తమ్ముడు పదిరోజులుగా బాధపడుతున్నాడు. రాష్టహీనతవల్ల నానాటికి కృషిస్తున్నాడు. పలుమార్లు విరేచనాలవుతున్నాయి. వ్యాధి మరింత తీవ్రమైంది. తమ్ముని భాధను చూస్తూ నిస్సహాయుడై నిల్చున్నాడు అన్న. పెద్ద వైద్యం చేయించేందుకు డబ్బుల్లేని వాడు ఆ బాలుని తండ్రి. చూస్తుండగానే తమ్ముడు శాశ్వతంగా కన్నుమూశాడు. పన్నెండేళ్ళ అన్న కన్నీళ్ళు కారుస్తూ ఈ రోగానికి మండెలేదా? అని తనలో తాను ప్రశ్నిఎంచుకున్నాడు.
'భయంకరమైన ఈ వ్యాధిని నిర్మలించాలి. ఇందుకు మందు కనిపెట్టాలి. నేను డాక్టర్ని కావాలి' అని బాలుడు నిబ్చయంచేకున్నాడు. ఆ బాలుడే దీక్ష నిరంతరాశ్రమ, పరిశోధనల వల్ల గొప్పవైద్యశాస్త్రవేత్తగా ప్రపంచ ప్రజల మన్నునాలందుకున్న డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు.
యల్లాప్రగడ సుబ్బారావు 1-7-1896 వ రాజమండ్రిలో జనమించాడు. తండ్రి తాలూకా కచేరీలో గుమస్తా. వారిది బీద కుటుంబం. దానికి తోడు బాల్యంలోనే తండ్రిని కోల్పోయాడు. బాల్యం నుంచి దైవచింతన కలవాడు.
మద్రాసులో విద్యార్థిగా ఉండే రోజులలో అయన ఉపనిషత్తులు, గీత, బైబిల్, ఖురాన్ లను పరించేవాడు. అప్పుడే ఆధ్యాత్మిక జీవితం పై మక్కువ చూపి, రామకృష్ణ సేవాసంస్ధలో చేరి సన్యాసి కావాలనుకున్నాడు. తనకు అభిమాన విషయం గణితశాస్రం అయినప్పటికీ రామకృష్ణ సేవాసంస్ధవారి సలహా పై మద్రాసు మెడికల్ కాలేజీలో ప్రవేశించాడు. 1921 లో ఎం.బి.బి.యస్. పట్టభద్రుడై, అదే కాలేజీలో ఒక సంవత్సరం ఫిజియాలజి డిమాన్ స్ట్రేటర్ గా పనిచేశాడు.
విజన్ తృష్ట కలిగిన సుబ్బారావు డిమాన్ స్ట్రేటర్ ఉద్యోగం ఇష్టపడక, 1922 లో ఇంగ్లండ్ వెళ్ళి, "స్కూల్ అఫ్ ట్రిపికల్ మెడిసిన్" లో చేరి డి.టి.ఎం. డిప్లమాను పొందాడు. ఇక్కడే బోస్టన్ లోని హార్వర్డ్ మెడికల్ స్కూల్ లో ప్రాసెసర్ గా పనిచేస్తున్న డాక్టర్ రిచర్డ్ సురేంజ్ ను కలుసుకున్నాడు. సుబ్బారావులోని ఉత్సాహాన్ని గమనించి, ఉన్నత విద్యాభ్యాసానికి హార్వర్డ్ రావలసిందిగా ఆయన్ను శ్రేయంగ ఆహ్వానించాడు. ఆ విధంగా 1923 సెప్టెంబర్ లో సుబ్బారావు అమెరికా వెళ్ళాడు. విదేశాలు వెళ్ళిన తొలిరోజులలో కాకినాడలోని మల్లాది సత్యలింగం నాయకర్ ధర్యంనిధుల నుంచి ఆయనకు కొంత ఆర్ధిక సహాయం లభించిన, తర్వాత చాలా సంవత్సరాలు అయన ఆర్ధికంగా అవస్ధలు పడవలసి వచ్చింది.
