অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

పండ్ల తోటలతో వర్షం లోటు మరియు తేమ ఒత్తిడి నిర్వహణ

పండ్ల తోటలతో వర్షం లోటు మరియు తేమ ఒత్తిడి నిర్వహణ

మామిడి

  • మామిడి తోట వేసే దశలో, మొక్క నుండి 10 సెం.మీ. దూరంలో నేలకు 1 అడుగు కింద, ప్లాస్టిక్ ప్లేట్ తో 3cm పరిధి పైపుతో 1.25 లీటరు నీరు ప్రతిరోజు పడేలా పిష్చరును ఏర్పాటు చేయాలి. మంచి ఫలితాల కోసం చెరుకు ఎరువును (1.0.kg/బేసిన్) ఏర్పాటు చేయాలి.
  • బ్లాక్ పాలిథిన్ ఫిల్మ్ (100 మైక్రో మందం) వేరు పెరుగుదల, పుష్పించటం, ఫలాల పెరుగుదల మరియు తేమ పరిరక్షణకు సహాయపడుతుంది మరియు పండ్లు రాలటం తగ్గుతుంది దీనితోపాటు దిగుబడి పెరుగుతుంతి.
  • చెట్ల చుట్టూ 6 అడుగుల దూరంలో 9 అంగుళాలు వెడల్పుతో వృత్తాకార కందకాలుతవ్వి వాన నీటి వినియోగం చేయవచ్చు. అలాగే పొడి మామిడి ఆకులను కందకాలపై కప్పడం ద్వారా, పుష్పించే మరియు ఫలాలు కాసే సమయంలో మట్టి లో తగినంత తేమను నిలబెట్టవచ్చు.
  • పంట అవశేషాల గడ్డి తో పాటు బిందు సేద్యం నీటి ఆదాకు సహాయపడుతుంది. 0.6 కొలత నీరుతో బిందు సేద్యం మరియు ప్లాస్టిక్ మల్చింగ్ ద్వారా గణనీయంగా దిగుబడి పెరుగుతుంది. పండ్లు కాయగానే నీటి ఎద్దడి పండ్లు రాలటాన్ని పెంచుతుంది. అందుకే, పండ్లు పెరిగే కాలంలో రక్షిత నీటి పారుదల అత్యవసరం.
  • అనేక ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రత కారణంగా ఆకు రాలటం గమనించవచ్చు. ఆకు రాలటం అధిగమించడానికి ట్రూగిటి 0.2% శాతం పొటాషియం సల్ఫేటును పిచికారీ చేయండి.

వర్షకాలం 15 రోజులపాటు ఆలస్యమైంది:- ప్రారంభ మరియు మధ్య కాలంలో పండిన పండ్లకు ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదు; ఆలస్యంగా పరిపక్వం అయిన పండ్లలో పరిమాణం మరియు నాణ్యతలో ప్రభావం ఉంటుంది. చసువా, మల్లికా మరియు ఆమ్రపాలివంటి పండ్లలో ప్రభావితం ఉంటుంది. కానీ నీటిపారుదల మరియు మల్చింగ్ అనుసరించాల్సిన అవసరం ఉంటుంది.

వర్షాకాల 30 రోజుల పాటు ఆలస్యమైంది: ప్రారంభ మరియు మధ్య కాలంలో పండిన పండ్లకు ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదు; శౌల్డర్ బ్రౌనింగ్ (పండు దోషాలు, టియర్ స్టేయిన్ ) మరియు కోత తరువాతి వ్యాధులు తక్కువ; పండు నాణ్యత బాగా ఉంటుంది; పండు పరిమాణం మరియు నాణ్యత వంటివి చెసువా, మల్లికా మరియు ఆమ్రపాలి మొదలైన చివరి పరిపక్వ రకాలు ప్రభావితం అవుతాయి; ప్రభావం తీవ్రత పెరుగుతుంది. జులై-సెప్టెంబరు సమయంలో పెరిగిన ఉష్ణోగ్రత టెలిస్కోపుడ్ సాగుకు దారి తీస్తాయి.

ఏపు దశలో వర్షపాతం లోటు: ఏపు రెమ్మల పెరుగుదల పై (సీజన్ యొక్క సంభావ్య ఫలాలు రెమ్మలు) ప్రతికూల ప్రభావం ఉంటుంది. నీటిపారుదల మరియు మల్చింగు అనుసరించాల్సిన అవసరం ఉంటుంది.

