రకాల ఎంపిక: యూనివర్సిటీ విడుదల చేసిన మధ్యకాలిక రకాలలో డి.హెచ్ . ఎమ్ .117 మరియు 119 మంచి దిగుబడి నిస్తాయి. ఇవికాక సిఫారసు చేయబడిన అధిక దిగుబడినిచ్చే ప్రైవేట్ సంకర రకాలను సాగు చేయవచ్చు.
పేలాల మొక్కజొన్న రకం: అంబర్ పాప్ కార్న్
తీపి మొక్కజొన్న రకాలు : కాంపొజిట్ రకాలు : మాధురి, ప్రియ, అల్ మోరా, విన్ ఆరంజ్
హైబ్రిడ్ రకాలు : షుగర్ 75, బ్రైట్ జీన్,హెచ్.ఎస్.సి.1
విత్తే సమయం : ఖరీఫ్ : జూన్ – జూలై , రబీ : అక్టోబర్ – నవంబర్
విత్తు పద్ధతి : దుక్కి చేసిన నేలల్లో 75 సెంమీ. లేదా 60 సెం.మీ. ఎడం ఉండునట్లు తూర్పు-పడమర లకు బోదెలు చేసుకోవాలి. విత్తనాన్ని బోదెకు ఒక వైపు 1/3 వంతు ఎత్తులో 2సెం.మీ. లోతులో విత్తుకోవాలి.
రకాలు | కిలోలు/ ఎకరాకు | విత్తే దూరం | మొక్కల సాంద్రత (ఎ) |
సంకర రకాలు తీపి మొక్కజొన్న పేలాలమొక్కజొన్న బేబి కార్న్ |
7 4 5 10 |
60x20 60x20 60x20 45x15 |
33,333 33,333 33,333 59,259 |
వర్షాధారంగా (కి/ఎ) |
(నీటిపారుదల క్రింద) కి/ఎ | |
నత్రజని భాస్వరం పొటాష్ జింక్ సల్ఫేట్ |
72 24 24 10 |
80-96 24-32 24-32 20 |
ఖరీఫ్ : నత్రజని ఎరువును 3 దఫాలుగా 1/3 వంతు వత్తే సమయంలో, 1/3 వంతు30-35 రోజులకు, మిగిలిన 1/3 వంతు 50-50 రోజులకు మొక్కకు 5 సెం.మీ దూరంలో మరియు 5 సెం.మీ లోతులో వేయాలి. మొత్తం భాస్వరం మరియు పొటాష్ ఎరువును విత్తే సమయంలోనే వేసుకోవాలి.
రబీ: నత్రజనిని 4 దఫాలుగా (విత్తేటప్పుడు, 30-35 రోజులకు, 45-55 రోజులకు ) వేసుకోవాలి. మొత్తం భాస్వరం మరియు 1/2 వంతు పొటాష్ ను విత్తేటప్పుడు మిగిలిన పొటాష్ ను 45-55 రోజులకు వేసుకోవాలి.
• కాండం తొలుచు పురుగులు రెండు రకాలు. మొదటిది ఖరీఫ్ పంటలో ఎక్కువగా వచ్చే మచ్చల/చారల కాండం తొలుచు పురుగు, రెండవది రబి పంటను ఎక్కువగా నష్టపరిచే గులాబి రంగు కాండం తొలుచు పురుగు. • వీటి నివారణకు గాను సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. • ఎర్ పంటగా మొక్కజొన్న చుట్టూ 4-5 వరుసల జొన్న విత్తుకొని 45 రోజుల తర్వాత తీసివేయాలి. • మొక్కజొన్నలో బొబ్బర్లను అంతర పంటగా, నేపియర్ గడ్డిని ఎరపంటగా వేసుకోవాలి. • అంతర పంటలుగా కంది,సోయాచిక్కుడు సాగుచేసి సహజ శత్రువులును పెంపొందించాలి. • మొలకెత్తిన 10-15 రోజులలోపు క్రింది 3-4 ఉన్న గ్రుడ్లను గమనించి నాశనం చేయాలి. • ఆకుసుడులలో 25 -30 రోజులలోపు పురుగు ఉధృతిని గమనిస్తే కార్బోప్యూరాన్ 3జి గుళిక లను ఎకరానికి 3 కిలోలు మొవ్వులో వేయాలి. • ఆకు మాడు తగులు నివారణకు గాను మాంకోజెబ్ @ 2.5గ్ర్ర/లీ. పిచికారి చేయాలి. |
. పైరులో పురుగు ఆశించిన మొక్కలలో ఎండిపోయిన మొవ్వులను (డెడ్ హార్ట్స్ ) గమనించ వచ్చు. పీకితే ఇవి సులభంగా ఊడి వస్తాయి. ఈ పురుగు యొక్క జీవెత చక్రం 30-45 రోజుల్లో పూర్తవు తుంది.