హార్వర్డ్ ట్రాపికల్ మెడిసిన్ స్కూల్లో డాక్టర్ స్ట్రాంగ్ వద్ద 1923 నుంచి 1924 వరకు సుబ్బారావు పనిచేశాడు. అప్పడే ఆయనకు బయెకెమిస్త్రి మీద అభిరుచి ఏర్పడింది. తర్వాత రెండు సంవత్సరాలు పాశ్యాత బాఎకేమిస్తూ డాక్టర్ ఒట్టోపోలుం వద్ద "రిసెర్చి ఫెలో" గా పనిచేశాడు. తర్వాత మరి రెండు సంవత్సరాలు "రాక్ ఫెల్లర్ ఫోమ్దేశం ఫెలో" గా ఉండి 1930 లో హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి బయెకెమిస్ట్రీలో పి.హెచ్.డి. డింద్రి పొందాడు. అంతకుముందే డాక్టర్ పిస్కతో కలిసి పనిచేసి సుబ్బారావు జీవరసాయన శాస్ర్త రంగంలో కీర్థప్రతిష్ఠలు సంపాదించుకున్నాడు. భాస్వరాన్ని నిశ్చయంచడానికి "పిస్క్ - సుబ్బారావు ప్రింనిపుల్" నే 1925 నుంచి నేటివరకు శాస్త్రజాలు ఉపయేగిస్తుకున్నారు. 1926 లో ఫిస్క్ తో కలిసి సుబ్బారావు కండరాలలో "ఫాస్ఫో క్రియాటివ్" ను వేర్పరచి కనిపెట్టిన విధానం, కండరాల చాలావానికి సంబంధించిన పరిశోధన రంగంలో నూతన శకాన్ని ప్రారంభించింది. ఈ పరిశోధనలే తర్వాతి సంవత్సరాలలో "ఎడినోసిన్ తరిఫాస్పెట్" ను కనిపెట్టడానికి దారితీసి, "కార్బోహైడ్రేట్ మెటబాలిజం" లో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టాయి.
సుబ్బారావు తాను పి.హెచ్.డి. పూర్తవగానే స్వదేశానికి తిరిగి రావాలనే తలంపుతో కలకత్తాలోని "హైజీన్ - ప్రజారోగ్య సంస్ధ" లో బయెకెమిస్త్రి ప్రొఫెసర్ పదవికి రాక్ ఫెల్లర్ ఫోమ్డేషన్ వారి ప్రోత్సాహంతో ప్రయత్నించాడు. కానీ అప్పటి ఆంగ్ల ప్రభుత్వం ఆ ఉద్యోగం ఆంగ్లేయులకే ప్రత్యకించిందని తెలిపి, పరిశోధనావకాశాలు లేని మరోపదవి ఇవ్వజూపారు.
పదేళ్ళపాటు సుబ్బారావు హీర్వార్డ్ మెడికల్ స్కూల్లో జీవరసాయన శస్త్ర విభాగంలో వివిధ పసువులను నిర్వహించాడు. 1930 - 1936 మధ్యకాలంలో 'ఆప్టిన్ టీచింగ్ ఫెలో' గాను, 1936 నుంచి 1938 వరకు ఇన్స్ట్రక్టర్ గాను, తర్వాత రెండు సంవత్సరాలు అసోసియేటెడ్ ప్రొఫెసర్ గాను పనిచేశాడు. విద్యార్థులకు బోధించడంలో కొంత సమయం గడిపినప్పటికీ, ఎక్కువ భాగం అయన లేబొరేటరీలోనే నిమగ్నుడై ఉండేవాడు. ఈ సమయంలో అయన దృష్టి 'బి-కాంప్లెక్సు' విటమిన్ లమీద, 'సెల్లాగ్రా' అనే వ్యాధిని నిరోధించే 'నికోటినిక్ యాసిడ్' పైన, 'బి - 12' విటమిన్ పైన లగ్నమైంది. ఆ రోజులలో హార్వర్డులోనే పనిచేస్తున్న మైనట్టు, మార్పి, కాన్ అనే శాస్త్రజాలు 'పేర్నిషియస్ ఎనిమియా' రోగ చికిత్సకోసం పరిశోధన చేస్తున్నారు. వేరుచేసి కృషిని కొనసాగించి సుబ్బారావు నూతన విధానాలను కనిపెట్టాడు.
