనా వస్తుంది. కింది వరుస ఆకులూ పసుపు రంగులోకి మరి ఎండిపోతాయి. ఈ విధంగా అన్ని ఆకులూ ఎండిపోయి మొక్క చనిపోతుంది.
నివారణ : ఈ తెగులు తట్టుకిలేని పచ్చ అరటి, తెల్ల చక్కెరకేళి రకములు ఫిబ్రవరి-జూన్ నెలల మధ్య నటరాదు. వేసవిలో తోటలకు సరిపడా నీరు పెట్టాలి. క్రొత్తగా తోటలు వేయడానికి తెగులు శోకానటువంటి ఆరోగ్యవంతమైన తోటలనుండి మాత్రమే పిలకలు సేకరించాలి .సేకరించిన పిలకలు కాపర్ ఆక్సీక్లోరైడు మరియు మెనోక్రోటోపాస్ కలిపినా నీళ్ళలో ముంచి నీడలో ఆరబెట్టినా తరువాత నాటుకోవాలి. తోటల్లో తెగులు నొక్కినా మొక్కలను చేసి, ఎండు తుక్కువేసి తగలబెట్టాలి. మొక్కలు తీసివేసిన చోట, చెట్టు ప్రక్కల ఆరోగ్యవంతమైన మొక్కల మెదళ్ళ వద్ద మట్టి బాగా తడిచేలా బ్లీచింగ్ ఫాదర్ కలిపినా (25 గ్రా. లీటరు నీటికి) నీళ్ళతో తడపాలి. ఈ తెగులు అధికంగా ఉన్న నెలల్లో వారి, చేదుకు లాంటి పంటలతో పంట మార్పిడి చేయాలి.
వైరస్ తెగుళ్ళు:
వెర్రి తలలు (బంచితాప్) : దీని వల్ల ఆకుల పరిమాణం తగ్గుతుంది. ఆకుల అంచులు పత్రహరితం కోల్పోయి. తెలుపు రంగుకు మారతాయి. చెట్టు ఎదుగుదల ఆగిపోతుంది. ఆకులన్నీ మొవ్వుల్లో గుబురుగా ఏర్పడతాయి. ఈ తెగులు చెట్టును ఈ దశలోనైనా ఆశించవచ్చు ప్రారంభ దశలో ఈ తెగులు ఆశించిన చెట్టు గెలవేయవు. తెగులు ఆశించిన చెట్టు గెలవేసిన అవి సరిగా తరుకావు.
గొడ్డు తెగులు : ఈ తెగులు సోకినా మొక్కలు ఆకుల పత్రహరితం తగ్గి ఈనెలు మధ్య పసుపు లేదా తెల్లని చారలు కలిగి ఉంటాయి. రుణాలు మందంగా ఉంటాయి. ఆకులూ పరిమాణం తగ్గుతోంది. మొవ్వు ఆకులూ సరిగా విడివడక, ఆకుల అంచుల వెంబడి పైకి ముడుచుకొని ఉంటాయి. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు మొవ్వు ఆకులపై నీటి మచ్చలు ఏర్పడి, క్రమేపి కాండలోకి వ్యాపించే మొవ్వుకుళ్ళి, చెట్టు చనిపోతుంది. తెగులు సోకినా తెట్టు గెలవేయపు, ఆలస్యంగా తెగులు సోకినా చెట్టు గెలలు కందం మధ్య మంచి బయటకు వచ్చి మెలికలు తిరిగి ఉంది, కాయలు సరిగా తాయారు కావు.
ఆపిల్ తెగులు : ఈ తెగులు ఆశించిన చెట్టు కందం పై గులాబీ లేదా ఎరుపు రంగు నిలుపు చారలు ఏర్పడతాయి. అరటి పువ్వు రేకులపై కూడా చిన్ని నూలుకండి ఆకారపు మచ్చలు ఏర్పడతాయి. కందం పై భాగం లోను, ఆకుల తొడిమలు పై కూడా లేత ఆకుపచ్చ చారలు ఏర్పడతాయి. ఆకుల ఈనెల మధ్య అక్కడక్కడా పత్రహరితం కోల్పోయి తెల్లని చారలు ఏర్పడవచ్చ. ఈ తెగులు పిలకలు ద్వారా, పెను పురుగుల ద్వారా వ్యాపిస్తుంది.
లిఫ్ స్ట్రీక్ తెగులు : ఈ తెగలు అన్ని రకాలను ఆశిస్తుంది. అయితే కర్పూర చక్కెరకేళి రకానికి ఎక్కవగా ఆశిస్తుంది. తెగులు సోకినా అరటి మొక్కల ఆకుల పై, ఈనెల వెంబడి తెల్లని చారలు ఏర్పడతాయి. కందం పైన ఆకుల తొడిమలు పైన నల్లని నిలుపు చారలు ఏర్పడతాయి. తెగలు ఎదుటుగా ఉన్న మొక్కల ఎదుగుదల మెండిగిస్తుంది. తెగులు సోకినా చెత్త జలాల పెరిమాణం తగ్గి, గెలలోని పండ్లు సరిగా తయారుకావు.
వైరస్ తెగుళ్ళ వ్యాప్తి : ఈ తెగుళ్ళు మొదటగా తెగులు సోకినా పిలకలు సొత్తా తోటలకు వ్యాపిస్తాయి. పిలకలు కోసే పనిముట్ల ద్వారా పేనుబంక పురుగు ద్వారా ఇవి తెగులుణ్ణి చెట్టు నుంచి మయోచి చెట్టుకు వ్యాప్తిస్తాయి. ఎక్కువ కార్శిలు ఉంచినప్పుడు తెగులు ఉదుత్తమవుతుంది.
వైరస్ తెగుళ్ళ యాజమాన్యం : విత్తనపు పిలకలు ఆరోగ్యవంతమైన తోటల నుంచి సేకరించాలి, లేదా టిగ్యకల్చర్ మొక్కలను మాత్రమే ఉపయెగించాలి. తెగులు సోకినా మొక్కలను, పిలకలు ఇప్పటికిప్పుడు గుర్తించాలి దుంపలతో సహా తీసివేసి ముక్కలుగా నరికి తోట బయట వేసి తగులబెట్టాలి. తోటలో పేనుబంక, పిండి పురుగుల ద్వారా వైరస్ తెగుళ్ళ వ్యాప్తి జరగకుంగా డైమిదోయేట్ లేదా మీదతెల్ థేమటన్లలో ఏదైనా ఒక మందును 2 మీ.లి. ఒక లీటరు నీటికి కలిపి మొక్కలు, పిలకలు పైన పిచికారి చేయాలి.
గెలలు, కాయల పై వచ్చు తెగుళ్ళు :
తొండం కుళ్ళు తెగులు : గెల తొండం పై సూర్యరశ్మి తాకిడికి తెల్లని మచ్చ ఏర్పడుతుంది. క్రమేపి మచ్చ పెద్ద దై కుళ్లిపోవటం ప్రారంభం అవుతుంది. తెగులు ఆశించిన గెలలో క్షలు సరిగా తయారుకావు. నివారణకు గెల తొండం పై పచుట్టి ఎండ తగలకుండా చేయాలి. మచ్చులు ఏర్పడిన తొండం పూర్తిగా తడిచేలా 1 గ్రా. కర్బందాజిమ్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
కాయ మచ్చిక కుళ్ళు తెగులు : ఈ తెగులు పెద్దపచ్చ, పొత్తిపచ్చ, తెల్ల చక్కెర కేళి రకాలకు వర్షాకాలంలో ఎక్కవగా అహిస్తుంది. పాశ్వానికి రాణి కాయలు ఈ తెగులును లోనవుతాయి. కాయల చివర మచ్చిక వద్ద నల్లగా మాడిన కుళ్ళు మచ్చలు ఏర్పడతాయి. మందుగా ఒకటి, రెండు కాయల పై లక్షణాలు కనిపించి, క్రమేపి మిగిలిన కాయలకు కూడా వ్యాపిస్తుంది. నివారణకు తెగులు ఆశించిన కాయలను గుర్తించి వెంటనే తీసివేసి తగలబెట్టాలి. కార్బండజిమ్ మందు ద్రావణాన్ని 1 గ్రా. లీటరు నీటికి కలిపి గెలలు పూర్తిగా తడిచేలా 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి.
ఆధారం: వ్యవసాయ పంచాంగం
చివరిసారిగా మార్పు చేయబడిన : 1/7/2021