অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

క్రీడాకారిణి – అశ్వని

బీజింగ్ ఆసియా క్రీడలకు క్రోధాకారులను ఎంపికచేసి ప్రయత్నాలు న్యూఢిల్లీలో జరుగుతున్నాయి. రెండు వందల మీటర్ల పరుగు పందెం ప్రారంభం కాబోతున్నది. పెద్ద ఎత్తున ప్రజలు, వివిధ దేశాల ప్రత్రికా విలేఖరులు, దూరదర్శన్ బురందలవారు తరలివచ్చారు. అందరికి ప్రత్యేక ఆకర్షణ పి.టి. ఉష. 'ఆమె గెలుస్తుంద' ని అందరి విశ్వసం. వేటకు దూకబోయే కొదమసింహాల్లా వేచి ఉన్నారు క్రీడాకారిణులు.

గన్ పేలి పరుగు ప్రారంభమయంది. మిగిలిన క్రీడాకారిణులనందరిని దూసుకుంటు ఉష 100 మీటర్లు దాటింది. 150 మీటర్లు దాటింది. మరొక 50 మీటర్లు ముందుకు వెళితే విజేత ఆమెయే. 'కామన్ ఉష' అన్న ప్రేక్షకుల కేకలు మిన్ను ముట్టుతున్నాయి. కానీ వారందరిని నిస్మయపరుస్తూ సరిగా అదే సమయంలో వింటి నుంచి సారించి వదలిన బాణంలా ముందుకు దూసుకుపోయంది మీరొక క్రీడాకారిణి. రాకెట్ లా ముందుకు వెళ్ళి 24.07 సెకన్లలో గమ్యం చేరింది. 24.12 సెకన్లలో అక్కడికి చేరిన ఉష రెండవ స్ధానం పొందండి.

స్టేడియం మొత్తం నిస్సాసిష్ఠమయండి. అరక్షణం నిశ్శబ్దం రాజ్యమేలింది. తమ అంచనాలు తలాక్రిమడులు చేసిన ఆ క్రీడాకారిణి వంక వింతగా చూశారందరు. ఆ పబ్లిక్ ఎరీనాలోని ఫోటో గ్రాఫేర్లు కెమెరాలు తళుక్కుమంటున్నాయి. వందలమంది అభినందనల వర్షంలో ముంచెత్తారు. 'రన్నింగ్ క్రేన్' ఆమె కవసమయండి. తాను పడిన శ్రమ పాలించినందుకు ఆమె శిక్షకుడు 'సునల్ అబ్రహాం' ఆనంద బాష్పాలు రాల్చాడు. ఆమె ఎవరోకాదు - అశ్వని. ఈ సన్నివేశం జరిగింది 1990 వ సంవత్సరంలో.

ఇండియన్ లేడి రన్నర్స్ అందరిలోనూ ఎలాగైనా ఉషను అధిగమించాలనే ఆకాంక్ష బలవత్తరంగా ఉన్న రోజులవి. ఎందుకంటే ఉష ప్రభ పట్టపగటి సూర్యుడిలా వెలిగిపోతున్నాడు. కానీ ఆ ఆకాంక్షను నిజం చేయగలిగింది మాత్రం అశ్వనియే! ఆమెను గురించిన వివరాలను తెలిసికొందాము.

జననం - బాల్యం

విభిన్న భాష మాత సంప్రదాయాలతో ఉపఖండంగా పేరొందింది ఈ భరతమాత. ఆమె పవిత్రీ దేహంలో కర్ణాటక రాష్ట్రం ఒక భాగం. ఆ భాగంలో 'కూర్గు' ప్రాంతం కూడా పేరెన్నికగన్నదే. అందు 'విరాజ్ పేట' గ్రామం అశ్వని జఞ్ఞాసాధనమై దేశమంతట, అదే విధంగా క్రీడా ప్రపంచమంతటా గుర్తింపు పొందింది. ఈమె క్రీ.శ. ది. 21-10-1967 న పార్వతి, అప్పచ్చ నాచప్ప దంపతులకు కుమార్తెగా, పుష్పకు చెల్లెలుగా జనమించింది. తన ముద్దు ముద్దు మాటలతోను, బుడి బుడి నడకలతోను అందరిని అలరిస్తూ చిలిపిగా, చలాకీగా నవ్వుతు నవ్విస్తూ 'ఆనందరాజి' గా వెలిగిపోయంది. తండ్రి ఉద్యోగరీత్యా కన్నడ భాష సంస్క్రుతులకు దూరంగా కలకత్తా నగరంలోని 'బిర్లా రేయాన్' లో పనిచేస్తున్నాడు. ఎదుగుతున్న పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తల్లి పార్వతి బెంగుళూరు లో ఉంటున్నది. వారికీ విద్యాబుద్ధులు నేర్పించే బాధ్యతలను తన భుజస్కంధాల పై వేసికొన్నది.

