మన రాష్ట్రంలో చెఱకు పంటను సుమారు 50 వేల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేస్తూ, 37 లక్షల టన్నుల చెఱకును ఉత్పత్తి చేస్తున్నాము. చెఱకు పంట ద్వారా పంచదార, బెల్లం, ఖండసారి, బగాస్సె, మొలాసిస్ మరియు ఫిల్టర్ మడ్డి ఉత్పత్తి అవుతున్నాయి. అధిక చెఱకు దిగుబడితో పాటు ఎక్కువ పంచదార దిగుబడి పొందటానికి శీతోష్ణస్థితులు, రకములు, సాగుభూమి, సాగు పద్ధతులు, సస్యరక్షణ మరియు సాగునీటి నాణ్యత అనే ఆరు అంశాలు ప్రభావితం చేస్తాయి. ఇటివలి కాలంలో రాష్ట్రంలో చెఱకు విస్తీర్ణం తగ్గడానికి ముఖ్యమైన కారణం కూలీల కొరత మరియు నీటి ఎద్దడి. చెఱకు సాగులో యంత్ర పరికరాలను ఉపయోగించవలసిన అవసరం రోజురోజుకి పెరుగుతూ వస్తుంది. మారుతున్నా ఆర్ధిక, సామజిక పరిస్థితుల నేపధ్యంలో మానవశ్రమ అవసరం ఉన్న చెఱకు సాగుపై దీని ప్రభావం కనిపిస్తూనే ఉంది. చెఱకు నాటడానికి, కలుపుతీతకు, పై పాటుగా ఎరువులు వేయడానికి కూలీల కొరత సమస్యగా తయారౌతున్నది. రైతులు సకాలంలో చెఱకు నరికించి ఫ్యాక్టరీకి తోలడానికి నానా పాట్లు పడవలసి వస్తున్నది. అయితే చెఱకు సాగులో పూర్తి యాంత్రీకరణ పద్ధతిలో చెఱకు నాటడం మొదలు, కలుపు తీయడం, ఎరువులు వేయడం, మట్టిని ఎగద్రోయడం, పంటపై సస్యరక్షణ మందులు పిచికారి చేయడం మరియు చెఱకు కోత వంటివి అవలంభించడంవల్ల, సాగు ఖర్చు తగ్గి అదనపు ఆదాయం పొందవచ్చని పరిశోధనా ఫలితాలు తెలియజేస్తూన్నాయి. నీటి వనరులను పొదుపుగా, సమర్ధ నిర్వహణతో వృధా కాకుండా వాడుకోవడంతో అధిక ప్రయోజనం పొందవచ్చు. చెఱకు పంటకు పిలక దశ అత్యంత కీలకమైన తేమ సున్నితమైన దశ. ఈ దశ వేసవిలో రావడం వలన పంటపై ఒత్తిడి ఏర్పడి పిలకల సంఖ్య గణనీయంగా తగ్గి దీని ప్రభావం పంట దిగుబడి పై చూపుతుంది. పరిమిత నీటి వనరులతో బిందు సేద్య పధ్ధతి పాటించడం వలన నీటి వినియోగ సామర్ద్యం పెరిగి అంతరపంటల సాగు ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు. అంతే కాకుండా చెఱకు పంటను ఒక మొక్క తోట మరియు 2-3 మోడెంలు చేయటం వలన విత్తనపు ఖర్చుతో పాటు పొలం తయారీ ఖర్చు కూడా తగ్గి చెఱకు సాగులో ఎంతో లాభం చేకూరుతుంది. కాని మోడెం తోటలలో సరియైన యాజమాన్య పద్ధతులను పాటించకపోవడం వల్ల దిగుబడులు తగ్గి సరాసరి ఉత్పాదకతపై ప్రభావం చూపుతుంది.
అనువైన వాతావరణం
ఎక్కువ సూర్యరశ్మి వర్షపాతం, గాలిలో తేమ హెచ్చుగా ఉన్నప్పుడు చెఱకు ఏపుగా పెర్గుతుంది. రాత్రి వేళల కన్నా పగటి వేళలు అధికంగా ఉంటే (జూన్ – జూలై) పెరుగుదలకు అనుకూలం. గాలిలో తక్కువ తేమ, వెచ్చని పగళ్ళు మరియు చల్లటి రాత్రులు ఉంటె రసంలో పంచదార శాతం పెరుగుతుంది. గరిష్ఠ మరియు కనిష్ఠ ఉష్ణోగ్రతలకు మధ్య హెచ్చు వ్యత్యాసం (నవంబర్ నుండి మొదలవుతుంది) ఉంటె గడలలో చక్కర కూడిక అధికంగా ఉంటుంది.
నేలలు మరియు నేల తయారీ
రకం | తల్లిదండ్రులు | చెఱకు దిగుబడి (ట/ఎ) | పంచదార శాతం | చెఱకులో బెండు | పూత పూయు స్వభావం | నీటి ఎద్దడికి తట్టుకునే శక్తి | తెగుళ్ళకు నిరోధక శక్తి |
---|---|---|---|---|---|---|---|
స్వల్పకాలిక రకాలు | |||||||
కో 6907 | కో 740 x కో 1287 | 40 | 17 - 18 | స్వల్పం | పూయదు | తట్టుకుంటుంది | ఎర్రకుళ్ళు తెగులును సహజ పరిస్దితుల్లో తట్టు కుంటుంది. గడ్డి దుబ్బు తెగులు సోకదు. కార్శి తోటలు కాటుక మరియు త్రుప్పు తెగులుకు ఎక్కువగా నావుతాయి. |
కో 8014 (మహాలక్ష్మి) | కో 740 x కో 6304 | 32-36 | 16-17 | ఉంటుంది | స్వల్పం | తట్టుకోలేదు | కాటుక, ఎర్రకుళ్ళు తెగుళ్ళను నిరోధిస్తుంది. గడ్డి దుబ్బు తెగులుకు లోనవుతుంది. |
83 ఎ 30 | కొఎ 7601 x కొఎ 7602 | 38-40 | 19 | ఉండదు | పూయదు | తట్టుకుంటుంది | ఎర్రకుళ్ళు, కాటుక మరియు గడ్డి గుబ్బు తెగుళ్ళకు లోనవుతుంది. |
కో 94008 | కో 7201 x కో 775 | 48 | 19.5 | ఉంటుంది | స్వల్పం | ఒక మోస్తారుగా తట్టుకుంటుంది | ఎర్రకుళ్ళు తెగులును ఒక మోస్తారుగా తట్టుకుంటుంది. |
కో సి 671 | క్యూ 63 x కో 775 | 48 | 17.8 | ఉంటుంది | పూస్తుంది | తట్టుకోలేదు | ఎర్రకుళ్ళు మరియు గడ్డి దుబ్బు తెగులుకు లొంగిపోతుంది. |
87 ఎ 298 (విశ్వామిత్ర) | కో 7704 x కో సి 67 | 44 | 18 - 19 | స్వల్పం | స్వల్పం | తట్టుకుంటుంది | ఎర్రకుళ్ళు మరియు గడ్డి దుబ్బు తెగులుకు లొంగిపోతుంది. |
83 ఆర్ 23 (వసుధ) | కో 740 x కో 6806 | 48 | 19.5 | లేదు | స్వల్పం | తట్టుకుంటుంది | ఎర్రకుళ్ళు తెగులును తట్టుకుంటుంది |
2003 వి 46 (భరణి) | 86 ఎ 146 x 83 వి | 50 | 18 | లేదు | పూయదు | తట్టుకుంటుంది | ఎర్రకుళ్ళు తెగులును తట్టుకుంటుంది. |
మధ్యకాలిక రకాలు | |||||||
కో 86032 (నయన) | కో 62198 x కో సి 671 | 50 - 25 | 18 | లేదు | పూయదు | తట్టుకుంటుంది | ఎర్రకుళ్ళు తెగులును కొంత వరకు తట్టుకుంటుంది. కాటుక తెగులును తట్టుకుంటుంది. |
