অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

చెల్లింపు మరియు పరిష్కార వ్యవస్థలు

చెల్లింపు మరియు పరిష్కార వ్యవస్థలు

జాతీయ చెల్లింపుల వ్యవస్థ వికాసంలో, సాధారణంగా ఏదేశ సెంట్రల్‌ బ్యాంకు అయినా ఒక చాలక శక్తిగా ఉంటుంది. దేశ సెంట్రల్‌ బ్యాంకుగా భారతీయ రిజర్వ్‌ బ్యాంకు (ఆర్‌బిఐ), ఈ అభివృద్ధిపరమైన పాత్రను పోషిస్తూ ఉంది. సురక్షితమైన, సౌష్ఠవమైన, సమర్ధమైన చెల్లింపు వ్యవస్థకు సంబంధించి అనేక చర్యలు చేపట్టింది. ఈ విషయానికి సంబంధించి తరచుగా అడిగే ప్రశ్నలతో కొన్నిటిని ఎఫ్‌.ఎ.క్యూ. (ఎఆ) రూపంలో కింద ఇవ్వడమైంది.

చెల్లింపు వ్యవస్థ అంటే ఏమిటి?

  • చెల్లించే వ్యక్తికీ మరియుప్రయోజనం పొందే వ్యక్తికీ మధ్య విలువ బదిలీకి అవకాశం కల్పించే యంత్రాంగాలే చెల్లింపు వ్యవస్థ. దీనిద్వారా చెల్లించే వ్యక్తి, ప్రయోజనం పొందే వ్యక్తి పట్ల గల చెల్లింపు బాధ్యతను నిర్వహిస్తోంది. ఆర్ధికవ్యవస్థలోని వస్తుసేవల వినిమయంలో చెల్లింపు వ్యవస్థ రెండు విధాల చెల్లింపుల ప్రవాహానికి (టూ-వే-ఫ్లో) వీలు కల్పిస్తుంది.

ఏ చెల్లింపు వ్యవస్థ అయినా ఉండే అంశాలు ఏమిటి?

  • చెల్లింపు వ్యవస్థలో, చెల్లింపులు జరపడానికి వినియోగించే పత్రాలు, ఈ చెల్లింపులకు మార్గనిర్దేశనం చేసే నియమ, నిబంధనలు, కార్యవిధానాలు, చెల్లింపు యంత్రాంగాలకు వీలు కల్పించే సంస్థలు, న్యాయవ్యవస్థలు మొదలయినవి ఉంటాయి. విభిన్న భాగస్వాముల మధ్య నిధులు బదిలీకి వీలు కల్పించడానికి ఇవన్నీ ఏర్పాట్లు ఉంటాయి.

చెల్లింపులు చేయడానికి చెల్లింపు వ్యవస్థలను ఎవరు ఉపయోగించుకొంటారు?

  • పరస్పరం చెల్లింపులు జరుపుకోడానికి వ్యక్తులతోపాటు బ్యాంకులు, కంపెనీలు, ప్రభుత్వాలు మొ||వి చెల్లింపు వ్యవస్థలను ఉపయోగించుకొంటాయి. మరోవిధంగా చెప్పాలంటే, చెల్లింపు చేయవలసిన వ్యక్తి ఎవరయినా, సదరు చెల్లింపు చేయడానికి ఏదో ఒక రకమైన చెల్లింపు విధానాన్ని ఉపయోగించుకోవచ్చు.

బ్యాంకుల ద్వారా ఖాతాదారు చెల్లింపులు చేయగల విధానాలు ఏమిటి?

  • నగదు, చెక్కు, డిమాండ్‌ డ్రాప్ట్‌లు, క్రెడిట్‌ కార్డులు, డెబిట్‌ కార్డులరూపంలోనూ ఖాతాదారుల తరఫున అలాంటి చెల్లింపు చేసే బ్యాంకుకు ఎలక్ట్రానిక్‌ సూచనలు ఇవ్వడం ద్వారానూ భారతదేశంలో చెల్లింపులు చేయవచ్చు. తక్కువ విలువగల, పదే పదే చేసే చెల్లింపులకు ఎలక్ట్రానిక్‌ నిధుల బదిలీ (ఇఎఫ్‌టి), ఎలక్ట్రానిక్‌ క్లియరింగ్‌ సర్వీస్‌ (ఇసిఎస్‌) రూపంలోనూ ఎక్కువ విలువలున్న చెల్లింపులకు రియల్‌టైమ్‌ గ్రాస్‌ సెటిల్మెంట్‌ (ఆర్‌టిజిఎస్‌) ద్వారా ఎలక్ట్రానిక్‌ చెల్లింపులు చేయవచ్చు. భారతదేశంలోని కొన్ని బ్యాంకులు, ఎలక్ట్రానిక్‌ విధానంలో నిధుల బదిలీకి వీలు కల్పించే ఇంటర్నెట్‌ ద్వారా కొన్ని బాంకింగ్‌ సేవలందించడం ప్రారంభించారు.

చెల్లించేవ్యక్తి (పేయర్‌), చెల్లింపు తీసుకొనేవ్యక్తి (పేయీ) కి చెక్కు ఇచ్చినప్పుడు, చెల్లింపు ఎలా జరుగుతుంది?

  • చెల్లించేవ్యక్తి ప్రయోజనం పొందే వ్యక్తికి తన వ్యక్తిగత చెక్కును ఇచ్చినప్పుడు, చెక్కు చెల్లింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. నిధులు వాస్తవ చెల్లింపు పొందడానికి చెక్కు తీసుకొన్న వ్యక్తి, తన బ్యాంకు ఖాతాలో చెక్కును డిపాజిట్‌ చేయాలి. ప్రయోజనం పొందే వ్యక్తికి అదే నగరంలో అదే బ్యాంకులో ఖాతా ఉన్నట్లయితే బ్యాంకు అంతర్గత ఏర్పాటు ద్వారా నిధులు అతని ఖాతాలోకి జమ అవుతాయి. ప్రయోజనం పొందే వ్యక్తికి అదే నగరంలో లేదా మరేదయినా నగరంలో మరేదయిన బ్యాంకులో ఖాతా ఉన్నట్లయితే అప్పుడు, అతని బ్యాంకరు, క్లియరింగ్‌ హౌస్‌ విధానం ద్వారా పేయర్‌ బ్యాంకర్‌ నుంచి నిధులు వసూలు చేయడానికి తగిన ఏర్పాటు చేస్తాడు.

క్లియరింగ్‌ హౌస్‌ అంటే ఏమిటి?