పునరుత్పత్తి దశలో వర్షపాతం లోటు: పండు మొగ్గ భేదం (FBD) దశలో అనుకూలం. కానీ నీటిపారుదల మరియు మల్చింగు అనుసరించాల్సిన అవసరం ఉంటుంది.

టెర్మినల్ కరువు: వచ్చే ఋతువులో పంట అవకాశాలు, ముఖ్యంగా తేలిక నేలలో, ప్రభావిత అవుతాయి; పునరావృత కరువులు పంట నష్టానికి దారితీస్తాయి. నీటిపారుదల మరియు మల్చింగును అనుసరించాల్సిన అవసరం ఉంటుంది.

అరటి

  • నేలలో తేమ లోటు ఒత్తిడి అరటి పండులో ఏపు దశలో చిన్న గుత్తి ఏర్పడటానికి, తక్కువ మరియు చిన్న తరహా వేళ్లు పెరగడానికి కారణమవుతుంది. పుష్పించే సమయంలో నీటి ఎద్దడి వేళ్లు మరియు అన్ మార్కడబల్ పుష్పగుచ్ఛాలు తక్కువగా వస్తాయి. ఇది తక్కువ బరువు మరియు ఇతర అభివృద్ధి పరిమితులకు కారణమవుతుంది.
  • బిందు నీటిపారుదల నీటి ఎద్దడి దుష్ప్రభావాలను తగ్గించడంలో సహాయపడుతుంది.
  • సస్య రక్షణ చర్యలు - అధిక ఉష్ణోగ్రతలతో పాటు తక్కువ తేమ మామిడి, ద్రాక్ష, దానిమ్మ వంటి పండ్ల పంటలపై త్రిప్స్ మరియు మిట్స్ వంటి పీల్చె పురుగులు మరియు తెగుళ్లకు అనుకూలంగా ఉంటుంది. సరైన పర్యవేక్షణ మరియు సకాలంలో పురుగు మందులు చల్లడం వలన దీని తీవ్రతను తగ్గించవచ్చు. త్రిప్స్ కు , తియమొతోజామ్ వంటి పురుగులకు 25 WG @ 0.25 గ్రా / లీ లేదా అషేఫైట్ 75 ఎస్పి @ 1.5 గ్రా /లీ లేదా స్పినోసాడ్ 45% ఎస్సీ@ 0.5 మి.లీ. / ఎల్ దీని ప్రభావాన్ని తగ్గిస్తుంది. పురుగు నిర్వహణకు, డికోఫాల్ 18.5 ఇసి @ 2.5 మి.లీ / లీ లేదా @ 0.5 ml / లీ ఫిన్ ఫోరాక్సిమేటు 5SC వాడాలి.

రుతుపవనాలు 15 రోజుల / 30 రోజుల ఆలస్యం అయితే:

  • ఎక్కువగా అరటి పెరిగే ప్రాంతాలలో సాధారణంగా సక్కర్/ కణజాల మొక్కలను రుతుపవనాల ఆన్ సెట్ తర్వాత నాటాలి.
  • అరటి పంట రుతుపవనంపై ఆధారపడి లేదు కాబట్టి, రుతుపవనాల ఆన్ సెట్ల్ ప్రకారం నాటవచ్చు.

ఏపు మరియు పునరుత్పత్తి దశలో వర్షం లోటు:

