অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

హైదరాబాద్

హైదరాబాద్

  1. హైదరాబాద్ పార్కులు
    1. గార్డెన్లు!!
      1. విమానాశ్రయం
      2. రైలు రవాణా
      3. రోడ్డు రవాణా
    2. హైదరాబాద్......ప్రాముఖ్యత
      1. చూడదగిన ప్రదేశాలు
        1. ఆనంద బుద్ధ విహార
        2. అస్మాన్ గర్ పాలస్, హైదరాబాద్
        3. బిర్లా ప్లానిటోరియం/ బిర్లా సైన్స్ మ్యూజియం
        4. ఢొలా రి దని
        5. హుస్సేన్ సాగర్ లేక్
        6. హైటెక్ సిటీ
        7. హైదరాబాద్ బొటనికల్ గార్డెన్స్
        8. లాడ్ బజార్
        9. ఐమాక్స్
        10. మీర్ ఆలం ట్యాంక్
        11. ఒస్మాన్ సాగర్ లేక్
        12. సికింద్రాబాద్
        13. రేమండ్ టూంబ్
        14. శిల్పారామం
        15. నిజాం మ్యూజియం
        16. ట్రిమల్గెర్రీ చర్చ్
        17. ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ మ్యూజియం
        18. చౌమహల్లా పాలస్
        19. ఉజ్జయిని మహంకాళి టెంపుల్
        20. హయత్ బక్షి బేగం మాస్కు
        21. కోటి
        22. పైగహ్ టొంబ్స్
        23. పురాని హవేలీ
        24. రామకృష్ణ మఠ్
        25. సాంఘి టెంపుల్
        26. షామీర్ పేట్
        27. సురేంద్రపురి
        28. స్పానిష్ మాస్క్
        29. తారామతి బారాదరి

తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ దక్షిణ భారత దేశంలో పర్యాటకులు తప్పక సందర్శించవలసిన ప్రదేశం. మూసీ నది ఒడ్డున ఉండే ఈ సుందరమైన నగరం ప్రఖ్యాత ఖుతుభ్ షా రాజవంశీయుల లో ఒకరైన మొహమ్మద్ ఖులీ ఖుతుబ్ షా చేత 1591 లో ఏర్పాటయింది. స్థానిక స్థల పురాణం ప్రకారం భాగమతీ, మొహమ్మద్ ఖులీ ఖుతుబ్ షా ల ఆసక్తి కరమైన ప్రేమ కథ నుండి ఈ నగరానికి ఈ పేరు వచ్చిందని అంటారు. ఆస్థాన నర్తకి అయిన భాగమతి తో సుల్తాన్ ప్రేమలో పడతాడు. వారి ప్రేమకి గుర్తుగా ఖులీ ఖుతుబ్ షా ఈ నగరానికి భాగ్యనగరం అన్న పేరు పెట్టాడు. ఆమె ఇస్లాం మతం లో కి మారి  హైదర్ మహల్ గా పేరు మార్చుకున్నాక సుల్తాన్ ని వివాహమాడారు. తదనుగుణంగా ఈ నగరం పేరు కూడా హైదరాబాద్ గా మారింది.

దక్షిణ భారత దేశం పై దండయాత్ర చేసిన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు చేత ఈ నగరం ఆక్రమించబడే వరకు హైదరాబాద్ నగరం ఖులీ ఖుతుబ్ షా రాజవంశీకుల చేతిలోనే దాదాపు ఒక శతాబ్దం వరకు ఉంది. 1724 లో ఆసిఫ్ జహి రాజవంశాన్ని స్థాపించిన తరువాత మొదటి ఆసిఫ్ జా హైదరాబాద్ ని, చుట్టు పక్కల ప్రదేశాలని అధీనం లోకి తీసుకున్నాడు. హైదరాబాద్ నిజాములు గా ఆసిఫ్ జా రాజవంశీకులు పేరొందారు. వైభవోపేతమైన నిజాముల శకానికి సంబంధించిన ఈ సుందరమైన ప్రాంతం యొక్క ఘనమైన చరిత్ర వలసవాదుల కాలం వరకు విస్తరించింది. బ్రిటిష్ రాజులతో పరస్పర లబ్ది దార సంది కుదుర్చుకుని నిజాం వారు హైదరాబాదుని దాదాపు రెండు వందల సంవత్సరాలు పాలించారు. 1769 నుండి 1948 వరకు ఈ ప్రాంతం నిజాముల రాజధానిగా వ్యవహరించింది. ఆపరేషన్ పోలో నిర్వహించిన తరువాత ఆఖరి నిజాం పాలకుడు ఇండియన్ యూనియన్ తో జరిగిన పట్టాభిషేక ఒప్పందం పై సంతకం చేసి హైదరాబాద్ ని అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా, స్వతంత్ర భారత దేశం లో ని భాగం గా చేసారు. సాంస్కృతిక గుర్తింపు, విలక్షనీయత హైదరాబాద్ సొంతం. తెలుగు దేశం యావత్తూ గర్వించదగిన నగరం హైదరాబాద్ నగరం.

భౌగోళికంగా హైదరాబాద్ మంచి ప్రదేశం లో ఉంది. ఉత్తర భారత దేశ భాగం పూర్తయ్యి, దక్షిణ భారత దేశం భాగం మొదలయ్యే ప్రదేశం హైదరాబాద్. అందువల్ల, హైదరాబాద్ లో రెండు విభిన్న సంస్కృతుల సమ్మేళనం కనిపిస్తుంది. ఈ కలయిక ఎంతో  అందంగా ఉంటుంది. పూర్వపు రోజుల నుండి సాహిత్యం, సంగీతం, కళలకు హైదరాబాద్ రాజధానిగా వ్యవహరించేది. నిజానికి, నైజాముల ఆదరణవల్ల ఈ నగరంలో లలిత కళలు ఎంతగానో అభివృద్ధి చెందాయి. లలిత కళ లపై అమితమైన ఆసక్తి కలిగిన నైజాములు, అర్హత కలిగిన కళాకారులని ప్రోత్సహించడంలో వెనకడుగు వేసేవారు కాదు. అంతే కాదు, ఈ రాజవంశీకులు భోజన ప్రియులు కూడా. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వంట వాళ్ళని రప్పించి ఎన్నో రుచులని వారిచేత విభిన్న రకాల వంటకాలను చేయించుకుని ఆస్వాదించేవారు. ఈ రోజు, హైదరాబాద్ లో కనిపించే విభిన్న రుచుల సమ్మేళనం దేశంలో ని వివిధ ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చినదే. అయినా స్థానిక వంటల రుచులు మాత్రం అన్నిటికంటే ప్రత్యేకంగా ఉంటాయి. ఇక్కడ తయారు చేసే హైదరాబాద్ దం బిర్యాని ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. వారసత్వ సంపద వారసులకి ఇచ్చినట్టు, హైదరాబాద్ లో ఉండే ప్రతి కుటుంబం ఈ వివిధ వంటకాల తయారీ విధానాన్ని తమ తరువాతి తరాలకి తెలియచేస్తున్నారు.

హైదరాబాద్... ఈ పేరు వింటే చాలు ఘుమఘుమ లాడే బిర్యానీ రుచులు గుర్తుకువస్తాయి కదా!!. నేను దాని గురించి చెప్పను లేండి. హైదరాబాద్ మహానగరం 50 లక్షల పైచిలుకు జనాభాను కలిగి ఉంది. కొన్ని వేల సంఖ్యలో కార్లు, బైకులు నిత్యం రోడ్డుల మీద పరుగెడుతున్నాయి, పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. నేటి యాంత్రిక జీవనంలో పర్యావరణం ఒక పెద్ద సమస్యగా దాపరించింది.,అందునా హైదరాబాద్ మరీను!!.

హైదరాబాద్ అందాలకు ఏ మాత్రం అవాంతరాలు కలగకుండా ఇక్కడ కొన్ని పార్కులు, గార్డెన్ లు వారంతపు విహారాలుగా ఉన్నాయి. శని,ఆది వారాలలో ఇక్కడికి వెళ్ళి మైండ్ ఫ్రెష్ చేసుకొని రావచ్చు. కుటుంబ సమేతంగా వెళ్ళవలసినవి, స్నేహితులతో వెళ్ళవలసినవి, ప్రేమికులు వెళ్ళవలసినవి ఇక్కడ కొన్ని ఉన్నాయి. అవి ఏమిటి? ఎక్కడెక్కడ ఉన్నాయి?ఎప్పు డు వెళ్ళాలి? అంటే.....

హైదరాబాద్ పార్కులు

గార్డెన్లు!!

ఎన్ టి ఆర్ గార్డెన్


దివంగత ముఖ్యమంత్రి ఎన్. టి. రామారావు జ్ఞాపకార్థం హైదరాబాద్ మహానగరంలో 1999 వ సంవత్సరంలో ఎన్. చంద్రబాబు నాయుడు గారిచే ప్రారంభించబడినది. ఈ గార్డెన్ మొత్తం 55 ఎకరాలలో విస్తరించినది. భౌగోళిక ప్రాంతం మరియు అద్భుతమైన సందర్శనా దృశ్యాలు కల ఎన్ టి అర్ గార్డెన్స్ చిన్నదే అయినా స్థానికులలో అత్యంత ప్రాచుర్యం పొందింది. హుస్సేన్ సాగర్ చెరువు పక్కనే ఉన్న ఈ ఎన్ టి అర్ గార్డెన్స్ ని తరచూ పర్యాటకులచే సందర్శించబడే గార్డెన్ గా చెప్పుకొనవచ్చు. కుటుంబ సమేతంగా పర్యాటకులు సాయం సమయాలని వినోదంగా గడపడానికి ఇక్కడి వస్తుంటారు.

టిక్కెట్ పెద్దవారికి 15 రూపాయలు, పిల్లలకి 10 రూపాయలు మరియు కెమరా తో వచ్చినట్లయితే 30 రూపాయలు వసూలు చేస్తారు.

సందర్శించు సమయం వారంలోని అన్ని రోజులలో పర్యటించవచ్చు. మధ్యానం 2:30 నుంచి రాత్రి 09:00 గంటల వరకు సందర్శించవచ్చు.

చూడటానికి పట్టే సమయం 2 గంటల నుంచి ౩ గంటల సమయం పడుతుంది.

రవాణా సదుపాయం దీనికి దగ్గరలో ఉన్న బస్ స్టాప్ సెక్రటేరియట్, ఒకవేళ ఎం. ఎం. టి. ఎస్. లో వచ్చినట్లయితే నెక్లెస్ రోడ్ లో దిగాలి.

ఇందిరా పార్క్


ఇందిరా పార్క్ చుట్టూ పచ్చని చెట్లతో నిండి ఉంటుంది. ఇది హైదరాబాద్ కి గుండెకాయ వంటిది. దీనిని 1975 - 78 మధ్యకాలంలో ప్రారంభించినారు. హైదరాబాద్ లో కెల్లా పురాతన పార్కులలో ఇదికూడా ఒకటి. సుమారు 76 ఎకరాల విస్తీర్ణంలో హుస్సేన్ సాగర్ సరస్సు ఒడ్డున ఉన్నది. దీనిని పునర్నిర్మించేటప్పుడు చెట్టు,పుట్టలను కదల్చకుండా నిర్మాణం చేశారు. ఇక్కడ గల ప్రధాన ఆకర్షణలు మ్యూజికల్ డ్యాన్సింగ్ ఫౌంటన్, వాటర్‌ఫాల్స్ మరియు నర్సరీలు. ఇక్కడ ఒక చిన్న కొలను మాదిరి కుంటలు ఉన్నాయి. అంతేకాదు వివిధ రకాల రోజా పూలు ఉన్నాయి. ఇందిరా పార్కులో బోటింగ్ భలే అందాన్ని ఇస్తుంది.

సందర్శించు సమయం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 7 గంటలవరకు. వారం లోని అన్ని రోజులలో తెరిచే ఉంటుంది.

టికెట్ ప్రవేశ రుసుము: 5 రూపాయలు

రవాణా సదుపాయం ఇందిరా పార్క్ క్రాస్ రోడ్ బస్ స్టాప్ దగ్గరలో ఉన్న బస్ స్టాప్.