  • ఒక నగరం / స్థలం పరిధిలో విభిన్న బ్యాంకు శాఖల మధ్య చెక్కులు మరియు ఒకరిమీద ఒకరు రాసిన చెక్కులను మార్చుకోడానికీ తత్సంబంధమైన నిధులను క్లెయిమ్‌ చేయడానికి ఇది బ్యాంకర్‌లకు కేంద్రసమావేశ స్థలంగా పనిచేస్తుంది. అలాంటి కార్యకలాపాలను క్లియరింగ్‌ కార్యకలాపాలు అంటారు. సాధారణంగా, క్లియరింగ్‌ కార్యకలాపాలకు ఇన్‌చార్జ్‌గా ఒక బ్యాంకును నియమించడం జరిగుతుంది. నాలుగు మెట్రోలలోనూ మరికొన్ని ఇతర ప్రధాన నగరాలలోనూ భారతీయ రిజర్వు బ్యాంకు క్లియరింగ్‌ హౌస్‌ కార్యకలాపాలను నిర్వహిస్తూ ఉంది. ప్రతి క్లియరింగ్‌ హౌస్‌కూ, తన కార్యకలాపాల నిర్వహణకు సంబంధించి, ఆర్‌.బి.ఐ. నిర్ణయించినట్లుగా ఒకే రకమైన నియమ నిబంధనలు ఉంటాయి. చెక్కు చెల్లింపులకు వీలు కల్పిస్తూ దేశం మొత్తం మీద వెయ్యి (1000) కి పైగా క్లియరింగ్‌ హౌస్‌లు ఉన్నాయి. వీటిని ఆర్‌.బి.ఐ, భారతీయ స్టేట్‌ బ్యాంకు, ఇతర ప్రభుత్వరంగ బ్యాంకులు నిర్వహిస్తున్నాయి.

ఈ క్లియరింగ్‌ ప్రక్రియకు ఎంత సమయం పడుతుంది?

  • సాధారణంగా, అదే నగరంలో చెక్కును చెల్లించవలసినట్లయితే 2-3 రోజులుపడుతుంది. కొన్ని పెద్ద నగరాలలో హైవాల్యూ, క్లియరింగ్‌ అనే వ్యవస్థ ఉంది. ఇది. అదేరోజు చెక్కు క్లియరింగ్‌ సర్కిల్‌ను పూర్తి చేయడానికి వీలు కల్పిస్తుంది. చెక్కును డిపాజిట్‌ చేసే ఖాతాదారును మరుసటిరోజు ఉదయం నిధులను వినియోగించుకోడానికి వీలు కల్పిస్తుంది. అయితే, ఈ హైవాల్యూ క్లియరింగ్‌ పరిధి చాలా పరిమితంగా ఉంది. సాధారణంగా ప్రధాన వ్యాపార ప్రాంతాలలోని ఉదాహరణకు ముంబాయిలోని ఫోర్ట్‌, నారిమన్‌ పాయింట్‌ ప్రాంతం, న్యూఢిల్లీలో కన్నాట్‌ ప్లేస్‌ వంటి ప్రాంతాలలోని శాఖలలో మాత్రమే అందుబాటులో ఉంది. బయటి ప్రాంతాల (ఔట్‌ స్టేషన్‌) చెక్కుల విషయంలో పట్టే సమయం, మూడు నుంచి పదిరోజుల వరకు ఉంటుంది. ఖాతాదారు వినియోగం కోసం రాబడులు (నిధులు) ఎప్పుడూ అందుబాటులోకి వస్తాయనే విషయం గురించి ఖాతాదారు ఒక అభిప్రాయం ఏర్పరచుకోడానికి వీలుగా అన్ని బ్యాంకులూ తమ చెక్కు వసూలు విధానాన్ని ప్రచురించాలని ఆర్‌.బి.ఐ. సలహా ఇచ్చింది. సాధారణ సమయం కంటే ఎక్కువ జాప్యం జరిగినట్లయితే (పరిహారం కోసం ఖాతాదారు అడగపోయినప్పటికీ) బ్యాంకులు, ఖాతాదారుకు పరిహారం చెల్లించవలసి ఉంటుంది.

చెల్లింపులకు చెక్కులను ఉపయోగించడం వల్ల బ్యాంక్‌ ఖాతాదారుకు ఏవయినా ఛార్జీలు అవుతాయా?

  • ఈ బ్యాంకు ద్వారా నిధులను వసూలు చేసిపెట్టినందుకు చెక్కుల ద్వారా చెల్లింపును గ్రహించే వ్యక్తి, కొన్ని ఛార్జీలు భరించవలసి ఉంటుంది. స్థానిక చెక్కులు అయినట్లయితే ఛార్జీలు విధించడం జరగదు. బయటి (ఔట్‌ స్టేషన్‌) చెక్కులయినట్లయితే, చెక్కు మొత్తాన్ని బట్టి దాన్ని వసూలు చేయవలసిన ప్రాంతాన్ని బట్టి బ్యాంకు కొన్ని ప్రొసెసింగ్‌/వసూలు ఛార్జీలు విధిస్తుంది. బ్యాంకులు విధించే ఛార్జీలకు సాధారణంగా భారతీయ బ్యాంకుల అసోసియేషన్‌ గానీ, బ్యాంకులే స్వయంగా గానీ నిర్ణయిస్తాయి. సర్వీస్‌ ఛార్జీల షెడ్యూల్‌ను కూడా బ్యాంకులు ప్రచురించవలసి ఉంటుంది.

చెక్కులను నగదునూ ఉపయోగించకుండా చెల్లింపులు ఎలా చేయవచ్చు?

  • చెక్కులు ఉపయోగించకుండా ఎలక్ట్రానిక్‌ సూచనల ద్వారా రెండు , అంతకంటె ఎక్కువ పార్టీల మధ్య చెల్లింపులు చేయవచ్చు. అలాంటి చెల్లింపులు చేయడానికి వీలుగా అందుబాటులో ఉన్న రీటైల్‌ చెల్లింపు యంత్రాంగాలు ః ఎలక్ట్రానిక్‌ నిధుల బదిలీ, ఎలక్ట్రానిక్‌ క్లియరింగ్‌ సర్వీస్‌, క్రెడిట్‌ /డెబిట్‌ కార్డులు మొదలయినవి.

ఒక బ్యాంకు ఖాతాదారు మరొక బ్యాంకు ఎటిఎమ్‌ కార్డును ఉపయోగించవచ్చా?

