పంటలలో అధిక దిగుబడులు సాధించడానికి నాణ్యమైన మంచి భూములు చాలా అవసరం. ఒక వేళ భూములలో భౌతిక లేదా రసాయన సమస్యలు ఉన్నట్లయితే ఆ భూములలో నాణ్యమైన పంటలు, సుస్థిర అధిక దిగుబడులను సాధించలేం. మన దేశంలో 5 దాదాపు 85 మిలియన్ హెక్టార్ల భూములు భౌతిక సమస్యలను, 50 మిలియన్ హెక్టార్ల భూమి రసాయన సమస్యలను ఎదురుకుంటున్నాయి. పెరుగుతున్నది జనాభాకు సరిపడ ఆహార పదార్థాలను ఉత్పత్తి చేయడానికి ఈ సమస్యాత్మక భూములను సరైన పద్ధతులలో సాగుచేయడం వలన సరైన యాజమాన్య పద్దతులు పాటించడం వలన సుస్థిర అధిక దిగుబడులను సాధించవచ్చు.
వివిధ భూ సమస్యలు సుస్థిర అధికోత్పత్తిని సాధించకుండా ఆటంక పరుస్తున్నాయి. ఈ క్రింద సూచించిన యాజమాన్య పద్దతులు ద్వారా వీటిని అధిగమించి సుస్థిరమైన అధిక దిగుబడులను సాధించవచ్చు.
నేల లోతు తక్కువగా ఉండటం (30 సెం.మీ. కన్నా తక్కువ) వలన వేరు పెరుగుదల తగ్గడమే కాక నీరు మరియు భూసారం పరిమితంగా ఉండటంతో పంట దిగుబడి తగ్గుతుంది. ఈ నేలలు ఉత్పాదక శక్తిని పెంచటానికి వాలుకు అడ్డంగా బోదెలు, కాలువలు నాగళ్ళతో లేదా “బండ్ఫార్మల్ తో” లేదా పారలతో గాని నిర్మించి పైరును బోదెల మీద నాటాలి. ఒక మీటరు దూరంలో లోతుగా మూడు సంవత్సరాల కొకసారి దున్నాలి. వీటితో బాటు ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువు లేదా ఇతర సేంద్రీయ ఎరువులను వేసి దిగుబడిని పెంచవచ్చు.
వీటిలో ఇసుక శతం అధికంగా ఉండటంతో పటు బంక మన్ను 20 శాతం కన్నా తక్కువగా ఉంటుంది. ఈ నెలల్లో దిగుబడిని పెంచటానికి ఎకరాకు 40 టన్నుల చేదు స్వభావం లేని చెరువు మట్టిని వేసవిలో వర్షాలకు ముందే తోలాలి. చెరువు మట్టిలోని పెద్ద పిల్లలను పగలగొట్టి చేను మొత్తం పై పలుచగా చల్లి భూమిలో కలియదున్నాలి. ఇసుక నెలల్లో చెరువు మట్టిని తొలినా తరువాత 200 కిలోల బరువు గల రోలరును 5-6 సార్లు నడిపించాలి. చెరువు మట్టి వేయడటం వలన భూమిలో బంక మన్ను శాతం పెరుగుతుంది. అందువలన భూమికి నీటిని, పోషక పాదార్థిలను నిలుపుకునే శక్తి పెరుగుతుంది. ఏ పంట అవశేపొంతనన ఎకరాకు 20 క్వింటాళ్ల చొప్పున వర్షాకాలానికి ఒక నెల ముందుగానే చేను పై పలచగా చల్లి దంతి కూడా గుంటకతో మట్టిలో కలియదున్ని ఈ సమస్యను అధిగమించవచ్చు. పై వ్యర్థి పదార్దాలను చేనులో తొలినా తర్వాత అలానే గాలికి వదిలి వేయకుండా వెంటనే చేనులో కలియుదున్నడం చాల ముఖ్యం. పశువుల ఎరువులను కూడా దీనికి వాడవచ్చు.