కోట్ల విజయ భాస్కరరెడ్డి బొటానికల్ గార్డెన్


కోట్ల విజయభాస్కర రెడ్డి బొటానికల్ గార్డెన్ గా పేరుగన్న హైదరాబాద్ బొటనికల్ గార్డెన్స్ హైదరాబాద్ లో ని మరి యొక ప్రత్యేక ఆకర్షణ. ఇది సుమారు 120 ఎకరాలలో విస్తరించింది. హైదరాబాద్ రైల్వే స్టేషన్ నుండి 16 కిలో మీటర్ల దూరంలో హైటెక్ సిటీ కి దగ్గరలో ఈ గార్డెన్ ఉంది. హైదరాబాద్-ముంబై ముఖ్య రహదారిపై ఈ గార్డెన్ ఉంది. బీజద్రవ్యం యొక్క అభివృద్ధి మరియు పరిరక్షణ ఈ బొటనికల్ గార్డెన్ ముఖ్య ఉద్దేశం. అత్యాధునిక సాంకేతిక పరికరాలతో గాడ్జెట్ లతో ఈ గార్డెన్ ని తీర్చిదిద్దారు. వృక్షజాలం మరియు జంతుజాలాన్ని పరిరక్షించడంతో పాటు ప్రకృతిని కాపాడాలనే సద్భావాన్నిఈ గార్డెన్ బోధిస్తుంది. ప్రస్తుతం, ఈ గార్డెన్ లో ని అయిదు విభాగాలని సందర్శకులకు అందుబాటు లో ఉంచారు.

పెరటి ఔషద మొక్కలు, ఆర్నమెంటల్ ప్లాంట్స్, అక్వాటిక్ ప్లాంట్స్, కలప మొక్కలు, వెదురు మొక్కలు, పళ్ళ చెట్లు ఇంకా ఎన్నో ఈ విభాగాలలోకి వస్తాయి. పర్యావరణవేత్త కాకపోయినా అందంగా నిర్మించబడిన ఈ గార్డెన్ ని చూడడానికి పర్యటించవచ్చు. ఇక్కడ అందమైన పచ్చిక బయళ్ళు నీటి చెలమలు చిన్న చిన్న కొండలు పర్యాటకులు చూసి సంతోషించవచ్చు.

ప్రవేశ రుసుం 15 రూపాయలు ప్రవేశ రుసుముగా ఉన్నది.

సందర్శించు సమయం సోమ-ఆది ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సందర్శించవచ్చు.

లుంబిని పార్క్


అద్భుతమైన హుస్సేన్ సాగర్ చెరువు కి పక్కన ఉన్నది లుంబిని పార్క్ , 7.5 ఎకరాలలో విస్తరించింది. 1994 లో నిర్మితమైన ఈ పార్క్ ఆ తరువాత ఎన్నో మార్పు చేర్పులకు గురవుతూ ఎప్పటికప్పుడు అన్ని వయసుల సందర్శకులకి ఆకర్షణీయంగా మారుతున్నది. లేజర్ ఆడిటోరియం, బోటింగ్ ఫెసిలిటీ, చక్కగా నిర్వహించబడే గార్డెన్స్ మరియు మ్యూజికల్ ఫౌంటైన్స్ తో ఈ గార్డెన్ అలరారుతున్నది. అందువల్ల కుటుంబసమేత విహార యాత్రలకి ఇది నెలవైంది. 2000 మంది కూర్చోగలిగే ఈ లేజర్ ఆడిటోరియం దేశం లోనే ప్రధమమైనది.

ఈ ఆడిటోరియం హైదరాబాద్ నగరం యొక్క ప్రాముఖ్యతని గౌరవాన్ని ప్రపంచ స్థాయిలో పెంచేందుకు నిర్మితమైంది. హైదరాబాద్ నగరం యొక్క చారిత్రిక విశేషాలను తెలిపే ప్రదర్శనలు ఆంగ్ల మరియు హిందీ భాషలలో ఈ ఆడిటోరియం లో ప్రతి రోజు ప్రదర్శితమవుతాయి.

ప్రవేశ రుసుం 10 రూపాయలు వసూలు చేస్తారు. స్పీడ్ బోటింగ్ అయితే 50 రూపాయలు, మామూలు బోటింగ్ అయితే 40 రూపాయలు, లేజర్ షోకి అయితే 50 రూపాయలు వసూలు చేస్తారు.

సందర్శించు సమయం వారంలోని సోమవారం తప్ప అన్ని రోజులలో పర్యటించవచ్చు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సందర్శించవచ్చు. చూడటానికి పట్టే సమయం 3 గంటల నుంచి 4 గంటల సమయం పడుతుంది.

ఓషియన్ పార్క్


హైదరాబాద్ లోని ఓషన్ పార్క్ దేశం లోనే రెండో అతిపెద్ద అమ్యూస్మెన్ట్ పార్క్. ఒస్మాన్ సాగర్ చెరువుకి దగ్గరలో నగరానికి 20 కిలోమీటర్ల దూరం లో నగర శివార్లలో ఉన్నది. చక్కగా నిర్వహించబడే ఈ పార్క్ నిర్మలమైన నీటితొ కన్నుల పండువగా కనిపించే పచ్చటి లాన్ ల తో ఉంటుంది.

ఈ అమ్యూస్మెన్ట్ పార్క్ యొక్క ఉన్నత ప్రమాణాలు స్థానికులు , పర్యాటకులు అనే తేడ లేకుండా అందరికీ ఎంతగానో ఈ పార్క్ నచ్చే విధంగా ఉంటాయి. పెద్ద చిన్న తేడా లేకుండా అందరిని వినోదాలలో ఓలలాడించే విధం గా ఈ పార్క్ ని తీర్చి దిద్దారు. చిన్న పిల్లలకు సురక్షితంగా ఈ పార్క్ ను రూపొందించారు. డ్రై రైడ్ ల తో పాటు వాటర్ రైడ్ లు ఉంటాయి.

ప్రతిఒక్కరు తమ ఇష్టానికి వినోదించే అవకాసం ఉంటుంది.పర్యాటకులు ఓషన్ పూల్ లో సమయం గడపటం లేదా టీ కప్స్,ఎయిర్ డ్రాప్స్, షిప్స్ ఇంకా ట్రైన్స్ వంటి రైడ్స్ లో పాల్గొని వినోదాన్ని పొందవచ్చు.ఇక్కడి వినోద భరిత రైడ్స్ అన్ని సురక్షితమైనవి.

ఎంట్రీ రుసుం పెద్దలకు 400 రూపాయలు, పిల్లలకి 250 రూపాయలు

సందర్శించు సమయం పార్క్ టైమ్: ఉదయం 11 నుంచి రాత్రి 7:30 వరకు నీటి క్రీడలు: ఉదయం 11 నుంచి సాయంత్రం 6 గంటల వరకు

 

పబ్లిక్ గార్డెన్స్


బాగ్ - ఎ- ఆమ్ అంటే ప్రజల యొక్క పార్క్ అని పూర్వం పిలవబడిన పబ్లిక్ గార్డెన్స్ హైదరాబాద్ లో ఉన్న మరోక సుందరమైన ప్రదేశం. 1920 లో నిజాముల చేత ఈ పార్క్ సాధారణ ప్రజల కోసం నిర్మితమైంది. ఇప్పటికి, వందల మంది ప్రజలు ఈ పార్క్ కి విచ్చేస్తారు. హైదరాబాద్ లో ఎన్నో అందమైన ఉద్యానవనాలు ఉన్నప్పటికీ పర్యాటకుల మరియు స్థానికుల మనసు గెలుచుకున్నది పబ్లిక్ గార్డెన్స్. ఈ పబ్లిక్ గార్డెన్స్ ప్రాంగణంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర పురావస్తు శాఖ మ్యూజియం కళా ప్రేమికులకి ముఖ్యమైనది. స్టేట్ అర్కలాజికల్ మ్యూజియం, జుబ్లీ హాల్, స్టేట్ లెజిస్లేచర్, తెలుగు లలిత కళా తోరణం మరియు జవహర్ బాల్ భవన్ వంటివి ఈ గార్డెన్స్ లో ఎన్నో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆర్కలాజికల్ మ్యూజియం కి పక్కగా కంటెంపరరి ఆర్ట్ మ్యూజియం ఉంది.

మ్యూజియం తో పాటు పక్కనే ఉన్న పబ్లిక్ గార్డెన్స్ ని సందర్శించవచ్చు. పచ్చటి ప్రకృతి ఒడిలో పచ్చని లాన్ ల లో సేద దీరాలనుకునే వారికి అనువైన ప్రదేశం.

ప్రవేశ రుసుం 20 రూ/- పెద్దలకు, పిల్లలకు 10 రూ/-

సందర్శించు సమయం ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యానం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు( శుక్రవారం తప్ప)

స్నో వరల్డ్


స్నో వరల్డ్ అనే అమ్యుస్మెంట్ పార్క్ ఈ తరహా పార్క్ ల లో దేశం లోనే మొట్టమొదటిది. 2004 లో పర్యాటకులకు అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ ఒక్క రోజు లో 2400 మంది పర్యాటకులు వినోదించవచ్చు.కృత్రిమం గా తయారు చేసిన మంచు ఈ పార్క్ లో కురిపిస్తారు.టన్ను ల కొద్ది మంచు ని పొరలు పొరలుగా నేల ఫై పరిచబడి ఉంటుంది. పర్యాటకులు ఈ మంచు ముద్దలతో ఆడుకోవచ్చు, మంచు మనిషిని నిర్మించవచ్చు. చిన్నపిల్లలు ఈ మంచు నోట్లో పెట్టుకున్నా, మంచి నీటితో చెయ్యటం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ పార్క్ లోపలి వెళ్ళే ముందు పర్యాటకులు ఉన్ని వస్త్రాలు ధరించాలి. పార్క్ లోకి వెళ్ళగానే శరీరాన్ని వెచ్చగా ఉంచటానికి ఓక కప్ వేడి సూప్ ని ఇస్తారు.పార్క్ లోపల స్నో ట్యూబ్ స్లయిడ్ ,ఐస్-బుమ్పింగ్ కార్స్, ఐస్ స్కేటింగ్ రింక్, స్నో వార్ జోన్ అండ్ స్లెఇఘ్ స్లైడ్స్ వంటి వినోద వసతులు ఉన్నాయి.

ప్రవేశ రుసుం 450 రూ/- పెద్దలకు, పిల్లలకు 250 రూ/- స్కూల్ పిల్లలకు 250 రూ/-, కాలేజ్ స్టూడెంట్లకి 300 రూ/-

సందర్శించు సమయం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు. వారంలోని అన్ని రోజులు సందర్శించవచ్చు.

కెబిఅర్ నేషనల్ పార్క్


కాసు బ్రహ్మానంద రెడ్డి నేషనల్ పార్క్ లేదా కెబిఅర్ నేషనల్ పార్క్ జూబిలీ హిల్స్ ప్రాంతం లో ఉంది. ఈ పార్క్ ప్రాంగణంలో ప్రిన్సు ముకర్రమ్ జా కి సంబంధించిన చిరన్ పాలస్ ఉంది. కాంక్రీటు అడవుల మధ్యలో ఉన్న సహజ సిద్దమైన అడవిగా ఈ కెబిఅర్ నేషనల్ పార్క్ ని పేర్కొనవచ్చు. పాలస్ మరియు పరిసర ప్రాంతాలని 1998 లో నేషనల్ పార్క్ గా గుర్తించారు.ఈ ప్రాంతం పేరు మార్చబడినా ఈ పాలస్ పేరు మాత్రం అలాగే ఉంది. తెల్లవారు జామున అలాగే సాయంత్రం వేళల్లో ఈ పార్క్ చాలా హడావిడిగా కనిపిస్తుంది. చాలా మంది వ్యాయామాల కోసం మరియు తాజా గాలి పీల్చడం కోసం ఇక్కడికి ఈ సమయాల లోనే ఎక్కువగా విచ్చేస్తుంటారు. ఆరోగ్యకరంగా ఉండడానికి జాగింగ్, వాకింగ్ వంటివి చేస్తూ ఏంతో మంది ఇక్కడ కనిపిస్తూ ఉంటారు.