  • ఎటిఎమ్‌ సొంతదారయిన బ్యాంకుతో ఖాతాదారుని బ్యాంకుకు అలాంటి ఏర్పాటు ఉన్నట్టయితే ఉపయోగించవచ్చు. ప్రస్తుతం స్టాండ్‌అలోన్‌ ఎటిఎమ్‌లు చాలా తక్కువగా ఉన్నాయి. సాధారణంగా అలాంటి స్టాండ్‌అలోన్‌ ఎటిఎమ్‌లను శాఖ ఆవరణలోనే ఏర్పాటు చేయడం జరిగింది. మరొక బ్యాంకు ఏటిఎమ్‌ ఉపయోగించినట్లయితే, సాధారణంగా ఇంటర్‌-ఛేంజ్‌-ఫీ అనే సేవా రుసుమును ఖాతాదారుకు విధించడం జరుగుతుంది.

ఎటిఎమ్‌ లను నగదు ఉపసంహరణలకు మాత్రమే ఉపయోగిస్తారా?

  • నగదు ఉపసంహరణలతో పాటు వినియోగ బిల్లుల చెల్లింపు, ఖాతాల మధ్య నిధుల బదిలీ, ఖాతాలలోకి చెక్కుల, నగదు డిపాజిట్‌, నిల్వ విచారణ, ఎటిఎమ్‌ సొంతదారయిన బ్యాంకు అందించేటువంటి మరెన్నో ఇతర బ్యాంకింగ్‌ లావాదేవీలకు కూడా ఎటిఎమ్‌ లను ఉపయోగించుకోవచ్చు.

చెల్లింపు వ్యవస్థలలో క్రెడిట్‌ / డెబిట్‌ కార్డుల పాత్ర ఏమిటి?

  • చెక్కులనూ, నగదునూ ఉపయోగించకుండా వస్తు సేవలకు చెల్లింపులు చేయడానికి అనువుగా ఉన్నాయి. కాబట్టి దేశంలో క్రెడిట్‌ /డెబిట్‌ కార్డులను విస్తృతంగా ఉపయోగించడం జరుగుతూ ఉంది . బ్యాంకులు, తమ ఖాతాదారులకు క్రెడిట్‌ కార్డులు జారీ చేస్తాయి. క్రెడిట్‌ / డెబిట్‌ కార్డు చెల్లింపులను అంగీకరించే వ్యాపారసంస్థ, తన బ్యాంకు ద్వారా ఖాతాదారు బ్యాంకు నుంచి మొత్తాన్ని క్లెయిమ్‌ చేస్తుంది.

క్రెడిట్‌ కార్డువంటి డెబిట్‌కార్డు ఏవిధంగా భిన్నంగా ఉంటుంది?

  • డెబిట్‌ కార్డు అనేది డైరెక్టు అకౌంట్‌ యాక్సెస్‌ కార్డు (లావాదేవీ మొత్తం వెంటనే డెబిట్‌ అయిపోతుంది) డెబిట్‌ కార్డులో లావాదేవీలు జరపడానికి అనుమతించిన మొత్తం, కార్డును వినియోగించే వ్యక్తి ఖాతాలో నిల్వ ఉన్నమొత్తం మేరకే ఉంటుంది. క్రెడిట్‌కార్డు అలాకాకుండా, కార్డు ఉపయోగించే వ్యక్తికే పరపతి సదుపాయం కల్పిస్తుంది. ఈ పరపతిమొత్తాన్ని కార్డును ఉపయోగించే వ్యక్తి, బిల్లు అందుకొన్న మీదట, పూర్తిగా కానీ వాయిదాలలో పాక్షికంగాగానీ చెల్లిస్తాడు.

ఎలక్ట్రానిక్‌ నిధుల బదిలీ (ఇఎఫ్‌టి) అంటే ఏమిటి?

  • మరొక వ్యక్తికి లేదా కంపెనీకి చెల్లింపు చేయాలనుకొన్న వ్యక్తి తన బ్యాంకుకు వెళ్ళి నగదు చెల్లింపు చేసే లేదా తన ఖాతానుంచి నేరుగా స్వీకర్త / ప్రయోజనం పొందే వ్యక్తి బ్యాంకు ఖాతాకు నిధులను బదిలీ చేయడానికి సూచనలు / అధికారం ఇచ్చే వ్యవస్థే ఎలక్ట్రానిక్‌ నిధుల బదిలీ (ఇఎఫ్‌టి). ప్రయోజనం పొందే వారి ఖాతాకు సరిగ్గా, వేగంగా నిధులు చేరడానికి వీలుగా అలాంటి బదిలీల కోసం కోరుతున్నప్పుడు స్వీకర్త పేరు, బ్యాంకు ఖాతాసంఖ్య, ఖాతారకం (సేవింగ్స్‌ లేదా కరెంటు ఖాతా), బ్యాంకు పేరు, నగరం, శాఖపేరు వంటి పూర్తి వివరాలను అందజేయాలి. ఇ.ఎఫ్‌.టి. కి ఆర్‌.బి.ఐ సర్వీస్‌ ప్రొవైడర్‌గా ఉంది.

భారతదేశంలో ఎక్కడైనా నిధుల బదిలీకి నేను ఇ.ఎఫ్‌.టి.ని ఉపయోగించుకోవచ్చా?

  • ప్రస్తుతానికి దేశం మొత్తం మీద దాదాపు 15 ప్రధాన నగరాల్లోనూ పట్టణాల్లోనూ బ్యాంకు శాఖల మధ్య నిధుల బదిలీకి ఇ.ఎఫ్‌.టి. సదుపాయం అందుబాటులో ఉంది. ప్రత్యేక ఇ.ఎఫ్‌.టి. అనే మరో ప్రత్యేక పథకం కింద 200పైగా నగరాల్లో మరిన్ని ఎంపికచేసిన శాఖలను (బాంకుల కంప్యూటర్‌ నెట్‌వర్క్‌లో ఉన్న వాటిని) ఎలక్ట్రానిక్‌ పరంగా నిధుల బదిలీ పరిధిలోకి తీసుకురావడం జరిగింది. ఆయా బ్యాంకుల నుంచి ఆర్‌.బి.ఐ వెబ్‌సైట్‌ నుంచి కూడా నగరాల, శాఖల వివరాలు తెలుసుకోవచ్చు.

ఇ.ఎఫ్‌.టి. ద్వారా నిధుల బదిలీకి ఎంత సమయం పడుతుంది?

  • సాధారణంగా నిధుల బదిలీ అదే రోజు జరిగిపోతుంది లేదా అలాంటి నిధుల బదిలీకి అభ్యర్థించిన సమయాన్ని బట్టి మహా అయితే తరవాతవచ్చే పనిరోజు జరిగిపోతుంది. నిధుల బదిలీకి అభ్యర్థించే సమయంలోనే ఖాతాదారు, తన బ్యాంకునుంచి ఈ అంశాన్ని స్థిరపరచుకోవాలి.