శుక్లపక్ష చంద్రునిలా దినదినాభివృద్ధి చెందుతున్న అశ్వని తన ఎనిమిదవ ఎటనుండే స్కూల్ పోటీల్లో పాల్గొన్నది. వందమీటర్ల పరుగు పందెం, లాంగ్ జంప్ రెండు ఆమెకిష్టమైనవే. క్రమేపి లాంగ్ జంప్ కు స్వస్తిచెప్పి, పరుగు మీదనే తన దృష్టి కేంద్రీకరించింది. లేడిలా చెంగు చెంగున పరుగెత్తుతూ స్కూలు ఆటలా పోటీల్లో మొదటి బహుమతినేప్పుడు ఆమె గెల్చుకుంటాన్నది.

బెంగుళురులో ఆమె ఇంటి కుదురుగానే 'కంఠీరవా స్టేడియం' ఉంది. అక్కడే ఆమె బాల్యదశనుండే గాలిని చీల్చుకుపోతూ పరుగెత్తడంలో మెళకువలు నేర్చుకున్నది. గారాల బలయిన ఆమెకు శిక్షణ నిస్తున్న 'మొహిందర్ సింగ్' ఒక రాయండి చుట్టి వస్తే ఒక చాకోలెట్ ఇస్తనవి లాలించి మరి ట్రాక్ మీదికి తోలేవాడు. అప్పటి వరకు చిలిపిగా ప్రవర్తించిన అశ్వని అంతలోనే గాంభీర్యం సంతరించుకొని, శిశషునికి కూడా ఆశ్చర్యం కలిగించే వేగంతో గమ్యం చేరుకుంటుంది. ఆమె బెంగుళూరులోని 'మాయంట్ కార్మెల్' లో నున్న 'సేక్రేడ్ హార్ట్ గరల్స్ హైస్కూల్ & కాలేజీ' లో మాధ్యమిక విద్యార్జన మారంభించింది. ఆ కాలంలోనే 11 వ ఏట నుండి 17 వ ఏట వరకు 6 సంవత్సరాలపాటు 'విజేత'గా వచ్చింది. 1980-81 లో తన 13 వ ఏట తొలిసారిగా జాతీయ స్ధాయి పోటీల్లో ఆమె అడుగుపెట్టింది. కర్ణాటక రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించి 'ఆల్ ఇండియా ఓపెన్ నేషనల్స్' లో జానియర్ స్ధాయిలో 100 మీటర్ల పరుగుపందెంలో బంగారు పథకాన్ని సాధించింది. అంతేకాక అన్ని జాతీయ స్ధాయి పోటిలయందును 1980 నుండి 1991 వరకు 11 సంవత్సరాలపాటు ప్రాతినిధ్యం వహించింది. 1984 నుండి 1991 వరకు భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది.