  • ఏపు దశలో వర్షపాతం లోటు నేపథ్యంలో రైతులు బిందు సేద్యాన్ని వేరుకు అవసరమైన నీటిని అందించడానికి ఉపయోగించాలి. దీనివలన నీటి వాడక సామర్థ్యం పెరుగుతుంది మరియు నీటిని ఆదా చేయడానికి వీలవుతుంది.
  • ఒక ఉపశమన చర్యగా, 0.1mm సాల్సిక్ లవణాలు గల ఆమ్లం (140 mg /లీ నీరు సర్పాకంట్) ఆకుల స్ప్రే ను @ 250 ml / మొక్క ఇవ్వవచ్చు.
  • ఏపు సమయంలో కయోలినైట్ (5%) ఆకుల అప్లికేషన్ ట్రాన్స్పిరేషన్ నీటి నష్టాన్ని తగ్గిస్తుంది.
  • ఆకుల ఎరువును ఐదు స్ప్రేలతో అనగా, 3% పాలీఫీడ్(19:19:19), అంటే 30g లీటరు నీటిలో సఫకంట్ తోకలిపి 15 రోజుల విరామం తరవాత ఏపు దశలో ఉపయోగించాలి.
  • బ్లాక్ పాలిథిన్ లేదా మొక్క పదార్థం/అరటి ఆకులతో మల్చింగును మట్టి ఉపరితలంపైన పరవవచ్చు. దీనివల్ల నీటి నష్టాన్ని తగ్గించవచ్చు.
  • పెరుగుతున్న మొక్క మరియు మల్చింగు చుట్టూ పచ్చ ఎరువులు వేయాలి.
  • రిజోస్పీయర్ లో నీటి నిలువ సామర్థ్యం పెంచడానికి మొక్కను నాటే సమయంలో గుంతలో 5kg బియ్యం ఊక మరియు బూడిద లేదా పీచు మెత్తని భాగం మిశ్రమాన్ని ఉంచాలి.
  • ఓపెన్ నీటిపారుదల బదులుగా, ఉప-ఉపరితల నీటిపారుదల మంచిది.

టెర్మినల్ కరువు: టెర్మినల్ కరువు సందర్భంలో, ఉప-ఉపరితల నీటిపారుదల, ప్లాస్టిక్ మల్చింగు, లవణాలు గల యాసిడ్, నీటిలో కరిగే ఎరువులు, ఫాయిల్ స్ప్రే ఉపయోగించాలి. మొక్కకు 5-6 ఆకులు మాత్రమే ఉంచటం కరువు పరిస్థితిని అధిగమించడానికి ఉపయోగపడుతుంది.

దానిమ్మ

15 లేదా 30 రోజులు రుతుపవనాలు ఆలస్యం అవటం మరియు ఏపు దశలో వర్షం లోటు :

  • పొడి సమయాలలో నీటిని పట్టి ఉంచే శక్తిని మెరుగుగా ఉంచటానికి మట్టి ఆరోగ్య మరియు సేంద్రియ కర్బన నిల్వలను పెరగాలి అందుకు పంట అవశేషాల రీసైక్లింగ్ పద్ధతిని వాడాలి.
  • ఇన్-సిటు సేంద్రీయ లేదా అకర్బన రక్షణ మల్చులను తేమ పరిరక్షణకు తక్షణమే ఉపయోగించాలి. స్థానికంగా అందుబాటులో దొరికే సేంద్రీయ ప్లాంట్ వ్యర్ధాలు లేదా ప్లాస్టిక్ రక్షణ మల్చులను (నలుపు / తెలుపు/సులభ ప్రవేశ రక్షణ పూతలు) ఉపయోగించాలి.
  • తగిన మట్టి తేమ వచ్చె వరకు ఫెర్టిగేషన్ ఉపయోగం చేయకూడదు. లేదా పరిమితంగా ఉన్న వాన వీటిని సమర్థవంతంగా ఉపయోగించడానికి ఎరువులను ఉపయోగించండి.
  • తేమ నష్టం తగ్గించడానికి పరస్పర చర్యలను తగ్గించండి.
  • పీల్చేవి మరియు నీటి మొలకలను తొలగించండి.
  • చెరువుల నిల్వ నీటిని ఆదా చేసి పంటలకు అత్యవసర దశల్లో ఈ నీటిని ఉపయోగించండి.
  • మొక్కల చుట్టూ గట్లు చేయండి.
  • డ్రిప్పెర్ల క్రింద మొక్క వేరు ప్రాంతంలో హైడ్రోజెల్ పూయండి. 5 కేజీల సన్న ఇసుకలో/నేలలో 500g హైడ్రోజెల్ను కలపండి; ఈ మిశ్రమాన్ని చెట్టుకు 20 గ్రాములు అందించండి.
  • పొడి సమయాలలో పురుగుల దాడి కనబడితే అబామేక్టిన్ 1.95 ఇసి @ 0.5ml /లీ స్ప్రే చల్లండి.

