సుభాష్ చంద్రబోసు ఉత్తల ప్రాంతంలోని కటక్ లో 1897 జనవరిలో జన్మిచారు. జానకీనాధబాసు, ప్రభావతి దేవి ఇతని తల్లిదండ్రులు. చిన్నప్పటి నుండి స్వాభిమానంతో, పట్టుదలతో ఉండేవారు. సుభాష్ కుటుంబం సంపన్నమైనదైనప్పటికీ స్వావలంబనతో జీవించేవారు. ఎవరి పనులు వారు చేసుకొనేవారు. ప్రొటస్టెంట్ యూరోపియన్ స్కూల్లో చదువుతున్నప్పుడు భారతీయులను కొడుతున్న ఆంగ్లేయుల పిల్లల్ని ఎదిరించి చావబాదాడు. దేశభక్తి గలవాడు. స్వాతంత్య్రం కోసం పోరాడిన విప్లవ వీరుల చిత్రాలని అతికించి నేను కూడా ఇలాగే జీవించాలి. నేను కూడా ఇలానే మరణించాలి అని వ్రాశాడు.
సుభాష్ కటక్ లో స్వేచ్ఛసంఘే ను స్ధాపించి చుట్టూ ప్రక్కల గ్రామాలలో సేవ కార్యక్రమాలు జరిపేవారు. 1919 జలియన్ వాలా బాగ్ లో భారతీయుల పై జరిగిన అమానుష చర్యలకు కలత చెంది ఇంగ్లండులో ఐపియస్ చదువుతున్న సుభాష్ 1920 లో రాజీనామా చేసి స్వతంత్ర ఉద్యమంలో దూకారు.
"నా జీవితం వివేకానందుని ప్రభావంతో రూపొందింది. అతని దేశభక్తి బావాలు నా నరనరాల్లో, రక్తనాళాల్లో లావాలాగా ప్రవహించి నన్ను ఉత్తేజపరుస్తూ మునుముందుకు నడిపిస్తున్నాయి" అని సగర్వంగా చెప్పుకున్నాడు. స్వాతంత్య్రా పోరాటంలో అతను చూపించిన అసమాన ధైర్యసాహసాలు, గంభీరత అందర్నీ ముగ్ధుల్ని చేశాయి. 1938 అఖిలభారత కాంగ్రెస్ అధ్యశులై కార్యకర్తలలో చైతన్యం ఉత్సాహం నింపారు.
రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభయామ్యక ఆంగ్ల ప్రభుత్వం సుభాష్ ను నిర్భంధించింది. 1941 లో నిర్భంధం నుండి తప్పించుకొని జర్మనీ వెళ్లి స్వాతంత్య్రా ఉద్యమం గురించి హిట్లర్ కు విన్నవించాడు. భారతీయులందర్నీ సమీకరించి, 1942 జనవరి 26 న ఆజాద్ హింద్ ఫయూజ్ అనే స్వతంత్య్రా జాతీయ సైన్యాన్ని రూపొందించాడు. జపాన్ దేశం అండమాన్ నికోనార్ దివుల్ని నేతాజీకి స్వాధీనం చేసింది. 1943 అక్టోబరు 21 న అక్కడ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పరిచి దాని నిర్వహణకు నిధులు సేకరించిన స్వాభిమాని. ఢిల్లీ ఛలో, జైహింద్ వంటి నినాదాలిస్తూ ప్రజల్ని స్వతంత్ర పోరాటంలో ఉత్సాహంగా పాల్గొనేటట్లు చేసిన వ్యక్తి నేతాజీ. 1945 ఆగష్టు 18 న ఫర్మిజా సమీపంలో విమాన ప్రమాదంలో మరణించినట్లుగా తొక్యో రేడియె ప్రకటించింది. కానీ, అది నిజం కాదని అధికారులు కొట్టివేశారు. దాంతో నేతాజీ చరమాంకం గురించి నేటికీ అంతుచిక్కని రహస్యమే.
స్వాభిమానం, షూర్యం, దైర్యం, సంఘాతన కుశలతగల నేతాజీ సమాజ శ్రేయస్సుకు, స్వాతంత్య్ర సాధనకు తన జీవితాన్ని పూర్తిగా వినియెగించిన మహానుభావుడు.
చివరిసారిగా మార్పు చేయబడిన : 6/16/2020