ఇ.ఎఫ్‌.టి. ద్వారా నిధులు బదిలీ చేయడానికి ఏవయినా ఛార్జీలు ఉంటాయా?

  • డిమాండ్‌ డ్రాప్ట్‌లు, పే ఆర్డర్‌లు వంటి ఇతర సేవలలో మాదిరిగానే బ్యాంకులు, సాధారణంగా ఇ.ఎఫ్‌.టి.కి కొన్ని ప్రాసెసింగ్‌ ఛార్జీలు విధిస్తాయి. వాస్తవమైన ఛార్జీలను బదిలీ చేసే మొత్తం మీద, బ్యాంకుకు ఖాతాదారు సంబంధం మీద ఆధారపడి ఉంటాయి. అయితే ఆర్‌.బి.ఐ. నిర్వహిస్తున్న క్లియరింగ్‌ హౌస్‌లలో సదరు నిధుల బదిలీ లావాదేవీలు ప్రాసెసింగ్‌ కోసం బ్యాంకుల నుంచి వసూలు చేస్తున్న ఇ.ఎఫ్‌.టి. ఛార్జీలన్నింటినీ ప్రస్తుతం ఆర్‌.బి.ఐ రద్దు చేసింది. దీనివల్ల బ్యాంకులకు కూడా ప్రాసెసింగ్‌ వ్యయం తప్పకుండా తగ్గిపోతుంది.

నిధులు స్వీకరించడానికి/ చెల్లింపులు చేయడానికి నేను ఎలక్ట్రానిక్‌ క్లియరింగ్‌ సర్వీసెస్‌ను ఎలా ఉయోగించుకోవాలి?

  • ఎలక్ట్రానిక్‌ క్లియరింగ్‌ సర్వీస్‌ (ఇ.సి.ఎస్‌) అనేది ఒక రిటైల్‌ చెల్లింపు వ్యవస్థ. ఒకే స్వభావం ఉన్న ముఖ్యంగా ప్రతి వైయక్తిక చెల్లింపూ పునరావృత స్వభావానికి చెంది, సాపేక్షంగా తక్కువ మొత్తానికి చెందిన ఎక్కువ సంఖ్యలో గల చెల్లింపులు చేయడానికి / రాబడులు స్వీకరించడానికి ఈ వ్యవస్థను ఉపయోగిస్తారు. ఈ సదుపాయాన్ని వ్యక్తులు చేసే నిధుల బదిలీ కంటే కూడా అధిక పరిమాణాలలో చెల్లింపులు చేయడానికీ / స్వీకరించడానికీ కంపెనీల కోసం,
  • ప్రభుత్వ శాఖల కోసం ఉద్దేశించడమైంది. భారతదేశం మొత్తం మీద 47 కేంద్రాలలో ఇ.సి.ఎస్‌.సదుపాయం అందుబాటులో ఉంది. తాను క్లియరింగ్‌ హస్‌లు నిర్వహిస్తున్న చోట్ల ఆర్‌.బి.ఐ. వీటిని నిర్వహిస్తూ ఉంది. ఇతర దేశాలలో ఎస్‌.బి.ఐ. దాని అనుబంధ బ్యాంకులు ఈ సదుపాయాన్ని అందిస్తున్నాయి. ఇ.సి.ఎస్‌.ను మళ్ళీ రెండు రకాలుగా విభజించడమైంది. వ్యక్తులకు/వెండార్‌లకు పెద్దమొత్తంలో చెల్లింపులు చేయడానికి ఇ.సి.ఎస్‌. (క్రెడిట్‌), వ్యక్తుల నుంచి పెద్దమొత్తంలో వినియోగ చెల్లింపులు స్వీకరించడానికి ఇ.సి.ఎస్‌. (డెబిట్‌).

ఇ.సి.ఎస్‌ (క్రెడిట్‌) అంటే ఏమిటి?

  • ఇ.సి.ఎస్‌ (క్రెడిట్‌) కింద, ఒక సంస్థ/ కంపెనీ తన బ్యాంకు ఖాతానుంచి నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు క్రెడిట్‌ చేయడం ద్వారా అనేకమంది స్వీకర్తలకు చెల్లింపులు చేస్తుంది. ఉదాహరణకు, తమపెట్టుబడిదారులకు నియతకాలిత డివిడెండ్‌/ వడ్డీ చెల్లింపులు చేయడానికి కంపెనీలు, ఇ.సి.ఎస్‌ (క్రెడిట్‌)ను ఉపయోగిస్తాయి. అదేవిధంగా బ్యాంకులు, ప్రభుత్వ శాఖలు వంటి యజమానులు, ఇ.సి.ఎస్‌. (క్రెడిట్‌) ద్వారా తమ ఉద్యోగాలకు నెలవారీ జీతాలు చెల్లిస్తారు. వెండార్‌లకు చేయవలసిన పదే పదే స్వభావం ఉన్న చెల్లింపులను కూడా ఈ విధానంలో చేయడం జరుగుతుంది. ఇందుకోసం చెల్లింపు చేస్తున్న సంస్థ/ కంపెనీ దగ్గర ప్రయోజనంపొందే వారి బ్యాంకు ఖాతా వివరాలు ఉండాలి. చెల్లింపు చేస్తున్న కంపెనీకి సంబంధించిన స్పాన్సర్‌ బ్యాంకు ద్వారా చెల్లింపులు జరుగుతాయి. అలాంటి బ్యాంకు నిర్ణీత పరిష్కారం కోసం చేస్తున్న చెల్లింపుకు సంబంధించిన పూర్తి మొత్తాన్ని తీర్చివేయడానికి పరిష్కారం రోజుకు తన ఖాతాలో తగినన్ని నిధులు ఉండేటట్లు చూసుకోవాలి. సాధారణంగా, కంపెనీ ఖాతాలను నిర్వహించే బ్యాంకే ఆ కంపెనీకి స్సాన్సర్‌ బ్యాంకుగా ఉంటుంది.

ఇ.సి.ఎస్‌ (డెబిట్‌) అంటే ఏమిటి?