పునరుత్పత్తి దశలో వర్షం లోటు:

  • పూర్తిగా వికసించిన ప్రాంతంలో గిబ్బరేలిక్ ఆమ్లం (GA) 10mg /లీ + 0.5ml /లీ స్ప్రెడర్ స్టికరును పిచికారి చేయండి.
  • పండ్లు కాసిన 20 రోజులకు సాయంత్రం వేళ బోరిక్ యాసిడ్ను 2g /లీ + 0.5ml /లీ స్ప్రెడర్ స్టికరును చల్లండి. నెల తర్వాత తిరిగి ఒకసారి చల్లండి.
  • మరుసటి రోజు n- (2-క్లోరో-4-పైరిడినియల్) పెనియల్ యూరియా (CPPU) [సాధారణ పేరు ఫరక్లోర్ఫిన్యురాన్] @ 5ml /లీ + 0.5ml / లీ పిచికారీ చేయండి.

టెర్మినల్ కరువు:పైన పేర్కొన్న చర్యలతో పాటు రైతుకు అందుబాటులో ఉన్న నీటి ఆధారంగా పండ్ల సంఖ్య తగ్గించాలి. పండ్లు రాలిపోతూ ఉంటే 2,4-డైక్లోరోఫినోక్స్ ఎసిటిక్ ఆమ్లం (2,4-డి) 10mg / లీ 4 సంవత్సరాల కంటే తక్కువ వయసు మొక్కలపై చల్లండి. అవసరమైతే 10 రోజులకు తిరిగి చల్లండి. 4 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న మొక్కలలో 20mg /లీ చల్లవచ్చు.

జామ

వర్షాకాలం 15 రోజులు ఆలస్యమైనప్పుడు: శీతాకాలంలో ప్రారంభ పంట ప్రభావితం అవుతుంది, అందువలన, అనుబంధ నీటిపారుదల మరియు రక్షణ మల్చింగును చేయాలి.
వర్షాకాలం 30 రోజుల పాటు ఆలస్యమైనప్పుడు: వర్షాకాలం పంట ప్రభావితమవుతుంది (పండు పరిమాణం మరియు నాణ్యత తగ్గుతుంది); శీతాకాల పంటలు ప్రభావితమవుతాయి కానీ పంట పరిమాణం మరియు నాణ్యత మెరుగుగా ఉండవచ్చు. సప్లిమెంటరీ నీటిపారుదల మరియు మల్చింగును మెరుగుపర్చాలి.

ఏపు దశలో వర్షపాతం లోటు:శీతాకాల పంట ప్రభానితం అవుతుంది. సప్లిమెంటరీ నీటిపారుదల మరియు మల్చింగు మెరుగు పరచాలి.

పునరుత్పత్తి దశలో వర్షపాతం లోటు:వర్షాకాల పంటలు ప్రభావితం అవుతాయి; శీతాకాల పంట ఆలస్యమవుతుంది. సప్లిమెంటరీ నీటిపారుదల మరియు మల్చింగును అందించాలి.

అధిక వర్షపాతం వలన వరదలు:ప్రతికూల ప్రభావాలు ఉండవు; వ్యాధులు మరియు తెగుళ్లు పెరగవచ్చు. తెగుళ్ళు మరియు వ్యాధులను తగ్గించటం ముఖ్యం.

టెర్మినల్ కరువు:మొత్తం పంట ఉత్పత్తిలో ప్రభావితం చూపిస్తుంది. నీటిపారుదల మరియు మల్చింగును అందజేయాలి.

ఉసిరి

వర్షాకాలం 15 రోజుల పాటు ఆలస్యమైప్పుడు: పంప్ల పరిమాణం మరియు అభివృద్ధి ప్రభావితం అవుతాయి. సప్లిమెంటరీ నీటిపారుదల మరియు మల్చింగు అవసరము.

వర్షాకాలం 30 రోజుల పాటు ఆలస్యమైనప్పుడు: పండ్ల పరిమాణం మరియు అభివృద్ధి ప్రభావితం అవుతాయి. ప్లండ్లు రాలిపోవచ్చు. సప్లిమెంటరీ నీటిపారుదల మరియు మల్చింగు అవసరము.

ఏపు దశలో వర్షపాతం లోటు: ప్రభావం ఉంటుంది. సప్లిమెంటరీ నీటిపారుదల మరియు రక్షణ మల్చింగు అవసరము.

పునరుత్పత్తి దశలో వర్షపాతం లోటు: మార్చి-ఏప్రిల్ మధ్య కాలంలో సంభవిస్తుంది కావట్టి ఇది వర్తించదు.

