శాస్త్రీయనామం : హీలియాంతస్ ఏన్యూయస్
కుటుంబం : కాంపోజిటే
వేరుశనగ నూనె, నువ్వులనూనె కంటె కూడ ప్రొద్దు తిరుగుడు నూనె శ్రేష్టమైనది. దీని నుండి వనస్పతి కూడ తయారు చేస్తారు. వార్నిష్, సబ్బు, కలప పరిశ్రమల్లో కూడ ఈ నూనెను విస్తారంగా ఉపయోగిస్తున్నారు. నూనె తీసిన తర్వాత వచ్చే పిండి పశువుల దాణాగా ఉపయోగపడుతుంది. సువాసన కలిగిన లినోలిక్ ఆమ్లం ఎక్కువగా ఉండి, లినోలినిక్ ఆమ్లం లేక పోవటం వలన ప్రొద్దుతిరుగుడు పంట చాలా ఆదరణలోకి వచ్చింది. దీని నూనె గుండెపోటుగల వారికి మంచిది. మన రాష్ట్రంలో ఈ పంటను 4.18 లక్షల ఎకరాల్లో పండిస్తూ 3.32 లక్షల టన్నుల దిగుబడి సాదిస్తున్నాం. సగటు ఉత్పాదకత హెక్టారుకు 794 కిలోలు (2008-09).
సూరజ్ ముఖి అనే సూర్యకాంతం భారతదేశంలో బాగా తెలిసిన మొక్క చాలా కాలం నుండి అలంకరణ కోసం దీనిని పెంచుతున్నారు. నూనెగింజల పంటగా వాణిజ్యసాగుకోసందీన్ని భారతదేశంలో 1969లో ప్రవేశ పెట్టారు. అనతి ਤ੦੦੬5 దీని సాగు విస్తీర్ణం దేశ వ్యాప్తంగా పెరిగింది.
ఈ పంటలో వున్న అనుకూల విషయాలు (అంశాలు)
వేరుశెనగ, నువ్వుల నూనె కంటే ఇది శ్రేష్టం. దీని నుండి వనస్పతిని తయారుచేస్తారు. వార్నిష్, సబ్బులు, కలప పరిశ్రమల్లో కూడా ఈ నూనెను విస్తారంగా ఉపయోగిస్తున్నారు. సువాసన కలిగిన అసంతృప్త క్రొవ్వు ఆమ్లం లినోలిక్ ఆమ్లం ఎక్కువగా ఉండి లినోలినిక్ ఆమ్లం తక్కువగా వుండటం వల్ల ప్రొద్దుతిరుగుడు పంటకు చాలా ఆదరణ వచ్చింది. నూనె తీసిన తర్వాత పిండి పశువుల దాణాగా ఉపయోగపడుతుంది. ఈ పంట గింజల పప్పును వేయించుకునితినవచ్చు.
నీటిపారుదల పంటగా సంవత్సరం పొడవునా పండించవచ్చు. ప్రొద్దు తిరుగుడు విత్తేటప్పుడు ముఖ్యమైన గుర్తుంచుకోవలసిన విషయం, పూత దశ మరియు గింజలు తయారయ్యే దశలో పంట దీర్ఘకాలం వరాలతో కాని లేక పగటి ఉష్ణోగ్రత 38"c So33 ఎక్కువ కాని వుండకుండా చూసుకోవాలి. రబీ, వేసవిలో విత్తిన పంట ఖరీఫ్ కంటే ఎక్కువ దిగుబడినిస్తుంది. ఖరీఫ్లో తేలికపాటి నేలల్లోజూన్ రెండవ పక్షం నుండి జూలై మొదటి పక్షం వరకు, బరువు నేలలో ఆగష్టు 2వ పక్షం, రబీలో వర్బాధారంగా సెప్టెంబర్లో,నీటి పారుదల క్రింద అక్టోబర్ 2వ పక్షం - జనవరి మొదటి పక్షం వరకు సత్రకో నీటిపారుదల క్రిందజనవరి రెండవ పక్షం నుండి ఫిబ్రవరి మొదటి పక్షం వరకు విత్తుకోవాలి. ఎర్ర, నల్లరేగడి నేలల్లో వరి తర్వాత ప్రొద్దు తిరుగుడు వేసుకునే పక్షంలో డిసెంబర్ ఆఖరి వారం నుండి జనవరి మొదటి వారం వరకు విత్తుకోవాలి.