  • తమ కస్టమర్‌ల బ్యాంకు ఖాతానుంచి నేరుగా బిల్లు చెల్లింపులను స్వీకరించడానికి టెలిఫోన్‌ కంపెనీలు, విద్యుచ్ఛక్తి కంపెనీలు వంటి వినియోగ కంపెనీలు ఇ.సి.ఎస్‌ (డెబిట్‌) ను ఎక్కువగా ఉపయోగిస్తాయి. నగదు రూపంలో లేదా చెక్కురూపంలో విద్యుత్‌ బిల్లును చెల్లించడానికి బదులుగా కస్టమర్‌ (వ్యక్తులతో పాటు కంపెనీలు కూడా) తన బ్యాంకు ఖాతానుంచి నేరుగా విద్యుచ్ఛక్తి ప్రొవైడర్‌ / కంపెనీ/ బోర్డు ఖాతాలోకి బిల్లు చెల్లింపులు చేయడానికి ఎంచుకోవచ్చు. ఇందుకోసం నెలకు / రెండు నెలలకు ఒకసారి వచ్చే బిల్లు మొత్తాన్ని నేరుగా తగ్గించుకోవలసిన బ్యాంకు ఖాతా వివరాలు సమకూరుస్తూ కస్టమర్‌, వినియోగ కంపెనీకి ఒక దరఖాస్తు ఇవ్వవలసి ఉంటుంది. అయితే వినియోగకంపెనీ, ఇ.సి.ఎస్‌ (డెబిట్‌) పథకాన్ని ఎంచుకొని ఉండాలి. ఈ పద్ధతిలో చెల్లింపులు చేయడానికి ఎంచుకొనే కస్టమర్‌కు సంబంధించిన బ్యాంకు ఈ వివరాలను ధ్రువీకరించాలి. ఒకసారి ఈ విధానాన్ని ఎంచుకొన్న తరవాత, బిల్లు చెల్లించవలసిన గడువు తేదీని బిల్లు మొత్తాన్ని తన ఖాతాకు డెబిట్‌చేసి, మొత్తాన్ని కంపెనీ సొంత ఖాతాకు బదిలీ చేయమని వినియోగ కంపెనీ, వినియోగదారు బ్యాంకుకు సలహా ఇస్తుంది. స్పాన్సర్‌ బ్యాంకు ఖాతాకు క్రెడిట్‌ చేయడం ద్వారా దీన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ కూడా సాధారణంగా కంపెనీ ఏ బ్యాంకు నుంచి చెల్లింపులు స్వీకరిస్తుందో అందులోనే ఖాతా నిర్వహిస్తుంది. వాస్తవ బిల్లుకు ముందులాగే యధావిధిగా వినియోగదారు చిరునామాకు పంపడం జరుగుతుంది.

ఇ.సి.ఎస్‌.ను ఉపయోగించుకోడానికి ఛార్జీలున్నాయా?

  • ఇ.ఎఫ్‌.టి పద్దతిలో మాదిరిగానే ఆర్‌.బి.ఐ ప్రస్తుతానికి, బ్యాంకులకు తన ప్రాసెసింగ్‌ ఛార్జీలన్నిటినీ రద్దు చేసింది. అయితే, ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోడానికి తమ కార్పొరేట్‌ కస్టమర్ల మీద రుసుం విధించే స్వేచ్ఛ బ్యాంకుకు ఉంటుంది.

ఎన్‌.ఆర్‌.ఐ. భారతదేశంలోకి ద్రవ్యం ఎలా పంపిస్తాడు?

  • ఒక ఎన్‌.ఆర్‌.ఐ. గా ఒక వ్యక్తి, విదేశాల్లోని బ్యాంకు సమకూర్చే సదుపాయాలను ఉపయోగించుకొని, సాధారణ బ్యాంకింగ్‌ విధానాల ద్వారా భారతదేశంలోకి నిధులు పంపవచ్చు. అంతేకాకుండా, అధికృత ద్రవ్య బదిలీ ఏజెంట్ల (ఎమ్‌.టి.ఎ) ద్వారా కూడా ఎన్‌.ఆర్‌.ఐ. నిధులు పంపవచ్చు. ఇటీవల, చాలా బ్యాంకులు గంటలలోనే నిధులు బదిలీకి వీలు కల్పించే ఇన్వార్డ్‌ రెమిటెన్స్‌ విధానాలను ప్రారంభించాయి.

స్వీయ లావాదేవీలకు బ్యాంకులు ఎలా చెల్లింపులు చేస్తాయి?

  • సాధారణంగా బ్యాంకుల మధ్య (ఖాతాదారు లావాదేవీలకు సంబంధించనవి) లావాదేవీలు, ఎక్కువ విలువలకు సంబంధించినవై ఉంటాయి. కాబట్టి అలాంటి లావాదేవీలను భారీ విలువ నిధుల బదిలీలుగా పేర్కొంటారు. ఆర్‌.బి.ఐ దగ్గర బ్యాంకులు నిర్వహించే ఖాతాల ద్వారానే అసలయిన నిధుల బదిలీ జరిగిపోతుంది. ఇందుకోసం, బ్యాంకులు ఆర్‌.బి.ఐ. దగ్గర నిర్వహించే తమ ఖాతా పేరుమీద పరస్పరం చెక్కులు రాస్తాయి. ఆ చెక్కులు, క్లియరింగ్‌ హౌస్‌ ద్వారా ప్రాసెస్‌ అవుతాయి. దీనికి ప్రత్యమ్నాయంగా బ్యాంకులు, రియల్‌ టైమ్‌ గ్రాస్‌ సెటిల్మెంట్‌ వ్యవస్థ అనే భారీ విలువల చెల్లింపు వ్యవస్థను కూడా ఉపయోగించుకోవచ్చు. ఈవ్యవస్థలో, వ్యక్తులు, కంపెనీల విషయంలో ఇ.ఎఫ్‌.టి. మాదిరిగా ఎలక్ట్రానిక్‌ సూచనల మీద ఆధారపడి, నిధుల బదిలీ వెంటనే జరిగిపోతుంది.

రియల్‌ టైమ్‌ గ్రాస్‌ సెటిల్మెంట్‌ వ్యవస్థ అంటే ఏమిటి?

  • రియల్‌ టైమ్‌ గ్రాస్‌ సెటిల్మెంట్‌ (ఆర్‌.టి.జి.ఎస్‌) వ్యవస్థను భారతదేశంలో 2004 మార్చి నుంచీ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ వ్యవస్థలో బ్యాంకులు, తన ఖాతా నుంచి ఇతర బ్యాంకు ఖాతాకు నిధులు బదిలీ చేయమని ఎలక్ట్రానిక్‌ సూచనలు ఇస్తాయి. ఈ వ్యవస్థను ఆర్‌.బి.ఐ. నిర్వహిస్తుంది. బ్యాంకులు ఆర్థిక పరమైన కార్యకలాపాలు సజావుగా సాగడానికి బ్యాంకుల మధ్య సమర్ధమైన, శీఘ్రమైన నిధుల బదిలీ సాధనాన్ని సమకూరుస్తుంది. ఈ వ్యవస్థ పేరులో ఉన్నట్టుగానే బ్యాంకుల మధ్య నిధుల బదిలీ ''రియల్‌ టైమ్‌'' ప్రాతిపదికమీదే జరుగుతుంది. అందువల్ల ప్రయోజనం పొందే వ్యక్తికి వెంటనే ద్రవ్యం అందుతుంది. రెండుగంటల లోపల ప్రయోజనం పొందే వ్యక్తి ఖాతాకు జమ చేసే బాధ్యత ఆ వ్యక్తికి సంబంధించిన బ్యాంకుకు ఉంటుంది.