ఎన్నో రకాల పక్షులకి, సీతాకోకచిలుకలకి ఈ పార్క్ స్థావరం.నెమళ్ళు, అడవి పిల్లులు, పాంగొలిన్స్ మరియు ఇండియన్ సివెట్ ల వంటి జంతువులని ఇక్కడ గమనించవచ్చు. ఈ పార్క్ లో జంతువుల మరియు పక్షుల దాహాన్ని తీర్చేందుకు ఎన్నో చిన్న చిన్న కొలనులని ఏర్పాటు చేసారు. పర్యాకులు, పక్షులకి, జంతువులకి ఆహారం అందించడం నిషేధం.

దుర్గం చెరువు


హైదరాబాద్ లోని రంగారెడ్డి జిల్లాలో ఉన్న దుర్గం చెరువు మంచి నీటి సరస్సు. జూబ్లీ హిల్స్ మరియు మాదాపూర్ ప్రాంతానికి మధ్యలో దాగి ఉండడం వల్ల ఈ సరస్సు ని రహస్యపు సరస్సుగా కూడా పిలుస్తారు. హైదరాబాద్ ప్రజలలోఈ సరస్సుకి అత్యంత చారిత్రక ప్రాముఖ్యత కలిగినది. ఖుతుబ్ షా సామ్రాజ్యంలో, గోల్కొండ కోటలో ఇంకా కోట సమీపంలో ఉన్న ప్రజలకి మంచి నీటి సదుపాయం ఈ సరస్సు కల్పించింది.రైతులు వ్యవసాయంలో నీటి పారుదల కోసం ఈ సరస్సుని ఉపయోగించేవారు. ప్రధాన పర్యాటక ఆకర్షణ గా ఈ సరస్సుని తయారు చెయ్యడం కోసం 2001 లో రాష్ట్ర ప్రభుత్వం ఈ సరస్సుని అభివృద్ధి చెయ్యాలని నిర్ణయించింది. కొద్ది కాలం లో నే ఈ సరస్సు ఏంతో ప్రాచుర్యం పొందింది. ఇక్కడ చేపలు పట్టేందుకు అనువుగా ఉంటుంది. ఎంతో మంది సరదాగా చేపలు పట్టడం కోసం ఇక్కడికి వస్తారు.

ఈ ప్రాంతాన్ని ప్రధాన పర్యాటక ఆకర్షణగా మలిచేందుకు వెలుగులు, రాక్ గార్డెన్, ఫ్లోటింగ్ ఫౌంటెన్ అలాగే కృతిమ జలపాతాల వంటి ఎన్నో ఆకర్షణలని ఇక్కడ జోడించారు. ట్రెక్కింగ్, రాక్ క్లైంబింగ్ ఇంకా రాపెల్లింగ్ వంటి వివిధ వినోద కార్యక్రమాలు ఇక్కడ ఎన్నో ఉన్నాయి.

మృగవాణి నేషనల్ పార్క్


హైదరాబాద్ నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిల్కూర్ లో మృగవాణి పార్క్ ఉంది. వివిధ రకాలైన జంతుజాలం మరియు వ్రుక్షజాలం కలిగి ఉండడం ఈ పార్క్ విశిష్టత. వేల మంది పర్యాటకులు ఈ పార్క్ ని సందర్శించేందుకు ప్రతి సంవత్సరం తరలి వస్తారు. దాదాపు 600 రకాల మొక్కలు ఈ పార్క్ లో కనబడతాయి.వెదురు, పలాస్, గంధం, టేకు, పైకస్ మరియు రేలా వంటి చెట్లని ఈ పార్క్ లో గమనించవచ్చు. ఇండియన్ హేర్, చీతా నుండి సివెట్ మరియు ఫారెస్ట్ కాట్ వరకు అలాగే వైల్డ్ బొర్ నుండి సాంబార్ వరకు ఇక్కడ గమనించవచ్చు. ఇండియన్ రాట్ స్నేక్ ఈ పార్క్ ప్రాంగణంలో గమనించవచ్చు. రస్సెల్ వైపర్, కోబ్రా మరియు పైతాన్ లు కూడా ఇక్కడ కనిపిస్తాయి.

ఫ్లవర్ పెక్కర్ పక్షి ఇక్కడ సాధారణంగా కనబడుతుంది. ఈ పార్క్ ని రోజు మొత్తంలో ఏ సమయంలోనైనా సందర్శించవచ్చు. అంతే కాదు సాహసవంతులైన పర్యాటకులు ఈ పార్క్ లో ఉండే కాటేజ్ లని అద్దెకి తీసుకుని రాత్రి పూట వైల్డ్ లైఫ్ ని ఆనందించవచ్చు.

నెహ్రూ జూలాజికల్ పార్క్


మీర్ ఆలం ట్యాంక్ కి సమీపంలో ఉన్న ఈ నెహ్రూ జూలాజికల్ పార్క్ ప్రఖ్యాతి పొందిన పర్యాటక ఆకర్షణ కేంద్రం. నిజానికి, హైదరాబాద్ లో ఉన్న మూడు ప్రధాన ఆకర్షణ లలో ఒకటిగా ఈ పార్క్ స్థానం సంపాదించుకుంది. 1959 లో ఏర్పాటయిన ఈ పార్క్ ప్రజలకి 1963 లో అందుబాటులోకి వచ్చింది. వివిధ రకాల జంతువులు, సరీసృపాలు మరియు పక్షులు ఈ జూ లో ఉన్నాయి. టైగర్, పాంథర్, ఏషియాటిక్ లయన్, పైథాన్, కొండచిలువ, ఒరాంగుటాన్, మొసలి, పక్షులు మరియు ఏంటేలోప్స్, జింకలు, ఇండియన్ రైనో వంటి సహజమైన జంతువుల జాతులని ఈ జూ లో గమనించవచ్చు. జంతువులు మరియు పక్షులకి సహజసిద్దమైన నివాసాలని ఏర్పాటు చెయ్యడంలోజాగ్రత్త వహించారు.

ఈ జూ సందర్శన వల్ల ఆహ్లాదంతో పాటు విజ్ఞానం కలుగుతుంది. పర్యాటకులు తమ పిల్లలతో ఈ జూ ని ఎక్కువగా సందర్శిస్తారు. ఏనుగు స్వారిలు, సఫారీలు ఈ జూ లో అందుబాటులో ఉంటాయి. ఈ జూ ప్రాంగణంలో నేచురల్ హిస్టరీ మ్యూజియం కూడా ఉంది.

ప్రవేశ రుసుం 20 రూ/- పెద్దలకు, పిల్లలకు 10 రూ/- ట్రేన్ రైడ్ అయితే పెద్దలకు 15 రూ/-, పిల్లలకి 5 రూ/-

సందర్శించు సమయం ఏప్రిల్-జూన్ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు. జులై-మార్చి ఉదయం 8:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. సెలవు ప్రతి సోమవారం సెలవు.

మహావీర్ హరిన వనస్థలి నేషనల్ పార్క్


హైదరాబాద్ నగరంలో ఉన్న వనస్థలిపురంలో ఈ మహావీర్ హరిన వనస్థలి నేషనల్ పార్క్ ఉంది. హైదరాబాద్ నుండి విజయవాడకి వెళ్ళే దారిలో ఈ నేషనల్ పార్క్ ఉంది. ఈ జింకల పార్క్ లో అనేక రకాలైన జింకలని గమనించవచ్చు. పురాతన కాలంలో నిజాములు వేటాడే ప్రాంతంగా ఈ పార్క్ ని ఉపయోగించుకునే వారు. భారత దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత ఈ పార్క్ ని నేషనల్ పార్క్ గా మార్చారు. వేటాడే ఈ ప్రాంతాన్ని వృక్ష మరియు జంతు జాల సంరక్షణకై పార్క్ గా మార్చారు. జింకలతో పాటు ఇక్కడ బ్లాక్ బక్స్ మరియు ముళ్ళపండులని కూడా ఇక్కడ గమనించవచ్చు. తెల్లకొంగలు, కింగ్ఫిషర్లు, నీటి కాకులు, చిన్న తోక గద్దలు, భారత సరస్సు నారాయణ పక్షులు ఇక్కడ కనబడే నిటి పక్షులు.

ఈ పార్క్ కి చాలా సులభంగా చేరుకోవచ్చు. బస్సు ద్వారా లేదా అద్దెకి తీసుకున్న ప్రైవేటు టాక్సీ ల ద్వారా హైదరాబాద్ నుండి ఈ నేషనల్ పార్క్ కి సులభంగా చేరుకోవచ్చు. షటిల్ సర్విసుల ద్వారా ఈ పార్క్ లోపల గైడెడ్ టూర్ అందుబాటులో ఉంది. పార్కు లో కనబడే జంతువుల సంగ్రహావలోకనం కోసం ఒక పెద్ద స్థంబం పర్యాటకుల కోసం నిర్మించబడింది.

ప్రవేశ రుసుం 5 రూ/-

సందర్శించు సమయం సంవత్సరం పొడవునా సందర్శించవచ్చు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు. సెలవు ప్రతి సోమవారం సెలవు.

నెక్లెస్ రోడ్


నెక్లెస్ రోడ్ అనేది ఒక ప్రాంతం. ఈ ప్రాంతం హుస్సేన్ సాగర్ అవలివైపు ఉన్నది. ఇది సంజీవయ్య పార్క్ మరియు ఎన్ టి ఆర్ పార్క్ ల మధ్యలో ఉన్నది. ఇక్కడికి ప్రేమికులు క్రమం తప్పకుండా వస్తుంటారు.

ఎలా వెళ్ళాలి?

విమానాశ్రయం

హైదరాబాదులో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. ఇక్కడి నుండి భారతదేశంలోని అన్నిప్రధాన నగరాలకు మరియు కొన్ని అంతర్జాతీయ గమ్యములకు విమాన ప్రయాణ సౌకర్యము ఉంది.

రైలు రవాణా

హైదరాబాదుకు జంటనగరమైన సికింద్రాబాదులో దక్షిణమధ్య రైల్వే ముఖ్యకార్యాలయం ఉంది.ఇక్కడి నుండి దేశంలోని అన్ని ప్రాంతాలకు రైలు సౌకర్యం ఉంటుంది. హైదరాబాదులో మొత్తం మూడు ముఖ్య రైల్వేస్టేషన్లు ఉన్నాయి 1)సికింద్రాబాదు రైల్వేస్టేషను 2)నాంపల్లి రైల్వేస్టేషను (హైదరాబాదు దక్కన్) 3)కాచిగూడ రైల్వేస్టేషను.హైదరాబాదులో మల్టీ మోడల్ రవాణా వ్యవస్థ(MMTS) ఉంది.

రోడ్డు రవాణా

హైదరాబాదు దేశంలోని చాలా నగరాలతో రోడ్డుద్వారా అనుసంధానమై ఉన్నది. వాటిలో బెంగళూరు, ముంబాయి, పూణె, నాగ్‌పూర్, విజయవాడ, వరంగల్, గుంటూరు మరియు కర్నూలు చెపుకోతగ్గవి.జాతీయ రోడ్లయిన ఎన్‌హెచ్-7, ఎన్‌హెచ్-9 మరియు ఎన్‌హెచ్-202 నగరంలో నుండే వెళ్తుంటాయి.

హైదరాబాద్......ప్రాముఖ్యత

హైదరాబాద్ నగరానికి 400 సంవత్సరాల చరిత్ర కలదు. ఈ మహానగరం డెక్కన్ పీఠభూమి ప్రాంతం లో విస్తరించి ఉంది. ప్రస్తుతం 10 సంవత్సరాల పాటుహైదరాబాద్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి రాజధాని గా 2014 జూన్ 2 నుండి అమలులో ఉన్నది. హైదరాబాద్ నగరాన్ని ఎక్కువగా మహమ్మదీయులు పరిపాలించారు.ఈ నగరం మూసి నది ఒడ్డున కలదు. ఈ నగరానికి ప్రత్యేక ఆకర్షణ చార్మినార్. దీనిని మొహమ్మద్ కులీ కుతుబ్‌షా నిర్మించాడు. హైదరాబాదు నగరాన్ని భాగ్యనగరం అని కుడా పిలుస్తారు.