ఈ సమస్యను తేలికగా గుర్తించవచ్చు. ఒక మీటరు వెడల్పు, పోడువు, లోతు గల గొయ్యిని త్రవ్వి చూస్తే భూమిని లోపల గట్టిపొర కనబడుతుంది. గట్టిపోరకు పైన, క్రింద మామూలు మట్టి ఉంటుంది. చిన్నపాటి చాకును గ్రుచ్చి ఈ గడ్డి పొరను నిర్ధారించుకోవచ్చు. గట్టి పోర ఉన్నచోట చాకుకు గట్టిగా తగులుతుంది. ఈ సమస్య నిజామాబాద్ జిల్లాలోని తెఱకు పండించే రేగడి భూముల్లో ఎక్కువగా గమనించబడింది. పెద్ద ట్రాక్టరుతో లోతుగా దున్నే నాగళ్ళతో లేదా సబ్ సాయిలర్ లేదా చిసెల్ నాగళ్ళతో దున్ని ఈ సమస్యను అధిగమించవచ్చు. ఈ లేతు సాళ్ళను 60 సెం.మీ. దూరంలో రెండు వైపులా తోడాలి. వీటితో పాటు ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు లేదా 2 టన్నుల జివ్సం కూడా వేస్తే 10 నుండి 12 శాతం వరకు అధికంగా చెఱకు దిగుబడిని పెంచవచ్చు. ఈ లోతు దుక్కి ప్రభావం 3 సంవత్సరాల వరకు ఉంటుంది.
మాగాణిలో వరి తరువాత ఆరుతడి పైరుకు అనువైన మంచి దుక్కి చేయడం ఒక ప్రధాన సమస్య. వరి తరువాత ఆరుతడి పెంటలు వేయడానికి భూమిని దున్నగానే పెళ్ళలు పెద్దవిగా లేస్తాయి. అందువల్ల వేసిన పైరు (విత్తిన గింజలు) సరిగా మొలకెత్తదు. మొక్కల సాంద్రత తక్కువగా ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో మొదట మామూలుగా నాగళ్ళతో దున్నిన తరువాత ట్రాక్టరుతో నడిచే తిరుగు దంతే (రోటావేటర్) లేదా పళ్ళ దంతెతో తేలికగా దున్నితే పెద్ద పెళ్ళలు పగిలి ఆరుతడి పంటలకు అనువైన దుక్కి వస్తుంది. దీని వల్ల వేరుశనగలో అధిక దిగుబడి సాధించవచ్చు. వరికోసిన తరువాత వేసే ఇతర ఆరుతడి పంటలకు కూడా ఈ పద్దతితో దుక్కిచేయడం ఎంతో శ్రేయస్కరం.
దీనివల్ల నేలకోత అధికంగా ఉండడమే కాకా భూసారం తగ్గటంతో పాటు నేల నీటి నిల్వ శక్తి తగ్గి, బెట్ట పరిస్థితులు వేగంగా వచ్చి పంట దిగుబడి తగ్గుతుంది. ఇది మెట్ట ప్రాంతాల్లో తీవ్ర సమస్య.