విత్తే సమయం కూడా ప్రొద్దు తిరుగుడు నూనె నాణ్యతను పెంచుతుంది. పువ్వు వికసించే మరియు గట్టిపడే సమయంలో సూర్యరశ్మి ఎక్కువ పగలు వుంటే నూనె శాతం పెరుగుతుంది. నూనె నిల్వ సామర్థం ఖరీఫ్ కంటే వేసవిలో ఎక్కువగా ఉంటుంది.
భూమిని 4,5 సార్లు దున్ని మెత్తని దుక్కిచేయాలి. మధ్యస్థ మరియు బరువు భూములైతే బ్లేడుతో 1.2 సార్లు కలియదున్ని ఆ తరువాత బోదెలు వేసి విత్తనం వేసుకోవచ్చు. ఇలా బోదెలు వేయడం వల్ల విత్తనాలు నాటుటకు మరియు 30-35 రోజులు తర్వాత మొగ్గ తొడిగే దశలో ఎరువులు పైపాటుగా వేయడానికి వీలుంటుంది.
ఎకరానికి 2 కిలోల విత్తనం సరిపోతుంది.
నేలలు |
అంతరం (సెం.మీ) |
మొక్కల సాంద్రత (ఎకరాకు) |
1. తేలిక నేలలు మధ్యస్ధ నేలలు (పొట్టి పంగడాలు తక్కువ కాలపరిమితి గల రకాలు) |
45*30 |
29,600 |
2. బరువు నేలలు (పొడవుగా పెరిగే రకాలు, దిర్గకాల పరిమితి రకాలు, సంకరాలు) |
60*30 |
22,000 |
విత్తనాన్ని 2 నుంచి 3 సెం.మీ లోతులో నాటవలసి వుంటుంది. మొక్కలు మొలకెత్తిన 7 నుంచి 10 రోజుల తర్వాత విధిగా కుదురుకు 1 మొక్క వుండేట్లు పైరును పలుచన చేయాలి.
విత్తనాలను విత్తే ముందు 14 గం! నీటిలో నానబెట్టినీడలో ఆరబెట్టివితే ముందు 2-3 గ్రాI ధైరమ్/కాప్టాన్ తో విత్తన శుద్ధి చేయాలి. నెక్రోసిస్ తీవ్రంగా వున్న ప్రాంతాల్లో కిలో విత్తనానికి 5 గ్రాII ఇమిడాక్టోఫ్రిడ్ కలిపి విత్తన శుద్ధి చేయాలి.
ఎరువులు (ఎకరాకు కిలోల్లో)
ఎకరాకు 3 టన్నుల పశువుల ఎరువును వితే 2-3 వారాల ముందు వేయాలి.
పంటపరిస్థితి / నేలలు |
నత్రజని |
భాస్వరం |
పొటాష్ |
||
రకాలు |
హైబ్రిడ్స్ |
రకాలు |
హైబ్రిడ్స్ |
రకాలు/ హైబ్రిడ్స్ |
|
వర్బాధారపు పంట |
24 (12+12) |
24 |
12 |
||
నీటిపారుదల పంట నల్లరేగడి నేలలు |
24 (8+8+8) |
30 (10+10+10) |
24 |
36 |
|
ఎర్రనేలలు |
12 (6+6) |
24 (8+8+8) |
గమనిక : నత్రజనిని మొదటి దఫా విత్తేటప్పుడు 50%, రెండవ దఫా విత్తిన 30 రోజులకు మొగ్గతొడిగే దశలో 25%, మూడవ దఫా విత్తిన 55-60 రోజులకు పూవు వికసించే దశలో 25% వేసుకోవాలి. మొత్తం భాస్వరం, పొటాష్ మాత్రం ఆఖరి దుక్కిలో వేసుకోవాలి.
2 గ్రా. బోరాక్స్ లీటరు నీటికి.చొప్పన కలిపి పైరు పూతదశలో ఆకర్షక పత్రాలు వికసించే దశలో ఎకరాకు 200 లీటర్ల మందు ద్రావణం పిచికారి చేయాలి. దీని వలన గింజలు ఎక్కువగా తయారవుతాయి. మొదట బోరాక్స్ను వేడినీటిలో కరిగించి తగినంత ద్రావణం తయారు చేయాలి లేదా ఆఖరి దుక్కిలో ఎకరాకు 8 కిలోల చొప్పన బోరిక్ ఆమాన్ని వేస్తే అధిక దిగుబడిని పొందవచ్చు.
గంధకం తక్కువగా ఉన్న నేలల్లో ఎకరాకు 10 కిలోల గంధకాన్ని జిప్సం రూపంలో వేసే నూనె శాతం పెరిగి అధిక దిగుబడులు పొందవచ్చు.
ఎకరాకు 8 టన్నుల పశువుల ఎరువు 2-3 వారాల ముందు వేయాలి. (ఎకరాకు కిలోల్లో)
గ్రుడ్లను తొలిదశ గొంగళి పురుగులు గుంపులుగా ఆకుల మీద ఉన్నప్పుడు ఏరి నాశనం చేయాలి. తొలిదశ గొంగళి పురుగులను నివారించేందుకు వేప గింజల ద్రావణాన్ని (5 శాతం) పిచికారి చేయాలి. పెద్ద లార్వాలు ఉన్నఎడల ఎండోసల్ఫాన్ లేదా క్లోరిపైరిఫాస్ 2.0 మి.లీ. లేదా డైక్లోర్వాస్ 1.0 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
దీని లార్వాలు పువ్వుల, గింజల మధ్య చేరి గింజలను తింటూ అధిక నష్టాన్ని కలుగచేస్తాయి. ఉధృతి ఎక్కువగా ఉన్న ఎడల ఎండోసల్ఫాన్ లేదా క్వినాల్ఫాస్ లేదా క్లోరిపైరిఫాస్ 2.0 మి.లీ. లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. లేదా తయోడికార్చ్ 1 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. హెచ్.యన్.పి.వి. అనే వైరస్ను ఎకరాకు 200 ఎల్.ఇ. పిచికారి చేసి కూడా ఈ పురుగును నివారించవచ్చు.
పై తెగుళ్ళ నివారణకు పంట అవశేషాలు మరియు శిలీంధ్రానికి ఆశ్రయ మిచ్చే ఇతర కలుపు మొక్కల నిర్మూలన, ధైరమ్ లేక కాష్ట్రాన్ 3 గ్రా. కిలో విత్తనానికి కలిపి విత్తనశుద్ధి మరియు మాంకోజెబ్ 3 గ్రా. లేక జినెబ్ 2 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
నివారణ : వేసవి దుక్కలు చేయాలి. పంట చుటూ నాలుగు సాళ్లు జొన్న,సజ్ఞమొక్కజొన్న పంట వేయాలి. కిలో విత్తనానికి 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్తో విత్తనశుద్ధి చేసి తొలిదశలో తామరపురుగులు ఆశించకుండా జాగ్రత్త పడవచ్చు. గట్ల మీద ఉండే పార్టీనియం (వయ్యారి భామ) మొక్కలను, ఈ తెగులు సోకిన పంట మొక్కలను పూదశ రాకముందే పీకి వేసి నాశనం చేయాలి. మెటాసిస్టాక్స్ 2 మి.లీ. లీటరు నీటిలో లేదా ఇమిడాక్లోప్రిడ్ 4 మి.లీ. 10 లీ. నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో మూడు, నాలుగు సార్లు పిచికారి చేసి ఈ తెగులు వ్యాప్తిని అరికట్టవచ్చు.
మొత్తం భాస్వరం, పొటాష్ను ఆఖరి దుక్మిలో వేసుకోవాలి. నత్రజని మొదటి దఫా విత్తే ముందు 50%, రెండవ దఫా విత్తిన తర్వాత 30 రోజుల తర్వాత మొగ్గ తొడిగే దశలో 25%, 3వ దఫా విత్తిన 50-60 రోజుల తర్వాత పువ్వువికసించే దశలో 25% వేసుకోవాలి.
2 గ్రా. బోరాల్స్ లీటరు నీటికి చొప్పున కలిపి పైరుపూత దశలో ఆకర్షక్రపత్రాలు వికసించే దశలో ఎకరాకు 200లీటర్ల మందు ద్రావణం పిచికారి చేయాలి. దీని వల్ల గింజలు ఎక్కువగా తయారవుతాయి.