చూడదగిన ప్రదేశాలు

గోల్కొండ కోట,చార్మినార్, ఫలక్ నూమా ప్యాలెస్, బిర్లా మందిరం,కుతుబ్ షాహిటూంబ్ లు,సాలార్ జంగ్ మ్యూజియం, నెహ్రూ జూ పార్కు, మక్కా మసీదు,రామోజి ఫిల్మి సిటి, చిలుకూరి బాలాజి దేవాలయం మొదలగునవి.

చార్మినార్


చార్మినార్ ఆగ్రాకి తాజ్ మహల్, పారిస్ కి ఈఫిల్ టవర్ ఎలాగో హైదరాబాద్ కు చార్మినార్ అలాగన మాట. మహమ్మద్ కులికుతుబ్ షా దీనిని 1591 వ సంవత్సరంలో కట్గించెను. చార్మినార్ చుట్టూ ఉండే స్దంభాలు 48.7 మీ. ఎత్తు కలిగి ఉంటాయి. పర్యాటకులు చార్మినార్ లోపలి కట్టడాలను,వాటి అందాలను ఆస్వాదించవచ్చు. పర్యాటకులు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సందర్శించవచ్చు.

గోల్కొండ కోట


గోల్కొండ కోట భారతదేశంలోని కోటలలో ముఖ్యమైంది. కుతుబ్ షాహి వంశస్థులు క్రీ.శ.1518 నుండి 1687 వరకు పరిపాలించిరి.ఇది చాలా ప్రసిద్ధి చెందిన కోట. ఇక్కడ భక్త రామదాసు బందీ ఖానా ఉంది.

మక్కా మసీదు


మక్కా మసీదు చార్మినార్ సమీపాన కలదు.మసీదులోని ఆర్చి పై భాగాన్ని మక్కా నుండి తీసుకువచ్చిన ఇటుకలతో నిర్మించినారు.దీనికి శంకుస్థాపన చేసినది కుతుబ్ షాహి వంశస్థులు అయినప్పటికి 1694లొ ఔరంగజేబు దీనిని పూర్తిచేసెను.

ఫలక్ నూమా ప్యాలెస్


ఫలక్ నూమా ప్యాలెస్ చార్మినార్ కు 5 కి.మీ. దూరంలో కలదు.ఇది 32 ఎకరాలలో విస్తరించి ఉన్న రాజ భవంతి.దీనిని అప్పటి హైదరాబాద్ ప్రధాని అయిన నవాబు వికర్-ఉల్-ఉమ్రా కట్టించెను.ఉర్దూలో ఫలక్ నూమా అంటే "లైక్ ద స్కై" లేదా "మిర్రర్ ఆఫ్ ద స్కై" అని అర్థం.

బిర్లా మందిరం


బిర్లా మందిరం పాలరాతి మార్బుల్ తో నిర్మించిన కట్టడం.ఇక్కడ శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్నాడు. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర స్వామికి ప్రతిరూపంగా దీనిని కొలుస్తారు.

కుతుబ్ షాహి టూంబ్ లు


కుతుబ్ షాహి టూంబ్ లు బులందర్వాజా ప్రాంతం నుండి కిలోమీటర్ దూరంలో ఉన్నాయి. ఇక్కడ కుతుబ్ షాహి వంశస్థుల సమాధులు ఉన్నాయి. బూడిద రంగు గ్రానైట్ రాళ్ళతో నిర్మించిన ఈ టూంబ్ లు పర్శియన్, పాథాన్ మరియు హిందూ రీతి కట్టడాలను పోల్చి ఉంటాయి.

హుస్సేన్ సాగర్


హుస్సేన్ సాగర్ సరస్సు కలదు.ఈ సరస్సును ఇబ్రహీం కులి కుతుబ్ షా కాలంలో హజరత్ హుస్సేన్ షా వలి క్రీ.శ.1562 లో కట్టించెను,లోతు 32 అడుగులు.ఇది 5.7 చ.కి.మీ. విస్తరించి ఉంది మరియు ఇది మూసీ నదికి ఉప నది. హుస్సేన్ సాగర్ సరస్సు మధ్యలో గౌతముని విగ్రహాన్ని ప్రతిష్ఠించినారు దీని ఎత్తు 18 మీ..

నెహ్రూ జూ పార్కు


నెహ్రూ జూ పార్కు 6 అక్టోబర్ 1963 లో ప్రారంభించినారు. జూలో సుమారు 100 ల రకాలైన జంతు సంపద కలిగి ఉంది.దీనిని ప్రస్తత తెలంగాణ రాష్ట్రంలోని అటవీ శాఖ నిర్వహిస్తుంది.ఇక్కడ ఆసియా ఖండపు సింహం, బెంగాల్ పులి,ఖడ్గ మృగం,వివిధ జాతుల కోతులు,పక్షులు,పాములు మరియు ఏనుగులు,మోసళ్ళు మొదలగునవి చూడవచ్చు.

సాలార్ జంగ్ మ్యూజియం


భారతదేశంలోని మూడు ప్రధానమైన మ్యూజియాలలో సాలార్ జంగ్ మ్యూజియం ఒకటి.ఈ మ్యూజియంలో చరిత్రకి సంభంధించిన అధ్బుత కళాఖండాలు ,చిత్రాలు(పేంటింగ్),దుస్తులు, సిరామిక్,మెటాలిక్ వస్తువులు,నవాబులు వాడినటువంటియుధ్ధసామాగ్రి,కార్పెట్లు,గడియారాలు మరియు జపాన్,చైనా,ఇండియా,నేపాల్,పర్షియా,యూరప్,నార్తమెరికా నుండి దిగుమతి కాబడిన గృహోపకరణాలు ఉన్నాయి.ఇక్కడ గోడ గడియారం ప్రత్యేకమైనది.

చిలుకూరి బాలాజి దేవాలయం

ఈ దేవాలయం "వీసా బాలాజి టెంపుల్" లేదా "వీసా గాడ్" గా ప్రసిద్ధి చెందినది.ఇది ఉస్మాన్ సాగర్ సరస్సు ఒడ్డున అక్కన్న,మాదన్న నిర్మించిన పురాతన హిందూ దేవాలయం.ఈ టెంపుల్ లో హుండి ఉండదు.వివిఐపి దర్శనాలు ఉండవు.ఇది మెహదీపట్నంకి 17 కి.మీ. దూరంలో కలదు.ఈ గుడిని 13 వ శతాబ్ధంలో కట్టించినారు.

రామోజి ఫిల్మి సిటి


1666 ఎకరాలలో నిర్మించిన రామోజి ఫిల్మి సిటి ప్రపంచంలోనే విశిష్ఠమైన ఫిల్మి సిటిగా గుర్తింపు తెచ్చుకుంది.దీనిని రామోజి రావు అనే సినిమా నిర్మాత 1996 లో ప్రారంభించెను.ఇక్కడ సినిమా షూటింగులు జరుగుతాయి అంతేకాదు ఈ ఫిల్మి స్టూడియో గిన్నిస్ రికార్డు కూడా సాధించింది కూడా.

ఆనంద బుద్ధ విహార

హైదరాబాద్ లో ఒక చిన్న కొండ మీద ఉన్న ఆనంద బుద్ధ విహార ఆసక్తికరమైన బుద్దుని ఆలయం. ఈ ఆలయాన్ని సందర్శించే మీ మొదటి చూపే ఆశ్చర్యానుభూతుల్ని కలిగిస్తుంది. ఈ కొండని ఎక్కగలిగితే ఈ ఎత్తుపైనుండి అద్భుతమైన నగరం యొక్క అందాలని వీక్షించవచ్చు. బుద్ధిష్ట్ నిర్మాణ శైలి ని దృష్టిలో పెట్టుకుని ఈ ఆలయ నిర్మాణం చేపట్టారు.

అతి పెద్ద వైన కిటికీలు కలిగి ఉండడం వల్ల సహజ సిద్దమైన సూర్య రస్మి ఈ ఆలయం లో ఉండే పెద్ద హాల్ లోకి వస్తుంది. ఈ ఆలయంలో ప్రతి చోటా వాతావరణం ఏంతో నిశబ్దంగా, ప్రశాంతంగా ఉండి మనస్సుకు హాయిగా ఉంటుంది. ఈ ఆలయంలో కి అడుగిడిన వెంటనే దైనందిన జీవితం యొక్క బాధలని మరచిపోతాము. బంగారం తో తయారు చేసిన భారీ బుద్ధుడి విగ్రహం ఈ హాల్ మధ్యలో ఉంటుంది. ఏంతో మంది భక్తులు ఈ విగ్రహం చుట్టూ కుర్చుని ధ్యానం చేస్తూ ఉంటారు.

అస్మాన్ గర్ పాలస్, హైదరాబాద్

'ఆకాశం యొక్క ఇల్లు' అనే అర్ధం వచ్చేటట్టు పేరు ఉన్న ఆస్మాన్ గర్ పాలస్ హైదరాబాద్ లో ని ఒక చిన్న కొండ మీద నిర్మితమై ఉంది. ప్రస్తుతం, పురావస్తు శేషాలని ప్రదర్శించే మ్యూజియంగా ఈ పాలసు మారింది. సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్ ఈ పాలసు ప్రాంగణం లో ఉంది. 1885 లో హైదరాబాద్ యొక్క అప్పటి ప్రధాన మంత్రి అయిన ఆస్మాన్ జా చేత రూపొందించి నిర్మించబడింది.

ప్రధాన మంత్రి కి చెందిన పైగర్హ్ కుటుంబీకుల కోసం ఈ పాలసు ప్రత్యేకించి రూపొందించబడినది. అతనికి ఆకాశాన్ని తాకేంత ఎత్తులో తన కలల సౌధం ఉండాలని కోరిక. అందువల్ల, కొండ పైన ఈ సౌధం నిర్మాణాన్ని చేపట్టారు. ఆ కాలంలో ప్రాచుర్యం పొందిన నిర్మాణ శైలిలో ఈ భవన నిర్మాణం జరిగింది. అప్పుడు ప్రాచుర్యం పొందిన నిర్మాణ శైలి గోతిక్. గోతిక్ శైలిలోనే ఈ ఆస్మాన్ గర్ పాలసు యొక్క నిర్మాణం ఉంది. మధ్యయుగపు యురోపెయన్ కోట ఆకృతిలో ఈ భవన నిర్మాణం జరిగింది.

బిర్లా ప్లానిటోరియం/ బిర్లా సైన్స్ మ్యూజియం

హైదరాబాద్ లో ఉన్న బిర్లా ప్లానిటోరియం దేశం లో నే మొట్ట మొదటి ప్లానిటోరియం గా ఖ్యాతి గడించింది. ఇది అప్పటి ముఖ్యమంత్రి అయిన ఎన్ టీ రామారావు చేత 1985 లో ప్రారంభించబడింది. వైజ్ఞానిక, సాంకేతిక విజ్ఞానాన్ని అందించే ఈ గొప్ప ప్రదేశాన్ని పిల్లలతో సందర్శించాలనుకునే వారు మరువకూడదు.

ఈ ప్లానిటోరియం లో విశ్వానికి సంబంధించిన ఎన్నో రహస్యాలు తెలుసుకోవచ్చు. ఈ అనుభవం అద్వితీయం మరియు అనుపమానం అయినది. ఇక్కడ ఉన్నటువంటి అత్యాధునిక పరికరాలు పర్యాటకులకి చక్కటి సంతృప్తి కరమైన అనుభవాన్ని మిగులుస్తాయి. విజ్ఞానంతో పాటు విశ్వ పర్యటన చేసినటువంటి వినోదాన్ని కూడా అందిస్తుంది ఈ ప్లానిటోరియం. బిర్లా ప్లానిటోరియం విజ్ఞానం మరియు వినోదాన్ని అందిస్తుందనడంలో అతిశయం లేదు.

