వివిధ పథకాల ద్వారా ప్రయోజనం పొందడానికి దరఖాస్తు చేయవలసిన విధానాన్ని వివరంగా డైరెక్టర్ల బోర్డు, ఎప్పటికప్పుడు నిర్ణయిస్తంది. ఇందులో ఆన్ లైన ద్వారా దరఖాస్తును స్వీకరించడం, దరఖాస్తువిలువ, ప్రాజెక్టుల తనిఖీ, ప్రమాణాల పరిశీలన, ప్రాజెక్టు ప్రతిపాదనలను పరిశీలించే విధానం, అనేక మంజూరులను గురించి, సమాచారం దరఖాస్తుదాదులకుక్ ఇవ్వడం మరియు ప్రతిపాదనలను ఆమోదం, రికార్డులను భ్ద్రపరచడం మొ|| న అంశాలను కూడా డైరెక్టర్ల బోర్డు నిర్ణయిస్తుంది.
ప్రాజెక్టులకు, ప్రాథమిక ఆమోదం తెలపడం, అంటే లెటర్ ఆఫ్ ఇండెంట్ ఇవ్వడం, ప్రాజెక్టు ప్రతిపాదనల పరిశీలన , ప్రతిపాధిత ప్రాజెక్టుల అంచనా వ్యయాన్ని నిర్ణయించడం, ప్రాజెక్టులో అంతర్గత అంశాల గుర్తింపు, ఆయా ప్రాజెక్టులను బట్టి అన్ని పథకాల క్రింద అందించే ఆర్ధిక సహాయాన్ని మంజూరు చేయదగిన మొత్తాల నిర్ణయం మొ|| అన్ని అంశాలను విధానాలను ఆయా పరిస్థితులు కాలాన్ని బట్టి డరక్టర్ల బోర్డు నిర్ణయిస్తుంది.
వివిధ పథకాలకు సంబంధించిన ఈ మార్గ దర్శకాలు, 2010 మే నుండి అమలులోకి వస్తాయి.
సంస్థలు/ప్రోత్సాహక సంస్థలు అంటే ప్రభుత్వేతర సంస్థలు, తోటల పెంపకదారుల సంఘాలు, వ్యక్తులు, భాగస్వామ్య సంస్థలు, అధీకృత సంస్థలు లేక కంపెనీలు, కార్పోరేషన్స్ , సహకార సంస్థలు, వ్యవసాయ ఉత్పత్తి మరియు మార్కెటింగ్ కమిటీలు, మార్కెటింగ్ బోర్డులు లేక కమిటీలు,మున్సిపల్ కార్పోరేషన్స్ లేక కమిటీలు, వ్యవసాయధార పరిశ్రమలు, కార్పోరేషన్స్ , రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, మరియు ఇతర పరిశోధన మరియు అభివృద్ధికి సంబంధించి సంస్థలు ఈ పథకాల క్రింద సహాయం పొందడానికి అర్హత కలిగిన సంస్థలుగా గుర్తించబడ్డాయి.
పద్ధతుల గురించి, విడివిడిగా వాటి గురించిన చాప్ట్రర్లలో వివరంగా పేర్కొనబడ్డాయి. జాతీయ ఉద్యానవన బోర్డు ఈ రెండు సంస్థలలో ఏదైనా ఒక సంస్థ నుండి మాత్రమే సహాయం పొందే అవకాశముంది. అంటే ఒక సంస్థ నుండే ఆర్ధిక సహాయం ఇవ్వబడుతుంది. అపెడా, యం.ఎఫ్ .పి.ఐ., ఎన్ .ఎమ్ . పి.బి., మొ|| న కేంద్ర ప్రాయోజత పథకాల క్రింది ఆర్ధిక సహాయం పొందిన ప్రాజెక్టులు లేక ప్రాజెక్టు ఉప విభాగాలుగానీ, జాతీయ ఉద్యానవనబోర్డు యొక్క పథకాల ద్వారా ఆర్ధిక సహాయం పొందే వీలులేదు.
ఆదారము:జాతీయ ఉద్యానవన బోర్డు వారి వ్యవసాయ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/27/2020