మీకు తెలుసా ? .... ఎలుకలూ, పిల్లులూ వంటి కొన్ని జంతువులు ముందరి పళ్ళు నిరంతరం పెరుగుతూ వుంటాయి. మనకులాగా ఎంతో కొంతమేరకు పెరిగాక వాటి పెరుగుదల ఆగిపోవడం అంటూ జరగదు. ఆ జంతువులు బతికినంత కాలం ఆ ముందరిపళ్ళు పెరుగుతూనే వుంటాయి. చిత్రంగా ఉంది కదా... అయినా ఇది నిజం.
తమ ముందరి పళ్ళు నిరంతరం పెరిగే కారణంగానే ఎలుకలు తమ కడుపు నిండినప్పటికీ ఎప్పుడూ ఏదో ఒక దాన్ని కొరుకుతూ వుంటాయి. అలా చేయడం వల్ల వాటికి పెరిగే పళ్ళు కొంచెం కొంచెంగా అరిగిపోతుంటాయి. ఒకవేళ అవి ఇలా దేన్నీ కొరకలేదనుకోండి. అప్పుడేం జరుగుతుమదో తెలుసా.... వాటి పళ్లు క్రమక్రమంగా చాలా పెద్దగా అయిపోతాయి. అప్పడవి తమ నోటిని మూసుకోలేవు.
ఎలుకలు దేన్నైనా కోరికినప్పుడు. అదే పై దంతాలు ఆ వస్తువులోకి చొచ్చుకొనిపోతాయి. అదే సమయంలో క్రింది వైపు నించి క్రింది దంతాలు పైకిపోయి పై దంతాలను కాపాడుతాయి. ఈ రెండు రకాల దంతాలు ఒక దాన్నొకటి రాసుకోవడమేగాక, అదే సమయంలో ఆ పదార్థంలోని కొంత భాగం కూడా ఎక్కువై ఊడి వస్తుంది.
ఎలుకలు పళ్ళు ఎంత గట్టిగా వుంటాయంటే వాటి సాయంతో అవి సిమెంటు, ఇంకా లోహాలతో చేసిన వస్తువులను కూడా కొరకగల్గుతాయి. అందుకే సిమెంట్ గోడల్లో ఎలుకలు (పందికొక్కులు) సొరంగాలు చేయకుండా, కొందరు సిమెంటులో సన్నని గాజు ముక్కల్ని కలుపుతారు.
ఎలుకలు వేలాడే తాళ్ళపైన చక్కగా నడవగల్గుతాయి. ఆ సమయంలో పడిపోకుండా శరీరంలో సమతల్యతను సాధించే నిమిత్తం అవి తమ పొడవాటి తోకలను ఉపయోగించుకుంటాయి.
ఎలుకలు ఎంత ఇరుకైన ప్రదేశంలోనైనా దూరి ముందుకు పొగల్గుతాయి. ఇక ఇరుకైన ప్రదేశంలో ఏదో ఒక విధంగా అవి తమ తలను దూర్చగలిగితే చాలు. ఇక మిగతా శరీరమంతా ఎంతో తేలిగ్గా లోనికి వెళ్ళిపోతుంది. ఎలుకలను సంబంధించి దీన్ని మరొక ప్రత్యేక విషయంగా చెప్పకోవాలి.
ఎలుకలు అప్పడప్పుడూ తమ వెనుకకాళ్ళపైన నిలబడతాయి. ఇలా నిలబడేటప్పుడు అవి తమ తోక సాయాన్ని తీసుకుంటాయి.
ఎలుకలు కళ్ళు (కంటి చూపులు) చాలా బలహీనంగా వుంటాయి. అందుకే ఇవి దేన్నైనా వెతికేటప్పుడు తమ పొడవాటి మీసాలను నేలకు తాకించి, ఆ స్పర్శ ద్వారా అక్కడ ఏమున్నాయో తెలుసుకుంటాయి. పాడైపోయిన, కుళ్ళిపోయిన ఆహారాన్ని తిన్నప్పటికీ ఎలుకలు జబ్బున పడవు. చల్లని వాతావరణం, లేదా చలివల్ల కూడా ఎలుకలను ఏమంత నష్టం వాటిల్లదు. ఎలుకలకు లాగానే కుందేళ్ళకు, ఉడతలకు కూడా ముందరి పళ్ళు ఎప్పటికీ పెరుగుతూ వుంటాయి. అందుకే ఇవి కూడా ఎలుకల్లాగే ఎలుకల్లాగే ఎప్పుడూ ఏదో ఒక దానిని కొరుకుతూ వుంటాయి.
చివరిసారిగా మార్పు చేయబడిన : 4/4/2022