ఢొలా రి దని

రాజస్థానీ గ్రామాల సాంప్రదాయ నమూనా తో ధోలా రి ధని ని హైదరాబాద్ నగరం లోతయారుచేసారు. ప్రధాన నగరం నుండి చాలా దూరంలో ఉండడం వల్ల ఈ ప్రాంతం దైనందిన హడావిడి నుండి దూరంగా వారాంతపు సెలవలు గడపడానికి అనువుగా ఉంటుంది. సికింద్రాబాద్ నుండి ఈ ప్రాంతం 11 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. థీమ్ రెస్టారెంట్ గా ఈ ప్రాంతం ప్రసిద్ది చెందింది.

మెజెస్టిక్ గేటు నుండి ఈ ప్రాంతానికి ప్రవేశించినప్పుడు రాచరిక సంబంధమైన అనుభూతి కలుగుతుంది. రాజస్థానీ కి సంబంధించిన జానపద కథలు జానపద సాహిత్యపు ప్రపంచం లోకి అడుగిడినట్టు అనిపిస్తుంది. సాయంత్రాలు, ఈ ప్రాంతం మొత్తం 2000 లాంతర్లతో ఈ ప్రాంతం వెలుగులు చిమ్ముతుంది. ఈ ప్రాంతంలో ఎన్నో రకాల వినోద కార్యక్రమాలు ఉంటాయి.

ఒంటె మరియు గుర్రపు స్వారీలు, జానపద సంగీతం మరియు డాన్సులు, తోలుబొమ్మ ప్రదర్శనలు, రైన్ డాన్సులు మరియు బోటింగ్ వంటివి ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. ఇక్కడ జరిగే ఎన్నో తెలుగు సినిమా షూటింగ్ లు కూడా మీరు గమనించవచ్చు.

హుస్సేన్ సాగర్ లేక్

హైదరాబాద్ యొక్క చరిత్రలో మరియు భౌగోళిక ప్రాంతంలో ఒక మైలురాయి వంటిది ఈ హుస్సేన్ సాగర్ చెరువు. 1562 లో ఈ మానవ నిర్మిత చెరువుని హజ్రత్ హుస్సేన్ షా వాలి నిర్మించారు. మూసీ నదికి అనుబంధంగా ఈ చెరువు నిర్మించబడినది. ఈ చెరువుని నిర్మించడంలో ముఖ్య ఉద్దేశం ఈ నగరానికి సాగు నీరు అందించడం.

ఆ అతిపెద్ద చెరువు ఎల్లప్పుడూ నీటితో నిండి ఉండి సికింద్రాబాద్ మరియు హైదరాబాద్ జంట నగరాలను కలుపుతూ ఉంటుంది. ఈ చెరువు చుట్టూ నిర్మితమైన నెక్లస్ రోడ్డు రాత్రి పూట లైట్లతో వజ్రాలు పొదగబడిన నెక్లస్ లాగా మెరుస్తూ ఉంటుంది. నెక్లస్ రోడ్డు మరియు హుస్సేన్ సాగర్ చెరువు కలిసి మనోహరంగా రాత్రి పూట కనిపిస్తాయి.

ఏక శిలా విగ్రహమైన బుద్ధుని విగ్రహం 1992 ఈ హుస్సేన్ సాగర్ చెరువు మధ్యలో ప్రతిష్టించారు. పడవ ద్వారా ఈవిగ్రహం ఉన్న ప్రదేశానికి చేరుకోవచ్చు. హైదరాబాద్ లో ఉన్నప్పుడు తప్పని సరిగా చూడవలసిన ఆకర్షణలలో ఒకటి ఈ ప్రదేశం.

హైటెక్ సిటీ

హైదరాబాద్ లో ఉన్న హైటెక్ సిటీ లేదా హైదరాబాద్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ ఒక టౌన్షిప్ ప్రాంతం. మాదాపూర్ మరియు గచ్చిబౌలి శివార్లకి ఈ టౌన్ షిప్ ప్రాంతం అత్యంత సమీపంలో ఉంది. ఈ మిలీనియం ప్రారంభంలో భారత దేశపు ఐటి కేంద్రంగా బెంగళూర్ ఉద్భవించిన తరువాత అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ కే ప్రధాన ఐటి కేంద్రంగా హైదరాబాద్ నగరాన్నితీర్చిదిద్దాలనుకున్నారు. అత్యుత్తమ మౌలిక సదుపాయాలని కలిగిస్తూ ఎన్నో ఐటి కంపెనీలని హైదరాబాద్ నగరానికి ఆహ్వానించారు. సైబర్ టవర్స్ ఈ హైటెక్ సిటీ ప్రాజెక్ట్ లో మొదటి దశ, అలాగే సైబర్ గేట్ వే రెండవ దశ. జి ఇ కాపిటల్ ఇంకా ఒరాకిల్ కార్పొరేషన్ వంటి ఎన్నో బహుళ జాతి సంస్థల ఆఫీసులు ఈ సైబర్ టవర్స్ లో ఉన్నాయి.

సత్యం కంప్యూటర్స్, విప్రో, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, మైండ్ స్పేస్, మరియు ఎల్ అండ్ టి, ఇన్ఫోసిస్, ఎపిఐఐసి, ఐబియం, గూగుల్ వంటి ఎన్నో కంపెనీ లు ఈ హైటెక్ సిటీ లేదా సైబర్ సిటీ లో ఉన్నాయి. ఇన్ఫోసిస్ వంటి ఎన్నో ప్రముఖమైన కంపెనీ లు వాటి యొక్క రోజు వారి అవసారాలకు తగినట్టుగా సెల్ఫ్ సఫిషియంట్ కాంపస్ లని ఏర్పాటు చేసుకున్నాయి.

హైదరాబాద్ బొటనికల్ గార్డెన్స్

కోట్ల విజయభాస్కర రెడ్డి బొటానికల్ గార్డెన్ గా పేరుగన్న హైదరాబాద్ బొటనికల్ గార్డెన్స్ హైదరాబాద్ లో ని మరి యొక ప్రత్యేక ఆకర్షణ. హైదరాబాద్ రైల్వే స్టేషన్ నుండి 16 కిలో మీటర్ల దూరంలో హైటెక్ సిటీ కి దగ్గరలో ఈ గార్డెన్ ఉంది. హైదరాబాద్-ముంబై ముఖ్య రహదారిపై ఈ గార్డెన్ ఉంది. బీజద్రవ్యం యొక్క అభివృద్ధి మరియు పరిరక్షణ ఈ బొటనికల్ గార్డెన్ ముఖ్య ఉద్దేశం.

అత్యాధునిక సాంకేతిక పరికరాలతో గాడ్జెట్ లతో ఈ గార్డెన్ ని తీర్చిదిద్దారు. వృక్షజాలం మరియు జంతుజాలాన్ని పరిరక్షించడంతో పాటు ప్రకృతిని కాపాడాలనే సద్భావాన్నిఈ గార్డెన్ బోధిస్తుంది. ప్రస్తుతం, ఈ గార్డెన్ లో ని అయిదు విభాగాలని సందర్శకులకు అందుబాటు లో ఉంచారు.

పెరటి ఔషద మొక్కలు, ఆర్నమెంటల్ ప్లాంట్స్, అక్వాటిక్ ప్లాంట్స్, కలప మొక్కలు, వెదురు మొక్కలు, పళ్ళ చెట్లు ఇంకా ఎన్నో ఈ విభాగాలలోకి వస్తాయి. పర్యావరణవేత్త కాకపోయినా అందంగా నిర్మించబడిన ఈ గార్డెన్ ని చూడడానికి పర్యటించవచ్చు. ఇక్కడ అందమైన పచ్చిక బయళ్ళు నీటి చెలమలు చిన్న చిన్న కొండలు పర్యాటకులు చూసి సంతోషించవచ్చు.

లాడ్ బజార్

హైదరాబాద్ పాత నగరం లో ఉన్న లాడ్ బజార్ లేదా చూడి బజార్ అందమైన డిజైన్ ల తో ముస్తాబయిన గాజులకి ప్రసిద్ది. ఖుతుబ్ షా కుటుంబం హైదరాబాద్ ని తన హయాం లో కి తీసుకున్నప్పటి నుండి ఉన్న ఈ మార్కెట్ చాలా పురాతనమైనది. ఈ ప్రాంతం నగరం లో నే అత్యంత రద్దీగా ఉండే చోట ఉంది.

చార్మినార్ అలాగే చౌమహల్లా పాలసు వంటి కొన్ని చారిత్రాత్మక ప్రదేశాలకి దగ్గరలో ఉండడం వల్ల ఈ ప్రాంతాన్ని సందర్శించడం చాలా సులభం. పెళ్లి పనుల షాపింగ్ లో భాగంగా ప్రతి సంవత్సరం ఇక్కడికి ఏంతో మంది కాబోయే పెళ్లి కూతుర్లు వస్తారు. పెళ్లి వేడుకలని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు కావలసిన ప్రతి వస్తువు ఈ లాడ్ బజార్ లో లభిస్తుంది.

అయినా ఈ మార్కెట్ ప్రత్యేకించి అమెరికన్ వజ్రాలతో పొదగబడిన లాకెర్ లేదా లాడ్ గాజులకి ప్రసిద్ది. హైదరాబాద్ నగరానికి వచ్చి ఈ ప్రాంతం లో షాపింగ్ చెయ్యకపోవడం మాత్రం బాధాకరమైన విషయం.

ఐమాక్స్

ప్రసాద్స్ ఐ మాక్స్ లేదా ఐ మాక్స్ థియేటర్ అని పిలువబడే ఈ థియేటర్ ఈ తరహా లో హైదరాబాద్ లో మొట్టమొదటిది. ఇక్కడి స్తానికులకు మరియు పర్యాటకులకు ఏకబిగిన వినోదాని పంచటానికి నిర్మితమైనది ఈ చిత్ర సముదాయం. ఈ ధియేటర్ లో ఒకే సమయం లో వివిధ చిత్రాలను ప్రదర్సించేందుకు అనువుగా చాలా తెరలను ఏర్పాటు చేసారు.

హాయిగా కుర్చోనగాలిగీ సీటింగ్ తో స్పష్టమైన దృశ్యం చూడతగ్గ తెరలతో ఈ థియేటర్ లో సినమా చూడటం అద్భుత మయిన అనుభవాన్ని మిగులుస్తుంది. ఇక్కడకు విచ్చేసిన వారి ఆకలి తీర్చుకోటానికి చక్కటి ఫుడ్ కోర్ట్ ఉన్నది. ఈ ఫుడ్ కోర్ట్ లో వివిధ రకాల ఆహార పదార్థాలు లభిస్తాయి.దాహార్తి ని తీర్చటానికి ఇక్కడ ఎన్నో శీతల పానీయాలు, మిల్క్ షేకు లు కూడా లభిస్తాయి.

అంతే కాకుండా షాపింగ్ మీద అమితమైన ఆసక్తి కలిగిన వారికి అంతర్జాతీయ బ్రాండ్స్ ఇంకా విస్తృతం గా లభించే డిజైనర్ వస్తువులు లభిస్తాయి. సాహసవంతులు గ్రాప్లింగ్ లో ఇంకా చాల ఆసక్తి కలవారు స్కేరీ హౌస్ ని సందర్శించవచ్చు. ఐ మాక్స్ వినోదం లో అత్య్త్తమమైనది.

మీర్ ఆలం ట్యాంక్

హైదరాబాద్ - బెంగుళూరు రహదారి మధ్యలో ఉన్న మీర్ ఆలం ట్యాంక్ అనే సరస్సు నెహ్రు జూలాజికల్ పార్క్ కి అత్యంత సమీపంలో ఉంది. హుస్సేన్ సాగర్ అలాగే హిమాయత్ సాగర్ లు నిర్మాణం కాక ముందు నుండే హైదరాబాద్ నివాసితులకి త్రాగు నీరు అలాగే వంట అవసరాల కోసం నీరు అందించేందుకు ఈ మీర్ ఆలం సరస్సు ఉపయోగపడేది.

హైదరాబాద్ రాష్ట్రానికి అప్పటి ప్రధాని మంత్రిగా వ్యవహరించిన మీర్ ఆలం బహదూర్ చేత 1804 లో ఈ సరస్సు నిర్మించబడినది. హైదరాబాద్ మూడవ నిజాం అయిన మీర్ అక్బర్ అలీ ఖాన్ సికందర్ జాహ్ ఆసిఫ్ జాహ్ హయాంలో అతని చేత ఈ సరస్సు నిర్మాణమయింది. ఈ సరస్సుని నిర్మించడానికి దాదాపు రెండు సంవత్సరాలు.

