অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

జామ

మన రాష్ట్రంలో జామ సుమారుగా 10,420 హెక్టార్లలో సాగుచేయబడుతూ 1,35,465 టన్నుల దిగుబడి నిస్తుంది. అనంతపురం, మహబూబ్నగర్, రంగారెడ్డి, మెదక్, కృష్ణా, గుంటూరు మరియు ప్రకాశం జిల్లాల్లో ఎక్కువగా సాగులో ఉంది.

వాతావరణం

వేడితో కూడిన పొడి వాతావరణంలో పెరిగిన తోటల్లో పండ్ల నాణ్యత ఎక్కువ. 100 సెం.మీ. వర్షపాతం గల ప్రాంతాలు అనుకూలం. మామూలు చలికాలం, వేసవి కాలం అవసరం.

నేలలు

ఉదజని సూచిక 48 నుండి 8.2 ఉండి, నీరు నిల్వని, లోతైన మరుగు నీటి పారుదల గల నేలలు అనుకూలం. తేలికపాటి ఇసుక నేలలు అంతగా పనికిరావు.

రకాలు

జామలో తెల్ల, ఎర్ర కండ గల రకాలు ఉన్నాయి.

తెల్ల కండ రకాలు

అలహాబాద్ సఫేదా : మధ్యస్థ పరిమాణం, గుండ్రని పండ్లు, కండ తెల్లగా మంచి నాణ్యత కల్లి ఉంటుంది. విత్తనాలు చిన్నవిగా, మెత్తగా వుంటాయి. ఎకరాకు సంవత్సరానికి దిగుబడి 60-80 క్వింటాళ్ళు

లక్నో-49 (సర్గార్) : పండ్లు కోలగా, పెద్ద పరిమాణంలో గరుకు చర్మంతో వుంటాయి. విత్తనాలు పెద్దవిగా, గట్టిగా వుంటాయి. ఎకరాకు సంవత్సరానికి దిగుబడి 60-80 క్వింటాళ్ళు

సఫేద్ జామ (అలహాబాద్ సఫేదా X కొహిర్ సెలక్షన్) : పండ్లు మధ్యస్థంగా, గుండ్రంగా, పలుచటి తోలుతో మంచి రుచిగా వుంటాయి. ఎకరాకు సంవత్సరానికి దిగుబది 80-100 క్వింటాళ్ళు

కొహిర్ సఫేదా (కొహిర్ సెలక్షన్ X అలహాబాద్ సఫేదా) : అత్యధిక దిగుబడి నిస్తుంది. పండ్లు పెద్దగా, గింజలు కొంచెం గట్టిగా వుంటాయి.

అర్క మృదుల : అలహాబాద్ సఫేద్నుంచి ఎన్నుకోబడిన రకం ఇది. పండ్లు గుండ్రంగా, పెద్దవిగా, గింజలు మొత్తగా ఉండి, కండ తెలుపు రంగులో తియ్యగా ఉండి, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.

అర్క అమూల్య(సీడ్ లెస్ జామ X ఆలహాబాద్ సఫేదా): కాయలు మధ్యస్థంగా, తెల్లకండతో తియ్యగా వుంటాయి. విత్తనాలు మొత్తగా వుంటాయి. ఎక్కువ రోజులు నిల్వ వుంటాయి.

శ్వేత : అధిక దిగుబడి నిచ్చే తెలుపు కండ రకం. పండు సుమారు 225 గ్రాముల బరువుతో తెలుపు రంగుతో ఎరుపు మచ్చలు కలిగి ఉంటుంది. గింజలు మృదువుగా వుండి, నాటిన ఆరవ సంవత్సరంలో సుమారు 100 కిలోల దిగుబడి నిస్తుంది.

ఎర్రకండ రకాలు

ఎఱ్ఱని గుజజ్ఞగల జామపండ్లు గుజు పరిశ్రమలో వాడకం ఎక్కువగా వున్నది.

రెడ్ప్లష్ : కాయ ముదురు ఆకుపచ్చ రంగుతో గరుకుగా ఉండి, గింజలు గట్టిగా ఉండి, కండ ఎరుపు రంగులో ఉంటుంది. ఎకరాకు సంవత్సరానికి దిగుబది 70-80 క్వింటాళ్ళు.

లలిత్ : అలహాబాద్ సఫేదతో పోలిస్తే 24% దిగుబడి ఎక్కువ నిస్తుంది. పండు బరువు 185గ్రా. నుండి 200గ్రా. ఉండి నిల్వ పదార్గాల తయారీకి అనువైన ఎరుపు కండ రకం.

