భారతీయ వాజ్మయానికి మూల పూరుఘుడు. అది పురుష/డు వాల్మీకి అయితే, రెండవవాడు వేదవ్యాస మహర్షి ఈయనకు కృష్ణద్వైపాయనుడు అను మరొక పేరు కూడా కలదు. ఈయన శరీరం నల్లడైనందున ఈయనకి పేరు వచ్చింది. ఈయన శంతనుని భార్య సత్యవతికి పరాశర మహర్షి ద్వారా కలిగాడు. ఈ సత్యవతి ఉపరిచారవసువనే రాజర్షి కూతురు. బెస్తరాజు వద్ద పెరిగింది. క్షత్రియ కన్య.
అపౌరు షేయాలైన వేదాలను నాలుగు భాగాలుగా విభజించడం వలన ఈయనకి వేదవ్యాసుడని పేరొచ్చింది. ఈయన వలన వేదం విభాగం జరిగింది. కాబట్టే వెడలు చదువుకోవడానికి వీలైనది. ద్వాపర యుగాంతారంలోనే మహాభారత యుద్దానికి పూర్వమే ఈయన జనమించి ఉండటం వలన ఆ మహాయుద్ధ పూర్వాపరాలను, కంటితో చూచిన వాడైనందువలన ఆ చరిత్రను యధాతధంగా రాశాడు. ఈ మహాభారతం ఐదువేల నూరు సంవత్సరాల క్రితం ఆయన చేత రాయబడింది. ఈ కావ్యం 18 పర్వాలు కలిగి, లక్షశ్లోకాలు గల గ్రంథమిది. వీటిని ఈయన శిష్యుడు శుకమహర్షి రాసి శుతునకు చెప్పగా, వారు అభిమన్యుని మనుమడైన జనమేజయునకు చెప్పారు. అప్పటి నుండే ఈ గ్రంధం ప్రజలు వినుటకందుబాటులోని వచ్చింది.
ఈ మహాభారతంలో లేని కలగని, రసముగాని లేదు. సర్వరస కళల భూయిష్టమైన కావ్యమిది. మానవజన్మ మెడలు మేషము పొందుటకు గల అంతర్ దశల విభాగాలను చెప్పటయేకాక మానవుడు ఉత్తముడుగా ఆఖరుకు దేవుడుగా కూడా కాగలదు. ఆ విధంగా ఎలా అయ్యేది ఈ గ్రంధాలో మనకు లభ్యమవుతుంది.
మహాభారతం ఉత్తమెత్తమమైన కథ. మానవ వికాసానికి ఇందనేక విషయాలు నిషేపించి యూన్నివి. ఇందలి పాత్రలు, వారి విభిన్న మనస్తత్వాలు, వారి పట్టుదలలు, కృత్య అకృత్యాలేగాక మనకెంతో ఆదర్శనీయమైన మహాగ్రంధమది. ఇందుల అనేక ప్రశ్నలు ఉన్నాయి. ఏ పాత్రకపాత్ర ప్రత్యేక ప్రతిపత్తి కలిగినవే. ఈ గ్రంధాన్ని ఒకసారి చదివితే చాలు. మానవ జీవితం సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది.
ఇందనేక నీతులు, శాస్త్రాలు మానవ జీవితానికి ఉపయెగంగా ఉన్నవి. ప్రపంచ చరిత్రలో ఇంతటి గొప్ప గ్రంధం మరొకటి లేదు.
ఈయన వేదాలు అర్ధమగుటకు, ఊఅనిషత్తులు రాశాడు. అవి అర్థమవడానికి మీమాంస చేశాడు. ఆ మహామహుడు చేసిన కృషే ఈనాటి మన వికాసానికి కారణమయంది.
భగవద్గిత గ్రంధం ఈ మహాభారతంలోనిదే. జైమిని మహర్షి కూడా బాగా రాశాడు. అది ప్రాచుర్యములోనే ఉన్నది.
భారత చిరంజీవులలో ఈయన ఒకరు.
చివరిసారిగా మార్పు చేయబడిన : 6/16/2020