ఆర్‌.టి.జి.ఎస్‌ వ్యవస్థ ద్వారా వ్యక్తులు చెల్లింపులు చేయవచ్చా?

  • ఆర్‌.టి.జి.ఎస్‌ వ్యవస్థ ద్వారా వ్యక్తులు చెల్లింపులు చేయవచ్చు. తమ బ్యాంకుల ద్వారా వ్యక్తులు, ఆర్‌.టి.జి.ఎస్‌. వ్యవస్థ ద్వారా నిధులు బదిలీ చేయవచ్చు. ఈ వ్యవస్థను ప్రధానంగా భారీ విలువ చె ల్లింపుల కోసమే రూపొందించినప్పటికీ సమయం కీలకమైన తమ అల్పవిలువ చెల్లింపులకు కూడా ఆర్‌.టి.జి.ఎస్‌. వ్యవస్థను ఉపయోగించుకొనే అవకాశం బ్యాంకు కస్టమర్‌లకు ఉంది. ఆర్‌.టి.జి.ఎస్‌ లావాదేవీకి సంబంధించి అల్పవిలువ లేదా భారీవిలువ కు స్పష్టమైన నిర్వచనం లేదు. 2005 జూలై 31 నాటికి భారతదేశంలో 401 నగరాలు, పట్టణాల్లోని 7500 బ్యాంకు శాఖలకు పైగా శాఖలలో ఆర్‌.టి.జి.ఎస్‌. వ్యవస్థ అందుబాటులో ఉంది. 2006 మార్చి నాటికి కనీసం 10,000 శాఖలలో ఈ సదుపాయాన్ని అందుబాటులో ఉంచాలని ఆర్‌.బి.ఐ, భావించింది. ప్రస్తుతం అన్ని బ్యాంకు శాఖలూ ఆర్‌.టి.జి.ఎస్‌. నిధుల బదిలీని ప్రాసెస్‌ చేయలేకపోతున్నాయి. ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలనుకొన్న కస్టమర్‌, తన బ్యాంకు శాఖ, ప్రయోజనం పొందే వ్యక్తి బ్యాంకు శాఖ కూడా ఆర్‌.టి.జి.ఎస్‌ వ్యవస్థ ద్వారా నిధులను బదిలీ చేయగలుగుతున్నామో లేదో కనుక్కోడానికి తన బ్యాంకుకు వెళ్ళవలసి ఉంది. బ్యాంకులు, అలాంటి నిధుల బదిలీలకు తమ విచక్షణాధికారానికి లోబడి, కస్టమర్‌-బ్యాంకు సంబంధం మీద ఆధారపడి ఛార్జీలు విధించవచ్చు. ఇందుకు ప్రతిగా, ప్రయోజనం పొందే వ్యక్తి ఖాతాలోకి నిధులు జమ కావడంలో జరిగిన జాప్యానికి వడ్డీ క్లెయిమ్‌ చేసే హక్కు కస్టమర్‌కు ఉంటుంది.

చెల్లింపు వ్యవస్థల పరిధిలోని కస్టమర్‌ సర్వీస్‌లకు సంబంధించి ఏవయినా ఫిర్యాదులుంటే నేను ఎవరిని కలవాలి?

  • ఫిర్యాదును పరిష్కరించుకోవడానికి కస్టమర్‌, సంబంధిత బ్యాంకుకు వెళ్ళవచ్చు. బ్యాంకు సరిగ్గా స్పందించకపోయినట్లయితే / సంతృప్తికరమైన పరిష్కారం చూపకపతే, కస్టమర్‌, స్థానిక ఆర్‌.బి.ఐ. కార్యాలయంలోని గ్రీవెన్స్‌ రిడ్రెసెల్‌ సెల్‌ను కలవవచ్చు. తన ఫిర్యాదును పరిష్కరించుకోడానికి కస్టమర్‌, బాంకింగ్‌ ఆంబుడ్స్‌మెన్‌ కార్యాలయానికి కూడా వెళ్ళవచ్చు.

చెక్కు ట్రంకేషన్‌ అంటే ఏమిటి?

  • భౌతికమైన పత్ర వినిమయం లేకుండా ఎలక్ట్రానిక్‌ దత్తాంశం/ఇమేజ్‌లు లేదా రెంటింటిమీదఆధారపడి బ్యాంకుల మధ్య జరిగే చెక్కు క్లియరింగ్‌ మరియు పరిష్కార వ్యవస్థే చెక్కు ట్రంకేషన్‌.

చెక్కు ట్రంకేషన్‌ ఏవిధంగా బ్యాంకు కస్టమర్‌ లకు లాభం?

  • చెక్కు ట్రంకేషన్‌ విధానం (సిటిఎస్‌)లో టి + 0 స్థానిక క్లియరింగ్‌, టి + 1 ఇంటర్‌ సిటీక్లియరింగ్‌ సాధ్యం కాబట్టి బ్యాంకు కస్టమర్‌లు, చెక్కులు వేగంగా రియలైజ్‌ అవుతాయి. సిటిఎస్‌ ద్వారా స్ట్రెయిట్‌ ధ్రూ ప్రాసెసింగ్‌; ఆటోమేటిక్‌ చెల్లింపు ప్రాసెసింగ్‌ వీలువుతాయి. కాబట్టి కస్టమర్‌లకూ బ్యాంకులకూ శీఘ్రమైన రియలైజేషన్‌కు తోడు వ్యయాలు కూడా తగ్గుతాయి. సి.టి.ఎస్‌. ఆధారంగా వినూత్నమైన సేవలందించడం కూడా బ్యాంకులకు సాధ్యమవుతుంది. రికన్సిలేషన్‌; క్లియరింగ్‌ మోసాలను కూడా తగ్గించే అదనపు ప్రయోజనం బ్యాంకుకు కలుగుతుంది.

చెల్లింపు వ్యవస్థలలో ఆర్‌.బి.ఐ. పాత్ర ఏమిటి?