కో 7850 | కో 740 x కో 6806 | 36 - 40 | 19 | లేదు | పూయదు | తట్టుకుంటుంది | ఎర్రకుళ్ళు తెగులును కొంతవరకు తట్టుకుంటుంది. కాటుక తెగులును తట్టుకుంటుంది. ఆకుమాడు, గడ్డిడుబ్బు, మొవ్వుకుళ్ళు తెగుళ్ళకు లోనవుతుంది. |
85 ఆర్ 186 | కో 7219 x కో 6806 | 48 | 16 - 17 | స్వల్పం | స్వల్పం | తట్టుకుంటుంది | ఎర్రకుళ్ళు తెగులుకు లోంగిపోతుంది.(కో సి 671 తెగ) |
97 ఆర్ 129 | కో 86011 x కో 775 | 50 | 19 | లేదు | పూయదు | తట్టుకుంటుంది | ఎర్రకుళ్ళు తెగులును తట్టుకుంటుంది. త్రుప్పు తెగులుకు లోనవుతుంది |
97 ఆర్ 401 | కో సి 671 జి.సి | 58 | 8.5 | లేదు | స్వల్పం | తట్టుకుంటుంది | ఎర్రకుళ్ళు, కాటుక తెగుళ్ళను తట్టుకుంటుంది. |
కో 7219 (సంజీవని) | కో 449 x కో 658 | 44 - 46 | 18 - 19 | స్వల్పం | - | తట్టుకుంటుంది | గడ్డిదుబ్బు తెగులును తట్టుకుంటుంది. ఎర్ర కుళ్ళు తెగులును సహజ పరిస్థితుల్లో తట్టుకుంటుంది. |
దీర్ఘకాలిక రకాలు | |||||||
కో 419 | పిఓజె 2878 x కో 290 | 52 | 16 - 17 | స్వల్పం | పూయదు | బాల్యదశలో తట్టుకోలేదు | ఎర్రకుళ్ళు కాటుక తెగుళ్ళను తట్టుకుంటుంది. పురుగును కొంత వరకు తట్టుకుంటుంది. |
కో 62175 | - | 50 - 55 | 16.8 | స్వల్పం | పూయదు | బాల్యదశలో తట్టుకోలేదు | ఎర్రకుళ్ళు కాటుక తెగుళ్ళను తట్టుకుంటుంది. గడ్డిడుబ్బు తెగులుకు లోనవుతుంది. పోలును పురుగును కొంత వరకు తట్టుకుంటుంది. |
కో ఆర్ 8011 | కో 740 x కో 6304 | 40 - 42 | 18 - 19 | స్వల్పం | పూయదు | తట్టుకుంటుంది | కాటుక తెగులును తట్టుకుంటుంది. ఎర్ర కుళ్ళు తెగులును సహజ పరిస్దితులలో తట్టుకుంటుంది. |
కో ఆర్ 8001 | కో 740 x కో 1287 | 40 - 45 | 17 - 18 | ఉంటుంది | పూస్తుంది | తట్టుకుంటుంది | ఎర్రకుళ్ళు తెగులును తట్టుకుంటుంది. కాటుక, గడ్డి దుబ్బు తెగుళ్ళకు లోనవుతుంది. |
చెఱకును డిసెంబర్ మాసంలో మొదలుకొని మర్చి వరకు నాటవచ్చు. స్వల్పకాలిక రకాలను ముందుగా గానుగాడుటకు డిసెంబర్ – జనవరిలోనూ, మధ్యకాలిక చెఱకు రకాలను జనవరి మాసంలో మరియు ఆడ్సాలి పంటను ఆగష్టు నుండి సెప్టెంబర్ మాసాలలో నాటుకోవాలి.
బోదెలలో నీరు పెట్టి ఇంకిన తర్వాత వెనుకకు నడుచుకుంటూ, అన్ని కళ్ళూ ప్రక్కకు ఉండేటట్లు 2 సెం.మీ. లోతు మించకుండా నాటాలి.
నాటే పద్ధతులు
బోదెలు – కాలువల పధ్ధతి :బోదెలు – కాలువల పద్ధతిలో నేలను మెత్తటి దుక్కి చేసి ఎత్తు, పల్లాలు లేకుండా చదును చేసి తర్వాత కర్ర నాగలితో గానీ, రెక్క నాగలితో గానీ, ట్రాక్టరుతో నడిచే రిడ్జ్ నాగలితో గాని 90 సెం.మీ. వెడల్పు, 20 సెం.మీ. లోతు గల కాలువలను వేసుకోవాలి.
దూరపు చాళ్ళ పధ్ధతి:జంట చాళ్ళ పధ్ధతి
రెండు చాళ్ళ ఒక చాలు విడిచి నాటే పధ్ధతి
చెఱకు పంటకు సుమారు 1900-2700 మి.మీ. నీరు అవసరమవుతుంది. పంట మొదటి నాలుగు నెలలను బాల్యదశ లేదా పిలకలు పెట్టె దశ అంటారు. పిలకలు పెట్టె దశ అత్యంత కీలకమైన తేమ సున్నిత దశ. ఈ దశలో నీటి ఎద్దడి వలన పిలకల సంఖ్య తగ్గి గడ బరువు మరియు దిగుబడి తగ్గుతుంది. కాబట్టి ఈ దశలో పంటకు ఆరు రోజులకొకసారి నీరు పెట్టాలి. సాంప్రదాయ పద్ధతిలో బోదెలు-కాలువల పద్ధతిలో నీరు పెట్టవచ్చును. బిందు సేద్యం పద్దతి అవలంభించడం వలన పరిమిత నీటి వనరులను పొదుపుగా వాడుకోవచ్చు. జంట చాళ్ళ పద్దతిలో చెఱకు సాగు చేసినపుడు, బిందు సేద్యం పధ్ధతికయ్యే ఖర్చును 50% వరకు తగ్గించుకోవచ్చును. ఈ పరిస్దితుల్లో యూరియా మరియు మ్యురేట్ ఆఫ్ పోటాష్ (2.5%) లను పైరు మీద పిచికారి చేయాలి.
ముచ్చెలు నాటిన వెంటనే 3వ రోజున అట్రజిన్ 50% పోడిమందును ఎకరానికి 2 కిలోలు లేదా 70% డబ్ల్యు.పి గల మెట్రిబుజిన్ 600 గ్రా. మందును లేదా 23.5% ఇసి గల అక్సిప్లోరోఫిన్ 400 మి.లీ మందును 200 లీటర్లు నీటిలో కలిపి పంటపై పిచికారి చేసి కలుపును నివారించుకోవచ్చు. తోట నాటిన 30-50 రోజుల వ్యవధిలో అవసరాన్ని బట్టి 2-3 సార్లు గోర్రుతో లేదా దంతెతో అంతరకృషి చేయాలి లేదా కూలీలతో కలుపు తీయించాలి లేదా ఎకరాకు 500 గ్రా. 2,4-డి సోడియం సాల్ట్ 80% పొడి మందు మరియు 300 గ్రా. మెట్రిబుజిన్ 200 లీటర్లు నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. వెడల్పాటి కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కరాకు 1300 గ్రా. 2,4-డి సోడియం సాల్ట్ 80% పొడి మరియు ఒక లీటరు గ్రామోకోన్ 24% మందును 450 లీటర్లు నీటిలో కలిపి చెఱకు ఆకులపై పడకుండా వరుసల మధ్య మాత్రమే నాటిన 40 మరియు 60 రోజులకు పిచికారి చేయాలి. తుంగ జాతి కలుపు అధికంగా ఉన్న సందర్భాలలో ఎకరానికి 36 గ్రా. హేలోసల్ఫ్యూరాన్ మిధైల్ మందును 200 లీటర్లు నీటిలో కలిపి పిచికారి చేయాలి.
క్ర. సం | పురుగులు | లక్షణాలు | ఉధృతి పెరగడానికి అనుకూల పరిస్దితులు | నివారణ చర్యలు |
1. | పీక పురుగు, కాండం తొలుచు పురుగు | బాల్య దశలో పీక పురుగుగా, కాండం ఏర్పడిన తర్వాత కాండం తొలుచు పురుగుగా చెఱకును నష్టపరుస్తుంది. పీక పురుగు తాకిడి వర్షాధారపు చెఱకు పై ఎక్కువగా వస్తుంది. | వాతావరణంలో తేమ శాతం తక్కువగా ఉండి, ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు, పంట నీటి ఎద్దడికి గురి అయినపుడు ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. | పురుగు ఆశించి తోటలలో 1.6 మి. లీ. మోనొక్రోటోఫాస్ లేదా 2.5 మి. లీ. క్లోరోపైరిఫాస్ 20 ఇ.సి లేదా 0.75 మి. లీ. క్లోరాంట్రానిలిప్రోల్ లేదా ఫిప్రోనిల్ 2 మి. లీ. లేదా ధయోమిధాక్సామ్ 0.75 మి. లీ. 1 లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. క్లోరాంట్రానిలిప్రోల్ 0.4 గ్రా. గుళికలను ఎకరాకు 7.5కిలోల చొప్పున నేలలో వేసుకోవాలి. ట్రైకోగ్రామా ఖిలోనిస్ గ్రుడ్లు పరాన్న జీవిని ఎకరాకు 20,000 చొప్పున చెఱకు నాటిన 30 రోజుల వ్యవధిలో 4 సార్లు విడుదల చేయాలి. జివనియంత్రణ పద్ధతిలో గ్రాన్యులో వైరస్ మందును ఎకరానికి 100 లార్వాల్ ఈక్వలాంట్స్ లేదా 300 వైరస్ లార్వలను పంట నాటిన 30 రోజుల తర్వాత 2 సార్లు పిచికారి చేస్తే పీక పురుగును సమర్దవంతంగా నివారించుకోవచ్చు. |
2. | పొలుసు పురుగు | కణుపు ఏర్పడినప్పటి నుంచి చెఱకు నరికే వరకు పైరును ఆశిస్తుంది. నీటి ఎద్దడి పరిస్దితుల్లో ఎక్కువ నష్టం కలిగిస్తుంది. | అధిక ఉష్ణోగ్రత, గాలిలో అధిక తేమ కలిగి ఉన్న జూలై – సెప్టెంబరు నెలల మధ్య కాలం పోలును పురుగు అభివృద్ధికి అనుకూలం. | పోలును పురుగు వ్యాప్తిని అరికట్టడానికి ఆకులు రెలచి (మొవ్వులో కనీసం 8 ఆకులు ఉంచి) డైమిధోయేట్ 1.7 మి. లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. |
3. | తెల్ల దోమ | పురుగు ఆకుల అడుగు భాగాన అంటుకొని ఆకుల లోని రసాన్ని పిల్చి వేయటం వలన పైరు పెరుగుదల తగ్గి పోతుంది. ఆకులు నారింజ రంగుగా మారి మొక్కలు గిడసబారి పొతాయి. | నీటి ముంపునకు గురైన ఇవక తీతసౌకర్యం లేని, సిఫారసు చేసిన ఎరువులు వేయలేని పొలాల్లోనూ, మెడెం తోటల్లోనూ తెల్లదోమ ఎక్కువగా వస్తుంది. | పురుగు ఆశించినపుడు 1.6 మి. లీ. మోనొక్రోటోఫాస్ లేదా 1.7 మి. లీ. డైమిధోయేట్ ను లీటరు నీటికి కలిపి 10-12 రోజుల వ్యవధిలో అవసరాన్ని బట్టి ఆకుల క్రింది పైభాగాలు తడిచేలా పిచికారి చేయాలి. పురుగు ఆశించిన ఆకులను రెలచి నాశనం చేయాలి. |
4. | పిండినల్లి | పురుగులు ఆకు తోడిమలకు, చెఱకు గడలకు మధ్య గుంపులు గుంపులుగా చేరి గడల నుండి రసాన్ని పిల్చి వేస్తాయి,. ఉధృతంగా ఉన్నప్పుడు మొవ్వు ఎండి పోతుంది. | పంట పక్వానికి వచ్చినపుడు పిండి నల్లి తాకిడి ఎక్కువగా ఉంటుంది. వర్ష భావ పరిస్దితులు ప్రధానంగా పిండినల్లికి అనుకూలం. | ఎదిగిన తోటల్లో పురుగు నివారణకు ఆకులు రెలచి, బహిర్గతమైన కణుపుల మీద 1.7 మి. లీ. డైమిధోయేట్ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. ఇటివల కాలంలో పంటపై ఆశిస్తున్న పిండినల్లి (డిస్మికాకస్ కారెన్స్) నివారణకు కూడా పైన సూచించిన మందులతో ఆకులు తడిచేట్లుగా పిచికారి చేసి నివారించవచ్చు. |
5. | వేరు లేద్దె పురుగు | తేలిక నేలల్లో ఎక్కువగా కనిపించి మొక్కల వేర్లను తినివేయడం వలన మొక్కలు చనిపోతాయి. | తేలిక పాటి నేలల్లో తగినంత తేమ లేని భూముల్లో వేరు పురుగు అధికంగా కనిపిస్తుంది. | ఎదిగే తోటల్లో ఈ పురుగు నివారణకు ఫోరెట్ 10% గుళికలను ఎకరాకు 8 కిలోల చొప్పున మొక్కల మొదళ్ళ దగ్గర గుంత చేసి నాటే సమయంలో భూమిలో వేస్తె ఈ పురుగు వల్ల కలిగే నష్టాన్ని తగ్గించుకోవచ్చు. జీవ రసాయన మందులైనటువంటి మెటారైజం అనైసాప్లియే మరియు బవేరియ బసియానా లను 5 గ్రా. లీటరు నీటికి కలిపి మొక్క మొదళ్ళలో చల్లుకోవాలి లేదా పేని బాసిల్లస్ పాపిలియే అనే బాక్టీరియాను లీటరు నీటికి 2 గ్రా,. కలిపి కూడా పిచికారి చేయాలి లేదా ఫిప్రోనిల్ 40% మరియు ఇమిడాక్లోఫ్రిడ్ 40% మందును ఎకరాకు 150 గ్రా. చొప్పున 400 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. వేరుపురుగులు ఆశించే ప్రాంతాలలో ఆఖరి దుక్కిలో ఎకరాకు 200 కిలోల వేప పిండిని వేసి కలియ దున్నాలి. తొలకరి వర్షాలు పడినవెంటనే పొలంలో దీపపు ఎరలు అమర్చుకోవడం ద్వారా దాదాపు 50% ఫ్రౌడ పెంకు పురుగులను నిర్మూలించవచ్చు. |
6. | దూదేకుల పురుగు | పురుగులు ఆకుల అడుగు భాగాన గుంపులు గుంపులుగా చేరి ఆకుల నుండి రసాన్ని పిల్చి వేయడం వలన ఆకులు వడలి పోయి, ఎండిపోతాయి. | అధిక నత్రజని ఎరువుల వాడకం వల్ల ఉధృతి పెరగవచ్చు | మలాధియాన్ 2 మి. లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేసి పురుగును నివారించుకోవచ్చు. |
