ఉన్నవ లక్ష్మీబాయమ్మగారు ప్రారంభించిన శారదానికేతన్ లో చదువుకుని, సాంఘిక రాజకీయ రంగాలలో కృషిచేసిన స్త్రీలలో సంగం లక్ష్మీబాయమ్మ చెప్పుకోవలసిన వ్యక్తి. శారదానికేతన్ లో ఆమె విద్వాన్ పరీక్ష పాసయ్యారు. ఆ సమయంలో దేశమంతా ఉప్పుసత్యాగ్రహ సమరంలో ఉద్రిక్తంగా ఉంది. లక్ష్మీబాయమ్మ దుర్గాబాయతో కలిసి సత్యాగ్రహంలో పాల్గొన్నారు. పోలీసులు ఆమెను అరెస్టుచేసి రాయవెల్లూరు జైలులో నిర్భందించారు. ఆ సమయంలో రాయమేళ్ళురు జనులు జాతీయాద్యమంలో పాల్గొన్న స్త్రీలకు రాజకీయ పాఠశాల అని చెప్పొచ్చు. లక్ష్మీబాయమ్మ అక్కడి మహిళలందరిని సహవాసంతో తన రాజకీయ సాంఘిక చైతన్యానికి పదును పెట్టుకున్నారు. జైలు నుంచి విడుదలయ్యాక మళ్ళీ చదువు కొనసాగించారు. మద్రాసులో చిత్రకళలో డిప్లొమా చేశారు. హిందీ భాషలో 'సాహిత', 'విదుషి' పరీక్షలు పాసయ్యారు. కార్వే యూనివర్సిటీలో డిగ్రీ చేశారు.
హైద్రాబాదులో నారాయణగారు బాలికోన్నత పరాశలలో బాలికల హిస్టాల్ కు వార్డెన్ గా, నార్మల్ స్కూల్ లో టీచరుగా పనిచేశాక లక్ష్మీబాయమ్మ రాజకీయ జీవితాన్ని ప్రధానంగా ఎంచుకుని ఆ రంగంలో కృషి ప్రాంరంచివారు. 1950 లో హైదరాబాదు రాష్ట్రంలో శాసన సభ్యురాలుగా ఎన్నికై. బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో విద్యాశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. ఒకవైపు శాసన సభ్యురాలిగా ఉంటూనే, మలక్ పేటలో తన ఇంట్లోనే నిరాశ్రయాలైన స్త్రీలకు, పిల్లలకు ఉచిత భోజన వసతి కల్పించి, రక్షణ ఇచ్చి, ప్రాధమిక విద్య, చేతిపనులు నేర్పి వాళ్ళ తమకాళ్ళమీద తమ నిలబడేలా చేసేవారు. ఆ పాఠశాల క్రమంగా 'ఇందిరా సేవాసదనం' గా మారింది. తరువాత దానితో మాశెట్టి హనుమంతగుప్తా బాలబాలికల ఉన్నత పాఠశాల తోడై అభివృద్ధి చెందింది. ఇందిరా సేవ సదానంలో బాలికలకు వృత్తి శిక్షణ, సంగీత, నృత్య శిక్షణ తో పాటు వ్యవసాయ శేత్రం, పాలా ఉత్పత్తి కేంద్రం, మొదలైనవన్నీ ఉన్నాయి.
చివరిసారిగా మార్పు చేయబడిన : 6/16/2020