కిరణ్ : (కంసారిXపర్పల్ లోకల్) : ఐ.ఐ.హెచ్.ఆర్. బెంగుళూరు నుండి ఈ మధ్యనే విడుదలైన రకం. పండు ఎరుపు కండతో మృదువైన గింజలున్న రకం. లైకోపిన్ అధికంగా ఉంటుంది. జామ పల్స్ తయారీకి అనువైనది.

ప్రవర్ధనం, నాటే సమయం

నేల అంట్ల గాని, అంట్ల గాని నాటుకోవచ్చు. మొక్కలను జూన్-జులైలోగాని, అక్టోబర్-నవంబర్ మాసాల్లో గాని నాటుకోవాలి.

నీటి యాజమాన్యం

లేత మొక్కలకు 2-3 రోజులకొకసారి, పెరిగిన చెట్లకు 7-10 రోజుల కొకసారి నీరు పారించాలి. నీటి పళ్ళాల పరిధి చెట్టు పెరుగుతున్న కొలది ఏడాదికి అర్ధ అడుగు చొప్పన పెంచాలి. డ్రిప్ పద్దతి ద్వారా నీరు పారించడం మంచిది.

మొక్కలు నాటుట

జామను సాధారణంగా నేల అంటు పద్ధతి లేదా చెర్బంటు పద్ధతులలో ప్రవర్ధనం చేస్తారు. మొక్కల మధ్య దూరాన్ని నేల లోతు, భూసారం సాగునీటి సౌకర్యం మొదలైన అంశాలను బట్టి నిర్ణయించాలి. మొక్కలను 5x5 మీ. (160 మొక్కలు ఎకరాకు) లేదా 6x6 మీ (112 మొక్కల ఎకరాకు) దూరంలో నాటవచ్చును. 60X60X60 ఘ. సెం.పరిమాణం గల గుంతలను తయారుచేసి, ప్రతి గుంతకు 10-15 కిలోల పశువుల ఎరువు, 500 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కలిపి నింపాలి.

కొమ్మల కత్తిరింపు (ప్రూనింగ్/ట్రేనింగ్)

ప్రధాన కండపై 2-3 అడుగుల ఎత్తు వరకు వచ్చే ప్రక్క కొమ్మలను కత్తిరించి వేయాలి. 60 సెం.మీ లేదా 90 సెం. పైన రెండు లేదా మూడు కొమ్మలను మాత్రమే పెరిగేటట్లు చూడాలి. ప్రతి సంవత్సరం ఎండిన కొమ్మలను, అడ్డంగా పెరిగే కొమ్మలను తీసివేయాలి. గత సంవత్సరం కాపు కాసిన కొమ్మలను నాలుగింట మూడు వంతులు కత్తిరిస్తే ప్రక్క కొమ్మలపై కాపు బాగా వస్తుంది.

ఎరువులు

సిఫార్సు చేసిన ఎరువుల మోతాదు ప్రతి చెట్టుకి

చెట్టు వయస్సు (సం.)

నత్రజని (యూరియా) (గ్రా.)

భాస్వరం (సింగల్ సూపర్ ఫాస్ఫేట్ గ్రా.)

పొటాష్ (మ్యూరేట్ ఆఫ్ పొటాష్ గ్రా.)

పశువుల ఎరువు (కిలోలలో)

1.

100 (217)

40 (250)

100 (170)

15

2.

200 (434)

80 (500)

200 (340)

30

3.

300 (651)

120 (750)

300 (510)

45

4.

400 (868)

160 (1000)

400 (680)

60

5 ఆపై

500 (1085)

200 (1250)

500 (850)

100

పోషక లోపాలు

ఆకులు ఎరుపు రంగులోనికి మారినప్పడు భాస్వరం, పొటాష్, జింక్, సేంద్రీయ పదార్ధాల మిశ్రమ లోపాలుగా గుర్తించవచ్చు. రసాయనిక ఎరువులతో పాటు సేంద్రీయ ఎరువులు వేసి ఈ లోపాలను నివారించవచ్చు. 4గ్రా. జింక్ సల్ఫేట్ మరియు 2గ్రా. బోరిక్ యాసిడ్ ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

