ఒక జర్నలిస్టు కిచ్చిన ఇంటర్వూయిలో అడిగిన పై మాటలు సోంబాయి మనసులోని కోపాన్ని భాధను చెబుతాయి. భారతదేశంలోని ఆదివాసులలో గొండు జాతి ఒకటి. ఆంద్రప్రదేశ్ లోని ఆదిలాబాద్ ప్రాంతాల్లో నివసించే గొండుల నాయకుడు కొమురం భీం భార్య సోంబాయి. ఈమె కొమురం భీంతో పాలు గిరిజనులకు భూమి మీద హక్కు కావాలని నిజం నంబుతో యుద్ధం చేశారు. అడవిబిడ్డలైన గొండు ప్రజలమీదా, వారి భీమి మీద అధికారం కోసం బ్రిటిష్ సైన్యాలు, నైజం సైన్యాలు దాడి చేసేవి. వాళ్ళ గదులను తగులభేట్టేవారు. వాళ్ళమీద కేసులు పెట్టేవారు.
కొమరం భీం తన వారితో కలిసి అరవై ఎకరాల అడవిభూమి సాగులోకి తెచ్చి జిదెంఘుటు, పట్నాపూర్ మెదలైన పన్నెండు గ్రామాలుగా ఏర్పరిచారు. ఆ గ్రామాలూ, మిగిలిన గొండు గ్రామాలూ తన ఆధీనంలోకి రావాలని నిజం మిలటరీని పంపాడు. గొండులకు నిజం పోలీసులకు జరిగిన యుద్ధాలలో చాలాసార్లు కొమురం భీం నాయకత్వంలో గొండులు నిజం సైన్యాన్ని తిప్పికొట్టారు.
1940 జోడెన్ ఘాట్ ని తుపాకులతో చుట్టుముట్టిన సైనికులు భీంనీ, అతని సహచరులను పట్టాలిస్తామని పిలిచి కాల్పులు మొదలుపెట్టారు. గిరిజనులు కూడా యుద్ధం చేశారుగాని తుపాకుల ముందు బరిసెలు, బాణాలు ఆగలేదు. సోంబాయి ఆసమయంలో బాలెంతరాలు. నెలవయసున్న కొడుకుని నడుముకి బిగించి కట్టుకుని యుద్ధంలోకి దిగి ఆయుధాలు అందిస్తూ పోరాటంలో భాగమయ్యారు. కొమరం భీం కాల్పుల్లో మరణించాక సింధులు సోంబాయి ని అక్కడ నుంచి అడవి లోపలి తప్పించారు.
నా భర్త శరీరం ఎక్కడ మళ్ళీ జీవం పోసుకుంటుందోనన్న భయంతో నిజం పోలీసులు మరి మరి కాల్చారు. పది బండ్ల కర్రతో తగలబెట్టారు. కానీ నా భర్త మరో రూపంలో కత్తికంటే కొచ్చెగా, పలుగు కంటే పదునుగా, బల్లెం కంటే బలంగా అడవినంతా ఆక్రమించుకుంటాడన్న సంగతిని వాళ్ళు పసిగట్టలేకపోయారు. అనే సోంబాయి మాటలు అతిశయెక్తి కాదు. ఇప్పటికి ఆదిలాబాద్ ఆదివాసులు భీం తమలో ఉన్నట్టే భావిస్తారు.
ఆ యుద్ధం ముగిసిన ఇన్ని సంవత్సరాలకు కూడా గిరిజనులకు ఒరిగిందేమి లేదంటారు. సోంబాయి అప్పటి నిజం ప్రభువు జోడెన్ ఘాట్ మెదలైన పన్నెండు గ్రామాలను కొమురం భిముఖీ ఇచ్చేస్తానన్నాడని, కానీ మొత్తం గిరిజన తెగలకు స్వేచ్ఛ కావాలని భీం కోరటంతో యుద్ధం తప్పలేదని, తన భర్త కోరిక నిజం నవాబు కొంతవరకైనా మన్నించాడు గాని ఏ ప్రజా ప్రభుత్వాలు గిరిజనులకు చేసినదేమి లేదన్న సోంబాయి గిరిజన స్త్రీలు పోరాట స్ఫూర్తికి నిదర్శనం.
చివరిసారిగా మార్పు చేయబడిన : 7/12/2020