మొదట బోరాక్స్ను వేడి నీటిలో కరిగించి తగినంత ద్రావణం చేసుకోవాలి. లేదా ఆఖరి దుక్కిలో 8 కిలోల బోరిక్ ఆమ్లం వేస్తే అధిక దిగుబడి సాధించవచ్చు.
గంధకం తక్కువగా వున్న నేలల్లో ఎకరాకు 10 కిలోల గంధకాన్ని జిప్సమ్ రూపంలో వేస్తే నూనెశాతం పెరిగి అధిక దిగుబడి సాధించవచ్చు.
వాతావరణ పరిస్థితులు
పంటపూత దశలో అధిక వర్షపాతం, అధిక చలి, మంచు మరియు అధిక ఉష్ణోగ్రత (40 డిగ్రీల సెంటిగ్రేడు కంటే ఎక్కువ) వున్నపుడు గింజ కట్టడానికి సరిపోయినంత పుప్పొడి ఏర్పడక తాలు గింజలు ఏర్పడతాయి. ఈ సమస్యను అధిగమించడానికి పంటను సరైన సమయంలో విత్తుకోవాలి.
పూవులోని గింజల మధ్య ఆహారానికి పోటీ • పూవులో ముందుగా ఏర్పడిన బయటవైపు గింజలు ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వలన పూవు మధ్యభాగంలో గింజలు ఏర్పడవు. దీనినే "సెంట్రల్ స్టెరిలిటి" అని అంటారు. పెద్ద వూపులున్న రాకల్లో ఈ విధంగా గింజకట్టకపోవడం 20 నుండి 40 శాతం దాకా వుంటుంది. అందువలన పఉ్వ సైజు మధ్యస్థంగా వుండే రకాలను ఎంపిక చేసుకోవాలి.
అధిక మొక్కల సాంద్రత
మొక్కల సాంద్రత అధికంగా వున్నపుడు అతి చిన్న పూలు ఏర్పడడం, ఏర్పడిన పూలలో తాలు గింజలు రావడం జరగుతుంది. నీటి పారుదల క్రింద ఎకరానికి 2 కిలోలు సరిపోతుంది. విత్తే దూరము 45X30 సెం.మీ, తేలిక నేలల్లో 45 సెం.మీ, నల్లరేగడి నేలల్లో 60x80 సెం.మీ.(ఎకరానికి 22,000) మొక్కలు వుండేలా విత్తుకోవాలి.
పోషకాల లోపం
గింజలు ఏర్పడినా గింజల్లో పప్పు అభివృద్ధి సరిగా జరుగక తాలు గింజలు ఏర్పడతాయి. దీని నివారణకు భూసార పరీక్ష ఫలితాలను బట్టి పోషకాలను సరైన మోతాదులో అందించాలి. గింజలో నూనె శాతం మరియు గింజల బరువు పెరగటానికి తప్పనిసరిగా ఎకరానికి 10-20 కేజీల గంధకం వాడాలి. అలాగే బోరాన్ సూక్ష్మపోషక లోపం వలన గింజ కట్టడం తగ్గి తాలు గింజలు రావడానికి ఆస్కారం వుంటుంది. అందుకుగాను, 2 గ్రాముల బోరాక్స్ బోరాక్స్ పొడిని లీటరు నీటికి చొప్పున కలిపి పైరు పూత దశలో ఆకర్షక పత్రాలు తెరుచుకున్నపుడు ఎకరానికి 200 లీటర్ల మోతాదులో మందు ద్రావణం పిచికారీ చేయాలి. దీనివల్ల పుప్పొడి ఎక్కువగా ఉత్పత్తి తఅయి. ఎక్కువ సమయం సజీవంగా వుండి పరపరాగ సంపర్కం బాగా జరుగుట వలన గింజ బాగా కడుతుంది.
నీటిఎద్దడి
ప్రొద్దు తిరుగుడులో మొగ్గతొడిగే దశ, పూవు వికసించేదశ మరియు గింజకట్టేదశలను కీలకదశలుగా పరిగణిస్తాము. ప్రధానంగా ఈ దశల్లో నీటి ఎద్దడి ఏర్పడటంవల్ల తాలు గింజలు ఏర్పడతాయి. కాబట్టి ఈ కీలక దశల్లో తప్పక నీటి తదులివ్వాలి. అదే సమయంలో పొలంలో నీరు నిల్వవుండకుండా చూడాలి.
కలుపు సమస్య
కలుపు మొక్కలు వలన మొక్కలు దృఢంగా ఎదగక, గింజలుసరిగా తోడుకోకపోవటం వలన కూడా తాలు సమస్య వస్తుంది. అందువలన విత్తిన మొదటి 45 రోజుల వరకు పొలంలో కలుపులేకుండా చూడాలి.
చీడపీడల ఉధృతి
చీడ పీడల వలన కిరణజన్యసంయోగక్రియ జరగడానికి అవసరమైన పరిమాణంలో పత్రహరితం లేక గింజ సరిగా కట్టకపోవడం, తాలు గిజంలు ఏర్పడటం జరుగుతుంది. అందువలన సమగ్ర సస్యరక్షణ పద్ధతులు చేపట్టి చీడపీడల ఉధృతిని నియంత్రించాలి.
పరపరాగసంపర్కలక్షణం
ప్రొద్దుతిరుగుడు పంటలో గింజకట్టడం పరపరాగసంపర్కం వలన జరగుతుంది. ఈ పనిని తేనెటీగల వంటి కీటకాలు సమర్థవంతంగా నిర్వహిస్తాయి. పుష్పించే దశలో తేనెటీగల సంఖ్య తక్కువగా వున్నపుడు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు మొత్తటి గుడ్డతో పూలను సున్నితంగా రుదుట వలన పరపరాగ సంపర్కం బాగా జరిగి గింజ బాగా కడుతుంది.
నీటి యాజమాన్యం
ఎర్ర నేలల్లో 6-10 రోజుల వ్యవధిలో, నల్లరేగడి నేలల్లో 15-20 రోజుల్లో నీటి తడులు పెట్టాలి. వివిధ నేలల్లో నీటి తడుల సంఖ్య క్రింది విధంగా పాటించాలి.
మొగ్గతొడుగు దశ, పువ్వు వికసించే దశ, గింజకట్టు దశ,
మొగ్గ తొడిగే దశ, పువ్వు వికసించే దశ, గింజ కట్టదశ
విత్తిన 30-40 రోజులలో కలుపు లేకుండా చూడాలి. విత్తేముందు ఫ్లూక్లోరాలిన్ 45% ఎకరాకు లీటరు చొప్పున పిచికారీ చేసి భూమిలో కలియదున్నాలి. పెండిమిధాలిన్ 30% 1 లీటరు నటికి అలక్లోర్ 50% 1.5 లీటర్లు చొప్పున ఏదోఒక దానిని విత్తిన వెంటనే కాని తర్వాత రోజునకాని పిచికారీ చేయాలి.
విత్తిన 20-25 రోజులకు గోర్రుతో అంతరక్రుషి చేయాలి.
ప్రొద్దు తిరుగుడు పువ్వు వెనుక భాగం నిమ్మ పసుపు పచ్చ రంగుకు మారిన తర్వాత కోసి 2-3 రోజ్లులు ఆరనివ్వాలి. కర్రలతో కొట్టిగాని, ఒలచిగాని గింజలను వేరుచేయాలి. విద్యుత్ ద్వారా నడిచే నూర్పిడి యంత్రం ఉపయోగంచి విత్తనాలను వేరుచేయవచ్చు. గింజల్లో 9-10% వచ్చేవరకు ఎండబెట్టాలి.
ముఖ్యంగా రామచిలుకల బెడద ఎక్కువ కావున ఎక్కువ కమతాలలో వేయాలి. మెరుపు రిబ్బీన్లను పైరు పైన అడుగు ఎత్తున సూర్యరశ్మి పడేటట్లు దక్షణ, ఉత్తరం దిశగా కట్టాలి. శబ్దం చేయడం ద్వారా కాని, దిష్టిబొమ్మలు పెట్టడం ద్వారా పక్షలను పారద్రోలాలి.
ఎకరాకు సుమారుగా వర్షాధారంగా 400 కిలోలు, నిశ్చత వర్షపాతం కింద 400-600 కిలోలు, నీటి పారుదల క్రింద దిగుబడికి దోహదం చేసే అంశాలు
చ.మీకు మొక్కల సంఖ్య, పుష్పాల సంఖ్య, ఒక్కొక్క పుష్పంలో గింజల సంఖ్య, 1000 గింజల బరువు
పుష్చించిన దశలో వున్నప్పుడు ఉదయం సమయంలో 7-11 గం.లకు రోజు పువ్వులను అరచేతితో సున్నితంగాతాకి పుష్పలకు వేరొక దాని పుప్పొడి రాయడం లాభదాయకరం. అరచేతికి మెత్తటి గుడ్డకట్టుకుని కూడా చేయవచ్చు. ఈ పని సుమారు 10 రోజుల పాటు చేయాలి. పుష్చించే సమయంలో 5-6 సార్లు చేతి పరాగ సంపర్కంవల్ల ప్రొద్దు తిరుగుడు దిగుబడి 20-25% పెంచుతుందని కనుకొన్నారు. అసమాన వాతావరణ పరిస్దితుల్లో, తుమ్మెదల చర్యతక్కువగా వుండే పరిస్దితుల్లో చేతి పరాగ సంపర్కం తప్పనిసరి.
చిరుధాన్యాలు (కొర్ర, జొన్న, సజ్జ), అపరాలు (కంది, శనగ, మినుము), వేరుశనగ మొదలగు పంటలతో పంటమార్పిడి చేయవచ్చు.
పైరులను అంతర పంటలుగా పండించవచ్చు.
ప్రొద్దు తిరుగుడునువేరుశెనగ, కందితో వేసినపుడు 36% మరియు 24% అదనపు ఆదాయం వస్తుంది. ప్రొద్దు తిరుగుడును కందితో 4:2 నిష్చత్తిలో వేసినట్లయితే 2:4 కంటే ఎక్కువ దిగుబడి వస్తుందని కనుగొన్నారు.
ప్రొద్దుతిరుగుడు రకాల గునగుణాలు |
|||
రకం |
పంటకాలం (రోజుల్లో) |
దిగుబడి (కి/ఎకరాకు) వర్షాధారంగా |
గుణగణాలు |
రకాలు |
|
|
|
మోర్డన్
డి. ఆర్. యస్.ఎఫ్-108 |
80-85
90-95 |
400
500 |
మొక్కలు 90-120 సెం.మీ ఎత్తు పెరుగుతాయి. నూనె శాతం 35-38 దేశంలోని అన్ని రాష్ట్రాలో పండించుకోతగిన తక్కువ కాలపరిమితి గల రకం. మిశ్రమ పంటగా వివిధ పంటల సరళిలో పండించేందుకు అనుకూలం.
నునేశాతం 40. |
సంకరాలు |
|||
కె.బి.యస్. హెచ్-1
యస్.డి.యస్.హెచ్-1 |
90
80-85 |
600
600 |
మొక్కలు 130-150 సెం.మి ఎత్తు పెరుగుతాయి. నూనె శాతం 41-43. నూనె శాతం 40-42 మిగిలిన అన్ని సంకరరకాల కన్నా ముందుగ కోత కొస్తుంది. అధిక నూనె శాతం, అధిక దిగుబడి నిచ్చేరకం. |
డి.ఆర్.ఎస్.హెచ్-1 |
95 |
650 |
అధిక నూనె శాతం, అధిక దిగుబడి నిచ్చేరకం. |
ఇతరసంకరాలు: టిఎన్.వి.యు.యస్. యు.ఎఫ్-7 ఇతరసంకరాలు – ఏ.వి.యస్. హెచ్-11 బి.యస్.కాచ్-1 యస్.ఎఫ్.హెచ్-8,17 |
ప్రొద్దుతిరుగుడు పువ్వు వెనుక భాగం నిమ్మపచ్చరంగుకి మారిన తర్వాత పువ్వులను కోసి వాటిని 2-3 రోజులపాటు ఆరనివ్వాలి. కర్రలతో కొట్టి కాని, నలిచిగాని విత్తనాన్ని వేరుచేయాలి. విద్యుత్ ద్వారా నడిచే నూర్పిడి యంత్రాలనుపయోగించి విత్తనాన్ని వేరుచేసుకోవచ్చు. గింజలో తేమ 9-10% వచ్చే వరకు ఎండబెట్టాలి.
ప్రొద్దుతిరుగుడు సాగుపై మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన చిరునామా : ప్రధాన శాస్త్రవేత్త (నూనె గింజలు), ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, పాలెం-509215, మహాబూబ్ నగర్ జిల్లా. ఫోన్ నెం. : 08540-228646, 94412 10514
చివరిసారిగా మార్పు చేయబడిన : 7/20/2020