ఇటీవల కాలంలో దుక్కి దున్నకుండానే పంటల సాగు (జీరో టిల్జేజి) పద్ధతి రైతుల్లో చాలా ప్రాచుర్యం పొందుతోంది. ఈ పద్ధతిలో తొలకరి వరిచేను కోసిన తరువాత పొలంలో వరి కొయ్యకాల్లలో దుక్కి దున్నకుండానే పదును చూసుకొని మొక్కజొన్న విత్తనాలు నేరుగా విత్తుకోవాలి. ఈ విధానంలో రైతులకు దుక్కి దున్నే ఖర్చులు ఆదా అవుతాయి. నెలరోజుల పంటకాలం కలసి వస్తుంది.
వరి మాగాణుల్లో మొక్కజొన్న సాగు చేసుకునేటప్పుడు ఈ క్రింద పేర్కొనబడిన అంశాలను పాటించాలి.
మిగతా యాజమాన్య పద్ధతులు ముఖ్యంగా ఎరువులు, సస్యరక్షణ మొదలగునవి సాధారణ రబీ మొక్కజొన్న పంటకు ఆచరించిట్లుగానే వరి మాగాణుల్లో సాగు చేసిన మొక్కజోన్నకు కూడా పాటించాలి.
పంట కోతకు వచ్చినప్పుడు బట్టల పై పొరలు ఎండినట్లు కనిపిస్తాయి. బాగా ఎండిన కండెలు మొక్కల పై క్రింది కి వేలాడుతూ కనిపిస్తాయి మరియు కండెలలోని గింజలను వేలి గోరుతో నొక్కినప్పుడు చాలా గట్టిగా ఉండి నొక్కులు ఏర్పడవు. అంతేకాకుండా, బుట్టలోని గింజలను తీసి అడుగుభాగం పరిక్షించినచో నల్లని మచ్చలు ఉండడం గమనించవచ్చు.
ఈ దశోలో గింజలలో సుమారుగా 25 శాతం తేమ ఉంటుంది. కండెలను మొక్కల నుండి వేరుచేసి గింజలలో తేమ శాతం 15 వచ్చే వరకు 3-4 రోజులు ఎండలో బాగా ఆరబెట్టాలి. పేలాల రకం వేసినపుడు గింజలలో 30-35% తేమ ఉన్న ప్పుడే కండెలు కోసి నీడలో ఆరబెట్టాలి. ఎండలో అరబెడితే సరియైన పేలాలుగా మారక గింజ పగిలి నాణ్యత తగ్గుతుంది. తీపిరకం వేసినప్పుడు గింజ పలుపోసుకునే దశలోనే కండెలు కోసుకోవాలి. బేబీ కార్న్ కొరకు పిచు వచ్చిన 1 లేదా 2వ రోజున కోసుకోవాలి. ఆలస్యం చేసినట్లయితే బెండులో పిచు శాతం పెరిగి నాణ్యత తగ్గుతుంది. మొక్కజొన్నను పశువుల మెత కొరకు వేసినప్పుడు 50% పుతదశలో పైరును కోయాలి. కంకులను నూర్పిడి చేయుటకు (గింజలను బుట్ట నుండి వేరు చేయుట) ట్రాక్టరుతో లేదా కరెంటుతో నడుచు నూర్పిడి యుంత్రాలను ఉపయోగించవచ్చు. నూర్పిడి తరువాత గింజలను 2-3 రోజులు శాతం తేమ గల ప్రాంతాలలో నిలువ చేయాలి. దినితోబాటు నిల్వలో తెమగాని, ఎలుకలు, పురుగులు, శిలింధ్రాలు మొదలగునవి రాకుండా ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
మొక్కజొన్న సాగుపై మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన చిరునామా ప్రధాన శాస్త్రవేత్త (చిరుధాన్యాలు), వ్యవసాయ పరిశోధనా స్ధానం, పెరుమాళ్ళపల్లి – 517502చిత్తూరు జల్లా, ఫోన్ నెం. 0877-2276240, సెల్ : 9989625227
చివరిసారిగా మార్పు చేయబడిన : 1/22/2020