కాపు నియంత్రణ

ఫిబ్రవరి నుండి మే నెల వరకు నీటిని ఇవ్వడం ఆపాలి. ఇలా చేయడం వలన ఏప్రిల్, మే నెలల్లో చెట్ల ఆకులను రాలుస్తుంది. జూన్ నెలలో పాదులు తీసి, ఎరువులు వేసి నీరు కట్టాలి. నీరు కట్టిన 20-25 రోజులలో కొత్త చిగురు వేస్తుంది. చలి కాలంలో వచ్చే పంట (మృగ్ బహార్) మంచి నాణ్యతతో ఉంటుంది. వర్షాకాలంలో వచ్చే పంట (అంబేబహార్)ను నియంత్రించి చలికాలంలో పంట వచ్చేటట్లు చేయవచ్చును. కాయకోత తరువాత, కాపు నిచ్చిన కొమ్మలను నాల్డింట మూడు వంతులు కత్తిరించాలి. ఇలా చేయడం వలన దిగుబడి పెరుగుతుంది. కాయలను కోసేటప్పడు చిన్న రెమ్మలతో కోయటం మంచిది. ఇలా చేయడం వలన కొత్త రెమ్మలు ఎక్కువగా వచ్చి అధిక దిగుబడి వస్తుంది.

జింకులోపం - సవరణ

ఈనెల మధ్య పత్రహరితం కోల్పోయినట్లు కనపడి, ఆకులు మరీ చిన్నవిగా వున్నప్పడు లీటరు నీటికి 2గ్రా, జింకు సల్ఫేటును కలిపి పిచికారి చేసి లోపాన్ని సరిదిద్దుకోవచ్చు

మెగ్నీషియం లోపం - సవరణ

నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. పంట తొలిదశలో ఆకులు రంగు కోల్పోయి, వాలిపోయి ఉంటాయి. వేసవికాలంలో ఆకులు ఎరుపు రంగుకు మారుతాయి. 2గ్రా.ల మెగ్నీషియం సల్ఫేట్ లీటరు నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేసి ఈ లోపాన్ని సవరించవచ్చు.

అంతరకృషి

వేరు నుండి పెరిగే పిలకలను తీసివేయాలి. కోత తరువాత ఎప్పటికప్పుడు ఎండిన కొమ్మలను, అడ్డ దిడ్డంగా పెరిగే కొమ్మలను కత్తిరించాలి. మామిడిలో తెలిపిన కలుపు నివారణ చర్యలనే చేపట్టి జామలో కూడా కలుపు నివారించవచ్చు.

సస్యరక్షణ

పురుగులు

పండు ఈగ : కాయలు పక్వానికి రాగానే పండు ఈగ ఉధృతి ఎక్కువగా ఉంటుంది. 2 మి.లీ. మిథైల్ యూజినాల్ మరియు 3గ్రా. కార్బోప్యూరాన్ 3జి గుళికలను లీటరు నీటిలో కలిపి తయారు చేసిన ద్రావణాన్ని ఒక్కొక్క ప్లాస్టిక్ సీసాలలో 200 మి.లీ. ద్రావణాన్ని పోసి తోటలో అక్కడక్కడ చెట్ల కొమ్మలకు వేలాడదీయాలి. దీనివలన మగ ఈగలు ఆకర్షించబడి, మందు ద్రావణంలో పడి చనిపోతాయి. 2 మి.లీ. మలాథియాన్ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. తోటల్లో పండు ఈగ ఆశించి రాలి పడిన కాయలను ఏరివేసి నాశనం చేయాలి.

కాండం తొలిచే పరుగు : పురుగు చెట్ల మొదళ్ళలోకి తొలుచుకొని పోయి పరుగు విసర్జించిన పదార్థం రంధ్రాల్లో నిండి ఉంటుంది. రంధ్రాలను శుభ్రపరచి, ఇనుప చువ్వ సహాయంతో పురుగును చంపి తర్వాత రంధ్రాల్లో పెట్రోలు లేదా కిరోసిన్లో తడిపిన దూదిని వుంచి గాని లేదా కార్బోప్యూరాన్ గుళికలను వేసి రంధ్రాలను తడిచిన రేగడి మట్టితో పూడ్చాలి.

తెల్లసుడి దోమ : వీటి పిల్లపురుగులు ఆకులపై తెల్లని దూది వంటి మెత్తని పదార్థంతో కప్పబడి రసం పీలుస్తాయి. ఆశించిన ఆకులు ఎర్రబడి ముడతలు పడతాయి. ఫిబ్రవరిలో చాలా తీవ్రస్థాయికి చేరి నష్టం కలుగజేస్తాయి. దీని నివారణకు గాను రాత్రులందు జిగురు పూసిన పసుపు రంగు డబ్బాలను తెల్లదోమ ఆశించిన చెట్లవద్ద ఉండాలి. ప్రధమ దశలో అయితే ఆశించిన కొమ్మలను కత్తిరించి వేసి వేపనూనె 5 మి.లీ. లీటరు నీటిలో కలిపి పిచికారి చేసి వీటి తీవ్రతను తగ్గించవచ్చు. వీటి ఉధృతి ఎక్కువైనచో ఫాస్పోమిడాన్ లేక డైక్లోరోవాస్ లేక హాస్టాథయాన్ 1 మి.లీ. లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.