  • చెల్లింపు వ్యవస్థలలో రెగ్యులేటర్‌, పర్యవేక్షక పాత్రలతో పాటు ఆర్‌బిఐ పరిష్కార ఖాతా పాత్ర కూడా పోషిస్తుంది. అంతేకాకుండా ఉత్ప్రేరక శక్తిగా, నిర్వాహక శక్తిగా వినియోగ శక్తిగా కూడా ఉంటుంది. నిరంతర ప్రాతిపదికమీద దేశంలో మరింత సమర్థమైన, సురక్షితమైన చెల్లింపులకు సంబంధించి సరికొత్త విధానాలను ప్రవేశ#పెట్టడం ఆర్‌బిఐ చర్యలు తీసుకొంటూ ఉంది. ఆర్‌.బి.ఐ. నాలుగు మెట్రో పాలిటన్‌ నగరాల (ముంబాయి, న్యూఢిల్లీ, చెన్నై, కోల్‌కత) లో 80వ దశకం చివర మాగ్నటిక్‌ ఇంక్‌ కారెక్టర్‌ రికగ్నిషన్‌ (ఎమ్‌ఐసిఆర్‌) ఆధారిత చెక్కు క్లియరింగ్‌ వ్యవస్థను ప్రవేశపెట్టింది. 90వ దశకం మధ్యలో ఇసిఎస్‌, ఇఎఫ్‌టిల లాంటి ఎలక్ట్రానిక్‌ చెల్లింపు వ్యవస్థలను ప్రవేశపెట్టింది. 2004-05 సంవత్సరంలో ఆర్‌టిజిఎస్‌ ను ప్రారంభించింది. ఇలాంటి కొత్త కొత్త యంత్రాంగాలను లేదా విధానాలను ప్రవేశపెట్టడంతోపాటు ఆర్‌బిఐ, తమ సామర్థ్యాన్ని పెంచుకొంటూ కస్టమర్‌ల అవసరాలను తీర్చడానికి వీలుగా ప్రస్తుతం అమలులో ఉన్న వ్యవస్థలు అభివృద్ధి చెందే విధంగా /సవరించుకొనే విధంగా నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటుంది. సాంకేతిక విజ్ఞానంలోని పురోగతులను ఆలంబనగా చేసుకుని ఆర్‌బిఐ, ఈవ్యవస్థలను సురక్షితం చేయడానికీ, లావాదేవీల పట్ల నిజాయితీతో వ్యవహరించడానికీ వీటిలో అదనపు భద్రతా చర్యలను తీసుకువచ్చింది. వివిధ చెల్లింపు వ్యవస్థలతో విభాగాలను నిర్వహించడంతో పాటు ఆర్‌బిఐ, వినియోగశక్తిగా కూడా ఈ వ్యవస్థలతో పాల్గొంటుంది. ఆర్‌బిఐ సర్వీస్‌ ప్రొవైడర్‌గా వ్యవహరిస్తుంది. వ్యవస్థ స్థిరపడిన తరవాత, తదుపరి అభివృద్ధి కోసం బాధ్యతను ఇతర బ్యాంకులకు/ సంస్థలకు అప్పగిస్తుంది. ఆర్‌.బి.ఐ. కి వివిధ చెల్లింపు వ్యవస్థలను క్రమబద్ధం చేసే, పర్యవేక్షించే పాత్ర కూడా ఉంటుంది.

చెల్లింపు వ్యవస్థలను ఆర్‌బిఐ ఏ విధంగా క్రమబద్ధం (రెగ్యులేటెడ్‌) చేస్తుంది?

  • చెల్లింపు, పరిష్కార వ్యవస్థల క్రమబద్ధీకరణ మరియు పర్యవేక్షణ మండలి (బిపిఎస్‌ఎస్‌) అనేది ఆర్‌బిఐ సెంట్రల్‌ బోర్డు కు చెందిన ఒక ఉపసంఘం. చెల్లింపు వ్యవస్థకు సంబంధించిన విధాన నిర్ణయాలు చేయడంలో ఇది అత్యున్నత సంఘంగా ఉంటుంది. ఆయా రంగాలలో ప్రముఖులయిన నిపుణులు సభ్యులుగా ఉన్న “జాతీయ చెల్లింపుల పరిషత్తు” (ఎన్‌పిసి) అనే ఒక సాంకేతిక కమిటీ ఈ మండలికి సహాయం చేస్తుంది. కొత్తగా ప్రారంబించిన చెల్లింపు మరియు పరిష్కార వ్యవస్థల విభాగం (డిపిఎస్‌ఎస్‌) మండలికీ పరిషత్తుకూ సహాయం అందిస్తుంది. దేశంలో ప్రస్తుతం అమలులో ఉన్న భవిష్యత్తులో రాబోయే చెల్లింపు వ్యవస్థలన్నింటికీ సంబంధించిన విధానాలను ప్రమాణాలను నిర్ణయించే బాధ్యతను ఈ మండలికి అప్పగించడం జరిగింది. ఈ వ్యవస్థలకూ, సంబంధిత విధానాలకూ సభ్యత్వ నిర్ణయ ప్రమాణాలను నిర్ధారించే అధికారాలు కూడా ఈమండలికి ఉంటాయి.

గత దశాబ్దకాలంలో, భారతదేశంలోని చెల్లింపు మరియు పరిష్కార వ్యవస్థలలో వచ్చిన ప్రధానమైన పరిణామాలు ఏమిటి?

గత దశాబ్దకాలంలో సామాన్య ప్రజానీకానికీ కార్పొరేట్‌ సంస్థలకూ బ్యాంకులు అందించే చెల్లింపు వ్యవస్థసేవలు, గణనీయంగా మెరుగుపడ్డాయి. దీనికి సేవలందించడంలో పెరిగిపోయిన సాంకేతిక విజ్ఞాన వినియోగం కొంతవరకూ కారణమైతే, బ్యాంకుల మధ్య పోటీ నేపథ్యంలో తప్పనిసరయిన కార్యవిధానపరమైన (ప్రొసీజర్స్‌) మార్పులు కొంతవరకూ కారణం. ఈ మార్పులు కింది విధంగా ఉన్నాయి.