|
కాండం కుళ్ళును కల్గించే శిలీంధ్ర బీజాలు నేలలో మరియు మొక్కల్ అవశేషాలలో జీవించి ఉండి, నేలలో తేమశాతం తగ్గినప్పుడు మరియు ఉష్ణోగ్రత పెరిగినప్పుడు తీవ్రంగా నష్టం వాటిల్లు తుంది. కావున పూత దశ నుండి నేలలో తేమ తగ్గకుండా నీటి తడులు ఇవ్వాలి. 5కిలోలు ట్రైకోడర్మా శిలీంధ్రాన్ని 100 కిలోలు పశువుల ఎరువులో వృద్ధి చేసి వరుసగా 3-4 సంవత్సరములు భూమిలో కలపాలి. మచ్చల/చారల కాండం తొలుచు |
గులాబి రంగు కాండం తొలుచు పురుగు. ఈ పురుగు ముఖ్యంగా రబీ పంటకాలంలో మొక్కజొన్నను ఆశించి నష్టపరుస్తుంది. తల్లి పురుగు 2-3 వరుసలో ఆకు మొదలు మరియు కాండం మధ్య భాగంలో ముత్యాల వంటి గుడ్లను 7-20 రోజులలో పెడుతుంది. ఒక సముదాయంలో 30 – 100 గుడ్లు గ్రుడ్లు సముదాయము, మొక్కను తొలుస్తున్న గొంగళి వారంరోజుల్లో గుడ్లు పగిలి గులాబి రంగు శరీరంతో ఎర్రని తల కలిగిన పిల్లపురుగులు కాందాన్ని తొలచి లోపలికి ప్రవేశించి అంకుగాన్ని తింటాయి. ఆకుల పైన అగ్గిపుల్ల మందం పొడవాటి చిల్లులను వరుసల్లో గమనించవచ్చు. కాండం లోపల ‘ఎస్ ‘ ఆకారంలో సొరంగాలు ఏర్పడతాయి. మొవ్వను ఆశించుట వలన మొక్కలు చనిపోతాయి. |
ఆకు ఎండు తెగుళ్ళు
మొక్కజిన్నను ఆశించే తెగుళ్ళలో ముఖ్యమైనవి ఆకు ఎండు తగుళ్ళు. ఇవి రెండు రకాలు. మొదటి రకం తెగులులో ఆకుఅలపై మచ్చలు కోలగా ఉండి, నీటితో తడిచినట్లుగా అనిపిస్తాయి. క్రమంగా ఈ మచ్చ్ల పరిమాణం పెరిగి, ఆకంతా వ్యాపించి ఆకులు పూర్తిగా ఎండి పోతాయి. ఎక్కువ తేమ గల వాతావరణంలో మొక్కలు చనిపోతాయి. రెండవ రకం ఆకు ఎండు తగులులో ఆకులపై చిన్న చిన్న కోలగా ఉండే బూడిద లేక గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. తరువాత ఈ మచ్చల పరి మాణం పెరిగి దీర్ఘ చతుర స్రాకారంలో మారుతాయి. వాతావరణంలో తేమ మరియు ఉష్ణోగ్రత అధికంగా ఉన్నపుడు ఈ తెగులు తీవ్రత ఎక్కువగా ఉంటుంది
నివారణ:
మాంకోజెబ్ 2.5 గ్రా. లీటరు నీటిలో కలిపి పిచికారి చేసి ఆకు ఎండు తెగుళ్ళను నివారించుకోవచ్చు.
