ఎండిపోయినపూల ఉత్పత్తిలో రెండు ప్రధాన అంచెలున్నాయి.
I.ఎండబెట్టడం
ఎండబెట్టడానికి పూలను కోయడానికిఅనువైన కాలం :
ప్రాతః సమయాల్లో, మొక్కలపైని మంచు బిందువులు ఆరిపోయాక పూలు కోయడం మంచిది. పూలను కత్తిరించాక, వాటిని ఒక చోటకు చేర్చాలి. తర్వాత గుత్తులుగా కట్టి సూర్యరశ్మి తగలకుండా ఉంచాలి.
ఎండలో ఎండబెట్టడం:
ఫ్రీజ్ పద్ధతిలో ఎండబెట్టడం :
గ్లిజరిన్పద్ధతి :
పాలిసెట్పద్ధతి :
సిలికాడ్రైయ్యర్లు
II.రంగువేయడం
పూలు,మొక్కల భాగాలు
పాట్పురీ
ఎండిపోయిన పూలకుండీలు
ఎండిపోయిన పూలతో చేతి పనులు
ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు
పబ్లిక్, ప్రైవేట్, ప్రజల భాగస్వామ్యంలో గ్రామీణ విత్తన కేంద్రాలను ఏర్పాటుచేసి, మేలైన పంటరకాలను రైతుల పొలాల్లో ఉత్పత్తిచేసి, తద్వారా నాణ్యమైన విత్తనాలకొరకు ఉన్న డిమాండు, సరఫరాలమధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించడమే ప్రధాన ఉద్దేశ్యము.రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ కేంద్రాల ద్వారా మేలైన వంగడాలను ఉత్పత్తి చేయడానికి అవసరమైన మూల విత్తనాలను, అనువైన ప్రణాళికలు, విత్తన శుద్ధి వంటి సదుపాయలు నాణ్యతా ప్రమాణాలు ఏర్పాటు చేసి , మహిళా సంఘాలు, సహకార సంఘాలు, అభ్యుదయ రైతులను ప్రోత్సహించడం జరుగుతుంది.
ఇక్రిశాట్ అంతర్జాతీయ ఉష్ణమండల మెట్టపంటల పరిశోధనాకేంద్రం. ఈ సంస్థ లాభాపేక్షరహితంగా, రాజకీయాలకు అతీతంగా, వ్యవసాయ రంగంలో శాస్త్రీయ పరిశోధనలు చేపడుతుంది. ప్రధానంగా భవిష్యత్తు అవసరాల కొరకు పరిశోధనలు చేస్తున్న 15 అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రాలలో ఇక్రిశాట్ ఒకటి. ఉష్ణమండల ప్రాంతాల్లో ప్రత్యేకంగా ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించడానికి వ్యవసాయ పరిశోధనలు ద్వారా విశేషంగా కృషిచేస్తుంది.
వ్యవసాయ వాణిజ్య విభాగము - ఇక్రిశాట్:
వ్యవసాయానికి సంబంధించి వాణిజ్య కేంద్రాలను మొదటి సారిగా ప్రారంభించే ఔత్సాహికులకు తోడ్పాటు అందించడంలో వ్యవసాయ వాణిజ్య విభాగము ప్రధాన భూమిక వహిస్తుంది. వ్యవసాయ రంగం ద్వారా అభివృద్ధి చెందడానికి అవసరమైన శాస్త్రీయ పరిజ్ఞానం, సలహా సంప్రదింపులు, నిర్వహణ, శాస్త్రవేత్తల సహకారంతో పర్యవేక్షణ, మూలధన సేకరణ మరియు పెట్టబడి తదితర అంశాల్లో సహకారం అందించి, తద్వారా మెరుగైన అవకాశాలను ఏర్పరచి సమస్యలను కొంతమేర తగ్గిస్తుంది. భారత ప్రభుత్వం, ఇక్రిశాట్ సంయుక్త అధ్వర్యంలో వ్యవసాయ వాణిజ్య విభాగం, శాస్త్రీయ టెక్నాలజీ విభాగం సౌజన్యంతో, జాతీయ టెక్నాలజీ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ అభివృద్ధి మండలి ద్వారా ప్రారంభించడం జరిగింది.