1933 లో లెడర్లీ లాబొరేటరీతో ఆయనకు ఏర్పడ్డ సంబంధం అయన జీవితంలో నూతనాధ్యాయాన్ని ప్రారంభించింది. లెడర్లీ వారు అయన పరిశోధనల నిమిత్తం, పాశికంగా పరిశుద్ధమైన 'లివర్' భాగాలను అందజేస్తుండేవారు. 'పెర్ల్' నది తీరాన ఉన్న లెడర్లీ లాబొరేటరీకి ప్రతి వారాంతరం సుబ్బారావు వెళ్ళి, వారి 'బి-కంప్లెక్సు' విటమినుల ఉత్పత్తిలో తోడ్పడుతుండేవాడు. 1940 లో లీడర్లలో "అసోసియేట్ రీసెర్చ్ డైరెక్టర్" గా ప్రవేశించి, 1942 లో "రీసెర్చ్ డైరెక్టర్" పదవి పొందగలిగాడు. వ్యాధుల బారినుంచి మానవకోటికి రాశించాలనే తన జీవిత లాశ్యంని సాధించడానికి ఈ లాబొరేటరీలోనే ఆయనకు అవకాశం లభించింది.
1945 జులై 20 వ తేదీ సుబ్బారావు జీవితంలోనేకాదు, ప్రపంచ వైద్య చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖియించ దాగిన రోజు. ఆ రోజునే సుబ్బారావు అయన సహచరులు భయంకరమైన 'ట్రాపికల్ స్ప్రూ' వ్యాధికి దివ్య హౌషధం అయిన 'ఫోలిక్ యాసిడ్ ' అనే విటమిన్ ను కనిపెట్టి చరితార్ధులయ్యారు. సుబ్బారావు తన జీవిత లాశ్యంని సాధించాడు. నాటి నుంచి ఆ హౌషధం 'స్ప్రూ' వ్యాధితో బాధపడుతున్న లక్షలాది రోగులనేగాక, ఉష్ణదేశాలలో తరచు వచ్చే 'మైక్రోసైటిక్ ఇనిమియా' వ్యాధిగ్రస్థలను కూడా కాపాడ గలుగుతున్నది. తర్వాత కొంతకాలానికి 'ఫోలిక్ యాసిడ్ కు' ప్రత్యామ్నాయమైన 'ఎమైనో స్టెరిన్', 'మొనాస్టరీన్', అనే హౌషదాలు కూడా ఆయన ఆధ్వర్యంలో కనిపెట్టబడ్డాయి. ఆ హౌషధలను 'లుకేమియా' అనే రక్తసంబంధమైన క్యాస్ర్ లో ఉపయేగిస్తున్నారు. అలాగే 'ఫైలేరియా' బోధ, ట్రాపికల్ ఇసినోఫీలియా వ్యాధులలో ఉపయెగించే 'హెట్రాజన్' కూడా సుబ్బారావు అధ్యర్యంలో కనిపెట్టబడ్డాయి.
విద్యార్థులంటే డాక్టర్ సుబ్బారావుకు ఎంతో ప్రేమ. చాలామంది విద్యార్థులకు ఆయన ఆర్ధిక సహాయం అందించారు. ఆయనలోని మానవుడు, పరోశోధకునని కంటే గొప్పవాడై వెలిగాడు. తనతోపాటు పరిశోధన సాగిస్తున్న యువ పరోశోధకురాలు షయవ్యాధితో శానిటోరియం చేరితే, ఆమె చికిత్సకోసం తన వేతనం నుంచి ఆరుసంవత్సరాలపాటు ఆర్ధికసహాయం ప్రతినెలా పంపేవాడు. తాను అనాధనాని ఏ రోగి భావించరాదని చెప్పేవాడాయన.
'నేను పుట్టుకతో ఏమి పట్టుకొని రాలేదు. చనిపోయేటప్పడు ఏమి తీసికెళ్ళాను. నా ఆదాయవ్యయాలు నా జీవనోపాధికి తగినంత ఉందినచనలు' అనే ఉదరశయం కలిగినవాడాయన. నైష్ఠిక బ్రహ్మచారి.