మూడు, నాలుగు శాతం వరకు నాలు వున్న నేలల్లో వాలుకు అడ్డంగా కాంటూరు సేద్యం చేయడం ద్వారా ఈ నేలల ఉత్పాదకతను గణనీయంగా పెంచవచ్చు. కాంటూరు సేద్యానికి వీలు కలిగించేందుకు వాలుకు అడ్డంగా ప్రతి మీటరు నిలువుకు (50 నుండి 100 అడుగుల దూరంలో) కాంటూరు కీలైన్లను (ఆధార రేఖలను) ఏర్పాటు చేసుకోవాలి. దీని పై చెట్లను పెంచుకోవచ్చు. రాళ్ళను కూడా పేర్చవచ్చు. పైరు వేసిన 3-4 వారాల తరువాత పెద్ద నాగలితో ప్రతి 3.5 మీటర్ల దూరంలో పర్షపు నీరు సంరక్షణకై వాలుకు అడ్డంగా కాంటూరు కీలైన్లకు సమాంతరంగా లోతు నాగటి సాలు (గొడ్డు సాలు)ను వేయాలి. పైరు వేసిన 25 రోజుల తరువాత పైరు సాలుకు అనుగుణంగా బోదెలు, కాలువల నిర్మాణఁ కూడా వర్షపు నీటి సంరక్షణ మరియు సద్వినియోగానికి ఎంతో దోహదపడుతుంది. వీటి వల్ల మెట్ట పైర్ల దిగుబడి 20 నుండి 25 శాతం వరకు పెరుగుతుంది.
వాలు తీవ్రత అధికంగా ఉన్నప్పుడు కాంటూరు (సమతల) గట్లను నిర్మించాల్సి ఉంటుంది. ఈ గట్లు వరద నీటి వేగాన్ని ఆపి, నేలలో నీటి నిల్వను పెంచుతాయి. ఫలితంగా వర్షాభావ పరిస్థితుల్లో పైరు బెట్టను దీర్ఘకాలం ఎదుర్కొనే వీలుంటుంది. వీటిని ఏర్పాటు చేసుకొనేటప్పుడు ప్రతి మీటరు నిలువుకు ఒక గట్టును నిర్మించాలి.
తేలికపాటి నేలల్లో మరియు వార్షిక వర్షపాతం 600 మి.మీ. కన్నా తక్కువ ఉన్న ప్రాంతాల్లో కంటూరు గట్లు బాగా ఉపయోగపడుతాయి. వార్షిక పప్షపాతం 600 మి.మీ. కన్నా ఎక్కువగా ఉన్న లేదా నేలల నీటిని పీల్చే వేగం తక్కువగా ఉన్న ఎడల వాలు గట్లను నిర్మించవచ్చు.
వట్టివేరు గడ్డి మొక్కలతో జీవగట్లను కూడా కాంటూరు గట్లకు బదులుగా పెంచవచ్చు. ఈ మొక్కలను కాంటూరు గట్ల మాదిరిగానే కాంటూరు మీద వేయాల్సి ఉంటుంది. ప్రతి మీటరు నిలువుకు గట్టును నిర్మించాల్సి ఉంటుంది. బెట్టను తట్టుకొని, పశువులు తినని, తక్కువ నీరు అవసరమయ్యే ఏ ఇతర స్థానిక గడ్డి జాతి మొక్కలను కూడా వట్టివేరుకు బదులుగా జీవగట్టు నిర్మాణానికి ఉపయోగపడవచ్చు.
ప్రత్యూమ్నాయంగా కాంటూరు గట్లకు బదులుగా చిన్న మట్టి గట్టును ఆనుకొని వట్టివేరు మొక్కలను ప్రతి 10-15 సెం.మీ.కు ఒక మొక్కను నాటితే ఇవి కూడా సమర్థవంతంగా పనిచేస్తాయి. దీని వల్ల కాంటూరు గట్ల వల్ల నష్టపోయే భూమి విస్తీర్ణఁ తగ్గుతుంది. ఖర్చు కూడా కలిసివస్తుంది.