ఆకృతి సంస్థ వ్యవసాయ శాస్త్ర పట్టభద్రులచే ప్రారంభించబడింది. ఆంధ్ర, కర్నాటక, రాష్ట్రాలలో రైతుముంగిట్లో వ్యవసాయ విజ్ఞాన కేంద్రాలను ఏర్పాటు చేసి, జాతీయ, అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రాల ద్వారా ఆధునిక శాస్త్రీయ పరిజ్ఞానాన్ని రైతుపొలాల్లోకి బదలాయించి రైతాంగాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తుంది. వ్యవసాయ వాణిజ్య విభాగము, - ఇక్రిశాట్ భాగస్వామ్యంతో, గ్రామీణవిత్తన కేంద్రాల అభివృద్ధిలో ఎంటర్ ప్రిన్యూర్స్ కు తోడ్పాటును అందిస్తుంది.
వ్యవసాయ శాఖ కమీషనర్ గారి ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న గ్రామీణ విత్తనాభివృద్ధి పథకాన్ని, ఈ గ్రామీణ విత్తన కేంద్రాలతో రాయలసీమ ప్రాంతంలో ప్రయోగాత్మకంగా ఖరీఫ్ - 2008 నుంచి అనుసంధానం చేయటం జరిగింది. ప్రధానంగా క్షేత్రస్థాయిలో విత్తనాభివృద్ధి పథకాన్ని బలోపేతంచేసి, వేరుశనగ, కంది, పప్పుశనగ, వరి, పంటలలో నాణ్యమైన విత్తనాలను వినూత్నమైన బ్రాండ్ ద్వారా రైతాంగానికి అందుబాటులో తేవడం జరుగుతుంది.
విత్తనోత్పత్తికి ముందు
వ్యాపార ప్రణాళికలు: ఈ విత్తన వ్యాపార కేంద్రాల ద్వారా అందజేయడం జరుగుతుంది.
కేంద్రాల అభివద్ధి: విత్తనోత్పత్తికి అవసరమైన శిక్షణ, నాణ్యతా ప్రమాణాలు, విత్తన సరఫరా, నిర్వహణ, విత్తనశుద్ధి, మార్కెటింగ్ కొరకు అవసరమైన సలహా సూచలనను అందజేయడం జరుగుతుంది.
ఒనగూరే సదుపాయలు: మార్కెట్ యార్డులు, బ్యాంకులు మరియు ప్రభుత్వరంగ విత్తన సంస్థలతో ఈ కేంద్రాలను అనుసంధానం చేయడం జరుగుతుంది.
విత్తనోత్పత్తి దశలో
నాణ్యమైన విత్తనాలు అందజేయుట: విత్తనోత్పత్తి అవసరమైన నాణ్యమైన మూలవిత్తనాలను అందించి, ఈ కేంద్రాల ద్వారా రైతులపొలాల్లో విత్తనోత్పత్తి కొరకు అందజేయడం జరుగుతుంది.
నాణ్యతా ప్రమాణాలు: విత్తన పరిక్షాకేంద్రాలలో నాణ్యమైన విత్తనాలను ధృవీకరించడానికి అవసరమైన సౌకర్యాలను, సదుపాయాలను కల్పించడం జరుగుతుంది.
విత్తనశుద్ధి మరియు ప్యాకింగ్: విత్తనశుద్ధి, ప్యాకింగ్ చేయడానికి, అవసరమైన యంత్ర పరికరాలను, ప్యాకింగ్ బ్యాగులను, అందజేయడం జరుగుతుంది.
విత్తనాల నిల్వ మరియు రవాణా: రైతుల పొలాల్లో ఈ కేంద్రాల ద్వారా ఉత్పత్తి చేసిన విత్తనాలను మార్కెట్ యార్డ్ గోదాముల్లో నిలువ చేయడానికి, అవసరమైన సహకారాన్ని అందజేస్తారు.
