సేంద్రీయ ఎరువుల వాడకం వలన లాభాలు
- మొక్కకు కావలసిన స్థూల, సూక్ష్మ పోషక పదార్థాలైన నత్రజని, భాస్వరం, పొటాష్, కాల్షియం, మెగ్నీషియం, గంధకం, ఇనుము, జింకు, రాగి మొదలగు మూలకాలను సరఫరా చేస్తుంది.
- నేల భౌతిక స్థితి గతులను మెరుగు పరుస్తుంది. అంటే నీరు నిల్వ ఉంచే శక్తి, నేలలో గాలి ప్రసరణ, మట్టి రేణువులు ఒక దాని కొకటి పట్టి ఉంచే శక్తి మెరుగుపడతాయి.
- భూసారం, నేల ఉత్పాదక శక్తి మెరుగవుతాయి.
- సేంద్రీయ ఎరువుల వాడకం వలన భూమిలో సూక్ష్మ పోషక పదార్థాల నిష్పత్తి మారుతుంది. దీనివలన భూమిలోని మొక్కలకు హాని కలిగించే నులి పురుగులు శిలీంద్రాలు కొంత వరకు అదుపులో ఉంటాయి.
- రసాయనిక ఎరువుల వాడకం తగ్గుతుంది.
- సేంద్రీయ ఎరువుల నుంచి నత్రజని మెల్లగా విడుదల అవడం వలన నత్రజని నష్టం తక్కువగా ఉంటుంది.
- నేలలోని సూక్ష్మజీవులకు మంచి ఆహారం గాను, అవి అభివృద్ధిచెంది చురుకుగ పని చేయడానికి ఉపయోగ పడుతుంది.
- పండ్లు, కూరగాయలు, ఇతర పంటలలో నాణ్యత పెరుగుతుంది.
- ఉప్పునేలలు, చౌడునేలలో లవణ, క్షార గుణాలు తగ్గించి పంటల దిగుబడులను పెంచడంలో దోహద పడుతుంది.
- బరువు నేలలు గుల్లబారి వేర్లు చక్కగా పెరగడానికి సహాయ పడుతుంది. నీరు ఇంకడం పెరిగి మురుగు సౌకర్యం మెరుగవుతుంది.
- నీటిని గ్రహించి తేమను ఎక్కువ కాలం పట్టి ఉంచే శక్తి పెరగడానికి దోహద పడుతుంది. బెట్ట పరిస్థితిని తట్టుకునే శక్తి పెరుగుతుంది.
- భూమిలోని వ్యాధికారక సూక్ష్మ జీవులను నశింపచేసి మొక్కలకు రక్షణ కల్పిస్తాయి.
- మొక్కలలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుంది.
- వాడటం తేలిక, వాతావరణ కాలుష్యం తగ్గుతుంది. ఇన్ని ఉపయోగాలు ప్రత్యక్షంగా కనిపిస్తున్నప్పుడు మనరైతు సోదరులు ఈ సేంద్రీయ ఎరువులను సాధ్యమైనంత మేరకు వాడి లాభదాయక పథంలో పయనించాలని ఆశిద్దాము.
ఆధారము:కృషి విజ్ఞాన కేంద్రము కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థసంతోష్ నగర్ సైదాబాద్ హైద్రాబాద్.
చివరిసారిగా మార్పు చేయబడిన : 7/23/2020
0 రేటింగ్స్ మరియు 0 వ్యాఖ్యలు
నక్షత్రాలపై రోల్ చేసి, ఆపై రేట్ చేయడానికి క్లిక్ చేయండి
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.