7. | చెదలు | విత్తనపు ముచ్చెలకు ఇరువైపుల నుండి ప్రవేశించి లోపలి పదార్దం తినిడం వలన మొలకశాతం తగ్గుతుంది. ఎదిగిన తోటల్లో కూడా మెత్తని లోపలీ పదార్దం తిని కేవలం దోల్లలు మిగిల్చి వేస్తాయి. | తేలిక పాటి నేలల్లో చెద పురుగుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. తక్కువ వర్షపాత ప్రాంతాల్లో నీటి వసతి తక్కువ గల ప్రాంతాల్లో సాగుచేసే చెఱకును చెదలు ఆశించే అవకాశ ముంది. | చెద పురుగులు నివారణకు పుట్టలను త్రవ్వి రాణి ఈగలను చంపాలి. క్లోరిపైరిఫాస్ 50 మందును లీటరు నీటికి 5 మి. లీ. చొప్పున కలిపి ఒక్కొక్క పుట్టలో 20 నుంచి 30 లీటర్లు మందు ద్రావణం వేయాలి మరియు ఎదిగిన తోటల్లో చెదలు ఆశించినప్పుడు పైన పేర్కొన్న ద్రావణాన్ని లీటరు నీటికి 5 మి. లీ. కలిపి బోదెల పై పోయాలి లేదా ఇమిడాక్లోఫ్రిడ్ 17.8 ఎస్.ఎల్ 0.25 మి. లీ. మందును ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. |
8. | ఎర్రనల్లి (లక్క తెగులు) | ఈ పురుగు ఏప్రిల్ – మే మాసాల్లో అధిక ఉష్ణోగ్రతలకు ఎక్కువగా ఉంటుంది. ఆకు అడుగుభాగాన అసంఖ్యాకంగా ఈ పురుగులు చేరి రసాన్ని పీల్చడం వలన ఆకు ఎర్రగా మారుతుంది. | వేసవి కాలంలో వానజల్లులు పడినప్పుడు, ఆ జల్లుల మధ్య బెట్ట సమయంలో లక్క తెగులు ఎక్కువగా కన్పిస్తుంది. | నివారణకు లీటరు నీటికి 3 గ్రా. నీటిలో కరిగే గంధకపు పొడి లేదా 1 మి. లీ. స్పైరోమెసిఫెన్ లేదా 5 మి. లీ. డైకోఫాల్ లేదా 1.5 మి. లీ. ప్రోపోర్గైట్ కలిపి ఆకుల అడుగు భాగం తడిచేటట్లు పిచికారి చేయాలి. |
9. | తెల్ల పేను (ఊలి ఎఫిడ్) | ఈ పురుగు యొక్క తల్లి మరియు పిల్ల పురుగులు ఆకుల అడుగు భాగంలో గుంపులుగా ఉండి రసాన్ని పీల్చడం వలన తెలుపు పసుపు వర్ణం మిళితమై మచ్చలు ఏర్పడతాయి. ఈ పురుగుల విసర్జన, తియ్యని జిగట పదార్దం లాగా ఉండి కిందున్న ఆకుల పై భాగాన పడి దాని మీద సుటీమోల్ద్ అనే నల్లని శీలీంధ్రం పెరిగి ఆకు మసి బారుతుంది. | వాతావరణం మబ్బుగా ఉండి 19-35o సేల్సియేస్ మరియు 80-90 % గాలిలో తేమ ఉన్నప్పుడు ఈ పురుగు బాగా అభివృద్ది చెందుతుంది. | పురుగు ఆశించిన ఆకులను తీసి తగల బెట్టాలి. పురుగు ఆశించిన తోటల నుండి చెఱకును ఇతర ప్రాంతాలకు రవాణా చేయకూడదు. లీటరు నీటికి 1.6 మి. లీ. మోనొక్రోటోఫాస్ లేదా 1.7 మి. లీ. డైమిధోయేట్ లేదా 1 గ్రా. ఎసిఫేట్ ను కలిపి పిచికారి చేయాలి. |
క్ర.సం | తెగుళ్ళు | లక్షణాలు | ఉధృతి పెరగడానికి అనుకూల పరిస్దితులు | నివారణ చర్యలు |
1. | కాటుక తెగులు | తెగులు సోకిన మొక్కల్లో మొవ్వు పొడవైన నల్లని కొరడాగా మారుతుంది. | నీటి ఎద్దడి గల పరిస్దితులు కాటుక తెగులు ఉధృతికి అనుకూలం. | మూడు కళ్ళ ముచ్చెలను వేడి నీటిలో (52 o సెల్సియస్ వద్ద 30 ని.) లేదా తేమతో మిళితమైన వేడి గాలిలో (54 o సెల్సియస్ వద్ద 2.5 గం.) విత్తనశుద్ది చేసి లేవడి తోటలను పెంచి వాటి నుండి వచ్చిన ముచ్చెలను నాటినట్లయితే తెగులును నివారించవచ్చు. విత్తనపు ముచ్చెలను ప్రోపికోనజోల్ (0.5 మి. లీ. / లీటరు)మందు ద్రావణంలో 5 ని. ముంచి నాటుకోవాలి. మోడెం తోటల్లో ప్రోపికోనజోల్ (1.0 మి. లీ. / లీ.) మందును కార్మి చేసిన వెంటనే మరియు 30-35 రోజులకొకసారి పిచికారి చేయాలి. |
2. | ఎర్రకుళ్ళు తెగులు | తెగులు ఆశించినపుడు తొలిదశలో పై నుండి 3, 4వ ఆకులు పసుపు పచ్చగా మారుతాయి. ఆ తర్వాత మొవ్వంతా వడలి పోతుంది. తెగులు సోకిన గడలను నిలువుగా చిల్చితే పులిసిన పిండి పదార్దపు వాసన వస్తుంది. చెఱకు లోపల ఎర్రకుళ్ళు తెగులు సోకిన భాగం ఎర్రగా మారి అక్కడక్కడ తెల్లని అడ్డు చారలు కనిపిస్తాయి. తెగులు సోకిన చెఱకు కొంత కాలానికి వడలి చనిపోతుంది. చెఱకు దిగుబడి, రసనాణ్యత తగ్గి పోతుంది. | నీటి ఎద్దడి మరియు నీటి ముంపుకు గురైన తోటలలో ఈ తెగులు ఉధృతి ఎక్కువగా కనబడుతుంది. | విత్తనపు ముచ్చెలను నాటే ముందు వేడి నీటిలో 52 o సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద కార్బండాజిమ్ 0.5 గ్రా. లీటరు నీటికి కలిపి 30 ని. శుద్ధి చేయాలి. ఎర్రకుళ్ళు తెగులు తట్టుకునే రకాలైన కో ఎ 7602, కో 7706, 83 ఆర్ 23, కో టి 8201, 87 ఎ 298 లను సాగు చేయాలి. |
3. | గడ్డి దుబ్బు తెగులు | తెగులు సోకిన మొక్కల ముడళ్ళ నుండి సన్నని కురచగా ఉన్న తెల్లని పిలకలు ఎక్కువగా వస్తాయి. ఆకులు పాలిపోయి చాలా చిన్నవిగా ఉండి మొక్కలు గడ్డి దుబ్బుల వలే ఉంటాయి. కార్మి తోటల్లో ఎక్కువగా కనబడతాయి. | అధిక నత్రజని ఎరువుల వాడకం బెట్ట పరిస్దితులు ఈ తెగులు ఉధృతికి అనుకూలం. | విత్తనపు ముచ్చెలను వేడి నీటిలో గాని, తేమతో మిళితమైన వేడి గాలిలో కాని శుద్ధి చేయాలి. తెగులును వ్యాప్తి చేసే కీటకాలను అరికట్టడానికి లీటరు నీటికి 1.7 మి. లీ. డైమిధోయేట్ ను కలిపి పిచికారి చేయాలి. పొలంలో కలుపు లేకుండా చూడాలి. తెగుళ్ళను తట్టుకునే రకాలను సాగు చేయాలి. |
4. | వడలు తెగులు | తెగులు సోకిన మొక్కల ఆకులు నీటి ఎద్దడికి గురైన మొక్కల ఆకుల వలే వడలి పోతాయి. చెఱకు గడలో గుల్ల ఏర్పడటం వలన బరువు తగ్గుతుంది. | నీటి ఎద్దడి నీటి ముంపుకు లోనైన తోటల్లో ఇది హెచ్చుగా వస్తుంది. | జూన్-జూలై నేలల్లో నాటిన తోటలు ఎక్కువగా లోంగిపోతాయి. వేసవిలో దగ్గర దగ్గరగా నీరు కట్టాలి. నాటుకొనే ముందు ట్రైకోడెర్మా విరిడితో శుద్ధి చేసుకొని నాటుకోవాలి |
