అంగీకార పత్రం జారీ కొరకు ఒక వ్యక్తి వ్యక్తుల సమూహం లేక చట్టపరమైన వ్యక్తి (భాగస్వామ్య సంస్థ, ఒక ట్రస్టు, ఒక సహకార సంఘం, సంఘాల రిజిష్ట్రేషన్ చట్టం క్రింద రిజిష్టరైన ఒక సంఘం, ఒక కంపెనీ, స్వయం సహాయక బృందం) దరఖాస్తూ చేయవచ్చును.
దరఖాస్తు వెల నిర్మాణం ఈ దిగువ విధంగా ఉండును
దరఖాస్తు వెల |
డిమాండ్ డ్రాప్టు మరియు ఎల క్ట్రానిక్ బదిలీ విభాగం |
క్రెడిట్ లేక డెబిట్ కార్డ్ (వీసా/ మాస్టర్ ) |
రూ.10లక్షల వరకు వ్యయం కలిగి యున్న ప్రాజెక్టులకు |
రూ.1,000/- |
రూ.1,000/-లు (గేట్ వే లావాదేవీ ఫీజు చెల్లించుటకు వర్తించు ఛార్జీలు అదనం) |
రూ.10లక్షలు మరియు రూ 20 లక్షల వరకు వ్యయం కలిగి యున్న ప్రాజెక్టులకు |
రూ.2,000/- |
రూ.2,000/-లు (గేట్ వే లావాదేవీ ఫీజు చెల్లించుటకు వర్తించు ఛార్జీలు అదనం) |
రూ.20లక్షలు మరియు రూ 50 లక్షల వరకు వ్యయంకలిగియున్న ప్రాజెక్టులకు |
రూ.5,000/- |
రూ.5,000/-లు (గేట్ వే లావాదేవీ ఫీజు చెల్లించుటకు వర్తించు ఛార్జీలు అదనం) |
రూ.50లక్షలు మరియు అంతకు పై బడి వ్యయం కలిగి యున్న ప్రాజెక్టులకు |
రూ.10,000/- |
రూ.10,000/-లు (గేట్ వే లావాదేవీ ఫీజు చెల్లించుటకు వర్తించు ఛార్జీలు అదనం) |
జాతీయ ఉద్యానవన బోర్డువారి ఖాతాలో చెల్లింపుకు డిమాండ్ డ్రాఫ్టు గాని లేక ఎలక్ట్రానిక బదిలీకి ఎంపిక చేసుకొన్నచో దరఖాస్తు దారు ముందుగా డిమాండ్ డ్రాఫ్టును లేక ఎలక్ట్రానిక బదిలీ ద్వారా సదరు ఖాతాకు విధులను మళ్ళీంచాలి. అపుడు ఆన్ లైన్ దరఖాస్తులో డిడి నెంబరు లేక ఎలక్ట్రానిక బదిలీ నెంబరును పొందుపరచాలి. ఈ విషయంలో దరఖాస్తుదారుకు తాత్కాలిక గుర్తింపు (ఐ.డి) ఇవ్వబడు తుంది. ఎలక్ట్రానిక బదిలీ ద్వారా జాతీయ ఉద్యానవన బోర్డు ఖాతాలో నిధులు జమ అయిన తరువాత మరియు డిమాండ్ డ్రాఫ్టు విషయంలో బోర్డు వారుకి డ్రాప్టు అందిన తరువాత అంగీకారపత్రం యొక్క్ శాశ్వత కోడ్ ఇవ్వబడును.
దరఖాస్తుదారు డెబిట్ /క్రెడిట్ కార్డు ద్వారా దరఖాస్తు వెలను చెల్లించుటకు ఎంచుకొన్నట్లయితే వెనువెంటనే అంగీకార పత్రం శాశ్వత కోడ్ తో బాటు (తిరుగు) రశీదు ఇవ్వబడును.
ఆన్ లైన్ లో దరఖాస్తు వారం నింపిన తరువాత దరఖాస్తుదారు పూర్తిచేసిన దరఖాస్తుయొక్క ప్రతిని తీసుకొనవలెను. దీనిని రెండు ప్రతులుగా తీసుకొని ఒక ప్రతిని తన రికార్డు కొరకు ఉంచుకోవాలి. రెండవ ప్రతిని దరఖాస్తుకు అవసరమైన ఇతర పత్రములతో జతపరచాలి. ఆన్ లైన్ దరఖాస్తు తో బాటు దరఖాస్తుదారు తప్పని సరిగా ఫారం 1 నమూనాలో దరఖాస్తు ను పూర్తి చేసిన సమర్పించాలి.
వ్యక్తి లేక వ్యక్తుల సమూహం విషయంలో వారిపేరు, లింగ, వయస్సు, వృత్తి, తండ్రి/భర్త పేరు, శాశ్వత చిరునామాతో బాటు తనచే దృవీకరింపబడిన పాస్ పోర్ట్ సైజు ఫోటోను దరఖాస్తుకు అతికించడం ద్వారా అతని వారి గుర్తింపును దృవీకరించవచ్చును.
ఒకవేళ దరఖాస్తుదారు చట్టబద్ధమైన సంస్థ అయినచో ఆ సంస్థను గుర్తించుటకు ఈ క్రింది వివరము లను పొందుపరచమని కోరవలెను.
ఎక్కడైతే ప్రాజెక్టు నిర్మించాలని ప్రతిపాదింపబడినదో ఆ స్థలము కనీసం 15 సంవత్సరాల కాలమునకు దరఖాస్తుదారు పేరున యజమానిగా లేక కౌలుదారు పేరున ఉండవలెను. స్థలమును కౌలు/అద్దెకు తీసుకున్నట్లైయితే సబ్ రిజిష్ట్రాట్ కార్యాలయములో కౌలు పత్రము రిజిష్టరు చేయబడవలెను. స్థలము పై హక్కును తెలుపు ప్రస్తుత పత్రముని దరఖాస్తుకు జతపరచవలెను. అప్పు మంజూరు చేసిన సంస్థ అంగీకరించిననూ తనఖా పెట్టబడిన స్థలమును కౌలుకుతీసుకొన్న స్థలంగా పరిగణిం చరాదు. ఇదే విధంగా స్థలం యొక్క్ స్వంతదారు పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా దరఖాస్తుదారుకు సంక్రమింపచేసిన స్థలము ఈ పథకము క్రింద అర్హత కలిగిఉండదు.
ఆదారము:జాతీయ ఉద్యానవన బోర్డు వారి వ్యవసాయ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం
చివరిసారిగా మార్పు చేయబడిన : 7/1/2020