![]() |
![]() |
బూజు తెగులు
మొక్కజొన్న పంటను బూజు తెగులు ఆశించిన ట్లైతే ఆకులు వంకర తిరిగి, ముడతలు పడటం వంటి లక్షణాలు గమనించవచ్చు.
నివారణ
• టలాక్సిల్ 4 గ్రా. కిలో విత్తనానికి కలిపి విత్తనశుద్ది చేసి విత్తుకోవాలి.
• మొక్కలపై తెగుళ్ళ లక్షణాలు గమనించి నప్పుడు మెటలాక్సిల్ 2గ్రా. ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి
కాండంకుళ్ళు తెగులు
మొక్కజొన్నలో ఈ తెగులు పూత దశ నుండి సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాండంపై గోధుమ రంగు చారలు ఏర్పడి పంట కోతకు రాక ముందే కాండం భాగం విరిగి నేలపై పడిపోతుంది. ఇటువంటి మొక్కలను చీల్చి చూసినప్పుడు లోపల బెండు భాగం కుళ్ళి నలుపు రంగుకు మారుతుంది.
నివారణ
• ఎండాకాలంలో నేలను లోతుగా దున్నుకోవాలు.
• పంటకోసిన తరువాత తెగులు ఆశించిన మొక్కల భాగాలను కాల్చి వేయాలి.
చేయవల్సినవి | చేయకూడనివి |
• ఎకరానికి 10 టన్నులు బాగా చివికిన పశువుల ఎరువును లేదా కంపోస్టును వేసి ఆఖరి దుక్కిలో కలియ దున్నాలి. • బెట్ట పరిస్థితులలో నత్రజని లోపం ఏర్పడినప్పుడు 2% యూరియా(20గ్ర్ర/లీ) ద్రావబణాన్ని 2-3 సార్లు పిచికారి చేయాలి. • పరపరాగ సంపర్క దశలో భాస్వరం లోపం వలన పీచు సరిగ్గా బయటకి రాక చిన్న కండెలు ఏర్పడ తాయి. ఈ లోప సవరణకు డి.ఎ.పి.2% ద్రావణాన్ని 4-5 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేయాలి. • అంతర పంటలుగా పప్పుజాతి పంటలను విత్తినప్పుడు సిఫారసు చేసిన అంతర పంటకు భాస్వరం మరియు పొటాష్ ఎరువులను 15-25% మేర పెంచి వేసుకోవాలి |
• నీటి వసతి లేని ఎర్ర చల్క నేలల్లో మొక్కజొన్న సాగు చేయరాదు. • భాస్వరం, జింక్ సల్ఫేట్ ఎరువులను కలిపి దుక్కిలో వేయరాదు. • కాంప్లెక్స్ ఎరువులను పై పాటుగా వేయరాదు. • యూరియాతో కలిపి పురుగు మందులను కలిపి పిచికారి చేయరాదు. • జింక్ స్ల్ఫేట్ లో పురుగు మందులను కలిపి పిచికారి చేయరాదు. • మొక్కజొన్న మరియు కందిని అంతర పంటగా వేసినప్పుడు అట్రజిన్ కలుపు మందును వాడరాదు |
మరిన్ని వివరాల కొరకు సంప్రదించవలసిన చిరునామా: ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి, మొక్కజొన్న పరిశోధనా స్థానం, రాజేంద్రనగర్ , హైదరాబాద్ , ఫోన్ నెం. 040-24018447
చివరిసారిగా మార్పు చేయబడిన : 1/2/2023
మొక్కజొన్న
ఈ విభాగములో మొక్కజొన్న సాగు విధానము మరియు తీసుకోవా...
హైబ్రిడ్ విత్తనోత్పత్తి అనువైన ప్రాంతాలు,విత్తుసమయ...
ఈ అంశం మొక్కజొన్నలో హైబ్రిడ్ విత్తనోత్పత్తి గురించ...