నీరు నిల్వ ఉండని తటస్ధ భూములైన ఎర్ర,చల్క,ఇసుక రేగడి మరియు ఒండ్రు నేలలు చాలా అనుకూలం.
కె.బి.ఎన్ .హెచ్ -1, కె.బి.ఎన్ .హెచ్ 44,ఎన్ ,డి,ఎస,హెచ్ -1, డి,ఆర్ .ఎస్ ,హెచ్ -1,ఎ,పి,ఎస్ ,హెచ్ -66
ఖరీఫ్ : జూన్ రెండవ పక్షం- అగస్టు రెండవ పక్షం రబీ : నవంబర్ – డిసెంబర్ వేసవిలో (నీటి పారుదుల క్రింద ): జనవరి 2వ పక్షం-ఫిబ్రవరి మొదలు పక్షం .
విత్తనమోతాదు: 2కిలోల/ఎకరానికి
చేయవల్సినవి | చేయకూడనివి |
• వర్షాధార పరిస్థితుల్లో త్వరుతగతిన విత్తనం మొలకెత్తుటకు, ఆశించిన మొక్కల సాంద్రత పొందుటకు లీటరు నీటికి కిలో విత్తనం చోప్పున 14 గంటల పాటుమంచి నీటికి నానబెట్టి నీడలో ఆరబెట్టి విత్తినట్లైతే మొలక శాతం పెరుగుతుంది. విత్తనం మొలకెత్తిన 10-15 రోజుల తరువాత కుదురుకు ఒక మొక్కను వుంచి మిగిలిన మొక్కలు తీసి వేయాలి. దీని వలన మొక్కల మధ్య నీరు మరియు పోషకాల కోసం పోటీ తగ్గి పువ్వు పరిమాణం పెరిగి అధిక దిగుబడి పొందుటకు దోహద పడుతుంది. • పువ్వులలో గింజలు ఎక్కువగా ధృఢంగా తయారవాడానికి 2 గ్రా బోరక్స్ లీటరు నీటికి కలిపి • పూత దశలో (ఆకర్షక పత్రాలు విచ్చుకొనే) ఎకరాకు 200 లీటర్ల మందు ద్రావణం పిచికారి చేయాలి. • మెరుపు రిబ్బనులను పైరు పైన అడుగు ఎత్తున సూర్యరశ్మి రిబ్బను పై పడేటట్లు ఉత్తర మరియు దక్షిణ దిశగా కట్టినట్లైతే పక్షుల బారి నుండి రక్షించవచ్చును. |
• సరైన సమయంలో విత్తక పోతే పూత మరియు గింజలు తయారయ్యే దశలో పంట దీర్ఘకాలం వర్షంలో లేదా పగటి ఉష్ణోగ్రత 38 సెల్సియస్ కంటే ఎక్కువైతే దిగుబడి, నాణ్యత తగ్గుతుంది. • పరపరాగ సంపర్కం కొరకు దోహదపడే తేనెటీగలకు హాని చేయరాదు. అవి ఎక్కువ ఉండే సమయాల్లో హానిచేసే పురుగు మందులను పిచికారి చేయరాదు. |
మరిన్ని వివరాల కొరకు సంప్రదించవలసిన చిరునామా: ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి, ప్రొద్దుతిరుగుడు పరిశోధనా స్థానం, రాజేంద్రనగర్ , హైదరాబాద్ , ఫోన్ నెం. 040-24018447
చివరిసారిగా మార్పు చేయబడిన : 9/8/2023