5. | అనాసకుళ్ళు తెగులు | ముచ్చెలు నాటడం ఆలస్యం అయినపుడు విత్తనపు ముచ్చెలు మొలకెత్తక కుళ్ళి పోతాయి. ఈ ముచ్చెల నుండి పండిన అనాస పండు వాసన వస్తుంది. | నల్ల రేగడి నేలల్లో మురుగు సౌకార్యం లేనపుడు దీని ఉధృతి పెరుగుతుంది. | ముచ్చెలను 0.5% కార్బండాజిమ్(150 గ్రా. మందు 300 లీ. నీటిలో) మందు ద్రావణంలో నాటడానికి 15 ని. ముందు అరికట్టవచ్చును. |
6. | మొవ్వుకుళ్ళు తెగులు | తెగులు సోకిన మొక్కల్లో మొదలు భాగం పాక్షికంగా తెల్లగా అవుతుంది. మొవ్వు ఆకులు చిన్నగా ఉండి సరిగా విడివడవు. ఒక్కొక్కప్పుడు చుట్టుకొని పోతాయి. ఆకుల మొదళ్ళలో పాలిపోయిన భాగంలో ఎర్రటి చారలు ఏర్పడి చార వెంబడి ఆకు చిట్లి పోతుంది. మొవ్వు కుళ్ళి పొతే మొక్క ఎదుగుదల లేక చనిపోతుంది. | వర్షాలు తొందరగా మే-జూన్ నేలల్లో ప్రారంభమై జూలై నెలలో అధిక వర్షాలు పడినపుడు మువ్వు కుళ్ళు తెగులు ఉధృతంగా వస్తుంది. | మొవ్వు కుళ్ళు తెగులు గాలి, వర్షపు జల్లుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. కార్బండాజిమ్ ఒక గ్రా. లేదా మాంకోజేబ్ 3 గ్రా. లీటరు నీటికి కలిపి తెగులు ఉధృతిని బట్టి 10-15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేసి నివారించుకోవచ్చు. |
7. | ఆకు మాడు తెగులు | ఈ తెగులు ఒక రకమైన బాక్టీరియా వల్ల వస్తుంది. ఆకుల మీద సన్నటి, పొడగాటి తెల్లటి చారలు ఏర్పడి, ఆ చారల వెంబడి ఆకుల కోన నుండి క్రిందకు. వంగడం జరుగు తుంది. తెగులు సోకిన గడలలోని కళ్ళు కింద కానుపుల నుండి మొదలై క్రమేపి పై కానుపుల వైపుగా మొలకెత్తుతాయి. ఈ మొలకలు పాలిపోయి క్రమేపి ఎండిపోతాయి. | నీటి ఎద్దడి పరిస్దితులు దీని ఉధృతికి అనుకూలం. | చెఱకు నరికే కత్తులను అడపాదడపా 5 % ఫార్మలిడ్డహైడ్ ద్రావణంలో ముంచి శుద్ధి చేయడం, విత్తనపు ముచ్చెలను 52 o సెల్సియస్ వద్ద కార్బండాజిమ్ 0.5% మందు కలిపి 30 ని. శుద్ధి చేయడం ద్వారా తెగులును నివారించవచ్చు. |
8. | త్రుప్పు తెగులు | ఆకు అడుగు భాగంలో సన్నగా పసుపు లేదా నారింజ రంగులో ఉండే బొబ్బలు ఏర్పడుతాయి. దుబ్బులో ఉండే అన్ని మొక్కలకు తెగులు సోకి సుమారు 70% విస్తీర్ణానికి వ్యాప్తి చెందు తుంది. తెగులు ఉధృతమైనపుడు ఆకు తొడిమల మీద కూడా త్రుప్పు తెగులు బొబ్బలు ఏర్పడి తెగులు సోకిన మొక్కలు దూరం నుంచి చూస్తే ముదురు గోధుమ రంగులో కన్పిస్తాయి. | ఈ తెగులు పంట తొలిదశ నుండి తోట నరికే వరకు ఆశిస్తుంది. నత్రజని ఎరువు అధిక మోతాదులో వాడితే దీని ఉధృతి పెరుగుతుంది. అధిక గాలితో కూడిన చల్లటి వాతావరణం మరియు గాలిలో హెచ్చు తేమ త్రుప్పు తెగులు వృద్ది చెందడానికి వ్యాప్తికి బాగా దోహదపడుతుంది. | మాంకోజేబ్ 3 గ్రా. లేదా ట్రైడిమార్ఫ్ ఒక మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేసి నివారించుకోవచ్చు. |
9. | పసుపు ఆకు తెగులు | ఈ తెగులు వైరస్ వలన సోకుతుంది. తెగులు సోకిన మొక్కల్లో 4వ ఆకు నుండి క్రింది వైపుకు ఆకులు పసుపుపచ్చ రంగుకు మారుతాయి. చివరన ఉన్న విచ్చుకొని ఆకులు మాత్రం ఆకుపచ్చగా ఉంటాయి. తర్వాత క్రమేపి ఆకుల చివర నుండి క్రిందికి ఎండిపోయి చుట్టుకొని ఉంటాయి. ఆకులలోని మధ్య ఈనె మాత్రం పసుపు పచ్చగా మారి తర్వాత ఈనెకు రెండు వైపులా పసుపు రంగు విస్తరిస్తుంది. | వాతావరణం మబ్బుగా ఉండి, 22 o -29 o సెల్సియస్ మరియు 70-80% గాలిలో తేమ ఉన్నపుడు ఈ పురుగు బాగా అభివృద్ధి చెందుతుంది. పెనుబంక పురుగు ఈ తెగులు వ్యాప్తికి దోహదపడుతుంది. | దీని నివారణకు తెగులు లక్షణాలు కనిపించిన వెంటనే తెగులు సోకిన మొక్కలను పీకి కాల్చివేయాలి. తెగులు సోకిన మొక్క తోటల నుండి విత్తనాన్ని సేకరించరాదు. తెగులును వ్యాప్తి చేసే పెనుబంక నివారణకు డైమిధోయేట్ 1.7 మి. లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. |
మొక్క తోటలో చెఱకు నాటిన 3వ రోజున చెఱకు చెత్తను నేలపై పలుచగా (1.25 ట/ఎ) పరవాలి. నీటి ఎద్దడి పరిస్దితుల్లో చెఱకు నాటిన 3వ రోజున ఎకరాకు 1.25 టన్నుల చొప్పున చెఱకు చెత్త కప్పడం ద్వారా భూమిలోని తేమ త్వరగా కోలోకుండా నివారించడంతో పాటు కలుపు, పీక పురుగుల ఉధృతి తగ్గించవచ్చు. వర్షాకాలంలో కాలువలు ఎగద్రోసే సమయంలో 2 కిలోలు ఎకరానికి క్రుళ్ళబెట్టె శిలీంద్రం, 8 కిలోల యూరియా, 10 కిలోల సూపర్ ఫాస్ఫేట్ లను వేసి మట్టితో కప్పితే మంచి సేంద్రియం ఎరువుగా మారుతుంది.
తుఫాను గాలుల వలన తోటలు పడిపోయినపుడు చెఱకు దిగుబడి, రసనాణ్యత తగ్గుతుంది. తోట వయస్సు 4 నెలలు ఉన్నప్పుడు (జూన్ – జూలై మాసాల్లో) మొక్కల వరసల మొదళ్ళకు ఎత్తుగా మట్టిని ఎగద్రోయాలి. తోట 6 నెలలు వయసు ఉన్నపుడు గడల సంఖ్య స్దిరపడిన తర్వాత మొక్కల మొదళ్ళకు 2వ సారి మట్టిని ఎగద్రోయాలి.
పంట పెరుగుదలను బట్టి 2-3 సార్లు జడచుట్టే పధ్ధతి ద్వారా చెఱకును నిలగాట్టాలి.
