ఈ రోజుల్లో ప్లాస్టిక్ వినియోగం విపరీతంగా పెరిగిపోయిది. మనం వాడుతున్న ప్లాస్టిక్ లో చాల వరకు భూమిలో కరిగిపోవడం లేదు. చెత్తగా పారేస్తున్న ప్లాస్టిక్ భూమిలో కలిసిపోయేందుకు కొన్ని వేల సవత్సరాలు కూడా పట్టవచ్చు. ఈ విపరీత పరిణామాల కారణంగా భూమి ప్లాస్టిక్ గోళంగా మారిపోతుందని అమెరికాలో జార్జియా యూనివర్సిటీ ఓ అధ్యనం లో తేల్చింది. 1950 నుంచి 2015 వరకు ప్రపంచ వ్యాప్తంగా 830 కోటన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి అయేది. ఇందులో 630 కోట్లటన్నుల ప్లాస్టిక్ చెత్త రూపంలో భూమి మీద పేరుకుపోయిన్ది ప్లాస్టిక్ చెత్త లో 9 శాతాన్ని రీసైక్లింగ్ చేయగా, 12 శాతాన్ని కాల్చివేశారు ( incinerated ). అంటే వృధాగా ప్లాస్టిక్ లో 79 శాతం గోతుల్లో ( land fills ) ను పర్యావరణంలోను పేరుకుపోయి కలుషాన్ని కలిగిపోయేది. ధోరణి ఇలాగె కొనసాగితే 2050 నాటికీ 1200 కోట్ల ప్లాస్టిక్ చెత్త పోగుపడిపోతుందని , ఈ ప్రమాదాన్ని దృష్టి లో పెట్టుకుని మనం వాడే ప్లాస్టిక్ వస్తువులు , చెత్త యాజమాన్య పద్దతులను గురించి తీవ్రంగా ఆలోచించి జార్జియా యూనివర్సిటీ శాస్త్రవేత్త ప్రొఫిసర్ జెన్నా జాంబెక్ పేరుకొన్నారు
ఆధారము: చెకుముకి
చివరిసారిగా మార్పు చేయబడిన : 4/24/2020