సుబాబుల్,అవిశ,నల్లతుమ్మ,రావి వంటి చెట్లు ఆకులు పశుగ్రాసానికి బాగా ఉపయోగపడతాయి. మేత కొరత సమయాల్లో వరిగడ్డి చొప్ప ఎండుమేతలలో ఈ చెట్ల ఆకులు 20-30 శాతం వరకు మేపితే పాల దిగుబడి తగ్గదు.
ఇటువంటి చెట్లను పెరట్లోను, తోటల చుట్టు పొలంగట్ల పైన సేద్యమునకు ఉపయోగపడని ఎత్తు పల్లాలలోను, ఖాళీ ప్రదేశంలోను వర్షాకాలములో నాటుకొని అభివృద్ది పరుచుకోవలి.
పచ్చిమేతకు అనువైన పప్పు జాతి వృక్షం త్వరగా పెరుగుతుంది. బెట్టను తట్టుకుంటుంది. ముఖ్యంగా వేసవిలో పశువులకు మేత కొరత తీరుస్తుంది. అన్ని నేలలో పెరుగుతుంది. పోషక విలువలు ఎక్కువగా వున్నందున పశువులు ఈ మేత తినటం వలన పాల ఉత్పత్తి పెరుగుతుంది.
నేలలు : | తేలికయిన బరక నేలలు మరియు సారం తగ్గిన భూములలో పెరుగుతుంది. 500-4600 మి.మి వర్షపాతం ఉన్న ప్రాంతంలలో పెరుగుతుంది . |
రకాల | మెట్ట నేలల్లో – హవాయిన్ కామన్, కె-8 ,కె -28. |
ఎరువుల యాజమాన్యం | 8 కిలోల నత్రజని, నీటి వసతిగల నేలల్లో – హవాయిన్ జెయంట్ – కె.636. 20 కిలోల భాస్వరం, 8 కిలోల పొటాష్. |
విత్తన మోతాదు | విత్తనం పైన గట్టి పొర తొలగించి విత్తుకోవాలి. ఇందుకోసం నీళ్ళలో ఐదు నిమిషాలు నానబెట్టి, పైన గట్టిపొరను తొలగించాలి. విత్తనం నీడన ఆరబెట్టి నిల్వ చేసుకోవచ్చు లేక విత్తుకోవచ్చు . ఎకరానికి 320 గ్రా విత్తనం సరిపొతుంది. |
విత్తుసమయం | జూన్ – జూలై, ఫిబ్రవరి – మార్చి. నీటి వసతి క్రింద. విత్తనం లేక 2 -3 నెల మొక్కలు నాటుకోవచ్చు. మొక్కలు నాటితే మంచి దిగుబడి వస్తుంది. |
మొక్కల మధ్య దూరం | సాలుకు, సాలుకు మధ్య దూరం 1.2 -1.5 మీ. దూరంలో నాటుకోవాలి.0.5 -0.9 మీ మొక్కకు మొక్కకు మధ్య దూరం వుండాలి. |
యాజమాన్య పధ్ధతులు |
|
దిగుబడి | 1. సుబాబుల్ 6 సంవత్సరములలో మీ. ఎత్తు అరకు పెరుగుతుంది. 2. పశుగ్రాసం, ఎకరాకు వర్షాధార ప్రాంతాలలో 5 -10 టన్నుల నీటి వసతి ఉన్న ప్రాంతాలలో 30 – 36 టన్నులు వస్తుంది. |
సమస్యలు – నివారణ |
|
పశుగ్రాసము ఎక్కువ లభించే రోజులలో వృథా చేయకుండా నిల్వ చేసుకోవాలి. పశుగ్రాసము నిల్వ చేసినప్పుడు మేతలో పోషక విలువలు సాధ్యమయినంత వరకు తగ్గకుండా చూసుకోవాలి.
నిల్వ చేసే పద్ధతలలో రెండు పద్ధతులు వున్నాయి.
పశుగ్రాసము కోసిన తర్వాత అందులోని తేమ శాతం తగ్గించి నిల్వ చేసుకోవాలి. ముందుగా పశుగ్రాసము ఉదయం పూట సూర్యరశ్మి బాగా ఉన్నప్పుడు కోసి ఎండలో తల క్రిందులుగా నిలబెట్టాలి. ఆ తర్వాత అప్పుడప్పుడు మరలి వేస్తుండాలి. దీని వల్ల మేతలోని తేమ శాతం 35 వరకు తగ్గించాలి. ఇలా ఆరపెట్టేటప్పుడు మేతలోని ఆకులు ఎక్కువగా రాలిపోకుండా చూడడం చాలా ముఖ్యం.
సైలేజి రోజుకు పాడి పశువుకు 20 కిలోల చొప్పున ఇవ్వవచ్చును. సుమారు 120 రోజులుకు సరిపడే పాతర గడ్డి చేతిలో వుంటే వేసవి కాలపు పచ్చిమేత కొరత చాలా వరకు తగ్గించుకొన వచ్చును. సుమారు ఒక ఎకరా భూమి నుండి లభించే జొన్న గాని, మొక్కజొన్న కాని అవసరముటుంది. 5 పాడి పశువులకు 120 రోజులకు 20 కిలోల సైలేజి కావాలి. ఈ సైలేజి తయారు చేయటానికి 18,000 కిలోల పచ్చిమెత కావాలి.
సైలేజి తయారు చేయడానికి తీసిన గుంత
ఆధారము:కృషి విజ్ఞాన కేంద్రము కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థసంతోష్ నగర్ సైదాబాద్ హైద్రాబాద్.
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/27/2020