పర్యావరణ పరిరక్షణ, సుస్థిర ఉత్పాదకత, రైతులను, శాస్త్రవేత్తలను, పర్యావరణ వేత్తలను నేడు తీవ్రమైన ఆందోళనకు గురిచేస్తున్న అంశం. ఆహార అవసరాలను తీర్చటానికి అభ్యమయ్యే వనరులు పరిమితంగా ఉంటాయి. కాబట్టి పరిమిత వనరులతో అధిక ఉత్పాదకత సాధించ గలగాలి. ఈ కోణంలో చూస్తే వ్యవసాయ భూముల యాజమాన్యంలో సేంద్రీయ ఎరువులు ముఖ్య పాత్ర వహిస్తాయి. ఆధునిక వ్యవసాయంలో రసాయన ఎరువుల వాడకం అధికమైన దరిమిలా రైతులు సాంప్రదాయకంగా వాడిన సేంద్రీయ ఎరువులను విస్మరిస్తున్నారు. రసాయనిక ఎరువుల వాడకం పూర్తిగా నిరోధించలేక పోయినా తగ్గించటానికి ప్రయత్నం చేయాలి. సేంద్రీయ ఎరువుల వాడకం వల్ల రసాయనిక ఎరువులకయ్యే ఖర్చు తగ్గటమే కాకుండా భూసారం పెరిగి, భూ భౌతిక స్థితిగతులు మెరుగుపడి మొక్కలు ఏపుగా పెరిగి, పంటల దిగుబడులు పెరుగుటతో పాటు పరిసరాలు శుభ్రంగా ఉంచుటకు, వాతావరణ కాలుష్య నివారణకు కూడా తోడ్పడుతుంది.
వ్యవసాయ వ్యర్థపదార్థములైన మొక్కల అవశేషాలు, రాలిన ఆకులు, పచ్చి ఆకులు, ఎండు గడ్డి, పనికి రాని పార వరి గడ్డి, పంట మొదళ్ళు, వేర్లు, పొట్టు, పశువులు తొక్కిన చొప్ప, పనికిరాని, కుళ్ళిన కాయగూరలు, పండ్లు మొదలగునవి.
ప్రతి టన్ను వ్యర్థ పదార్థములకు 100 కిలోల అవసరము
మక్కిన పశువుల ఎరువు :
అవసరానిని, వీలును బట్టి రెండు, మూడు తట్టల ఎరువును వేసిబాగా కలియబెట్టడం వలన నాణ్యమైన ఎరువు త్వరగా తయారయ్యే అవకాశము ఉంటుంది.
కంపోస్టు త్వరగా కుళ్ళడానికి దోహద పడుతుంది. ప్రతి టన్ను చెత్తకు 40 – 50 కిలోల వరకు వాడాలి.
ఆధారము:కృషి విజ్ఞాన కేంద్రము కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థసంతోష్ నగర్ సైదాబాద్ హైద్రాబాద్.
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/27/2020
సేంద్రీయ ఎరువుల తయారీ