చెఱకును దూరపు చాళ్ళలో సాగు చేసే సందర్బంలో అంతర పంటలుగా పప్పుధాన్యపు పంటలు, కూరగాయలు టమాట, ఉల్లి, బంగాళదుంప, తీగజాతి కూరగాయలు పుచ్చ, చిక్కుడు, తీగ కూరగాయలు వేసుకుంటే లాభదాయకంగా ఉంటుంది. చెఱకు నాటిన రోజునే బోదెలను చదును చేసి అంతర పంటను బోదెల మీద వరుసల్లో నాటుకోవాలి. పుచ్చ మరియు తీగ జాతి కూరగాయలను ఒక వరుసలో నాటుకోవాలి. జంట చాళ్ళ పద్ధతిలో చెఱకును నాటినపుడు అంతర పంటల సాగు మరింత అనుకూలంగా ఉంటుంది. అంతర పంటల సాగు వల్ల పరాన్నభుక్కల సంఖ్య పెరిగి పీక పురుగు ఉదృతి తగ్గుతుందని పరిశోధనల్లో తేలింది. పచ్చిరోట్టాను ఇచ్చే జీలుగ, జనుము విత్తనాలను పెడల మీద చల్లి మొగ్గ దశలో పీకి చాళ్ళలో చెఱకు మొక్కల మొదళ్ళలో వేసి మట్టి కప్పితే పంటకు సేంద్రియ ఎరువు రూపంలో అధిక పోషకాలు అందుతాయి.
గడలలో సుక్రోజ్ శాతాన్ని చేతి రిఫ్రాక్టోమీటర్ అనే పరికరం ద్వారా అంచనా వేయవచ్చు. గడలలో 85% రసశుద్దత, 18% సుక్రోజ్ ఉన్నపుడు పంట పక్వానికి వచ్చినట్లుగా నిర్ధారించి తోటలను భుమట్టానికి నరకాలి. పురుగులు, తెగుళ్ళు, నీటి ముంపు మరియు నీటి ఎద్దడికి గురైన తోటలను ముందుగ కొట్టాలి. చెఱకు తోటలు నరకడంలో మోడెం తోటలకు ప్రాధాన్యత ఇవ్వాలి. నరికిన చెఱకు నుండి ఎండు ఆకులు, ఆకు తొడిమలు తొలగించి శుభ్రమైన చెఱకునే గానుగాడుటకు సరఫరా చేయాలి. తోటలు నరికిన 24 గం. లోపు చెఱకు బెల్లం తయారీకి గాని, పంచదార కర్మాగారానికి గానీ పంపాలి. నరికిన 24 గంటలలో గానుగాడుకుంటే అధిక రసనాణ్యత కలిగి ఉండి పంచదార, బెల్లం రికవరీ అధికంగా ఉంటుంది.
మొక్క తోటల కన్నా మేడెం తోటలే త్వరగా పక్వానికి వస్తాయి. మోడెం సాగులో మొక్క తోటల కంటే తక్కువ ఖర్చు అవుతుంది. అంతేకాకుండా మెడెం తోటలు మొదటి రోజుల్లో నీటి ఎద్దడిని తట్టుకుంటాయి. పుతకు రాని, తెగుళ్ళను తట్టుకునే రకాల నుంచి మెడెం తోటలు సాగు చేయవచ్చు. కో 6907, కో 8014, 83 ఆర్ 23, కో 86032, 97 ఆర్ 129 రకాల నుంచి మెడెం తోటలను సాగు చేయుట లాభదయకము. లోతైన కాల్వలలో నాటిన మొక్క తోటల నుండి పెంచిన మెడెం తోటలు అధిక దిగుబడులు ఎస్తాయి. పొలంలో పదును తక్కువగా ఉన్నప్పుడు, దుబ్బులు కదలకుండా పదునైన పారలతో వరుసలలోని మోళ్లను చేక్కినప్పుడు భూమి లోపలి కణుపుల నుండి పిలకలు వస్తాయి. మెడెం చేసిన వెంటనే మెట్రిబుజిన్ పొడి మందును ఎకరాకు 600 గ్రా. 450 లీ. నీటిలో కలిపి పిచికారి చేసి కలుపును సమర్దవంతంగా నివారించవచ్చు. మెడం తోటల్లో ఖాళీలు ఉన్నపుడు 6 వారాల వయస్సు గల పాలిధీన్ సంచులలో పెంచిన అదే రకపు మొలకలతో ఖాళీలను నింపాలి.
మొక్క తోటకు ఎకరాకు సిఫారసు చేసిన నత్రజని కన్నా 45 కిలోల అందనంగా 2 దఫాలుగా మోళ్ళు చెక్కిన వెంటనే ఒకసారి మరియు 45 రోజులకు మరోసారి వేయాలి. ఇనుప ధాతు లోప నివారణకు లీటరు నీటికి 10 గ్రా. అన్నభేది మరియు 2 గ్రా. నిమ్మ ఉప్పు కలిపిన ద్రావణాన్ని ఎకరాకు 200 లీ. చొప్పున పైరు 45-60 రోజుల వయస్సులో వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేయాలి. మెడెం చేసిన వెంటనే వరుసల మధ్య ఎకరాకు 1.25 టన్నుల చెఱకు చెత్తను కప్పితే కలుపు మరియు పీక పురుగు వ్యాప్తిని తగ్గించవచ్చు. డెస్క్ ఆఫ్ బ్యారర్ అను పల్లెపు నాగలిని మెడెం వరుసల మధ్య నడిపించినపుడు, వరుసల్లోని మట్టి రెండు వైపులకు సమానంగా విసరడం వల్ల చెఱకు చెత్త సులువుగా కుళ్ళి సేంద్రీయ ఎరువుగా మారుతుంది. అంతే కాకుండా మొదళ్ళ వద్దనున్న పాత వేర్లు తెగి కొత్త వేర్లు వచ్చి నీటిని, పోషకాలను సమర్దవంతంగా గ్రహిస్తాయి. ఎక్కువ పంచదార లేదా బెల్లం పొందడానికి మోడెం తోటలను 9-10 నెలలు వయస్సు పైబదినపుడు మాత్రమే నరకాలి.
చౌడు భూములలో చెఱకు సాగు చేయడానికి కో 7219, కో టి 8201, 97 ఆర్ 129, 83 ఎ 30 రకాలను ఎంచుకోవాలి. ఎకరాకు 18,000 ముదురు మూడుకళ్ళ ముచ్చెలను పైపైన నాటాలి. పాల చౌడు తీసి వేయడానికి పొలాన్ని చిన్న చిన్న మడులుగా చేసి మంచి నీటితో నిలగట్టి, తర్వత నీటిని తీసి వేయాలి. పచ్చి రొట్ట ఎరువులు లేదా పచ్చి ఆకు ఎరువులను నేలకు అందివ్వడం ద్వారా నేలలో సేంద్రియ పదార్ధం పెరిగి లవణత తగ్గుతుంది.
బాగా పక్వానికి వచ్చిన చెఱకు బెల్లం తయారికి ఉపయోగించాలి. చెఱకును భుమట్టానికి నరికి, వెంటనే గానుగాడించి బెల్లం తయారు చేసుకోవాలి. చచ్చిన, ఎలుకలు కొట్టిన, గాలి పెడలతో వచ్చిన పిలకల వంటి చెఱకు గడలను ఏరివేసి మంచి చెఱకు ఉపయోగించి బెల్లం చేయాలి. అనివార్య పరిస్దితుల్లో వెంటనే బెల్లం చేయలేని పక్షంలో చెఱకు మోపులను నీడలో గుట్టలుగా పేర్చి చెఱకు చెత్త కప్పి పలుచగా నీరు చల్లితే చెఱకు తూకం, రాసనాణ్యత తరుగుదలకు తక్కువ అవకాశం ఉంటుంది. తక్కువ శక్తితో ఎక్కువ రసపు దిగుబడికి గానుగ సామర్ధ్యం పెంపొందించేందుకు నిలువు క్రష్ర్లు వాడి ఒక టన్ను చెఱకు నుండి 650 కిలోల రసం, 120 కిలోల బెల్లపు దిగుబడి పొందవచ్చు. ఫలితంగా ఒక టన్ను చెఱకు నుండి 10-20 కిలోల బెల్లం అదనంగా పొందవచ్చు. రోలర్లపై ఉండే నొక్కులు పిప్పితో నిండి ఉండకుండా శుభ్రపరచాలి. ఒకే సమయంలో 2-3 చెఱకు గడలు మాత్రమే గానుగాడుకోవాలి. గోనుగాడిన రసాన్ని పులిసిపోకుండా, త్వరగా పెనములో పోసి మరగబెట్టాలి. బెల్లం తయారీలో ఉపయోగించు పరికరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. చెఱకును గానుగాడే సమయంలో విద్యుత్ అంతరాయం వలన రసం పులియకుండా ఉండటానికి 107 o సెల్సియస్ వరకు రసాన్ని మరిగించి తర్వాత నిల్వ ఉంచి, బెల్లం చేస్తే నాణ్యత తరుగుదల తక్కువగా ఉంటుంది.