ఈ సరస్సు వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. టిప్పు సుల్తాన్ పై యుద్ధం చెయ్యడానికి మీర్ ఆలం నిజాం బలగాలని పంపారు. టిప్పు సుల్తాన్ ని ఓడించిన తరువాత మీర్ ఆలం శ్రీరంగపట్నం నుండి తీసుకున్న ఖజనాతో ఈ సరస్సుని కట్టారని నమ్ముతారు.

ఒస్మాన్ సాగర్ లేక్

ఈ ఒస్మాన్ సాగర్, గండిపేట్ గా స్థానికులచే పిలవబడుతుంది. ఇది మరి యొక మానవ నిర్మిత చెరువు. మూసీ పైన డ్యాం ని నిర్మించే సమయంలో నిర్మితమైనది ఈ చెరువు. 1920 లో నిర్మిత మైన ఈ చెరువు హైదరాబాద్ కి మరియు చుట్టు పక్కల గ్రామాలకి మంచి నీటి అవసరాలని అప్పటినుండి తీరుస్తున్నాది. అంతే కాక ఈ చెరువు వరదల నుండి ఈ నగరాన్నిరక్షిస్తున్నది. ఉదాహరణకి 1908 లో ని వరదలని చెప్పుకోవచ్చు.

ఆఖరి నిజాం అయిన ఒస్మాన్ అలీ ఖాన్ యొక్క పరిపాలనా కాలంలో ఈ చెరువు నిర్మితమైనది. అయన పేరు మీద ఈ చెరువుని ఒస్మాన్ సాగర్ లేక్ అని పిలుస్తారు. ఈ చెరువు పక్కనున్న రాయల్ గెస్ట్ హౌస్ నుండి చెరువుని ఆసాంతం చూడవచ్చు.ఈ అధ్బుతమైన సాగర్ మహల్ ని నిజాం తన వేసవి విడిదిగా వాడే వారు.

ఈ అద్భుత భవనం ఇప్పుడు చారిత్రక చిహ్నం గానే కాకుండా ఈ చెరువుని అధ్బుతంగా చూపించే ప్రదేశంగా కూడా ఉన్నది. విలాసవంతమైన విడిదిగా ఈ భవనాన్ని ఉపయోగిస్తున్నారు.

సికింద్రాబాద్

హైదరాబాద్ జంటనగరంగా సికింద్రాబాద్ ప్రసిద్ది. అసఫ్ జహి రాజవంశం లో హైదరాబాద్ కి మూడవ నిజాం అయిన సికందర్ జాహ్ పేరు నుండి ఈ నగరానికి సికింద్రాబాద్ అనే పేరు వచ్చింది. 1806 లో ఏర్పాటయిన సికింద్రాబాద్ స్వాతంత్రం వచ్చే వరకు ప్రధానంగా బ్రిటిష్ ఆర్మీ కంటోన్మెంట్ గా వ్యవహరించేది.

హైదరాబాద్ కి సికింద్రాబాద్ జంట నగరం అయినప్పట్టికి ఈ రెండు నగరాలు రెండు విభిన్న సంస్కృతులు అలాగే రెండు విభిన్న చారిత్రిక గుర్తింపు కలిగినవి. హైదరాబాద్ నవాబుల నగరమైతే, బ్రిటిష్ వారి సైనిక దళాలు ఉన్న నగరం ఈ సికింద్రాబాద్. హైదరాబాద్ యొక్క కంటోన్మెంట్ ప్రాంతంగా ఇప్పటికీ సికింద్రాబాద్ పని చేస్తోంది. సాయుధ దళాలకి సంబంధించిన మూడు విభాగాల సిబ్బంది ఇక్కడ ఎక్కువ మంది పని చేస్తున్నారు.

ఈ జంటనగారాలని విడదీసేది హుస్సేన్ సాగర్ లేక్. అయినప్పటికీ, సికింద్రాబాద్ కి ప్రత్యేకంగా వేరే మున్సిపాలిటీ లేదు, హైదరాబాద్ లో ఒక భాగంగా సికింద్రాబాద్ ని పరిగణలోకి తీసుకున్నారు. ఈ జంటనగరాలు కలిసి భారత దేశం లో నే ఆరవ పెద్ద కాస్మోపాలిటన్ నగరంగా గుర్తింపు తెచ్చుకున్నాయి. సికింద్రాబాద్ లో ఉన్న వినాయకుడి గుడి అత్యంత ప్రాచీన మరియు ప్రఖ్యాతమైనది.

రేమండ్ టూంబ్

నిజాముల సైనికుల ప్రఖ్యాత ఫ్రెంచ్ జనరల్ అయిన మైఖల్ జోచిం మేరీ రేమండ్ సమాధి కలిగిన ప్రాంతం రేమండ్ స్ టూంబ్. ఈ సమాధి 200 సంవత్సరాల పుర్వానిది. ఒకప్పుడు ఈ ప్రాంతం స్థానికులచే పూలు, అగరబత్తిలచే ఈ సమాధి తరచూ సందర్శింపబడేది. నిజానికి, నిజాములచే ఈ సమాధి దగ్గర అర్పించేందుకు ప్రతి సంవత్సరం మార్చ్ 25 వ తారీఖున డబ్బాడు పొగ చుట్టలు ఇంకా ఒక సీసాడు బీరు ఇక్కడికి పంపించేవారు.

1940 వరకు హైదరాబాద్ స్థానికులు ఈ సమాధిని ఒక చిన్న గుడిలాగే భావించేవారు. నిజాముల సైన్యంలో ధైర్య సాహసాలు కలిగిన దయ కరుణ కలిగిన ఒక మంచి సైనికుడుగా అలాగే మంచిమనిషిగా రేమండ్ గుర్తింపు పొందాడు. నిజాములు రేమండ్ ని అత్యున్నత స్థాయి ని చ్చి గౌరవించారు. మలక్పెట్ లో ఉన్న ఒక చిన్న కొండకి ముస్సా రామ్ బాగ్ గా ఇతని పేరు పెట్టారు.

దురదృష్టవశాత్తు సరిగ్గా జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఈ రేమండ్ టూంబ్ 2001 లో భారీ వర్షపాతానికి కూలిపోయింది. ఆ తరువాత, మునుపటి వైభవాన్ని కాపాడడం కోసం ఈ సమాధి ని మరమ్మత్తు చేసి పునరుద్దరించేందుకు ప్రభుత్వం ఉపక్రమించింది.

శిల్పారామం

ప్రఖ్యాతి గాంచిన కళలు మరియు హస్త కళా వస్తువుల గ్రామం మాదాపూర్ లో హైటెక్ సిటీ కి దగ్గరలో ఉన్న శిల్పారామం. హైదరాబాద్ నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రదేశం ఆంధ్ర ప్రదేశ్ యొక్క హస్తకళలకే కాకుండా దేశ వ్యాప్తంగా కళలకి ప్రాముఖ్యత పొందిన ప్రాంతం. భారత దేశం యొక్క పురాతన కళల సంప్రదాయాలని రక్షించే ఆలోచనతో ఈ గ్రామాన్ని నిర్మించారు.

దీనిని దృష్టిలో పెట్టుకుని ఏడాది పొడవునా సాంప్రదాయక పండుగలని ఈ శిల్పారామంలో నిర్వహిస్తారు. 1992 లో ప్రారంభమైన దేశం లో ని వివిధ సాంప్రదాయక పండుగలని చక్కగా నిర్వహించడం వలన ఈ గ్రామం జాతీయ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈ పండుగలు వల్ల భారత దేశం యొక్క వివిధ హస్తకళాకృతుల గురించి తెలియడమే కాకుండా అంతరించిపోకుండా ప్రాచీన కళల ని సంరక్షించే అవకాశం కూడా మీకు లభిస్తుంది.

సాంప్రదాయ ఆభరణాలు, ఎంబ్రాయిడరీ వస్త్రాలు, చేతితో చెక్కబడిన ఫర్నిచర్ అలాగే ఎన్నో రకాల వస్తువులని ఇక్కడ కొనుక్కోవచ్చు. కనుల విందుగా ఉండే పచ్చటి లాన్స్ లో ఈ గ్రామాన్ని నిర్మించారు.

నిజాం మ్యూజియం

చారిత్రాత్మక నగరమైన హైదరాబాద్ ని సందర్శించే ప్రతి పర్యాటకుడు తప్పక సందర్శించవలసిన ప్రదేశం ఈ నిజాం మ్యూజియం. నిజాముల పాలస్ లో ఒక భాగమైన ఈ మ్యుజియం అత్యంత చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం. ఇందులో ఎన్నో చిత్రలేఖనాలు, ఆభరణాలు, ఆయుధాలు అలాగే పురాతన శకానికి సంబంధించిన కార్లు వంటివి ప్రదర్శనలో ఉన్నాయి. నిజాం రాజులు అందుకున్న ఎన్నో జ్ఞాపికలు, వివిధ కానుకలు ఈ మ్యూజియంలో ప్రదర్శనలో ఉంచారు.

వెండితో తయారు చేయబడిన హైదరాబాద్ నగరానికి చెందిన చారిత్రక ఆనవాళ్ళు ఇక్కడ ప్రదర్శన కోసం ఉంచబడినవి. చెక్క మరియు బంగారంతో చేయబడిన సింహాసనం, అత్తరు దాచుకునేందుకు అత్యద్భుతంగా చెక్కబడిన వెండి సీసాలు, వెండితో చెయ్యబడిన కాఫీ కప్పులపై అలంకరించిన వజ్రాలు, చెక్కతో చెయ్యబడిన రైటింగ్ బాక్స్ ఇలాంటివి కొన్ని మ్యూజియం లో ప్రదర్శనకి ఉంచబడిన అత్యద్భుతమైన వస్తువులు.

వజ్రాలతో పొదిగిన బంగారు టిఫిన్ బాక్స్, వెండితో తాయారు చేసిన ఏనుగు, మావటి వాడి శిల్పం వంటివి ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించే కళాఖండాలు. రోల్స్ రాయ్స్ అలాగే జాగ్వర్ మార్క్ వి కారులు కూడా ప్రదర్శనలో ఉంచబడినవి. ఈ కారులు పాతకాలపు కార్లని ఇష్టపడే వారిని అమితంగా ఆకర్షిస్తున్నాయి.

ట్రిమల్గెర్రీ చర్చ్

చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా లో భాగమైన ఈ ట్రిమల్గెర్రీ చర్చ్ ని ఆల్ సెయింట్స్ చర్చ్ గా కూడా పిలుస్తారు. సికింద్రాబాద్ లో ఉన్న ట్రిమల్గెర్రీ లో ఈ చర్చ్ ఉంది. ఈ చర్చ రక్షక దళానికి చెందినది కావడం వల్ల ఈ చర్చ్ లో జరిగే వివిధ వేడుకలు ఉత్సవాలలో సైనిక పురోహితులు ఎక్కువగా పాల్గొనేవారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా లో ఈ చర్చ్ భాగం అయ్యింది.

ఇది ఒక ఆంగ్లికన్ చర్చ్. ఎక్కువగా తమిళులు ఈ చర్చ్ కి రావడం వల్ల ఇక్కడ ఇంగ్లీష్ మరియు తమిళ భాషలలో ఇక్కడ భోధనలు జరుగుతాయి. విలక్షణమైన గోతిక్ నిర్మాణ శైలితో ఈ చర్చ్ ఉండడం వల్ల ఏంతో మంది పర్యాటకులు మధ్య ఈ చర్చ్ ప్రాచుర్యం పొందింది. శిలువతో ఉన్న జీసస్ ని వర్ణన కలిగిన అందమైన గాజు కిటికీ పూజా వేదికగా వ్యవహరిస్తోంది.