విత్తనోత్పత్తి అనంతరము:
గుర్తింపు (బ్రాండింగ్): ఉత్పత్తి చేసిన విత్తనాలకు ఉమ్మడి బ్రాండింగ్ తో మార్కెట్ చేయడం
పంపిణి (మార్కెటింగ్): విత్తనాలను మార్కెట్ లో అమ్మడానికి అవసరమైన విదివిధానాలను రూపకల్పన చేసి వివిధ సంస్థలకు, ఈ కేంద్రాల ద్వారా విక్రయించడం జరుగుతుంది.
నేను ములగాలపాలెం ఝాన్సీరాణి డ్వాక్రా గ్రూపు లీడరును. గ్రామీణ విత్తన కేంద్రాలు (యస్.బిఐ.) లో మా గ్రూపులోని సభ్యులందరము చేరినాము. ప్రత్యేక పద్ధతిలో, (యస్.బిఐ.) ద్వారా విత్తనోత్పత్తిలో శిక్షణ పొంది, ఐ.సి.జి.వి - 91114 వేరుశనగ రకాన్ని పండించి ఒక వినూత్నమైన ప్యాకింగ్ మరియు మన సీడ్స్ బ్రాండింగ్ తో మార్కెట్ చేస్తున్నాము. మా ఆర్ధిక పురోగతికి బాటలు వేస్తున్న భాగస్వామ్యులందరికీ ధన్యవాదాలు.
నేను గార్లదిన్నెలో, గ్రామాణ విత్తన కేంద్రాన్ని (యస్.బిఐ.) ప్రారంభించాను. (యస్.బిఐ.) ద్వారా విత్తనోత్పత్తిలో శిక్షణ పొంది, వేరుశనగ రకాలైన ఐ.సి.జి.వి - 91114, కె-6, వరిలో బి.పి.టి - 5204 రకాలను రైతుల పొలాల్లో శాస్త్రవేత్తల పర్యవేక్షణలో పండించి నాణ్యమైన విత్తనాలను మా గ్రామానికి అందించగలననే విశ్వాసంతో ఉన్నాను.
గత కొన్ని సంవత్సరాలుగా వేరుశనగలో నాణ్యమైన విత్తనాలు అందుబాటులో లేక, ఆశించిన దిగుబడిరాక ఆర్ధికంగా నష్టాలకు గురౌతున్నాము. అటువంటి మాకు యస్.బిఐ. ద్వారా మా గ్రామంలో రైతుస్థాయిలో విత్తనోత్పత్తి ద్వారా క్రొత్త వేరుశనగ రకాలతో మేలైన దిగుబడులు సాధించగలమని విశ్వాసంతోవున్నాము. ధీర్ఘకాలంతో మరికొన్ని క్రొత్త రకాలను ప్రవేశపెట్టి మా రైతాంగం అభివృద్ధికి తోడ్పడగలరని ఆశిస్తున్నాము.
నేను ఎస్.బి.ఐ. భాగస్వామ్యుల ప్రోత్సాహంతో ప్రారంభించిన విత్తన కేంద్రాల కార్యక్రమంలో ఎంటర్ ప్రిన్యూర్ గా చేరి లక్కిరెడ్డిపల్లె మండలంలో విత్తనోత్పత్తి చేపట్టినాను. కంది, వేరుశనగ పంటలలో నూతన వంగడాల విత్తనాలను ఈ కార్యక్రమం ద్వారా పండించి, మా ప్రాంత రైతులకు నాణ్యమైన విత్తనాలను అందిస్తాను.
ఆధారము:
ఆగ్రీ బిసినెస్ ఇన్ క్యుబేటర్ – పటాన్ చెరు 502324, ఆంధ్రప్రదేశ్, టెలిఫోన్: 040-30713417, ఫాక్స్: 040-30713075
ఆక్రుతి ఆగ్రికల్చరల్ అసోసియేట్స్ ఆఫ్ ఇండియా
#6-3-903/ఏ/3, 2 వ అంతస్తు, సూర్యనగర్, రాజ్ భవన్ రోడ్, సోమాజిగూడ, హైదరాబాద్ – 500082.
టెలిఫోన్: 40038381, సెల్: 9849910975
తేనెటీగల,పట్టు,పుట్టగొడుగుల,పెరటి తోటల,వర్మి కంపోస...