ప్రమాదాలు (రోడ్డు, రైలు, భూకంపాలు లాంటివి) జరిగినప్పుడు ఎక్కువ మంది గాయాల వల్ల రక్తం కోల్పోతుంటారు. అలాంటి వారిని రక్షించాలంటే వారికి రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. రక్తం ఎక్కించాలంటే ఎవరైన రక్తం ఇవ్వాల్సుంటుంది. మనదేశంలో కాన్పుల సమయంలో తల్లికి అవసరమైన రక్తం కోసం, శస్త్రచికిత్స (Surgery) చేసే సమయంలో పేషెంట్లకి రక్తం అవసరం ఉంటుంది. వీరి అందరి అవసరాలు తీరాలంటే విరివిగా రక్తం అవసరం ఉంటుంది. వీరి అందరి అవసరాలు తీరాలంటే విరివిగా రక్తం ఇచ్చేవారుండాలి. అలా రక్తం ఇచ్చేవారు దొరక్క చాలామంది రోగులు చనిపోతున్నారు.
ఇటీవల మద్రాస్ IIT శాస్త్రవేత్తలు రక్తాన్ని కృత్రిమంగా తయారుచేసే పద్ధతిని కని పెట్టారు. కృత్రిమరక్తం తయారు చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో శాస్త్రజ్ఞులు అనేక సంవత్సరాలుగా ప్రయోగాలు చేస్తున్నారు. కాని వాటి ఫలితాలు ఇంకా అందుబాటులోకి రాలేదు. మద్రాస్ IIT శాస్త్రజ్ఞులు చేసిన ప్రయోగం వల్ల కృత్రిమ రక్తంలో ఎర్రరక్తకణాలు మాత్రమే ఉండేవిధంగా చేస్తారు. ఇందువల్ల రోగికి ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది. ఈ కృత్రిమ రక్తాన్ని ముందు ఎలకల మీద తరువాత కొన్ని జంతువుల మీద ప్రయోగించి ఫలితాన్ని ఇచ్చిన తరువాత మనుషులకు ఉపయోగిస్తారు. ఈ ప్రయోగాలు పూర్తవడానికి ఇంకా 5 సంవత్సరాలు పట్టొచ్చని అంచనా వేస్తున్నారు. అన్ని సవ్యంగా జరిగి కృత్రిమ రక్తం తయారుచేయగలిగితే రక్తం అందక రోగులు చనిపోయే పరిస్థితిని అరికట్టవచ్చు.
ఈ కృత్రిమమ రక్తాన్ని గర్భిణీ స్త్రీకి శిశువుని కలిపి పేగు నుండి తీసిన స్టెమ్ సెల్సు నుంచి తయారుచేస్తున్నారు. ఇలా తయారుచేసి కృత్రిమ రక్తం వల్ల అనేక ఉపయోగాలున్నాయి. సాధారణంగా రక్తం మార్పిడి చేసేముందు, HIV, హైపటైటిస్ వంటి ప్రమాదకర వైరస్ లేకుండా పరీక్షించి రోగికి రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. ఈ కృత్రిమ రక్తంలో ఈ అవసరం ఉండదు. కృత్రిమ రక్తం ఎక్కువ రోజులు నిలువ ఉంచుకోవచ్చు. ఎక్కువ దూరం సులభంగా రవాణా చేయవచ్చు. తక్కువ ఖర్చుతో తయారు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. శాస్త్రజ్ఞులు ఈ ప్రయోగాలని విజయవంతంగా కృత్రిమ రక్తాన్ని అందరికి అందుబాటులోకి తెస్తారని ఆశిద్దాం.
ఆధారం: సి. ఆనంద్.
చివరిసారిగా మార్పు చేయబడిన : 6/22/2020