అధిక వర్ష సమయంలో వరద నీరు నేల కోత లేకుండా వెళ్ళటానికి కాంటూరు గట్లను కొద్దిగా వాలు ఇచ్చి (గ్రోడుతో) నిర్మించాలి. రేగడి భూముల్లో 0.1 నుండి 0.2 శాతం వాలు సరిరోతుంది. మధ్యస్థ నేలల్లో 0.3 నుండి 0.4 శాతం వాలు ఇవ్వవచ్చు. ఇదే ఇసుక నేలల్లో 0.5 శాతం వరకు వాలు ఇవ్వవచ్చు. కాంటూరు వాలు గట్లు 400 మీటర్ల కన్నా పొడువుగా నిర్మించి వరద నీరు నేలకోత లేకుండా పోవడానికి వాలుకు అనుగుణంగా ప్రత్యేకంగా వరద కాలువలను నిర్మించాల్సి ఉంటుంది. ఈ కాలువలోని నీటిని పొలాల్లోని ఇంకుడు గుంతల్లో (Farm Pond) మళ్ళించాలి. ఈ గుంటలలోని నీటిని పశువులు త్రాగడానికో, చెట్ల పెంపకానికో, బెట్ట సమయంలో క్లిష్ట పరిస్థితుల్లో పైరును రక్షించటానికో వినియోగించవచ్చు.
ఇవి ప్రధానంగా రెండు రకాలు. తెల్ల (పాల)చౌడు మరియు కారు (నల్ల) చౌడు.
ఈ నేలల్లో నీరు ఇంకే స్వభావం తక్కువ కాబట్టి మొదటగా పొలాన్ని చిన్న చిన్న మళ్ళుగా చేసుకొని, మళ్ళ నుండి మురుగు నీరు పోయేలా లోతైన మురుగు నీటి కాలువను ఏర్పాటు చేలుకోవాలి. ఈ నేలలను బాగు చేయటానికి “జిప్సంను” వేయాల్సి ఉంటుంది. జిప్సం మోతాదును భూసార పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. భూసార పరీక్షా ఫలితాలు అందుబాటులో లేకపోతే ఎకరాకు సుమారుగా 1.2 నుండి 1.6 టన్నుల జిప్సంను వేయవచ్చు. జిప్సంను నేలపై చల్లి మట్టిలో కలిసేలా పైపైనా దంతెతో లేదా గొర్రుతో దున్నాలి. మొత్తం జిప్సంను ఒకే దఫాగా వేయాలి. పలు దఫాల్లో వేయకూడదు. తరువాత నీటిని నిల్వ కట్టి నేలలో ఇంకేలా చేయాలి. ఒక వారం రోజులు వరుసగా నీటిని మడిలో విల్వ ఉంచాలి. రేగళ్ళలో తరుచుగా తేలికపాటి తడులను ఇవాల్సి ఉంటుంది.
ఒకవేళ నేలలో సున్నం అధికంగా ఉంటే, జిప్సంకీ ప్రత్యూమ్నాయంగా ఐరన్ పైరైట్ ను లేదా పొడి చేసిన గంధకాన్ని వాడవచ్చు. పైరైట్ పొడి 5 మి.మీ. కన్నా తక్కువ సూక్ష్మత్వం కలిగి ఉండాలి. పైరైట్ ను నేలమీద చల్లి మట్టిలో కలిసేలా దంతెతో తేలికగా దున్నాలి. మట్టి తేమగా ఉండేటట్లు తేలికపాటి తడిపెట్టి వారం రోజులు గాలికి వదిలివేయాలి. తరువాత మడిలో నీరుపెట్టి ఇంకేలా చేయాలి.
చెఱకు ఫ్యాక్టరీలలో వ్యర్ధ పదార్ధంగా మిగిలే ప్రెస్మడ్ ను కూడా జిప్సంకు బదులుగా వాడవచ్చు. ఎకరాకు 1.2 నుండి 1.6 టన్నులు వేయాలి. తెల్లచైడు ఒక మోస్తారుగా ఉంటే, జీలుగను పెంచి మట్టిలో కలియదున్నితే చౌడు ప్రభావము తగ్గుతుంది. ఇటువంటి నేలల్లో ఒక బోదె విడిచి రెండవ బోదెలో సాగునీటిని కట్టి పైరును నీరు కట్టిన సాలులో వేసి దిగుబడిని పెంచవచ్చు. తప్పని సరిగా జీలుగా, వరి, రాగి, పంటల క్రమాన్ని 2-3 సం. వరకు పాటించాలి.
ఈ నేలల్లో ఉదజని సూచిక 7 కన్నా తక్కువగా ఉంటుంది. ఇవి సాధారణంగా అధిక వర్షపాతం గల ప్రాంతాల్లో ఏర్పడతాయి. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, మెదక్ జిల్లాల్లోని జహిరాబాద్ ప్రాంతాలలో విస్తరించి ఉన్నాయి. పైకి చుడటానికి ఈ నెలలు తేలికగా ఎర్రగా అగుపడతాయి. ఈ నేలలను బాగు చేయటానికి సున్నం లేటా ఉక్కు పారిశ్రిమలో వ్యర్డిపదార్థంగా మిగిలే బేసిక్ష్లగ్ మరియు ప్రేసెండ్ లను వాడవచ్చు. భూసార పరీక్షా ఆధారంగా ఎంత సున్నం వేయాలో తెలుసుకోవచ్చు భూసార పరీక్షా ఫలితం అందుబాటులో లేనప్పుడు ఎకరాకు 2 నుండి 3 కేఎంటెల్ల పొడి చేసిన సున్నాన్ని సళ్ళలో వేస్తె సరిపోతుంది. మొదట 2-3 సంవత్సరాలు సున్నం బాగా అవసరమయ్యా లెగ్యుమ్ జాతి పైర్లను, కూరగాయలను పండించవచ్చు. వేసిన సున్నం ప్రభావం 5 సంవత్సరాల వరకు వుంటుంది. అందువల్ల ఆ తరువాత సంవత్సరాల్లో సున్నం అంతగా అవసరం లేని ఇతర పైర్లను వేయవచ్చు.
మన రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో సున్నం అధికంగా ఉన్న నెలలు విస్తారంగా ఉన్నాయి. ఈ నేలలను గుర్తించటం చాల తేలిక. గలదు లేదా ప్రత్యేక పోరా రూపంలో ఉన్న సున్నాన్ని తేలికగా కాంతితో గుర్తించవచ్చు. కంటికి కనిపించని రూపంలో వున్నా సున్నాన్ని గుర్తించటానికి 1:4 నిషాత్తిలో హెటెడ్రోక్లోరిక్ ఆమ్లాలో, నీరు కలిపి ఒక చిక్క విశ్రమ ద్రావనాన్ని మట్టిపై వేస్తె బుస బుసమనే నురగ వస్తే, సున్నం అధికంగా గల నేలగ గుర్తించవచ్చు. ఈ నెలలో భాస్వరం ఎరువు వినియగా సామర్థ్యం అతి తక్కువగా ఉండేటిమి కాకా సుక్ష్మ్యా పోషక పదార్డయితేనా జింకు, ఇనుము, మాంగనీస్, రాగి లోపాలు సర్వసామాన్యంగా కనిపిస్తాయి.
ఈ సూక్ష్మ పోషకాలు ఎరువుల రూపంలో వేస్తే అంత సమర్థవంతంగా పైరులో లోపాలను సరిదిద్దలేవు. ఫలితంగా ఈ నేలల్లో వేసే పంటల దిగుబడి మరియు నాణ్యత బాగా దెబ్బతింటాయి. కనుక పైరుపై పిచికారి చేయటం మంచిది. ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువును వేసి పంట నఫ్టాన్ని తగ్గించవచ్చు. ఈ నేలల్లో జనుము మరియు జీలుగను పచ్చిరొట్ట పైర్లుగా పెంచి నేలలో కలియదున్ని మురిగేలా వేస్తే సున్నపు దుష్ప్రభావాలు కొంత వరకు తగ్గిపోతాయి.
ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువును వేసి పంట నఫ్టాన్ని తగ్గించవచ్చు. ఈ నేలల్లో జనుము మరియు జీలుగను పచ్చిరొట్ట పైర్లుగా పెంచి నేలలో కలియదున్ని మురిగేలా వేస్తే సున్నపు దుష్ప్రభావాలు కొంత వరకు తగ్గిపోతాయి.
భాస్వరం ఎరువును చేలో వెదజల్లకుండా పైరును సాలుతో విత్తేటప్పుడే గింజ కన్నా 5 సెం.మీ. లోతు మరియు 5 సెం.మీ. పక్కన పడేలా విత్తనం మరియు ఎరువును ఒకేసారి వేసే “సీడ్ కమ్ ఫర్టిలైజర్ డ్రిల్” ద్వారా వేయాలి. ప్రత్యూమ్నాయంగా భాస్వరంతో పటిష్ఠపరచిన పశువుల ఎరువు లేదా కంపోస్టును కూడా వాడి భాస్వరం ఎరువు వినియోగ సామర్థ్యాన్ని పెంచవచ్చు.
ఈ నేలల్లో పెరిగే నిమ్మ, నారింజ తోటల్లో ఇనుము లోపం వల్ల సామాన్యంగా పల్లాకులు కనిపిస్తాయి. ఈ లోపాన్ని సవరించడానికి జనుమును పచ్చిరొట్ట పంటగా పెంచి పాదులో వేసి మురగనిస్తే , పోశకలోపాలు ముఖ్యంగా ఇనుము లోపం తగ్గుతుంది. దీనితో పాటు ప్రతిపాదులో 25 కిలోల పశువుల ఎరువు మరియు 125 గ్రా. అన్నభేదిని వేస్తే, ఇనుము లోపం సవరించబడుతుంది.
ఈ నేలల్లో వేసిన నిమ్మ, నారింజ తోటల్లో బహుళ సూక్ష్మ మరియు ఇతర పోషకాల లోపాలు విస్తారంగా కనబడుతాయి. వీటిని సవరించడానికి జింకు సల్ఫేట్ 5 గ్రా., మాంగనీస్ సల్ఫేట్ 2 గ్రా., మెగ్నీషియం సల్ఫేట్ 2 గ్రా., ఫెర్రస్ సల్ఫేటి 2 గ్రా., బోరాక్స్ 1 గ్రా. సున్నం 6 గ్రా. మరియు యూరియా 10 గ్రా. కలిపిన మిశ్రమాన్ని లీటరు నీటికి కలిపి 2-3 సార్లు పక్షం వ్యవధిలో పిచికారి చేయాలి.
ఆయకట్టు ప్రాంతములో, చెరువుల క్రింద ఎల్లపుడు నీరు నిల్వ ఉండి “లేక” నేలకు గాలి పోకని పరిస్థితులలో వరి పంటకు సల్ఫైడ్ దుష్ప్రభావం కలుగుతుంది. ఇటువంటి పరిస్థితులలో పెరుగుతున్న వరి వేర్లకు తగినంత గాలి అందక, నీటి ముంపునకు గురైన మట్టిలో రసాయనిక చర్యలు జరిగి సల్ఫైడ్ అను పదార్ధము వలన వరి పంట వేర్లు కుళ్ళిపోయి(చెడిపోయి) ఆ ప్రాంతములోని పంట మొత్తము పసుపు పచ్చగా మారుతుంది. ఇటువంటి దుష్ప్రభావమునకు లోతైన దుబ్బలను వెలుపలికి తీసినప్పుడు వాటి వేర్లు కుదించుకుపోయి, కుళ్ళిపోయి నలుపు నుండి నీలి రంగు కలిగి కుళ్ళిన కోడి గ్రుడ్ల వాసనను కలిగి ఉండును. ఈ దుష్ప్రభావమునకు లోనయిన పొలం ప్రాంతంలో అడుగు పెట్టినప్పుడు నీటి బుడగలు పైకి వస్తూ దుర్గంధము వచ్చును.