1948 లో అమెరికా ఆయనకు పౌరసత్వమిచ్చి గౌరవించింది. లెడర్లీ వైద్యపరిశోధనకేంద్రం ముఖద్వారం దాటినా తర్వాత పెద్ద కాంస్య ఫలకం పై ఉన్న డా. యల్లాప్రగడ సుబ్బారావు చిత్రం కింద "యల్లాప్రగడ సుబ్బారావు, 1896-1948 పరిశోధకులు, విదాయవేత్త, తత్వవేత్త, దయామయుడు, లీడర్ల పరిశోధన సంస్ద డైరెక్టర్" అన్న వాక్యాలు అందరి దృష్టిని ఆకర్షిస్తాయి.
ఆయనలో అత్యంత శ్లఘనీయమైన గుణం జనతృష్ణ, ఏ విషయం గురించి తెలుసుకోవాలన్న, ఆ విషయం గురించి సమస్త గ్రంధాలను, జర్నల్స్ ను కూలంకషంగా చదివి త్థసంబంధమైన శాస్త్రజలతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేవాడు. తన సందేహాలను నివృత్తి చేసుకోవడానికి, వరాల తరబడి గ్రంధాలయాలలోనే గడిపేవాడు. సమస్య లోతుపాతులు సునిశిత దృష్ఠతో సమగ్రంగా పరిశీలించి, తర్కానికి నిలబడని వదలను విడిచివేసి, సంశయ నిష్వాత్తి చేసుకొని నిశ్చతాభిప్రాయానికి వచ్చేవాడు. ఇంత సాధించిన తన కృషి కంటే, తన సహచరుల కృషే ఈ మహోన్నత విజయాలకు కారణమని, వారిలో తనొకడినని మాత్రమే ఉడ్ఘుటించిన నిరాడంబరుడు, నిస్వార్థజీవి.
తన పరిశోధనలను ప్రకటించే వ్యాసాల్లో కూడా తన సహచరుల పేర్లు ముందు రాసి చివరకు తన పేరును రాసుకునేవారు. సహచరులను ప్రత్సాహించి, వారి కష్ట సుఖాలలో పాలుపంచుకున్న ఉదాత్త హృదయుడు. తన పేరును రాసుకునేవారు. సహచరులను ప్రత్సాహించి, వారి కష్ట సుఖాలలో పాలుపంచుకున్న ఉదాత్త హుర్దయుడు. తన అవసరాలకు పోను మిగిలిన ధనాన్నంతా సేవాసంస్ధలకు, చర్చిలకు దానం చేసేవాడు. ఇలాంటి త్యాగపురుషుడు, ప్రపంచ ప్రఖ్యాత వైద్య పరిశోధకుడు విద్యావంతులందరికి ఆదర్శమూర్తి.
తెలుగువేలకు, భాతర భూమికి, యావత్ప్రపంచానికి కూడా గర్వకారణమైన సుబ్బారావు 'కరోసారి త్రయంబడిం' అనే వ్యాధితో 1948 ఆగష్టు 9 న అమెరికాలో కన్నా మూశారు. ఈ ప్రముఖ భారతీయ విఆద్యునిపట్ల గౌరవ సూచకంగా ముంబయి లోని బల్సార్ లో నిర్మించిన తమ ప్రయేగాశాలకు 'డా. యల్లాప్రగడ సుబ్బారావు సంస్ధ' అని నామకరణం చేశారు లేడిర్లి సంస్ధవారు.
ప్రముఖ వైద్యశాస్త్రవేత్త విలియం డామ్ షేక్ "1900 నుంచి 1950 వరకు జీవించిన, అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన రక్తవిజన శాస్త్రవేత్తలు (హిమాటాలజిస్టులు) పది మందిలో సుబ్బారావు అగ్రగణ్యుడు" అని సుబ్బారావును ప్రశంసించాడు. 'న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్' లాంటి ప్రత్రికలు ఆయనకు జోహార్లు అర్పించాయి.
ఆయన మానవాళి ఖండించిన వైద్య విధానాలు చిరకాలం జీవించి ఉంటాయి.
చివరిసారిగా మార్పు చేయబడిన : 6/16/2020