తేలిక ఎర్ర నేలలు మరియు నల్లరేగడి నేలలు అనుకూలమైనవి.
ఋతువు | నెల |
ఖరీఫ్ | జూన్ – సెప్టెంబర్ |
మాఘీ | సెప్టెంబర్ – డిశంబర్ |
రబీ | అక్టోబర్ – జనవరి |
లేట్ రబీ | నవంబర్ – ఫిబ్రవరి |
వేసవి | జనవరి – ఏప్రిల్ |
రకము | ఋతువు | పంటకాలం (రోజులు) |
గింజ దిగుబడి (క్విం | | . హె.) |
చొప్ప దిగుబడి (క్విం | | . హె.) |
ఎస్ పి.వి. 462 | ఖరీఫ్, రబీ | 110 | 33 – 36 | 120 – 130 |
సి.ఎస్ . వి. 15 | ఖరీఫ్ | 110 | 35 – 38 | 130 – 140 |
ఎన్.జె.2122 | మాఘీ, రబీ | 100 | 30 – 35 | 135 - 140 |
ఎన్.జె.2169 | ఖరీఫ్ | 105 | 30 – 35 | 140 -145 |
సంకర జాతి రకాలు | ||||
సి.ఎస్.హెచ్.6 | ఖరీఫ్,మాఘీ, రబీ | 110 | 45-50 | 100-105 |
సి.ఎస్.హెచ్.16 | ఖరీఫ్ | 110 | 42-43 | 95-105 |
సి.ఎస్.హెచ్.17 | ఖరీఫ్ | 105 | 40-41 | 85-90 |
సి.ఎస్.హెచ్.18 | ఖరీఫ్ | 112 | 41-42 | 100-105 |
తొలకరి వర్షాలు పడిన వెంటనే విత్తుకోవాలి. ఆలస్యం చేసినచో దిగుబడి తగ్గుతుంది.
జొన్న2:1 నిష్పత్తిలో వేయవలెను.
విత్తనం విత్తిన 30 రోజులకు దంతిలో అంతర కృషి చేయడము వలన తేమ నిలచి మొక్కలు బాగా పెరుగుతాయి. విత్తిన రెండు వారాలలోపు ఒత్తు మొక్కలను తీసివేయాలి. విత్తిన రెండవ రోజు అట్రజిన్ హెక్టారుకు 0.5 – 1.0 కిలోలు లేదా స్టాంప్ (పెండామిథిలిన్ ), హెక్టారుకు 0.5 కిలోల పొడి మందును 625లీ.చొప్పున నీటిలో కలిపి పిచికారి చేసిన 25 రోజుల వరకు ప0టలో కలుపు ఉ0డదు.
జొన్నలో మల్లె వచ్చిన ఎడల లీటరునీటికి 50గ్రా. అమ్మోనియా సల్పేటును గాని 200గ్రా. యూరియా గాని కలిపి పిచికారి చేసి నివారించవచ్చును లేద 2, 4 – డి, 2 గ్రా. ఒక లీ. నీటిలో కలిపి పిచికారి చేసి నివారించవచ్చును. పంట మార్పిడి ద్వారా అనగా ప్రత్తి, ప్రొద్దుతిరుగుడు, వేరుశనగ వంటి పంటలు సాగు చేయడం ద్వారా కూడా మల్లెను అదుపులో వుంచవచ్చు.
విత్తనం మొలకెత్తిన మొదటి 30 రోజుల వరకు మాత్రమే ఈ పురుగు ఆశిస్తుంది. పురుగు ఆశించి మొవ్వ ఎండిపోయి, లాగినప్పుడు సులువుగా వచ్చి కుళ్ళిపోయిన వాసన కలిగి ఉంటుంది.
నివారణ: మొదటి తొలకరి వర్షాలకు విత్తనము విత్తిన ఎడల మొవ్వ తొలుచు ఈగ బారి నుండి పంటను రక్షించుకొనవచ్చు మరియు విత్తిన 25వ రోజు మరియు 35వ రోజు హెక్టారుకు 10 కిలోల కార్బోప్యూరాన్ లేదా ఎండోసల్ఫాన్ 4జి మందును మొక్క యొక్క సుడిలో వేసి ఈ పురుగును నివారించవచ్చును.
గింజ పాలు పోసుకొను దశలో దోమ ఆశించి, గింజల నుంచి పాలను పీల్చడం వలన గింజలలో నొక్కులు ఏర్పడతాయి. నివారణ: హెక్టారుకు 20 కిలోల కార్బోరిల్ పొడి మందును కంకుల మీద చల్లాలి.
విత్తనము తయరయ్యే దశలో ఎక్కువకాలం వర్షాలు పడిన ఎడల బూజు తెగులు సోకుతుంది. ఈ తెగులు సోకిన గింజలు మసక తెలుపు లేదా గులాబి రంగులోకి మారతాయి.
నివారణ: గింజ క్రింద భాగంలో నల్లని చార ఏర్పడినప్పుడు కంకులను కోయాలి. పూత వచ్చినప్పుటి నుంచి 10 రోజుల విరామంతో 3 సార్లు కార్బండైజిమ్ 1 గ్రా. 1లీ. నీటికి కలిపి పిచికారి చేయాలి.
తేనె వంటి ద్రవం బొట్లు బొట్లుగా ఈ తెగులుసోకిన కంకి నుంచి కారుతుంది. తరువాత కంకి పై నల్ల బూజు ఏర్పడి కంకులు నల్లగా మారతాయి.
నివారణ: లీటర్ నీటికి మాంకోజెబ్ 2 గ్రా. లేదా బెన్ లేట్ 1 గ్రా. కలిపి రెండు సార్లు పిచికారి చేయాలి. మొదటి సారి 50 శాతం పూత వచ్చినప్పుడు, తర్వాత 15 రోజులకు రెండవసారి పిచికారి చేయాలి.
ఆధారము: కృషి విజ్ఞాన కేంద్రము కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థ సంతోష్ నగర్ సైదాబాద్, హైద్రాబాద్.
చివరిసారిగా మార్పు చేయబడిన : 3/9/2023