పచ్చి గడ్డి, ఎండు గడ్డి ఉపయోగించి బయో డైనమిక్ కంపోస్టును తయారు చేయవచ్చును.
కుప్ప తయారు చేయుపద్దతి
- ముందుగా 5x2.5 మీ. వైశాల్యముగల మెరక ప్రదేశమును ఎంచుకోవాలి.
- మొదటి వరుసలో 20 సెం.మీ. ఎత్తులో ఎండు గడ్డిని, రెండవ వరుసలో 20సెం.మీ ఎత్తులో పచ్చి గడ్డిని పరవాలి.
- తరువాత 100 – 150 లీటర్ల పేడనీటిని చల్లాలి.
- ఇదే పద్ధతిలో ఎండుగడ్డి, పచ్చి గడ్డిని, పేడనీటిని 1.5 మీ ఎత్తు వచ్చువరకు పేర్చుకుంటూ పోవాలి.
- బాగుగా కుళ్ళుటకు రాక్ ఫాస్పేటు (భాస్వరం), సున్నము(కాల్షియం), బూడిద (పొటాషియం)ను పొరల మధ్యలో చల్లాలి.
- ఒక బి.డి. సెట్ 502 నుండి 507 వరకు పొరల మధ్యలో 5 – 7 అడుగుల దూరంలో పెట్టాలి.
- ఈ కుప్పను మట్టి, పేడ కలిపిన మిశ్రమముతో మెత్తాలి.
కాల వ్యవది : 8 నుండి 12 వారముల వ్యవధిలో తయారగును.
ఆధారము:కృషి విజ్ఞాన కేంద్రము కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థసంతోష్ నగర్ సైదాబాద్ హైద్రాబాద్.
చివరిసారిగా మార్పు చేయబడిన : 2/19/2021
0 రేటింగ్స్ మరియు 0 వ్యాఖ్యలు
నక్షత్రాలపై రోల్ చేసి, ఆపై రేట్ చేయడానికి క్లిక్ చేయండి
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.