బెల్లం తయారీకి ఉపయోగించు పెనాలు వెడల్పుగా ఉండి (240-270 సెం.మీ.) లోతు తక్కువగా (45 సెం.మీ.) ఉండాలి. పెనం గోడలు 16 గేజి ఇనుప రేకులతోనూ, అడుగున 18 గేజి కళాయి రేకుతోను చేయడం మంచిది.
రసాన్ని శుభ్రపరచడానికి ఆమ్ల స్దితిలో ఉదజని సూచిక 5.2 ఉన్న రసానికి సున్నం కలిపి, 5.8 వరకు తీసుకోని రావాలి. ఈ విధంగా చేయడానికి ప్రత్యేక ఉదజని సూచిక కాగితాలు ఉపయోగించాలి. సోడా కలిపితే బెల్లం మొత్తబడి నాణ్యత దెబ్బతింటుంది. పక్వానికి వచ్చిన చెఱకు రసానికి ఉదజని సూచిక 5.8 వచ్చే వరకు, పక్వానికి రాని చెఱకు అయితే 6.4 వచ్చే వరకు, రసం విరిగిన చెఱకుకు అయితే 6.6 వచ్చే వరకు సున్నం కలిపి మంచి బెల్లం తయారు చేయవచ్చు. బెండ మొక్కల గుజ్జు వంటి వృక్ష సంబంధమైన పదార్దాలను సున్నంతో కలిపి నాణ్యమైన బెల్లం తయారు చేయవచ్చు.
హైడ్రోసులో గంధకం ఉంటుంది. ఒక క్వింటా బెల్లంలో 7 గ్రా.ల కంటే ఎక్కువ సల్ఫర్ డై ఆక్సైడ్ ఉంటె ఆరోగ్యానికి హాని కలుగుతుంది. 400 లీ. రసానికి 100 గ్రా. హైడ్రోసు వేసి తయారు చేసిన బెల్లంలో ఒక క్వింటాలుకు 7-12 గ్రా. సల్ఫర్ డై ఆక్సైడ్ ఉంటుంది. రైతులు ఎక్కువ పరిమాణంలో (1-2 కిలోలు) హైడ్రోసు వేసి తెల్లని బెల్లం చేస్తే సల్ఫర్ డై ఆక్సైడ్ పరిమాణం ఉండవలసిన దాని కన్నా 2-3 రెట్లు ఎక్కువగా ఉంటుంది. హైడ్రోసు వేసిన బెల్లం రుచికి వెగటుగా ఉండి రంగు 2-3 వారాలకు మించి ఉండక, త్వరగా మెత్తబడి, ఎక్కువ కాలం నిల్వ ఉండదు. వినియోగదారులు బెల్లం రంగుకు ప్రాధాన్యం ఇవ్వకుండా నాణ్యతను గమనించాలి. హైడ్రోసు వాడిన బెల్లాన్ని ప్రోత్సహించాకూడదు.
పక్వతకు రాని చెఱకు లేదా ఆలస్యంగా నరికిన చెఱకు లేదా నీటి ఎద్దడికి లోనైనా చెఱకు లేదా పొలుసు పురుగు సోకిన చెఱకు గడల నుండి చేసిన బెల్లం తోడుకునట్లైతే పాకాన్ని దించి, చిక్కబడిన తర్వాత 5-10 కోలోల బెల్లపు పొడి లేదా పంచదార కలిపితే తోడుకొని అచ్చులు పోసుకోవడానికి వీలుగా ఉండి, బెల్లం నాణ్యత పెరుగుతుంది.
రసం మరిగేటపుడు ఎప్పటికప్పుడు తెట్టును పూర్తిగా తీసివేయాలి. తెట్టును తీసివేసిన తర్వాత రసాన్ని మరిగించాలి. బురద పొంగు సమయంలో రసం పొంగుతుందనుకుంటే నువ్వుల నునెను చిలకరించాలి. పాకం ఉష్ణోగ్రత 118 o సెల్సియస్ వచ్చినపుడు పెనం దించాలి. పెనం దించిన తరువాత చంద్ర వంక బల్లతో బాగా కలిపి కొంత చల్లారిన తర్వాత 5 ని. కలుపకుండా ఉంచితే బెల్లం మంచి రావ్వకట్టు కలిగి ఉంటుంది. బెల్లం చల్లబడి గట్టిబడటం ప్రారంభం కాగనే వివిధ రకాల అచ్చులలో వేసుకోవచ్చు.
వాతావరణం మబ్బుగా ఉండి 19-85 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత మరియు 80-90 శాతం గాలిలో తేమ ఉన్నప్పడు తెల్ల పేను (ఊలి ఎఫిడ్) అభివృద్ధి చెందుతుంది. వీటి నివారణకు పంటకు సిఫార్పు చేసిన మోతాదులో నత్రజని ఎరువులు వాడాలి. పురుగు ఆశించిన ఆకులను తీసి తగులబెట్టాలి. లీటరు నీటికి మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. లేదా డైమిధోయేట్ 1.7 మి.లీ. లీటరు లేదా ఎసిఫేట్ 1 గ్రా.ల మోతాదులో నీటికి కలిపి పిచికారి చేయాలి. పురుగు ఆశించిన తోటల నుండి చెరకును ఇతర ప్రాంతాలకు రవాణా చేయకూడదు.
పంట పెరుగుదలను బట్టి మొక్కల మొదళ్ళకు మట్టిని ఎగదోయాలి. జడచుట్టే పద్ధతి ద్వారా చెఱకును నిలపెట్టాలి.
నవంబర్–డిసెంబర్ మాసాల్లో చెరకును నాటుటకు అక్టోబరు నుంచే నేలను తయారు చేసుకోవాలి. ఇందుకు గాను ముందుగా నేలను లోతు దుక్కి చేసుకోవాలి. ఆ తర్వాత పశువుల లేదా కంపోస్టు ఎరువులను ఎకరానికి 10 టన్నుల చొప్పన వేసి చెరకును నాటుటకు 4 నుంచి 6 వారాల ముందు పళ్ళెపు దంతితో భూమిలో కలియదున్నాలి. బరువు నేలల్లో 5-6 టన్నులు వేసుకోవాలి. ఫిల్టరు మడ్డి దొరుకు ప్రాంతాల్లో ఎకరానికి 5-6 టన్నులు బాగా ఎండిన ఫిల్టర్ మడ్డిని భూమిలో వేసి కలియదున్నాలి. ఒక టన్ను ఫిల్టరు మడ్డి వాడడం వల్ల 17 కిలోల నత్రజని, 7 కిలోల భాస్వరం మరియు 2 కిలోల పొటాష్ను పంటకు అందించవచ్చు. ఈ ఎరువులు లభ్యం కాని ప్రాంతాల్లో పచ్చి రొట్ట ఎరువులైన జనుము, జీలుగ, పిల్లి పెసర, అలసంద వంటి వాటిని దంతితో కలియదున్నితే పంట ఎరువు త్వరగా చివికి సారవంతమైన సేంద్రియ ఎరువుగా మారుతుంది.