1884 కి చెందిన ఈ భాగం రాయల్ ఫిరంగి యొక్క లెఫ్టినెంట్ ఎడ్వర్డ్ డాసన్ కి గుర్తుగా వ్యవస్థాపించబడినది. 1983 లో క్వీన్ ఎలిజబెత్ రెండు సందర్శన తరువాత ఈ చర్చ్ అంతర్జాతీయ గుర్తింపు పొందింది.

ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ మ్యూజియం

మూడవ నిజాం చే హైదరాబాద్ నగరం లో ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ మ్యుజియం ఏర్పాటయింది. ఈ నగరం యొక్క అద్భుతమైన మరియు సంపన్నమైన చారిత్రక గతానికి సంబంధించి అంతర్ద్రుష్టి ని ఈ మ్యూజియం కలిగిస్తుంది. ఆ కాలం లో ఉన్న ఇండో సార్సెనిక్ శైలి లో నిర్మించబడిన ఈ మ్యుజియం 1928 లో ప్రారంభమయింది.

పబ్లిక్ గార్డెన్స్ లో నిర్మించబడిన ఈ మ్యూజియానికి ఔత్సాహికులైన సందర్శకులు ఎందరో ప్రతీ రోజు విచ్చేస్తూఉంటారు. బుద్ధుడు, అతని శిష్యుల జీవితాలకి సంబంధించిన గాలరీ ఈ మ్యూజియం లో ఉంది. లార్డ్ బుద్ధుడి కాలానికి సంబంధించిన ఎన్నో ప్రాచీన వస్తువులు ఈ మ్యూజియంలో గమనించవచ్చు. ఈ మ్యూజియంలో నాలుగు గదులు ఉన్నాయి. ప్రతి గదిలో మానవ నాగరికతకి సంబంధించిన దశలు కనిపిస్తాయి. నిర్దిష్ట కాలానికి సంబంధించిన వస్తువుల సేకరణ ప్రతి గదిలో గమనించవచ్చు.

హిందువుల మరియు జైనుల మతాలకు సంబంధించిన గెలరీ లు కూడా ఇక్కడ గమనించవచ్చు. రెండు మతాల నిర్మాణానికి సంబంధించిన వస్తువులు పురోగమిస్తున్న సమయంతో పాటు ఇక్కడ కనిపిస్తాయి. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన వస్తువులని కూడా ఇక్కడ గమనించవచ్చు.

చౌమహల్లా పాలస్

అసఫ్ జహిల అధికార నివాస స్థలమైన చౌమహల్లా పాలస్ హైదరాబాద్ నిజాములకి చెందినది. పెర్షియన్ పదాలయిన చహార్ మరియు మహాలట్ నుండి చౌమోహోల్ల పాలస్ పేరు వచ్చింది. వీటి అర్ధం నాలుగు పాలస్ లు అని అర్ధం. షాహ అఫ్ ఇరాన్ పాలసు నిర్మించిన శైలి లో నే ఈ పాలస్ ని నిర్మించారు.

18 వ శతాబ్దంలో ఈ పాలసు నిర్మాణం ప్రారంభం అయింది. ఈ పాలస్ నిర్మాణం పూర్తవడానికి పది సంవత్సరాలు పట్టింది. అందువల్ల, ఈ పాలసు యొక్క నిర్మాణం మరియు ఆకృతి వివిధ రకాల శైలులతో ప్రభావితమయ్యాయి.పలు విధాల విదులకి ఈ పాలస్ ని ఉపయోగించేవారు. నిజాముల పట్టాభిషేక కార్యక్రమం, గవర్నర్ - జనరల్స్ ల ఆహ్వాన వేడుకలు వాటిలో కొన్ని.

నిజానికి, నిజాముల హయాంలో అన్ని విధాల ఉత్సవ వేడుకలని జరుపుకునేందుకు ఈ పాలస్ ని ఉపయోగించేవారు. ఇక్కడ రెండు రాజ దర్బారులు ఉన్నాయి. ఒకటి ఉత్తరపు రాజదర్బార్. రెండవది దక్షిణపు రాజ దర్బార్. ఈ రెండు దర్బారులు చుట్టూ అందమైన డిజైన్ ల గదులు ఉన్నాయి. వైభవము మరియు మనోహరము ఈ పాలసు యొక్క విశిష్టత.

ఉజ్జయిని మహంకాళి టెంపుల్

హైదరాబాద్ లో లో ఉన్న సికింద్రాబాద్ ప్రాంతం లో ఈ శ్రీ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ ఉంది. ఈ ఆలయం దాదాపు 200 ఏళ్ళ పుర్వానికి చెందినదని నమ్మకం. ప్రతి రోజు వందల మంది భక్తులు ఇక్కడికి వచ్చి ప్రార్ధనలు చేస్తారు. ఈ గుడిలో శక్తి కి మరియు అధికారానికి దేవత అయిన మహంకాళి మాత కొలువై ఉంటారు.

ఆదివారం మరియు సోమవారాల్లో పడే ఆషాడ జాతర పండుగ సమయంలో ఈ ఆలయం కిటకిటలాడుతుంది. మహంకాళి మాతని కొలవడానికి ఈ రెండు రోజులు చాలా మంచివి. బోనాలు పండుగని కూడా ఈ ఆలయంలో ఏంతో సంబరంగా , ఆరాధనతో జరుపుకుంటారు. ఈ పండుగని ముఖ్యంగా హైదరాబాద్ ఇంకా సికింద్రాబాద్ నగరాలలో జరుపుకుంటారు.

తెలంగాణా, రాయలసీమ నుండి ఏంతో మంది భక్తులు ఈ పండుగ సమయంలో ఈ ఆలయానికి విచ్చేస్తారు. జూలై ఇంకా ఆగష్టు మాసాలలో ఈ బోనాలు పండుగని జరుపుకుంటారు. ప్రశాంతమైన, నిలకడగా ఉన్న జీవితాన్ని భూమి పైన ప్రసాదించినందుకు కృతజ్ఞతగా ఈ బోనాలు పండుగ ద్వారా మహంకాళి మాతని ప్రార్ధించేందుకు ఈ పండుగ చేస్తారు.

హయత్ బక్షి బేగం మాస్కు

హయత్ బక్షి బేగం మాస్క్ అని లేదా హయత్ బక్షి మాస్క్ అని ఇంకా హయత్నగర్ గ్రాండ్ మాస్క్ అని కూడా పిలువపడుతుంది. ఈ మసీదు హైదరాబాద్ లోని ముస్లిములకు చాలా పవిత్రమైనది.1672 లో అయిదవ సుల్తాన్ అయిన అబ్దుల్లా కుతుబ్ షా పాలించిన సమయంలో ఈ మాస్క్ నిర్మితమయింది. ఖుతుబ్ షా కుటుంబీకుల పరిపాలకుల హయాంలో నిర్మించబడిన ఈ మాస్క్ ఖుతుబ్ షాహి శైలిలోనే నిర్మితమయింది.

ఈ మసీదులో ప్రార్ధనలు చేసుకోవడమే కాకుండా ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి పర్యటించే పర్యాటకులకు విశ్రాంతి ని అందించే ప్రదేశం గా కూడా ఈ మసీదు ఉపయోగపడుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని అలసిన ప్రయాణికులకి విశ్రాంతి మందిరంగా ఒక సారాయ్ ని ఏర్పాటు చేసారు. ఈ మసీదు యొక్క నిర్మాణ పద్దతిలో అయిదు కమానులు ఉంటాయి.

ఒక పిట్ట గోడ, ప్రార్ధనా మందిరం, రెండు స్థంబాలు, శిల్పాలు కలవు. గాలరీ ల మీదుగా ఉన్న పిట్టగోడ పన్నెండు ప్రోట్రుషన్స్ మీదుగా వెళ్తుంది. ఒక ఎత్తైన వేదిక మీద ప్రార్ధనా మందిరం ఏర్పాటు చేసారు. ఈ మసీదు కి కిందనే ఏర్పాటు చేసిన ప్రాంతంలో కాళ్ళు, చేతులు కడుగుకునే సదుపాయం కలదు.

కోటి

కింగ్ కోటి, రామ్ కోటి అనే రెండు భాగాలుగా విభజించబడిన కోటి హైదరాబాద్ నగరం యొక్క వాణిజ్య ప్రాంతం. నిజాముల ఉంపుడు గత్తెల నివాస స్థలం అయిన ఈ కోటి పేరు కోటి రెసిడెన్సి నుండి వచ్చింది. ఈ ప్రదేశం ఆ తరువాత జేమ్స్ అచిలీస్ కిర్క్పాట్రిక్ నివాస స్థలంగా మారింది. ప్రస్తుతం ఈ ప్రాంతం ఒస్మానిఅ యూనివర్సిటీ లో భాగం గా మహిళా కళాశాలగా మారింది.

హైదరాబాద్ లో మీకు పుస్తకాలు కావాలంటే, తప్పకుండా కోటి ని సందర్శించవలసిందదే. ఈ మార్కెట్ వస్త్రాలు, ఆభరణాలు అలాగే గృహోపకరణాలు వంటి వి దొరకడంతో పాటు అనేకమైన పుస్తాకాలు కూడా దొరుకుతాయి. కోటి లో ఉన్న గుజరాత్ గలీ లో చౌకవైన ఎలక్ట్రానిక్ వస్తువులు దొరుకుతాయి. స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా ఇంకా ఆంధ్రా బ్యాంకు వంటి ప్రముఖ బ్యాంకులకి ఇక్కడ శాఖలు కలవు.

కోటి లో ఉన్న అతి ప్రాచీనమైన మరియు అతి ప్రఖ్యాత మైన వైద్య కళాశాల ఉస్మానియా మెడికల్ కాలేజ్.

పైగహ్ టొంబ్స్

పైఘ రాజ వంశీకులకి చెందిన పైగహ్ టొంబ్స్ ని శుమ్స్ ఉల్ ఉమ్రాహి ఫ్యామిలీ. మక్బ్రా శుమ్స్ ఉల్ ఉమ్రా అని కూడా అనబడే ఈ సమాధులు హైదరాబాద్ నగర సివరలలోని పిసాల్ బండ దగ్గర ఉన్నాయి.

1787 లో నవాబ్ తిగ్ జుంగ్ బహదూర్ ఈ టొంబ్స్ ని నిర్మించటం మొదలు పెడితే ఆ తర్వాత అమీర్ ఏ కబీర్, జుంగ్ బహాదుర్ కొడుకు, ఈ నిర్మాణాన్ని కొనసాగించాడు.చాల తరాల పైఘ వారు ఈ టొంబ్స్ లో సమాధి చెయ్యబడ్డారు. ఈ టొంబ్స్ వాటి విశిష్ట నిర్మాణ శైలి వల్ల పేరు గాంచాయి.నిజానికి అటువంటి నిర్మాణ శైలి ప్రపంచంలో మరొకటి లేదని భావిస్తారు.

ఈ టొంబ్స్ స్టక్కో వర్క్ ద్వారా అలంకరించబడి, గ్రీకు , పెర్షియన్ , ముఘల్, రాజస్తాని, అసఫ్ జహి మరియు దక్కని నిర్మాణ శైలిల మేళవింపు తో ఉంటాయి. అప్పటి మహోన్నత కళా నైపుణ్యానికి ఈ టొంబ్స్ ఒక ఉదాహరణ గా నిలుస్తాయి. తర్వాత కాలం లో చలువరాతి తో చెయ్యబడిన తాపడం చూడ చక్కగా ఉంటుంది.

పురాని హవేలీ

స్వాతంత్ర్యం కి పూర్వం ఈ పురాని హవేలీ లేదా పాత భవనం హైదరాబాద్ నిజాముల యొక్క అధికార నివాస గృహాలుగా ఉండేది. అలీ ఖాన్ బహదూర్ అసఫ్ జహ రెండు చేత నిర్మించబడిన ఈ పాలసు ని ప్రాచీన కాలంలో హవేలీ ఖదీమ్ అనే పేరుతో పిలిచేవారు. 1803 నుండి 1829 వరకు ఈ నగరాన్ని పాలించిన అతని కుమారుడు సికందర్ జహ అసఫ్ జహ మూడు కి ఈ పాలసు ని కానుకగా ఇచ్చాడు.