  1. చెక్కు క్లియరింగ్‌ విధానం విస్తృతంగా మెరుగుపడింది. స్థానిక చెక్కును వసూలు చేయడానికి పట్టే సమయం ఇప్పడు రెండు లేదా మూడు రోజులకు తగ్గింది. ఇంతకుముందు ఇది 4లేదా 5 రోజులు పట్టేది. 42 పెద్ద పెద్ద నగరాలలో ఆటోమేటిక్‌ చెక్కు ప్రొసెసింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కేంద్రాలలో, నగరంలోని అన్ని బ్యాంకు శాఖలూ అందుకొన్న చెక్కులను రాత్రిపూట ప్రాసెస్‌ చేస్తారు. బయటి (ఔట్‌స్టేషన్‌) చెక్కుల వసూలుకు పట్టే సమయం కూడా తగ్గిపోయింది. ఇప్పుడు చెల్లించే కేంద్రాల ఉనికిని బట్టి 4 నుంచి 10 రోజులు పడుతూ ఉంది. ఇంతకు ముందు దీనికి 10 రోజులనుంచి 1 నెలవర కూ పట్టేది.
  2. 90వ దశకంలో ఎలక్ట్రానిక్‌ చెల్లింపు పద్దతులకు సంబంధించి కొన్ని వినూత్న రూపాలను ప్రవేశపెట్టడం జరిగింది. పెద్ద పెద్ద కార్పొరేట్‌ సంస్థలు, గడువు తేదీన తమ డివిడెండ్‌; వడ్డీ, తిరిగి చెల్లింపులను ఎలక్ట్రానిక్‌ పద్ధతితో చెల్లించడంలో, ఎలక్ట్రానిక్‌ క్లియరింగ్‌సర్వీస్‌ (ఇసిఎస్‌), వాటికి ఎంతగానో సహాయపడింది. గడువుతేదీన పెట్టుబడి పెట్టిన వారికి చెల్లింపు జర గడమే కాకుండా కాగితం పత్రాలకు మాత్రమే అవసరం లేకపోవడం వల్ల కార్పొరేట్‌ సంస్థలు కూడా గణనీయంగా పొదుపు చేసుకోగలిగాయి. 2005-06 సంవత్సరంలో ఇ.సి.ఎస్‌. ద్వారా అలాంటి 36 మిలియన్‌ల లావాదేవీలు జరిగాయనే వాస్తవాన్ని బట్టిఎంత ఆదా అయిందో ఊహించవచ్చు. అదేవిధంగా, వినియోగ సంస్థలు (యుటిలిటీ బాడీస్‌) గడువుతేదీనే ఇసిఎస్‌ ద్వారా తమ బిల్లులను వసూలు చేసుకొనే స్థితిలో ఉన్నాయి. నగదు ప్రవాహ నిర్వహణ సులభతరమవుతుంది. 2004-05 సంవత్సరంలో అలాంటి లావాదేవీలు 16 మిలియన్‌లున్నాయి.
  3. బ్యాంకులు, ఎలక్ట్రానిక్‌ నిధుల బదిలీ (ఇఎఫ్‌టి) సదుపాయాన్ని విస్తరించడం వల్ల ద్రవ్యబదిలీ విధానం మారిపోయింది. రిజర్వు బ్యాంకు రూపొందించిన ఇ.ఎఫ్‌.టి సదుపాయాన్ని ఉపయోగించుకొని వాణిజ్య బ్యాంకులు, ఖాతాదారులకు అదేరోజు నిధుల బదిలీ సదుపాయాన్ని అందించడం ప్రారంభించాయి. 15 ప్రధాన కేంద్రాలలోని బ్యాంకు ఖాతాదారులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకొని పరస్పరం నిధులను బదిలీ చేసుకోవచ్చు. నెట్‌వర్క్‌ ఉన్న శాఖల కోసం ప్రత్యేక ఇ.ఎఫ్‌.టి. అనే ఇ.ఎఫ్‌.టి పద్దతిని ప్రత్యేకంగా రూపొందించడం జరిగింది. ఇది, కంప్యూటరీకరించినా, నెట్‌వర్క్‌ ఉన్న శాఖలు దేశంలో ఎక్కడున్నా వాటి పరిధిలో అదేరోజు నిధుల బదిలీ సదుపాయాన్ని అందిస్తుంది. ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ సదుపాయం ఉన్న బ్యాంకులకు ఇ.ఎఫ్‌.టి. కోసం తమ ఖాతాదారుల నుంచి అభ్యర్థనలు అందుతున్నాయి.
  4. ఆర్‌.బి.ఐ. రియల్‌ టైమ్‌ గ్రాస్‌ సెటిల్మెంట్‌ (ఆర్‌టిజిఎస్‌) విధానాన్ని ప్రవేశపెట్టడంలో, ఇఎఫ్‌టి వ్యవస్థ కొత్త రూపు సంతరించుకొంది. ఇప్పుడు కార్పొరేట్‌ సంస్థల కూ ఇతర బ్యాంకు ఖాతాదారులకూ వెంటనే నిర్ణీత శాఖలకు (ప్రస్తుతం దాదాపు 9600) నిధులు బదిలీ చేసుకొనే అవకాశం ఉంది. ఆర్‌టిజిఎస్‌ నిర్వహణ నియమాల ప్రకారం క్రెడిట్‌ గనక వర్తించకపోయినట్లయితే 2 గంటల లోపల దాన్ని తిప్పి పంపవలసి ఉంటుంది. అంటే, గరిష్ట జాప్యం 2 గంటలుగా ఉంటుంది.
  5. దేశంలో ఎ.టి.ఎమ్‌.ల ఏర్పాటులో విపరీతమైన వృద్ధి కనిపిస్తుంది. నగదు ఉపసంహరణ, నగదు డిపాజిట్‌, నిల్వవిచారణ, చెక్కుబుక్కులు కోసం అభ్యర్థన, చెల్లింపు నిలుపుదల సూచనల జారీ వంటి విషయాలలో 24 X 7 ప్రాతిపదిక మీద బ్యాంకు ఖాతాదారులకు మరింత సౌకర్యం చేకూరింది. ప్రస్తుతం దేశంలో ఏ.టి.ఎమ్‌ సంఖ్య దాదాపు 16,000. ప్రతినెలా కొన్ని వందలలో ఈ సంఖ్య పెరుగుతూ ఉంది.
  6. గత మూడు లేదా నాలుగు సంవత్సరాలలో దేశంలో చెల్లింపు మాధ్యమంగా చెల్లింపు కార్డుల (డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు) వినియోగంలో స్పష్టమైన వృద్ధి కనిపించింది. 2004 డిసెంబర్‌ చివరికి, దేశంలో 4.33కోట్ల చెల్లింపు కార్డులున్నాయి. కార్డులకు సంబంధించి పెరుగుతున్న వినియోగానికి కేవలం భద్రతా సదుపాయాలే కాకుండా దేశంలో నెలకొన్న చిల్లర వినియోగదారుల పెరుగుదల (Retail consumer boon) కూడా కారణమే. భారతదేశంలో చెల్లింపు వ్యవస్థలు -కీలకమైన గణాంకాలు

చివరిసారిగా మార్పు చేయబడిన : 2/6/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate