అనగనగా ఒక ఊరిలో ఇద్దరు అన్నా తమ్ముళ్ళు నివసిస్తూ ఉండే వారు. పెద్ద వాడి పేరు రాము, చిన్నవాడి పేరు సోము. పెద్ద వాడు ధనవంతుడు, చిన్నవాడు పేద వాడు.
ఆ రోజు దీపావళి పండుగ. ఊరంతా సంతోషంగా పండగ జరుపుకుంటున్నారు. చిన్నవాడు వెళ్ళి వాళ్ళ అన్నను డబ్బు సాయం చేయమని అడిగితే ఏమి లేదు వెళ్ళు అన్నాడు. దాంతో సోము బాధతో ఒక చోట కూర్చుని ఏడుస్తూ ఉన్నాడు. అంతలో ఒక ముసలి వాడు కట్టెల మోపు కట్టి ఇంటికి ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తూ అటూఇటూ చూస్తున్నాడు. అక్కడ ఏడుస్తూ ఉన్న సోముని చూసి, నాయనా ఎందుకు ఏడుస్తున్నావు ? ఊరంతా పండగ జరుపుకుంటుంటే ఎందుకు ఏడుస్తూ ఉన్నావు? అని పలకరించాడు. సోము జరిగిందంతా చెప్పాడు.
ఆ ముసలి వాడు సోముతో ఇలా అన్నాడు. నాయనా! ఈ కట్టెల మోపు మా ఇంటి దగ్గర దించు నేను నీకు ఒక సలహా చెబుతాను అని అంటాడు. అలాగే అని చెప్పి ఆ కట్టెల మోపు అక్కడ వదిలి పెడతాడు. ఆ ముసలి వాడు ఇలా చెప్పాడు. ఊరి చివరలో రెండు కొండలు ఉన్నాయి కదా అక్కడ ఒక గుహ ఉంటుంది. దాంట్లో ఇద్దరు వ్యక్తులు ఉంటారు. వారికి మిఠాయి అంటే చాలా ఇష్టం అవి తీసుకొని వెళ్ళి వాళ్ళికు ఇవ్వు, వాళ్ళు నిన్ను ఏమి కోరుకుంటావు అని అడుగుతారు.
నీవు అక్కడ వున్న విసురు రాయిని ఇవ్వమని కోరుకో. అది ఎలా ఉపయోగించాలో చెపుతారు. నీవు అది తీసుకొని ఇంటికి రా అని చెప్పాడు. అప్పుడు వెంటనే వెళ్ళి సోము వారికి నారింజ మిఠాయిని ఇస్తాడు. ఇవ్వగానే ఆ విసురురాయిని కోరుకొని ఇంటికి వస్తాడు. తన భార్యతో చాప పరచమని అడుగుతాడు. అతని భార్య చాప పరుచుతుంది. పరిచిన తరువాత ఆ విసురు రాయిని చాప మీద పెడతాడు పెట్టి బియ్యం అని మొక్కి విసురు రాయిని తిప్పుతాడు. బియ్యం రాసులుగా పడుతుంది. తరువాత పప్పు, ఉప్పు కోరుకుంటాడు. ఆ తరువాత వండుకొని కడుపునిండా తింటారు. తిన్న తరువాత మిగిలినవి మార్కెట్ లో అమ్ముతారు.
అలాగే పప్పు, నూనె, జీడిపప్పు, బాదం, కిస్ మిస్ కోరుకొని తిప్పితే అవి రాసులుగా పడతాయి. అవన్నీ అమ్ముకొని వాళ్ళ అన్న కన్నా డబ్బు బాగా సంపాదించి పెద్ద ఇల్లు కట్టుకుంటాడు. వాళ్ళ అన్నకు అనుమానం వచ్చి ఏమిటి ఇది! కటిక దారిద్ర్యంలో ఉన్న వాడు ఇలా మారాడు అని అనుకుంటాడు. తన తమ్ముని ఇంటికి దొంగతనంగా వెళ్ళి చూస్తాడు. అక్కడ సోము భార్య విసురు రాయి ముందు కోరుకొని తిప్పింది. అది చూచి ఆ విసురు రాయిని దొంగలించాలి అని ఆలోచిస్తాడు. తన తమ్ముడు బయటకు వెళ్ళడం చూసి దానిని దొంగలించి భార్య పిల్లలను తీసుకోని వేరే ఊరు వెళతాడు. వాళ్ళు అందరూ వెళ్ళుతుంటే ఒక నది దాటి వెళ్ళాలి. ఒక పడవలో ఆ నదిలో వెళ్తునారు. రాము అని చూద్దాం అంటుంది. సరే అని రాము అంటాడు. తన భార్య ఉప్పు కోరుకుందాం అంటుంది. సరే అని రాము అంటాడు. వెంటనే ఉప్పు రాసులుగా వస్తుంది రాగానే దానిని ఇలా ఆపాలో తెలియదు. ఆ పడవ నిండా ఉప్పే అయింది. దాన్ని ఆపడం వాళ్ళకు తెలియదు. వాళ్ళు నీళ్ళలో మునిగి పోయారు. అందుకే సముద్రపు నీరు ఉప్పగా ఉంటుంది.
ఆధారం: గడ్డం రిష్మామాధురి.
చివరిసారిగా మార్పు చేయబడిన : 6/20/2020