అదనపు వర్షపాతం వలన వరదలు: అదనంగా ఏపుగా పెరగటం వలన పునరుత్పత్తి తగ్గుతుంది ; దీర్ఘకాల వరదల వలన మొక్కలు మరణించవచ్చు; త్రిప్స్ మరియు త్రుప్పు పెరుగుతుంది. పారుదల అభివృద్ధి, తెగుళ్ళు మరియు వ్యాధులను తగ్గించటం ముఖ్యం.

టెర్మినల్ కరువు: పండ్లు రాలుతాయి, తక్కువ పండు పరిమాణం వలన దిగుబడి తగ్గుతుంది . నీటిపారుదల మరియు రక్షణ మల్చింగు అందించాలి.

అంతర పంటలు:

వర్షాకాల 15 రోజుల పాటు ఆలస్యమైనప్పుడు: ఖరీఫ్ పంటలు నాటడం ఆలస్యం అవుతుంది. నీటిపారుదల మరియు మల్చింగు అందజేయాలి.

ఏపు దశలో వర్షాకాలం 30 రోజుల ఆలస్యం: ఇప్పటికే నాటిన దినుసు (పసుపు, అల్లం), గడ్డ (అమరఫోఫలస్), ప్రభావితం అవుతాయి. సప్లిమెంటరీ నీటిపారుదల మరియు మల్చింగు అందించాలి.

టెర్మినల్ కరువు: ప్రతికూల ప్రభావం ఉంటుంది.

లీచీ

* లీచీ సతతహరిత మొక్క అవటం వలన, అవసరమైన మట్టి తేమల నిర్వహణ దాని పెరుగుదల, అభివృద్ధి మరియు పండు ఉత్పత్తికి కీలకం.

  • ఇది పొడి మరియు మంచు శీతాకాలాలు మరియు అధిక వర్షపాతం మరియు సుదీర్ఘ తేమ, వేడి ఉన్న ప్రాంతాలకు ఉత్తమ పంట.
  • వర్షపాతం బాగా ఉంటే , లీచీ విజయవంతంగా పెరుగుతుంది. మరియు అనుబంధ నీటి అవసరం వృక్ష మరియు బాష్పీభవనాల అవసరం మీద ఆధారపడి ఉంటుంది.
  • మొక్క వేగంగా వృద్ధి సాధించడానికి, నీటి ఎద్దడి ఉండకూడదు. అయితే పునరుత్పాదక దశలో పుష్పించేటప్పుడు మరియు మొగ్గతొడిగే టప్పుడు (ఫిబ్రవరి-మార్చి), గుత్తులు వచ్చేట్పుడు నీటి ఎద్దడి ఉపయోగకరంగా ఉంటుంది.
  • వేసవి నెలల్లో కొద్ది కొద్ది సమయాలలో కొంత నీటిని పారించాలి మరియు తొట్టెను శుభ్రపరిచటం అవసరం (ఏప్రిల్-మే).
  • తక్కువ లింగ నిష్పత్తిని, తక్కువ పండ్ల గుత్తి, భారీగా పండ్లు రాలటం, అధికంగా పండ్లు విరగటం మరియు సన్బర్న్ వంటివి కొన్ని రుగ్మతలు. సరైన నీటి నిర్వహణతో (మార్చి-మే) దీనిని తగ్గించవచ్చు.
  • ఎర్రబారడం, ఏపుగా పెరగటం మరియు షూట్ అభివృద్ధి లాంటివి సకాల వర్షాలతో చాలా (జూన్-సెప్టెంబర్) ప్రభావితమవుతాయి.
  • ఇంటర్ కల్చరల్ కార్యకలాపాలు, కత్తిరింపు మరియు శిక్షణ ఆపరేషన్ మరియు వేసవి దున్నటం లాంటివి పండ్లు పండిన వెంటనే చేస్తారు. ఇది సేద్యపు మొక్కలపై (జూన్ -July) ఆధారపడి ఉంటుంది.
  • రుతుపవనాల రాకతో , వాతావరణ పరిస్థితుల్లో గొప్ప మార్పులు వస్తాయి. వెంటనే వాతావరణంలో తేమ మరియు సాపేక్ష ఆర్ద్రత (> 90%) అవుతుంది. పొడితనం, వేడి, కాలటం తగ్గిపోతాయి. గాలులు, తడి, చల్లని గాలి, ఉరుములు, మేఘాలు వంటివి లీచీ ఏపుగా పెరగటానికి ఉపయోగపడుతాయి.
  • దశ మార్పులో అంటే పునరుత్పత్తి దశలో చల్లని/తక్కువ ఉష్ణోగ్రత ఇండక్షను అనుబంధ నీటిపారుదల నిరోధితతో మరియు తేలికపాటి ఒత్తిడితో అవసరం.
  • ఆర్దికంగా ఉపయోగపడే దిగుబడి రావాలంటే, రుతుపవనాల ముందు పండు అభివృద్ధి, పండు దిగుబడి మరియు నాణ్యతలో మంచి నిర్వహణా పద్ధతులు ఉపయోగించటం అవసరం. దీనితోపాటు పోషకాలు మరియు తేమల పర్యవేక్షణ అవసరం.

రుతుపవనాల 15 రోజుల ఆలస్యం:

* కొత్త లీచీ పండ్ల చెట్ల పెంపకం, సాధారణంగా రుతుపవనాల సంబంధం కలిగి ఉంటుంది కనక దాని విస్తరణ కార్యక్రమం ఆలస్యం అవుతుంది.

  • నిర్వహణ మరియు నాటే వస్తువుల ఖర్చు పెరుగుతుంది.
  • ప్రారంభ రకాలలో (CVS. షాహీ, రోజ్ సెంటెడ్) రెండు నీటిపారుదల ఖర్చు పెరుగితే, చివరి రకాలలో (CVS. చైనా, లేట్ Bedana) కనీసం ఒక నీటిపారుదల ఖర్చు పెరుగుతుంది.
  • ఎదిగిన లీచీ మొక్క (> 10 సంవత్సరాలు) కరువును తట్టుకుంటుంది. అది 4 నుండి 12 వారాల పాటు నీళ్లు లేకుండా ఉండగలదు. దీనికోసం ఆకుల షేడింగ్, ఎర్రబారడంలో జాప్యం, ఆకులను తిప్పడం/జారవిడవటం/ వంచటం వంటి జీవ సహన విధానానలను అభివృద్ధి చేసుకుండుది. దీనివలన అది మొక్క ఏపుగా పెరిగకుండా మరియు శక్తిని కాపాడుకొని కరువును తట్టుకుంటుంది.
  • మొత్తంమీద, వాణిజ్య లీచీ మొక్కలు/చెట్లకు పండ్లు రాగానే పోషణ మరియు నీటిని తక్షణం అందించాలి. దీని వలన రుతుపవనాలు ఆలస్య అయిన పరిస్థితుల్లో కూడా ఇవి బాగా పండుతాయి.
  • అవసరమైన కత్తిరింపు మరియు శిక్షణ కార్యకలాపాలు పండ్లు కాసిన వెంటనే చేయాలి. దీనీవలన పందిరి సాంద్రత తగ్గుతుంది. ఎరువులను పండ్లు కాసిన వెంటనే అందించాలి లేకపోతే తదుపరి సీజన్ ఫలాలపై ప్రభావం పడుతుంది.
  • ఆలస్య రుతుపవనాల సమయంలో, వాతావరణ తేమ చాలా తక్కువగా ఉంటుంది. పర్యవసానంగా, ఇవాపో-ట్రాంస్పిరేషను ఈ కాలంలో (జూన్) తీవ్రంగా పెరుగుతుంది. వేరు కదలిక మరియు పోషకాల వాడుక సామర్థ్యం తీవ్రంగా ప్రభావితమవుతాయి. చివరికి మొక్క పెరుగుతలపై ప్రభావం చూపుతుంది. తిరిగి పునరుద్ధరణ ఆ సంవత్సర చక్రంలో జరుగుతుంది.

తుపవనాలు 30 రోజుల పాటు ఆలస్యమైనప్పుడు:

*లీచీ తోటల క్షేత్ర విస్తరణ కార్యక్రమం సాధారణంగా రుతుపవనాలకు సంబంధం ఉంటుంది కాబట్టి, ఆలస్యం అవుతుంది.

  • నిర్వహణ మరియు నాటే పరికరాల నిర్వహణా ఖర్చు పెరుగుతుంది.
  • ప్రారంభ రకాలలో నాలుగు సంఖ్యల నీటిపారుదల ధర పెరుగుతుంది. అలాగే చివరి దానికి రెండు సంఖ్యల నీటిపారుదల ఖర్యు పెరుగుతుంది మరియు చెట్ల ఫలాల వార్షిక వృద్ధి మరియు పునరుత్పత్తి చక్రాన్ని నిర్వహించే ధర కూడా పెరుగుతుంది.
  • ప్రారంభ ఎర్రబారడం జాప్యం, ఏపుగా పెరగటం, పరిపక్వత, పుష్పించటం మరియు ఫలాలపై వచ్చే ఋతువులో ప్రభావం చూపుతుంది.
  • షూట్ పెరుగుదల మరియు ఏపుగా అవటం లాంటివి నెమ్మదిగా జరుగుతాయి.
  • కొత్తగా వచ్చిన ఎరుపు ఎండటం మరియు షూట్ కొన మాడిపోయో అవకాశం ఉంది.
  • వయోజన లీచీ మొక్కలు/చెట్లు (> 10 సంవత్సరాలు) ఆలస్య రుతుపవనాలను విశ్రాంత దశలో ఉండి తట్టుకొనే విధానాన్ని పెంపొందించుకుంటాయి. చివరికి సీజన్ కారణంగా ఏపుపై ప్రభావం ఉంటుంది.
  • లీచీకి ఆలస్య రుతుపవనాల సమయంలో నీటిని వేరునుంచి ఆకులకు పంపే సామర్ధ్యం తక్కువగా ఉంటుంది. వేరు ప్రాంతంలో తేమ తగ్గిపోవటం వలన మొక్క కాండం మరియు ఆకులపై జీవ ప్రక్రియలకు సంబంధించిన అనేక మార్పులు జరుగుతాయి. అనువర్తిత నీటిపారుదలతో ఒక్క తడి మట్టి మాత్రమే చెట్టు నీటి ఎద్దడిని నిరోధించలేదు.

ఏపు దశలో వర్షం లోటు:

* కొత్త తోటల ఏర్పాటు కష్టం.

  • క్లిష్టమైన పంట పెరుగుదల దశలో, వర్షం లేకుండా చాలా రోజులు ఉంటే రాబోయే సీజన్లో పంట నష్టపోతుంది.
  • షూట్ పెరుగుదల మరియు పందిరి వ్యాప్తి తక్కువగా ఉంటుంది.
  • లీచీ వృక్షాలు ఎద్దడిని తట్టుకోవడానికి వత్తిడి నివారణ విధానాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. దీనివలన అది ఏపుగా పెరగకుండా విశ్రాంతి దశలో ఉండవచ్చు. దీనివలన పంట ఆరోగ్యం మరియు పండు ఉత్పత్తిపై ప్రభావం ఉటుంది.
  • పైన చెప్పినట్లుగా, వేరు నుంచి ఆకులకు నీటిని తక్కువ సామర్థ్యంతో పంపుతుంది. అనుబంధ సేద్యంతో సరైన నిర్వహణ పద్ధతులు (సేంద్రీయ మన్యూర్ పూయడం, మల్చింగు ఉపయోగించడం) రూపొందించి పరిస్థితి చెడు ప్రభావాన్ని తగ్గించవచ్చు.
  • ముఖ్యమైన కారకం అనగా, అధిక సాపేక్ష తేమ (RH), ఏపు దశలో అనుకూలంగా ఉంటుంది. దీనికోసం ఎల్లప్పుడూ ఒక ముఖ్యమైన కారక సేద్యం ద్వారా తగినంత నీటి సరఫరా అందిచాలి.
  • మొత్తం మీద, లీచీ వేడి, పొడి, గాలి రోజులలో తేమ ఒత్తిడికి లోనవుతుంది. దానికోసం సరైన నిర్వహణా పద్ధతులను సకాలంలో అమలు చేయాలి.

పునరుత్పత్తి దశలో వర్షం లోటు:

* ఫేస్ మార్పు, అంటే పునరుత్పత్తి దశలో ఏపు, లీచీ పండ్ల ఉత్పత్తిలో చాలా ముఖ్యమైనది. దానికి తక్కువ తేమ పరిస్థితులతో చల్లని / తక్కువ ఉష్ణోగ్రత ఇండక్షన్ అలాగే వాతావరణంలో తక్కువ తేమ అవసరం. అందువల్ల లోటు వర్ష పరిస్థితిలో వేరే నీటిపారుదల లేకుండా మరియు తేలికపాటి ఒత్తిడి పరిస్థితిని సృష్టించడం వలన లీచీ సాగు పునరుత్పత్తి దశకు మంచి ఉపయోగకరంగా ఉంటుంది.

  • అభివృద్ధి చెందిన పరిణతి రెమ్మలు ప్రారంభ జలనిర్గమణలు మాత్రమే విశ్రాంతి దశలో ఉంటాయి. శీతాకాలంలో తేలికపాటి ఒత్తిడి పరిస్థితితో పుష్పాలు ఏర్పడతాయి.
  • రెండు నెలల ముందు, అంటే గుత్తులు రావడానిక ముందు, నీటిపారుదల పరస్పర ఆపరేషన్, కత్తిరింపు, శిక్షణ ఆపరేషన్ మరియు పందిరి విస్తృత ప్రాంతం మొదలైనవి లేకుండా చేస్తే పునరుత్పత్తి ప్రారంభ సమయంలో ఉపయోగకరంగా ఉంటుందని నిరూపించబడింది.

టెర్మినల్ కరువు:

  • కరువును లీచీ మొక్కలు/చెట్ల పెరుగుదల, పండ్ల ఉత్పత్తి మరియు చెట్టు బలాన్ని పరిమితం చేసే ఒక పెద్ద కారకంగా చెప్పవచ్చు.
  • భారతదేశంలో లీచీ ఉత్పత్తి చేయాలంటే క్లిష్టమైన నీటిపారుదల కాలం మార్చి ముగింపు నుండి రుతుపవనాల వరకు i.e. జూన్ ఆరంభం వరకు ఉంటుంది. ఈ సమయంలో పండు అభివృద్ధి మరియు ఏపు పెరుగుతుంది. వర్షాభావ పరిస్థితిని మెరుగైన వ్యవస్థల ద్వారా తగినంత సాగునీటి నిర్వహణ చేసి తగ్గించవచ్చు.
  • రిజోస్పేరులో జీవక్రియ విధుల నిరోధం, కిరణజన్య క్రియ తగ్గిన రేటు మరియు తగ్గిన వేరు కార్యకలాపాలు కరువు వలన వచ్చే ప్రధాన పరిణామాలు. తత్పలితంగా, పోషకాలను వాడే సామర్థ్యం తగ్గుతుంది. దానివలన పండ్ల ఉత్పత్తి మరియు పండ్ల నాణ్యత క్షీణిస్తుంది.
  • మార్చి నుంచి, ఉష్ణోగ్రతలు పెరుగటం మొదలవుతుంది మరియు వాతావరణ తేమ చాలా తక్కువగా ఉంటుంది. తత్ఫలితంగా ఇవాపో - ట్రాన్స్పిరేషన్ గణనీయంగా పెరుగుతుంది. లీచీ చెట్లకు ఈ కాలంలో తరచుగా సాగు నీటిని ఇవ్వకపోతే, అనేక రుగ్మతల రావచ్చు ( పండు పగలటం, సన్బర్న్ మరియు పండు రాలటం).
  • పైన చెప్పినట్లుగా లీచీ వేరు నుండి ఆకులకు నీటిని తక్కువ సామర్థ్యంతో పంపుతుంది. అందువలన కరువు పరిస్థితి దాటి తిరిగి జీవక్రియ ప్రక్రియలను మొదలు పెట్టే వరకు సరైన నీటిని అందించాలి. దీనివలన సెల్ టర్గరు తగ్గుతుంది (పత్రాలలో చూడవచ్చు). సరైన నిర్వాహణా విధానాలు (ఆర్గానిక్ ఎరువులు మల్చింగుల ఉపయోగం), సరైన కత్తిరింపు మరియు శిక్షణతో ఎత్తును తగ్గించవచ్చు. మెరుగైన మరియు సమర్థవంతమైన పద్ధతుల ద్వారా అనుబంధ పోషకాహారం మరియు నీటిపారుదలతో కరువు ప్రభావాన్ని తగ్గించవచ్చు.

మూలం: NHM

చివరిసారిగా మార్పు చేయబడిన : 12/18/2023



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate