మొక్కజొన్న మన రాష్ట్రంలో వరి, పత్తి తర్వాత సాగుచేసే ప్రధానమైన పంట మొక్కజోన్నలో కనిపించే చీడపీడలు వాటి నివారణ చర్యలు ఇలా చేసుకోవాలి.
ఈ తెగులు ఆశించిన మొక్కల ఆకుల, కాండం పైన బూడిద లేదా గోధుమ వర్ణపు మచ్చలు ఏర్పడి అవి పరిమాణంలో పెరిగి ఒక దానితో ఒకటి కలిసి పెద్ద మచ్చలు గోధుమ వర్ణంలో ఉంటాయి. ఇవి చూడటానికి పాముపోడ మాదిరిగా కనిపిస్తాయి. ముందుగా ఈ రకమైన మచ్చలను నేలకు దగ్గరగా ఉన్న ఆకులలో గమనించవచ్చు. క్రమంగా పైఆకులను, కండాన్ని ఆశించడం వలన మొక్క కణుపుల వద్ద విరిగిపోయే అవకాశం ఉంది. తెగలు ఉన్నప్పుడు మొక్క పైనుండి కిందకు వడలీ ఎండిపోతుంది.
ఈ తెగులు ఆశించిన మొక్కలు కాండం మొదటి భాగంలో విరిగి కింద పడిపోతాయి. అటువంటి మొక్కల కాండాన్ని చీల్చి చుసినట్లైతే లోపల బెండు భాగం కుళ్ళి, తెలుపు రంగు నుండి నలుపు రంగుకు మారి ఉంటుంది. ఈ తెగుళ్ళు కారకమైన శీలింధ్రాం వేరు నుండి కాండం పై భాగానికి వ్యాపించి గోధుమరంగు చారలు ఏర్పడతాయి. పూత దశలో / నేలలో తెమశాతం తగ్గడం వలన / ఉష్ణోగ్రత వాతావరణంలో ఎక్కువైనప్పుడు ఈ తెగులు సోకుతుంది.
వాతావరణంలో తేమ, ఉష్ణోగ్రత అధికంగా ఉన్నప్పుడు తెగులు త్వరగా వృద్ధి చెందుతుంది. ఆకుల పై పొడవాటి చిన్న చిన్న కోలగా బూడిద రంగుతో కూడిన ఆకుపచ్చ లేదా గోధుమ రంగు మచ్చలు ఆకుల కిందిభాగంలో ఏర్పడి పైపైపు వ్యాప్తి చెందుతాయి.
మాంకోజేబ్ 2.5 గ్రా. లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
ఆకులకు రెండు వైపులా గుండరని లేదా పొడవాటి గోధుమ వర్ణపు మచ్చలు / పొక్కుల మాదిరిగా కనిపిస్తూ తర్వాత క్రమంగా నలుపు వర్ణంలోకి మారుతాయి.
మాంకోజేబ్ 2.5 గ్రా. లీటరు నీటిలో కలిపి 1-2 సార్లు పిచికారీ చేయాలి.
ఈ పురుగు పంట మొలకెత్తిన 10-30 రోజుల నుండి కంకి దశ వరకు ఆశించి వాటి ప్రభావాన్ని చూపుతాయి. మొదటి పిల్ల పురుగులు. (లార్వా) మొక్క మొలకెత్తిన 10-20 రోజుల దశలో పత్రహరితాన్ని గోకి తింటుంది. కాయ లోపల తినడం ముడుచుకొని ఆకు ద్వారా కాండం లోపలికి చేరి రంధ్రాలను చేస్తాయి. ఆ ఆకులు విచ్చుకున్నాక వరుస క్రమంలో ఉండే రంధ్రాలు అగుపిస్తాయి. ఎదిగే అంకురాన్ని తినడం వలన మొవ్వ చనిపోతుంది. ఇవి పూతను, కంకిని కూడా ఆశించి దిగుబడి తగ్గిస్తుంది.
మొలకెత్తిన 30 రోజుల తర్వత నుండి రసం పిల్చే పురుగులైన పెనుబంక, నల్లి వంటివి ఆకులను, కాండాన్ని ఆశించి రసం పిల్చిడం వలన ఆకులు పసుపు రంగులో మారి, మొక్క గడిసబారి పోతుంది. అయితే రసం పిల్చే పురుగులు జిగురు పదార్దాన్ని నిసర్జిస్తాయి. దాని వలన మసి తెగులు సాకి కిరణజన్య సంయోగక్రియకు అంతరాయం ఏర్పడి ఆశించిన దిగుబడి రాకపోవచ్చు.
ఆధారం: పాడిపంటలు మాస పత్రిక