ఈ సమయంలో నాటుకునే రైతులు నీటి ఎద్దడిని తట్టుకునే రకాలైన 83 ఆర్ 23, 85 ఆర్ 186, కో 86032, కో 99004 వంటి రకాలను ఎంపిక చేసుకోవాలి. వనరులు తక్కువగా ఉండే తేలిక నేలల్లో స్వల్పకాలిక రకాలైనటువంటి కో ”8014, 83 ఎ 30, 87 ఎ 298, 83 ఆర్ 23, 2003 వి 46 వంటి రకాలను ఎంపిక చేసుకోవాలి. నీటి వసతి ఉన్న ప్రాంతాలలో మధ్య కాలిక రకాలైనటువంటి కో 86032, 85 ఆర్ 186, 97 ఆర్ 129, కో 7219, 97.
ఆర్ 401 వంటి రకాలను ఎంపిక చేసుకోవాలి. ఎటువంటి చీడపీడలు, తెగుళ్ళు ఆశించనటువంటి ఆరోగ్యకరమైన, నాణ్యమైన విత్తనాన్ని ఎంపిక చేసుకోవాలి.
చెరకు తోటల కోత కూడా ఈ మాసం నుండి మొదలవుతుంది. పక్వానికి వచ్చిన చెరకును గుర్తించడానికి కొన్ని మెలకువలు పాటించాలి.
మన రాష్ట్రంలో సాగు చేసే స్వల్పకాలిక చెరుకు రకాలు నాటిన ఎనిమిది నెలలలో పక్వానికి వస్తాయి. ఇతర ప్రాంతాల కంటే శీతాకాలంలో రాత్రి పూట చలి ఎక్కువగా ఉండటం వలన గడలలో చక్కెర కూడికకు ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. కొన్ని సందర్భంలో చెరకు పక్వత వాతావరణ పరిస్థితులపై కూడా ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా కనిష్ణ, గరిష్ట ఉష్ణోగ్రతలలో వ్యత్యాసము ఎక్కువగా ఉండాలి. గాలిలో తేమ తక్కువగా ఉండాలి. చెరకు నరకడానికి ముందు వరాలు లేకుండా ఉండాలి.
చీడపీడలు ఆశించిన తోటలను వీలైనంత త్వరగా ఫ్యాక్టరీకి తోలాలి లేదా బెల్లం తయారీకి వాడాలి. చెరుకును నరికేటప్పడు భూమట్టానికి కొంచెం క్రిందగానే నరకాలి. మొదలు కణుపులలో పంచదార పాలు ఎక్కువగా వుండటం వలన పంచదార, బెల్లం దిగుబడులు కూడా తగ్గుతాయి. చెరకును భూమట్టానికి నరికినప్పడు కారి చేసిన తోటలోని వేళ్ళ లోతుగా చొచ్చుకొని పోయి, తోట బలంగా పెరిగి వరా కాలంలో వచ్చే ఈదురుగాలులు మరియు వరాలకు తట్టుకుని తోట నిలకడగా ఉండి, గడలు బాగా ఎదిగి మంచి దిగుబడినిస్తాయి.
తెలంగాణ ప్రాంతంలోని చెఱకు మిల్లులు అన్ని కూడా నవంబరు మాసంలో ప్రారంభిస్తారు. సాధారణంగా ఆత్యధిక చెక్కర కుడిక గల చెఱకు రకాలను మాత్రమే ప్రారంభపు చెఱకుగా గానుగాడుటకు అనుమతిస్తారు. ఈ పక్వదశలో చెఱకు పంటకు చిడపిడలు ఆశించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
ముఖ్యంగా రసం పిల్చు పురుగులు తెల్ల పేను (ఊలీ ఎఫేడ్), దూదేకుల పురుగు (పైరిల్లా), పిండి నల్లి, పోలును పురుగు మరియు పసుపు నల్లి ఉధృతి తగ్గాలంటే తప్పనిసరిగా పై 8 ఆకులు వదిలి, పురుగులు ఆశించిన ఆకులను రెలచి వేయడం లేక జడ చుట్టూకోవడం చేయుట వలన ఈ పురుగు ఉధృతి తగ్గుతుంది. అంతేకాకుండా పిండినల్లి, పొలుసు పురుగులు ఎండకు, గాలికి బహిర్గతం కావడం వల్ల వాటి ఉధృతి కొంత వరకు తగ్గుతుంది. తోటకు జడ చుట్టు వేయడం వలన గాలి, వెలుతురూ తగిలి రసం పిల్చు పురుగులు ఆశించే స్ధాయి తగ్గడమే కాకుండా, పురుగు మందుల పిచికారి చేపట్టడం సులభతరం అవుతుంది. పంట ఎదుగుదలను బట్టి చెఱకు తోటలు పడిపోకుండా అవసరం మేరకు రెండవసారి జడచుట్లు వేసుకోవాలి.
పొలుసు పురుగు కణుపు ఏర్పడినప్పది నుంచి చెఱకు నరికే వరకు పైరుసు ఆశిస్తుంది. నీటి ఎద్దడి పరిస్ధితుల్లో ఎక్కువ నష్టం కలిగిస్తుంది. పొలుసు పురుగు ఆశించని తోటల నుంచి విత్తనపు చెఱకును సేకరించాలి. పొలుసు పురుగు వ్యాప్తి అరికట్టడానికి ఆకులు రెలచి (మొవ్వులో కనీసం 8 ఆకులు ఉంచి) డైమిధోయేట్ 1.7 మి.లీ లేక మలధియాన్ 2 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
తెల్లపేను (ఊలి ఎఫిడ్) ఈ పురుగు పిలక దశ నుండి చెఱకు నరికే వరకు పైరును ఆశించి నష్టపరుస్తుంది. ఈ పురుగు యొక్క తల్లి మరియు పిల్ల పురుగులు ఆకుల అడుగుభాగంలో గుంపులుగా ఉండి రసాన్ని పీల్చడం వలన తెలుపు, పసుపు వర్ణం మిళితమైన మచ్చలు ఏర్పడాతాయి. మొదటి అంచులు, తర్వత మొత్తం ఆకులు క్రమేపి ఎండిపోతాయి. ఈ పురుగులు విసర్జన ఆకులు క్రమేపి ఎండిపోతాయి. ఈ పురుగులు విసర్జన తియ్యని జిగట పదార్ధం లాగా ఉండి కిందున్న ఆకుల పైభాగాన పడి, దాని మీద సుటిమోల్ట్ అనే నల్లని శిలింధ్రం పెరిగి ఆకు మసిబారుతుంది. పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు చెఱకు దిగుబడి 26శాతం పంచదార దిగుబడులు 24 శాతం తగ్గిపోతాయి. వాతావరణం ముబ్బుగా ఉండి 19-35 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత మరియు 80-90 శాతం గాలిలో తేమ ఉన్నప్పుడు పురుగు బాగా అభివృద్ధి చెందుతుంది. గాలి ద్వారా 1.5-2.0 కిలో మీటర్ల దూరం వరకు ఈ పరుగులు వ్యాప్తి చెందగలవు. విత్తనాన్ని ఆరోగ్యవంతమైన తోటల నుండి సేకరించాలి. సిఫార్సు చేసిన మోతాదులో నత్రజని ఎరువులు వాడాలి. పురుగు ఆశించిన ఆకులను తీసి తగులబెట్టాలి. పురుగు ఆశించిన తోటల నుండి చెఱకు ఇతర ప్రాంతాలకు రవాణా చేయకూడదు. లీటరు నీటికి మలాధియాన్ 1.7 మి.లీ లేదా ఎసిఫేట్ 1 గ్రా. మోతాదులో కలిపి పిచికారి చేయాలి.
చెఱకు సాగుపై మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన చిరునామా: ప్రధాన శాస్త్రవేత వ్యవసాయ పరిశోధన స్థానం-బసంతపూర్, ఫోన్ నెం. 9849535756
ఆధారం: వ్యవసాయ పంచాంగం
చివరిసారిగా మార్పు చేయబడిన : 1/10/2023