పిండినల్లి : చిన్న పెద్ద పరుగులు కొమ్మల చివర మరియు కాయలను ఆశించి రసాన్ని పీలుస్తుంది. కాయలు, ఆకులు రాలిపోతాయి. ఇవి జిగురు పదార్గాన్ని విసర్జించటం వల్ల మసి తెగులు ఆశిస్తుంది. వీటి నివారణకు అక్షింతల పురుగు (క్రిస్టోలిమన్ మెంట్రీజియోరీ) బదనికలను తోటలో విడుదల చేయాలి. ఎసిఫేట్ 1గ్రా. లేదా డైక్లోర్వాస్ 1 మి.లీ. లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.

తెగుళ్ళు

ఎండుతెగులు : వేరు పై తెగులు ప్రారంభమయిన కొద్ది కాలంలో ఆకులు పసుపుపచ్చ రంగుకు మారుతాయి. కొమ్మలు పై నుండి క్రిందికి ఎండుతాయి. ఎక్కువగా చెట్టు క్రింది భాగం కొమ్మలు ఎండుతాయి. ఆకులు వడలిపోయి, రాలిపోతాయి. చెట్టు మోడువారుతుంది. చౌడు భూములు ఈ తెగులుకు అనుకూలం. ఈ తెగులు తీవ్రత తగ్గించేందుకు వర్షపు నీరు మొక్కల మొదళ్ళలో నిల్వకుండా చూడాలి. మొక్కకు క్రిలో చొప్పన సున్నం లేదా జిప్సం, పచ్చిరొట్ట ఎరువు లేదా పశువుల ఎరువును ఎక్కువగా వేసుకోవాలి. మొదళ్ళలో కార్బండజిమ్ 1గ్రాము లీటరు నీటిలో కలిపి  తడపాలి. తెగులుతో ఎండిపోయిన మొక్కలను వేర్లతో సహా పీకి వేయాలి. చెట్టు చుటూ 1-1 1/2 మీటర్ల లోతు వరకు తవ్వి 2 శాతం ఫార్మాలిన్ ద్రావణంతో గుంతను తడపాలి. 14 రోజుల తర్వాత ఎండుటాకులను గుంతలో వేసి మంట పెట్టాలి. ఇలా చేసిన తర్వాత క్రొత్త మొక్కలను నాటుకోవాలి

అంత్రక్నోస్ లేక క్షీణింపు మరియు కాయకుళ్ళు : చెట్టు పై నుండి రెమ్మలు మరియు కొమ్మలు ఎండిపోతాయి. పూర్తిగా మాగిన పండ్లపై గుండ్రటి, గోధుమ రంగు మచ్చలు చిన్న చిన్న గుంతలుగా ఏర్పడుతాయి. ఈ మచ్చల మధ్యభాగం గులాబీ రంగును కలిగి వుంటాయి. ఇలా ఏర్పడిన రెండు, మూడు రోజుల్లో పండ్లు కుళ్ళిపోతాయి. దీని నివారణకు ఎండిన రెమ్మలను, కొమ్మలను కత్తిరించి కుళ్ళిన పండ్లను తొలగించి, కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రాములు లీటరు నీటిలో కలిపి కాయ తయారయ్యే సమయంలో 10-15 రోజుల వ్యవధితో కాయ పూర్తిగా తయారయ్యే వరకు పిచికారి చేయాలి.

జామ సాగుపై మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన చిరునామా: "ప్రిన్సిపల్ సైంటిస్ట్ (హార్టికల్చర్), ఉద్యాన పరిశోధనా స్థానం, సంగారెడ్డి - 501 001, మెదక్ జిల్లా", ఫోన్ నెం : 08455-276451

లేదా

"సీనియర్ సైంటిస్ట్(హార్టికల్చర్), ఉద్యాన పరిశోధనా స్థానం, అనంతరాజుపేట-516 105, కడప జిల్లా", ఫోన్ నెం. 08566-200218

చివరిసారిగా మార్పు చేయబడిన : 12/26/2023



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate