అనగనగా మద్దిరాల అనే ఊరిలో రామయ్య ,భార్య సీతమ్మ, కొడుకు రాము ఉండేవారు, వారు పేదవారు. ఒక రోజు సీతమ్మ వారితో మీరు కూడా ఒక పని చూసుకోవచ్చు కదా అని గట్టిగామందలించింది. అప్పుడు రామయ్య, రాము పని చూసుకోవడానికి సమీపంలో ఉన్న సూర్యాపేట అనే పట్టణానికి చేరుకొని పని కోసం వెతుకసాగారు. ఆ సమయంలో వారికీ చాలా దాహం వేసింది. అప్పుడే నిమ్మరసం అమ్మేవాడి వద్దకి వెళ్ళి డబ్బులు ఇచ్చి నిమ్మరసం తాగారు.
రోజంతా వెతికిన పని దొరకక వారు వెనుదిరిగి వారి ఊరికి చేరుకున్నారు. అప్పుడు రామయ్యను సీతమ్మ ఏమైనా పని దొరికిందా అని అడిగింది. అప్పుడు రామయ్య, రాము ఇద్దరు కలిసి అలోచించి నిమ్మరసం కొట్టు పెడదామని అనుకుంటున్నాం అని సమాధానం ఇచ్చారు.
నిమ్మరసం ఎవరు తాగినా వారు డబ్బులు ఇచ్చే తాగాలి అని నియమం పెట్టుకుని మరుసటి రోజే వారు నిమ్మరసం కొట్టు పెట్టారు. మొదటి రోజు కొనడానికి ఎవ్వరూ రాలేదు. ఆ రోజు వారికీ చాలా దాహం వేసింది. అప్పుడు రామయ్య రాముకి రూపాయి ఇచ్చి నిమ్మరసం త్రాగాడు. ఆ తర్వాత రాము, రామయ్యకు అదే రూపాయి ఇచ్చి నిమ్మరసం తాగాడు.ఇదే విధంగా ఆ రోజంతా వారు గడిపారు.
అలాగే నిమ్మరసం అయిపోయింది. సాయంత్రం వేళా ఇంటికి వెళ్లి వారి ఆదాయం చూసుకుంటే ఒక్క రూపాయి మాత్రమే. అయినా ఓపిగ్గా వారు చేస్తున్న వ్యాపారంలోని మెలకువలనుతెలుసుకుని ఎదుటివారిని ఆకర్షించడానికి ప్రణాలికను రూపొందించి, లాభాలను ఆర్జించారు.
ఆధారం;చెకుముకి
చివరిసారిగా మార్పు చేయబడిన : 1/22/2020