ఒక దానికి ఒకటి సమాంతరంగా నిర్మించిన రెండు ఎల్లిప్సోయిడాల్ విభాగాలు కలిగిన ఈ పాలసు ఆకారం 'U" ఆకారంలో ఉంటుంది. ఈ రెండు విభాగాల మధ్యన లబకోణం స్థానం లో ఈ పాలసు యొక్క నివాస భాగం ఉంది. 18 వ శతాబ్దపు యూరోపెయన్ పాలసులని ఈ భవనం గుర్తుకుతెస్తుంది.

ఈ పాలసు యొక్క మరొక ముఖ్య లక్షణం ఇక్కడ ఉన్న వార్డ్ రోబ్. ప్రపంచం లో నే అతి పెద్ద వార్డ్ రోబ్ గా ప్రసిద్దికెక్కింది. సౌకర్యార్ధం ఒక చెక్క ఎలివేటర్ కుడా ఈ వార్డ్ రోబ్ లో ఉంది. నిజాం మ్యూజియం

రామకృష్ణ మఠ్

లోయర్ ట్యాంక్ బ్యాండ్ రోడ్డులో ఉన్న దోమలగూడ ప్రాంతంలో ఈ రామకృష్ణ మఠ్ ఉంది. 1974 లో ఈ నగరంలో ప్రారంభమయిన ఈ మఠానికి లక్షల మంది ప్రజలు విచ్చేస్తూ ఉంటారు. ఇది ఒక ఆధ్యాత్మిక మైన ప్రదేశమే కాకుండా, వివేకానంద ఇన్స్టిట్యూట్ అఫ్ హ్యూమన్ ఎక్సెలెన్స్, వివేకానంద లైబ్రరీ, గీత దర్శన, వివేకానంద యూనివర్సల్ టెంపుల్ ఇంకా మరెన్నో వివిధ విద్యా విభాగాలు కలిగిన ప్రదేశం కూడా.

రామకృష్ణా మఠం యొక్క భక్తులు మానవులకి అన్ని విధాలా సేవలు చేస్తారు. పేదలకి ఆహారం అందించడం, చదువులు చెప్పడం, పేద విద్యార్ధులకి పాఠ్య పుస్తకాలని పంచడం, స్కూళ్ళకి వెళ్ళే పేద విద్యార్ధులకి అల్పాహారం అందించడం వంటివి వారు చేసే కొన్ని సేవలు. స్వామి వివేకానందుని చే ఏర్పాటు చేసిన కొన్ని నిబంధనలైన అన్నదానం, విద్యాదానం అలాగే జ్ఞాన దానం వంటి వి నిర్వర్తించడం ఈ మఠం యొక్క ముఖ్య ఉద్దేశం.

పేద విధ్యార్ధులకి ఉచితంగా విద్యనందించడమే కాకుండా మానసికంగా అలాగే ఆధ్యాత్మికంగా ఎదిగేందుకు సహకరిస్తుంది ఈ మఠం. మతం అలాగే సంసృతి తో సంబంధం లేకుండా ఎవరైనా రామకృష్ణ ఉద్యమంలో భక్తులుగా చేరవచ్చు. స్వయం సేవకులుగా నిర్వహించేందుకు ఇక్కడ ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ మఠం లో ఉన్నాయి.

సాంఘి టెంపుల్

హైదరాబాద్ యొక్క నగర శివార్లలో సాంఘి టెంపుల్ ఉన్నది. ఇక్కడి ఏంతో పవిత్రమైన పొడవాటి రాజ గోపురం ఈ కోవెల యొక్క పేరు ప్రఖ్యాతలను ఇంకా పెంచింది.నిజానికి చాలా దూరం నుంచి ఈ రాజ గోపురాన్ని చూడవచ్చు.పరమానంద గిరి అనే కొండ పైన ఉన్నది అందమైన ఈ ఆలయం.

ప్రతి సంవత్సరం వేలాది మంది భక్త జనం ఇక్కడి భగవంతుని ఆసిస్సుల కోసం వస్తారు.చాలా మంది పర్యాటకులు కూడా ఇక్కడి కొండ అందాలని చూడటానికి వస్తారు. దక్షిణ భారత నిర్మాణ శైలి లో నిర్మించబడినది ఈ ఆలయం. ఈ ఆలయ మెట్ల పైన గొప్ప రాయితో చేయబడిన ఏనుగు విగ్రహం రక్షణ గా ఉంటుంది.ఈ ఆలయానికి ఉన్న మూడు గోపురాలు ఏంతో ఎత్తుగా ఉంది ఆకాశాన్ని తాకుతున్నాయ అనిపిస్తుంది.

వాయు పుత్రుడైన ఆంజనేయుని విగ్రహం ఈ ఆలయ యొక్క చాలా ఎత్తు అయిన ప్రదేశం లో ఉంటుంది.అక్కడి నుండి భక్తులను ఆయన ఆశీర్వదిస్తారని భక్తుల నమ్మకం.

షామీర్ పేట్

హైదరాబాద్ యొక్క శివారు ప్రాంతమైన షామీర్ పెట్ సికింద్రాబాద్ కి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. బిర్లా ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, పిలాని - హైదరాబాద్, NALSAR యూనివర్సిటీ అఫ్ లా మరియు జీనోమ్ వాలీ వంటి ప్రఖ్యాతి గాంచిన విద్యాసంస్థలతో నిండి ఉన్న ప్రదేశం ఈ షామీర్ పేట్. ప్రఖ్యాతి గాంచిన షామీర్ పెట్ చెరువు కూడా ఈ జిల్లాలోనే ఉంది.

నిజాముల చే నిర్మించబడిన మరొక మానవ నిర్మిత చెరువు ఇది. స్థానిక పర్యటనకి ఇది ఒక ముఖ్య ప్రదేశం. ఎన్నో కుటుంబాలు, స్కూళ్ళు మరియు కాలేజీ విధ్యార్ధులతో ఈ ప్రదేశం కిటకిట లాడుతుంటుంది. వారాంత విశ్రాంతికి ఇక్కడ ఎన్నో రెస్టారెంట్లు మరియు హోటళ్ళు అందుబాటులో ఉన్నాయి. అంతే కాకుండా ఇక్కడ ఒక క్లబ్బు మరియు విలాసవంతమైన రిసార్ట్ కూడా ఇక్కడ ఉన్నాయి.

షామీర్ పెట్ లో ఉన్న జింకల పార్కు లోజింకలె కాకుండా నెమళ్ళు మొదలగు అనేక రకాల పక్షులు కూడా కనబడతాయి. ఈ పార్క్ షామీర్ పేట చెరువుకి అతి సమీపంలో ఉంది. ఎన్నో తెలుగు సినిమాలు ఈ చెరువు చుట్టూ పక్కల ప్రదేశాలలో నిర్మితమైనాయి.

సురేంద్రపురి

నగర శివార్లలో ఉన్న సురేంద్రపురి ఒక అద్బుతమైన మ్యుజియం. పౌరాణిక అవగాహన కేంద్రంగా కూడా ఈ మ్యూజియం ని పిలుస్తారు. భారత పురాణాల గురించి అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ మ్యుజియమ్ ని ఏర్పాటు చేసారు. కుండా సత్యనారయన్ కుమారుడు సురేంద్ర పేరుతొ ఈ సురేంద్రపురి మ్యుజియం పేరు పెట్టారు. తన కుమారుడి పేరు అమరంగా ఉండడానికి ఈ మ్యూజియాన్ని స్థాపించిన సత్యనారాయన్ గారు ఈ మ్యూజియానికి సురేంద్రపురి మ్యూజియం అన్న పేరు పెట్టారు. భారత దేశం లో ఉన్నప్రఖ్యాతమైన మరియు ముఖ్యమైన ఆలయాల మినియెచర్ లు ఇక్కడ ప్రధానంగా కనిపిస్తాయి.

ఈ వైవిధ్యమైన అంశం సందర్శకులని అమితంగా ఆకర్షిస్తుంది. ప్రముఖమైన ఆలయాల యొక్క ఖచ్చినమైన ప్రతిరూపాలని తయారు చేసేందుకు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ ఆలయాల పైన ఉండే శిల్పకళలూ నిర్మాణ శైలి ఇలా ప్రతి విషయం గురించి తగిన జాగ్రత్తలు తీసుకుని ఇక్కడ మినీయెచర్ ఆలయాలని అద్భుతంగా తయారు చేసారు. హిందువుల దేవుళ్ళని, దేవతలని వర్ణించే శిలావిగ్రహాలు, చిత్రలేఖనాలు ఈ మ్యూజియంలో గమనించవచ్చు. ఈ మ్యూజియాన్ని ఒక్క సారి సందర్శిస్తే భారత దేశ పురాణాల గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు

స్పానిష్ మాస్క్

ఐవాన్ - ఎ - బేగుంపేట్ లేదా మసీద్ ఇక్బాల్ ఉడ్ దాలా అని స్థానిక భాషలో ప్రసిద్ది చెందిన ఈ స్పానిష్ మాస్క్ హైదరాబాద్ లో నే ఈ తరహాలో మొట్ట మొదటిది. పైగహ్ నవాబ్ అయిన నవాబ్ సర్ ఇక్బాల్ ఉద్ దాలా స్పానిష్ సందర్శనకి వెళ్ళినప్పుడు అక్కడ కేథడ్రాల్ మాస్క్ అఫ్ కార్డోబా నిర్మాణ శైలి కి ఆకర్షింపబడ్డాడు.

స్పెయిన్ నుండి తిరిగి వచ్చిన వెంటనే, 1906 లో స్పానిష్ మాస్క్ నిర్మాణాన్ని చేపట్టాడు. స్పెయిన్ లో ఉన్న కేథడ్రాల్ మాస్క్ అఫ్ కార్డోబా శైలి లో నే ఈ మాస్క్ నిర్మితమయింది. కర్ణాటకా రాష్ట్రం లో ని ఉన్న జమ్మా మసీద్ గుల్బర్గా శైలి కి కూడా ఈ మాస్క్ నిర్మాణం ప్రభావితమయింది.

మాస్క్ అఫ్ మూర్స్ గా కుడా ప్రాచుర్యం పొందిన ఈ మాస్క్ నిర్మాణ శైలిలో ప్రత్యేకమైన మూరిష్ నిర్మాణ శైలి కూడా కనిపిస్తుంది. బయట నుండి చుస్తే ఒక చర్చ్ లా కనిపించడం కూడా ఈ మాస్క్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ది చెందడానికి గల కారణం.

తారామతి బారాదరి

గోల్కొండ యొక్క ఏడవ సుల్తాన్ అయిన అబ్దుల్లా ఖుతుబ్ షా చేత నిర్మింపబడిన సారాయ్ ఈ తారామతి బారాదరి. ఇబ్రహీం ఖులి ఖుతుబ్ షా చేత నిర్మింపబడిన ఇబ్రహీం బాగ్ అనే ఉద్యానవనం ప్రాంగణంలో నే ఈ సారాయ్ నిర్మించబడినది. ఈ ప్రాంతానికి పర్యటించే ప్రయాణికులకి విశ్రాంతి ప్రదేశంగా మూసీ నది ఒడ్డున ఈ బారాదరి ని నిర్మించారు.

వేశ్య అయిన తారామతి అలాగే ఆమె చెల్లెలు ప్రేమమతి లకి గౌరవార్ధంగా ఈ బారాదరి ని నిర్మించారని గాధలు ఉన్నాయి. అబ్దుల్లా ఖుతుబ్ షా సభ లో ఆట పాటలతో ఈ అక్కా చెల్లెళ్ళు సందడి చేసేవారు. వారి ప్రదర్శనలకి ఆకర్షించబడిన సుల్తాన్ వారి కోసం ప్రత్యేకంగా ఒక సారాయ్ ని నిర్మించి తారామతి పేరునే పెట్టారు. అలా ఆ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు రాజ సభలో ప్రాముఖ్యత పొందారు. ఖుతుబ్ షా సుల్తాన్ మరియు రాణులు సమాధి పక్కనే వీరి సమాధిని కూడా గమనించవచ్చు.

ఆధారము: నేటివ్ ప్లానెట్.కం

చివరిసారిగా మార్పు చేయబడిన : 6/6/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate