నిత్యజీవితంలో మనకు కలరా, డయేరియ వంటి వ్యాధుల వలన వాంతులు, విరేచనాలు కావడం జరుగుతుంది. దీని వలన శైరిరం నుంచి నీరు, లవణాలు బయటకు వెళ్ళిపోతాయి. ఎండదెబ్బ(వడదెబ్బ) తగిలినపుడు అధిక ఉష్ణోగ్రత వద్ద పని చేస్తున్నప్పుడు కూడా శరీరం నుంచి నీరు లవణాలు చెమట రూపంలో బయటకు వెళ్ళిపోతాయి. దీనివల్ల శిరిరానికి నిర్జలికరణ స్దితి (Dehydration) ఏర్పడుతుంది. సోడియం, పొటాషియం, క్లోరిన్ వంటి లవణాలు లేకపోవడం వల్ల శిరింలో జివనచర్యలు సక్రమంగా జరగవు. సమాచారం ఒక భాగంనుంచి మరొక భాగానికి ప్రసరించదు. ఇటువంటి సమయంలో రోగి మరణించవచ్చు కూడా.
ఇలాంటి పరిస్ధితి సంక్రమిచినపుడు రొగీకి మొదట ప్రధమ చికిత్సలో భాగంగా అతనికి ప్రాణాలను కాపాడే రక్షక ద్రావణం లేదా ఓరల్ డిహైడ్రేషన్ సొల్యుషన్ (ORS) ఇవ్వాలి. దీని వల్ల శరీరానికి నీటితో పాటు వివిధ లవణాలు అందుతాయి.
రక్షక ద్రావణం తయారు చేయడానికి సంబంధించిన పాకెట్లు మందుల దుకాణాలలో లభిస్తాయి. వీటిని ఎలక్ట్రాల్ అనే పేరుతో పిలుస్తారూ. తగినంత నీటికి ఈ పౌడర్ను కలిపితే రక్షక ద్రావణం తయారవుతుంది. ఉదాహరణకు 5 గ్రాముల పౌడరుకు 200 మి.లీ నీటిని కలుపవచ్చు. ఈ ద్రావణంలో ప్రపంచ ఆరోగ్యసంస్ధ నూచించిన విధంగా సోడియం, పొటాషియం, క్లోరిన్ లవణాలు ఉండి శరీరంలో నుంచి బయటకు వెళ్ళిన వాటిని భర్త చేస్తాయి. ఈ లవణాలతో పాటుగా డేక్స్ ట్రోజ్ (Dextrose) అనే చక్కర ఉంటుంది. ఇది శరీరానికి తక్షణ శక్తినిస్తుంది. ఈ రకమైన పాకెట్ లు అందుబాటులో లేనట్లితే మనం ఈ ద్రావణాన్ని ఇంటిలోనే అపటికప్పుడు తయారు చేసుకోవచ్చు. శుభ్రమైన కాచి చల్లార్చిన గ్లాసు నీటిలో చిటికెడు ఉప్పు, ఒక చెంచా పంచదార వేసి కలిపితే రక్షక ద్రావణం తయారవుతుంది. ఈ ద్రావణాన్ని కొద్దికొద్దిగా ప్రతి పదినిమిషాల కొకసారి వైద్యుని వద్దకు వెళ్ళేంతవరకు త్రాగించవచ్చు.
ఒక ద్రావణాన్ని తయారు చేసిన తరువాత సాధ్యమైనంత తొందరగా వాడుకోవాలి. ఎక్కువసేపు నిలువ ఉంచరాదు. ఈరకమైన ద్రావణం అందుబాటులో లేనట్లయితే రోగికి కొబ్బరినిళ్ళను కూడా ఇవ్వవచ్చు. నిర్జలికర్ణం జరిగి రోగి స్పృహకోల్పోయినపుడు లేదా వ్యక్తి రక్షకద్రావణాన్ని త్రాగే స్ధితిలో లేనప్పుడు అతనికి సెలైన్ ఎక్కించడం జరుగుతుంది.
రచయిత: డా. బి.నరేష్ ఉస్మానియా యునివర్శిటి
చివరిసారిగా మార్పు చేయబడిన : 6/20/2020