మన సమాజంలో చూసినట్లయితే మూఢ నమ్మకాలూ రోజు రోజుకు పెరుగుతూ వస్తున్నవి. ఉత్తర దేశంలో రెండు రాష్ట్రాల మధ్య గొడవలకు కూడా ఈ మూఢ నమ్మకాలే. దీనికి ఉదాహరణ పంజాబ్, హర్యాన. ఈ రెండు రాష్ట్రాల మధ్య గొడవ రాబాబా అనే ఒక బాబా వల్ల వచ్చింది. ఈ గొడవ మొదలైందంటే డేరాబాబా ఒక సామాన్య మనిషి. ఒక మాత సమస్యని సృష్టించాడు. ప్రజల భక్తి తన నమ్మకాలను ఆసరాగా తీసుకొని అనేక సంక్షేమ కార్యక్రమలను జరిపిస్తూ కొన్ని అవినీతి కార్యక్రమాలకు పాల్పడ్డాడు. అవినీతి భక్తి ముసుగులో ప్రజలను మోసగిస్తూ జీవనంసాగిస్తున్నాడు. అతనికి ప్రభుత్వం కూడా సహకరించడం వల్ల అతను ఎక్కువగా చలామణి అవుతున్నాడు. ఎట్టకేలకు అతని రహస్య అవినీతి కార్యక్రమాలు బహిర్గతం అవడంవలన అతనికి కోర్టు 12 సంవత్సరాలు శిక్ష విధించింది. అప్పటికి కూడా ప్రజలలో ఇంకా మార్పు రాలేదు. అతనికి శిక్ష పడ్డందున కిరాయి ముఖాలతో ప్రజల ఆస్తులకు, ప్రాణాలకు నష్టం కల్గింది. ఇలాగె డేరా బాబా వంటి బాబాలు అంతో మంది ఉన్నారు. అందుకని ప్రజలు మూఢంగా దొంగబాబాలను, దొంగ స్వాములను నమ్మకూడదు. బాబాలైన, స్వాములైనా, ఫకీర్లయినా, ఫస్టార్లయినా ఆర్భాటంగా బతికేవాళ్లను నమ్మకూడదు. ఓట్లు అడగడానికి వచ్చే రాజకీయ నాయకులూ ముందుగా ఇలాంటి బాబాలు, స్వాముల దగ్గరికి వెళ్లి తీసుకొని తర్వాత వల్ల ప్రయత్నిస్తున్నాడు మొదలు పెడుతున్నారు. దీన్ని మనం ఖండించాలి. ప్రజలు విజ్ఞానవంతులు కావాలి. వాళ్ల ఆలోచనలను మార్చుకోవాలి. ప్రతి విషయంలో దోషం ఉందని చెప్పి, పూజలు చేసి దోషం తొలగిస్తామంటూ, ప్రజల డబ్బులను అన్యాయంగా తీసుకుంటున్నారు.
ఆధారము ;చెకుముకి
చివరిసారిగా మార్పు చేయబడిన : 3/14/2020