ఇటువంటి నేలలు జోగులాంబ గద్వాల్, వనపర్తి, నిజామాబాద్ జిల్లాలలో గమనించడము జరిగినది. ఈ సల్ఫేట్ దుష్ప్రభావం చాలా కాలము నీటి ముంపునకు గురైన మరియు మురుగు కాలువలు తీయుటకు సౌకర్యం లేని చోట్ల వచ్చుచుండును. కావున ఇటువంటి పరిస్థితిని ప్రతి సంవత్సరం పరిస్థితులను బట్టి గమనించకపోవచ్చును.
సల్ఫైడ్ ప్రభావమునకు గురైన పోలంలోని పలు ప్రాంతాలలోని దుబ్బులు పూర్తిగా కోలుకోనప్పుడు పంట దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. ఈ సల్ఫైడా ప్రభావం కలిగిన తరువాత సవరించడము కన్నా, అప్రమత్తంగా ఉండి సరైన నీటి యాజమాన్యం మరియు మురుగు కాలువల సాకర్యాన్ని అందిస్తూ పూర్తిగా సల్ఫైడ్ దుష్ప్రభాములు కలుగనీయకుండా చూసుకోవలెను. ఒక వేళ సల్ఫైడ్ దుష్ప్రభావం గమనించినట్టైతే వెంటనే నీటిని తీసివేసి ఒకటి రెండు రోజులు దుబ్బల చుట్టూ మరియు ఆ ప్రాంతములోని నేలకు గాలి తగిలేటట్లు చర్యలు తీసుకొనవలెను. దీనికి తోడుగా త్వరగా తేలికపాటి నీరును మాత్రమే వరి పోలంకు అందచేయాలి.
ఈ నేలలో నీటిలో కరిగే లవణాల శాతం ఎక్కువగా ఉంటుంది. కొన్ని సార్లు వేసవి కాలంలో ఈ లవణాలు నేల ఉపరితలం పైన పేరుకుపోయి కనబడతాయి. లవణాలు అధికంగా ఉండడం వలన మొక్కలు పెరుగుదల సన్నగిల్లి దిగుబడులు తగ్గుతాయి.
ఈ నేలల్లో సోడియం (ఇ. ఎస్. పి.) దిగా 15 శాతం కన్నా ఎక్కువగా ఉండి, ఉపరితలం నల్లగాచి లేదా బూడిద రంగులో కనబడతాయి. ఈ నేలలకు నీటిని ఇంకించుకొనే సామర్థ్యం తక్కువగా ఉండడం వల్ల కొద్ది పాటి వర్గానికే పొలంలో నీళ్ళు నిల్వ ఉండి పంటల పెరుగుదలను తగ్గిస్తాయి. ఈ నేలలు సేద్యానికి అనుకూలం కాదు. ఎండిన తర్వాత ఇవి చాలా గట్టిగా మారతాయి.
ఈ నేలల్లో నీటిని ఇంకించుకొనే శక్తి తక్కువగా ఉంటుంది. దీనికి కారణం నేలలో అధిక బంక ఉండడం లేదా బల్క్ డెన్సిటీ అధికంగా ఉండడం వల్ల ఈ సమస్య రావచ్చు. నీరు నేలపై నిల్వ ఉండడం, నేల చాలా గట్టిగా ఉండడం పంటల పెరుగుదలకు ఆటంకాలు.
ఈ నేలలు మామూలుగా క్షార స్వభావం కలిగి ఉంటాయి. కొన్ని సార్లు ఆమ్ల స్వభావం కలిగి ఉంటాయి. ఈ నేలల్లో నీటిని నిల్వ ఉంచుకొనే శక్తి తక్కువగా ఉంటుంది. నేలలు గట్టిగా ఉంటాయి.
ఆధారం: వ్యవసాయ పంచాంగం
చివరిసారిగా మార్పు చేయబడిన : 1/7/2021