అశ్వని సాధించిన ఘన విజయాలు

  • 1984 లో నేపాల్ లో జరిగిన 'తొలి దక్షణ ఆసియా సమాఖ్య క్రీడ' ల్లో ఒక స్వర్ణపతకం, ఒక రజిత పథకం గెలుచుకొంది.
  • 1985 లో జకార్తాలో జరిగిన 'ఏషియన్ ట్రాక్ & పీల్డ్ మీట్ ' లో ఒక కాంస్య పతకం గెలుచుకొంది.
  • 1985 లో బంగ్లాదేశ్ లో జరిగిన 'రెండవ దక్షణ సియా సమాఖ్య క్రీడ' ల్లో ఒక స్వర్ణపతకం, ఒక రజిత పతకం గెలుచుకొంది.
  • 1986 లో దక్షణ కొరియాలో జరిగిన 'ఆసియా క్రీడ' ల్లోనూ పాల్లొన్నది.
  • 1987 లో రోమ్ లో 'వరల్డ్ ఛాంపియన్ ఫీస్' లోను పాల్గొన్నది.
  • అట్లాగే 1987 లో సింగపూర్ లో 'ఏషియన్ ట్రక్ & పీల్డ్ మీట్ ' లో ఒక స్వర్ణపతకం, ఒక రజిత పతకం సాధించింది.
  • 1987 న్యూఢిల్లీ లో 'ఇంటర్నేషనల్ పర్మిట్ మీట్'లో ఒక స్వర్ణపతకం, ఒక రజిత పతకం సంపాదించింది.
  • అట్లాగే 1988 దక్షణ కొరియా 'ఒలింపిక్ క్రీడ'ల్లోనూ పాల్గొన్నది.
  • 1989 న్యూఢిల్లీ 'ఏషియన్ ట్రాక్ & ఫీల్డ్ మీట్'లో 2 రజిత పతకాలు సాధించింది.
  • 1990 బీజింగ్ లో జరిగిన ఆసియా క్రీడల్లో పాల్గొన్నది.
  • 1991 టోక్యోలో 'వరల్డ్ ఛాంపియన్ షిప్స్'లో ఒక స్వర్ణపతకం సాధించింది.
  • 1991 మలేషియాలో 'ఏషియన్ ట్రాక్  & ఫీల్డు'లో ఒక స్వర్ణపతకం గెల్చుకుంది.

ఆమె 1988 నుండి 1991 వరకు 200 మీటర్ల పరుగు పందేల్లో జాతీయ స్ధాయి చాంపియన్. అంతేకాదు 1990 లో పి.టి. ఉష ను 200 మీటర్ల పరుగు పందెంలో రెండుసార్లు ఓడించింది.

అశ్విని అందుకొన్న అవార్డుల్లో ఎంతో విశిష్టమైనవి

  • 1987 లో కర్ణాటక ముఖ్యమంత్రి నుండి అందుకొన్న 'దసరా అవార్డు'.
  • 1990 లో భారతదేశాధ్యక్షని నుండి అందుకొన్న 'అర్జున అవార్డు'.
  • 1990 లో కర్ణాటక రాష్టం తరపున, ఇవ్వబడిన 'రాజ్యోత్సవ అవార్డు'.
  • 1990 లో శ్రీ శంకర్ దయాళ్ శర్మ నుండి అందుకున్న 'స్పిరిట్ అఫ్ ఎక్సలెన్స్' అవార్డు.
  • 1993 లో కర్ణాటక గవర్నర్ నుండి అందుకొన్న 'శిరోమణి అవార్డు'.

వేగంగా పరుగెత్తే వాళ్ళకు అంటే - స్ప్రీంటర్సుకు - ప్రతి క్షణం ప్రధానమైనదే. అందుకే పోటీలో కళ్ళేకాదు, మెదడు కూడ పరుగు పెట్టాలని అశ్వని అభిప్రాయం. ఆ విధంగా పరుగుకానుగుణంగా మనసును మలచుకొనేందుకు మరో చక్కని హాభిని ఆమె అలవరచుకొన్నది. అదే మానసిక శిక్షణ (మైండ్ ట్రైనింగ్), ఏకాగ్రత, పట్టుదల పెరిగేఎందుకు 'రిలాక్సేషన్' ఎంతోగానో ఉపకరిస్తుంది. శరీరంలోని కండరాల్ని పోటీకి సంసిద్దంచేసి, టెంషన్ తొలగించేందుకు ధ్యానం (మెడిటేషన్) చేస్తుంది. ఇందుకు 'రూపెన్ దాస్' అనే శిక్షకుడు ఆమెకు సహకరిస్తున్నాడు. ధ్యానం వల్ల తన పరుగులో మార్పు వచ్చిందని ఆమె భావన.

