మేజిక్ షోలో మరో అంశం మొదలయింది. “మనం మేవలను ఎక్కడ చూస్తాం?' మెజీషియన్ సుబ్బు విద్యార్థుల్ని అడిగాడు.
ఇంకెక్కడ, ఆకాశంలోనే' ఠక్కున జవాబిచ్చింది ఆశ్రీత.
కరెక్ట్! కాని ఈ ప్లాస్టిక్ సీసా చూడండి. నేను దీంట్లో మేఘాలను సృష్టిస్తా. అదే ఈ రోజు మేజిక్ అన్నాడు మెజీషియన్.
ఇదెలా సాధ్యం. అయినా చూద్దాం. మెజీషియన్ సామాన్యుడు కాదు. చెప్పింది చేస్తాడు' అనుకున్నారు విద్యార్థులు.
మెజీషియన్ ఒక ప్లాస్టిక్ సీసాను తీసుకుని అందులో వేరే బీకరులోని రంగులేని ద్రవం కొంచెం పోశాడు. అగ్గిపుల్లను వెలిగించి వెలుగుతున్న తలభాగాన్ని సీసాలో ఉంచాడు. సీసాలో పొగ వ్యాపించింది. సీసామూతికి మూతను బిగించాడు. ఏదో మంత్రం పఠిస్తున్నట్లుగా పెదవులు కదిల్చి, సీసాను నాలుగైదు సార్లు గట్టిగా నొక్కి వదిలాడు. సీసా మబ్బులో నిండిపోయింది.
ఇదిగో సీసాలో మేఘం. చూడండి' అంటూ అందరికీ చూపించాడు. అంతా చప్పట్లు కొట్టారు.
విద్యార్థుల్లో ఆసక్తి పెరిగింది. అంతటితో ఆగిపోలేదు. ఆకాశంలో ఏర్పడే మేఘం సీసాలో ఎలా ఏర్పడింది? ఇందులో ఏదో సైన్స్ రహస్యం ఉండి ఉంటుంది. అడిగి తెలుసుకుందాం అనుకున్నారు. సైన్స్ టీచర్ లక్ష్మి అన్ని విషయాలు చక్కగా చెబుతుంది కదా! ఇంకేముంది, సైన్స్ టీచర్ ను ప్రశ్నలతో చుట్టుముట్టారు.
మీలో ఇంత ఆసక్తి కలిగినందుకు సంతోషం. వానలు కురవాలంటే, మేఘాలు ఏర్పడాలి కదా. మేవలు ఏర్పడడానికి కొన్ని అనుకూలమైన పరిస్థితులుండాలి. ఇది ప్రకృతిలో జరిగేదే. ముందు ఈ విషయాలు తెలుసుకుందాం' అంటూ చెప్పడం ప్రారంభించింది సైన్స్ టీచర్.
చాలా సూక్మ పరిపూణంలోని అనేక నీటిబిందువులు లేదా మంచు స్పటికాల సమూహమే మేఘం లేదా మబ్బు గాలిలో కొంత నీరు కూడా ఉంటుందని తెలుసుకదా, కాని నేలకు దగ్గరలో గాలిలోని నీరు కంటికి కనిపించని వాయుపులా అంటే జలభాస్చం రూపంలో ఉంటుంది. వేడిగాలి పైకి లేచినప్పుడు వ్యాకోచం చెంది చల్లబడుతుంది. కాని వేడిగాలితో పోల్చినప్పుడు, చల్లని గాలి ఎక్కువ జలభాష్పాన్ని తనలో పట్టి ఉంచుకో లేదు. అందుచేతనే గాలిలో తేలియాడే దుమ్ముకణాల మీద జలభాష్పంలో కొంత భాగం ద్రవీకరించి అతి సూక్ష్మనీటి బిందువులను ఏర్పరుస్తుంది. ఇలాంటి నీటి బిందువులు కోట్లాదిగా దగ్గరగా వచ్చినప్పుడు కంటికి అగుపించే మేఘాలు ఏర్పడతాయి.
గాలి పైకి లేచినప్పుడు ఎందుకు చల్లబడుతుంది? కార్తీక్ ప్రశ్న.
చెబుతా విను కార్తీక్. గాలి పైకి లేచినప్పుడు పడనం తగ్గుతుంది. కాబట్టి గాలి వ్యాకోచిస్తుంది. అందుకే చల్లబడుతుంది అని జవాబిస్తూ ఈ రోజు మెజీషియన్ చేసిన మేజిక్ మనం చేసి చూద్దాం రండి' అంది సైన్స్ టీచర్.
ఇందుకు కావాల్సినవి: లీటరు ఘనపరిమానం గల ప్లాస్టిక్ సీసా, వెచ్చిన నీరు, అగ్గిపుల్ల.
ముందుగా ప్లాస్టిక్ సీసాలో కొంచెం వెచ్చని నీరు సోయాలి. సీసా అడుగుభాగం కనపడేంత నీరు పోస్తే సరిపోతుంది. అగ్గిపుల్ల వెలిగించి, తలభాగం సీసాలో ఉంచాలి. సీసా పొగతో నిండేలా చేసి మూతపెట్టాలి. సీసాను నాలుగైదు సార్లు గట్టిగా నొక్కి వదలాలి. నొక్కిన తరువాత వదిలినప్పుడు సీసాలో మబ్బు ఏర్పడడాన్ని గమనించవచ్చు.
సీసాను నొక్కినప్పుడు జలభాష్పం అణచబడి దాని ఉష్ణోగ్రత పెరుగుతుంది. వదిలినప్పుడు, భాష్పం వ్యాకోచించి చల్లబడుతుంది. పొగకణాల చుట్టూ జలభాష అణువులు దృవీకరించి సూక్ష్మ బిందువులుగా ఏర్పడతాయి. ఇలాంటి సూక్ష్మ బిందువులు వేలాదిగా దగ్గరై మేఘం మాదిరిగా ఏర్పడతాయి. గాలిలోని దుమ్ము, ధూళి, కాలుష్యాలు, బాక్టీరియా, పొగ కణాల మాదిరి గానే, మేఘాలు ఏర్పడడానికి ఉపయోగపడుతున్నాయి.
నిజానికి మేఘాలను గురించి మీరు తెలుసుకోవలిసింది చాలా ఉంది. మేఘాల్లో రకాలు, తెల్లని మేఘాలు, నల్లమబ్బులు ఇలా చాలా విషయాలు మనం తెలుసుకోవాలి. ముందు ముందు తెలుసుకొందాం.
ఆధారం: డా.ఇ.ఆర్. సుబ్రహ్మణ్యం.
చివరిసారిగా మార్పు చేయబడిన : 1/22/2020