అభిరుచులు

ఆమెకు తానొక అంతర్జాతీయ స్ధాయి క్రీడాకారిణినన్న గర్వం కించిత్తు కూడ కనిపించదు. ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎవరితోనైనా ఎంచక్కా కబుర్లు చేపుతుంది.

'కైనెటిక్ హోండా' ఎక్కి హుషారుగా షికార్లు చేయడం ఆమెకు ఎక్కడలేని సరదా. పుస్తకాలంటే ఆమెకు ప్రాణం. తీరిక చిక్కినప్పుడల్లా ఓ మంచి నవలను పాటించడంలో కలం వెళ్ళబుచ్చుతుంది.

ఇక సంగీత మంటే చెప్పనే అక్కర్లేదు. క్యాసెట్స్, రికార్డ్స్ సంపాదించి వాటి మాధుర్యాన్ని ఆస్వాదించడం, విడియె చిత్రాలు తిలకించడం ఆమె అందమైన అభిరుచులు.

విమర్శలు

క్రీడాకారిణిగా ఆమె ఎందరి అభిమానం చూరగొన్నదో అందరి విమర్శలకు కూడ గురికావలసి వచ్చింది.

ఢిల్లీ లో ఉషను ఓడించినప్పుడు 'ఇది కేవలం యాదృచ్చికం, ఏదో గాలిపాటు గెలుపు' అంటూ పెదవి విరుస్తూ భాష్యాలు చెప్పరెందరో.

అంతేకాక ఉషను ఆమెకు ప్రత్యర్థిగా చితరించటానికి పూనుకున్నారు కొందరు. వారికీ సమాధానంగా 'ట్రాక్ లో మేం తప్పకుండా ప్రత్యర్థులమే. పోటీ అంటేనే అది తప్పదు. అయితే మాది స్నేహపూర్వక శత్రుత్వం. దాని బహిరంగపరచటంలో అర్ధం లేదు' అందమే.

అంతేకాక ఆధ్లెట్లకు అరకొరగా సౌకర్యాలు కల్పించడం పట్ల ఆమె థ్రవ్రంగా అశేపన తెల్పిన సన్నివేశంలో సంజాయిషీ ఇచ్చుకోవలసి వచ్చింది. 'మనవాళ్ళు ఒక క్రీడాకారిణి గెలుపొందినప్పుడు పొగడడం, లేనప్పుడు తేగడడం చేస్తారు. అంతేకాని ఆమెకు కావలసిన వాతావరణం, ప్రోత్సాహం గురించి ఆలోచించ' రంటుంది.

ఉన్నత విద్య ఉద్యోగం

ఆమె ఎంతగా క్రీడారంగంలో రాణిస్తున్న విద్య విషయంలో మాత్రం నిర్లక్యం వహించలేదు. కర్ణాటక విశ్వవిద్యాలయం నుండి బి.ఏ.డిగ్రీని 'కరెస్పాండెన్స్ కోర్సు' ద్వారా సాధించింది.

అంతేకాక బెంగుళూరు 'విజయ బ్యాంక్' లో ఆఫీసర్ గా తన ఉద్యోగ బాధ్యతలకెటువంటి లోపాలు కలుగకుండగానే తన మిగిలిన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. 1993 లో 'ఆస్ట్రియా'లో జరిగిన 'వరల్డ్ వింటర్ ఒలింపిక్స్'లో 'ప్లోర్ హాకీ' లో భరత్ జట్టు స్వర్ణపతాకాన్ని గెలుచుకొన్నది. ఆ జట్టు కోచ్ లలో అశ్వని కూడ ఒకరు!

మానవుడు తనకోసం తాను జీవించడంలో గొప్పతనం లేదు. అంతకంటే తనకు చేతనైనంత లో వేరొకరికుపయెగపడడంలోనే జీవిత పరమార్ధం ఇమిడి ఉంది. ఆమె ఆ విధమైన దృక్పథంతోనే మానసికంగా వికలాంగులైన పిల్లలకు ఒలింపిక్ క్రీడలకు శిక్షణ నిచ్చే సంస్ధలో స్వచ్ఛదంగా పనిచేస్తోయింది.

ఆధారం : రాష్ట్ర విద్య పరిశోధన శిక్షణ సంస్ధ

చివరిసారిగా మార్పు చేయబడిన : 6/16/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate