అనగా అనగా ఒక ఊరిలో సుజాత అనే ఒక సలి ఆవిడ ఉండేది. ఆమెకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. వాళ్ళు హైదరాబాద్ లో వ్యాపారం చేస్తున్నారు. పెద్దకొడుకు రవి బట్టల వ్యాపారం, చిన్న కొడుకు శ్రీను గాజుల వ్యాపారం చేస్తున్నారు. పెద్ద కొడుకుకు రోజుకు రూ. 5000 వస్తాయి. చిన్నకొడుకుకు రోజుకు రూ.4500 వస్తాయి. అయితే ఆ డబ్బు వాళ్ళు అమ్మకు ఇస్తారు. పెద్దకొడుకు రోజుకు రూ.3000 ఉంచుకొని మిగిలిన రూ. 2000 ఇచ్చాడు. చిన్నకొడుకు రోజుకు రూ. 500 ఉంచుకొని అమ్మకు రూ.4000 ఇచ్చాడు. తల్లి చిన్నకొడుకును చూసి ఎంతో మురిసిపోయేది. అది సహించలేక పెద్దకొడుకు ఎలాగైనా చిన్న కొడుకుని అమ్మనుంచి దూరం చేయాలని అనుకున్నాడు.
ఒక రోజు తల్లి సుజాత కొడుకులను ఇంటికి రమ్మని పిలిచింది. వస్తున్నాము అన్నారు. తెల్లారి బయలు దేరారు. అప్పడు దారిలో ఒక కళ్ళులేని మనిషి కనిపించాడు. ఆయన ధర్మం చేయండి అని పెద్దకొడుకును అడిగాడు. అయితే పెద్ద కొడుకు రవి. నీకు నేనే దొరికానా అని అన్నాడు. అయితే చిన్నకొడుకు శ్రీను అయ్యా నేను నీకు దానం చేస్తాను అన్నాడు. అప్పుడు ఆ కళ్ళు లేని మనిషి బాబు నీకు పుణ్యం దక్కుతుంది, నీవు నూరేళ్ళు చల్లగా ఉండు అన్నాడు. అయితే పెద్దకొడుకు తమ్ముడితో నీకు పనీ పాట లేదా, ఉన్న డబ్బు గుడ్డి వాడికి దానం చేసావుగా ఇప్పుడు మనం ఎలా వెళ్ళాలి అన్నాడు.
అపుడు చిన్నకొడుకు అన్నయ్యా! నేను నడుస్తూ వస్తాను నీవు బస్సులో వెళ్ళు అన్నాడు. పెద్దకొడుకు సరే అన్నాడు. చిన్నకొడుకు నడుస్తూ వెళ్తున్నాడు. పెద్దకొడుకు మాత్రం నాకు వీడి పీడ వదిలింది. నామనస్సు ప్రశాంతంగా వుంది అనుకున్నాడు. పెద్ద కొడుకు ఇంటికి చేరుకున్నాడు, ఈ లోపే చిన్నకొడుకు ఇంటికి చేరుకున్నాడు. పెద్దకొడుకు తమ్మున్ని ఒరే నీవు నడుచుకుంటూ వచ్చావు కదరా అన్నాడు. తమ్ముడు అన్నయ్యా నాకు రన్నింగ్ లో ఫస్ట్ కదా మరినేను అన్నింటికంటే వేగంగా వెళ్తాను కదా అందుకనే నీ కంటే కొంచెము ముందు వచ్చాను అని అన్నాడు. చిన్నకొడుకు అమ్మ ఎక్కడ వుంది? అని అన్నాడు. పెద్దకొడుకు నాకేం తెలుసు? ఎక్కడ ఏమూలన పడి ఉందో అని అన్నాడు. అయితే చిన్నకొడుకు అవి ఏమి మాటలు అన్నయ్యా అన్నాడు. సరేలేగాని నాకు కడుపు మండిపోతుంది, అన్నం పెట్టమను అన్నాడు. చిన్నకొడుకు తల్లిని అమ్మా, అమ్మా అని పిలిచాడు. వచ్చారా నాయనా అని తల్లి అన్నది. అయితే పెద్దకొడుకు వచ్చి సచ్చాములే గాని అన్నం పెట్టు అన్నాడు. అపుడు చిన్న కొడుకు అన్నయ్యా మనకు జన్మనిచ్చిన తల్లి కదా అలా అనవద్దు అని అన్నాడు. అయితే పెద్దకొడుకు సరేలేగాని మా ఇద్దరికి అన్నం పెట్టు అన్నాడు.
అప్పుడు అమ్మ “ పెడతాగాని ముందు నాకు హైదరాబాద్ నుండి ఏమైనా తెచ్చారా?” అన్నది. అయితే పెద్దకొడుకు నీ మొహానికి నెక్లెస్ గానీ కావాలా అన్నాడు. తల్లి నిన్ను అడగలేదు అన్నది. తల్లి " చిన్నా నువ్వు ఏమైనా తెచ్చావా?” అని అడిగింది. చిన్నకొడుకు “ నేను నీకు హైదరాబాద్ నుండి డైమెండ్ నెక్లెస్ తెచ్చాను” అన్నాడు. పెద్దకొడుకు “దాని మొహానికి డైమెండ్ నెక్లెస్ కావాలా?” అన్నాడు. చిన్నకొడుకు నువ్వు అరవకు అన్నాడు. అయితే అమ్మ “నా చిన్నకొడుకుకి నా దిష్ట తగిలేటట్లు ఉన్నది” అని అన్నది. పెద్దకొడుకు “నీ దిష్టి తగిలిందిలే” అన్నాడు.
అమ్మ ఒరే! మీకు నేను ఒక పరీక్ష పెడతాను. ఇద్దరిలో పరీక్షలో ఎవరు గెలిస్తే వాళ్ళు ఇంటికి మహారాజు అంది. దానికి ఇద్దరూ ఒప్పుకున్నారు. పెద్దకొడుకు ఏంటిదో చెప్పు అన్నాడు. అయితే తల్లి రెండు చీకటి గదులు ఇచ్చింది. వాటిలో ఎవరయితే ఒక రోజు మొత్తం వెలుగు ఉంచుతారో వాళ్ళే ఇంటి మహారాజు అని తల్లి అన్నది. పెద్దకొడుకుకి ఒక చీకటి గది, చిన్నకొడుకుకి ఒక చీకటి గది ఇచ్చింది. అమ్మ లైటు గాని బల్బ్ గాని ఉపయోగించరాదు అన్నది. పెద్దకొడుకు ఎంత ప్రయత్నించిన ఎలా వెలిగించాలో తెలియలేదు. ఒక అబ్బాయిని పిలిచి కొవ్వొత్తులు తెప్పించి వెలిగిస్తే అవి ఆరిపోయాయి. చిన్నకొడుకు ఆలోచించగా ఒక ఐడియా వచ్చింది. దీపాల కప్పులో దూది పెట్టి వెలిగించాడు, అప్పుడు ఆ దీపం వెలుగుతూనే ఉంది. వాళ్ళ ఇద్దరికి ఇచ్చిన టైం అయిపోయింది. చిన్నకొడుకుది వెలుగుతూనే ఉంది కాబట్టి ఇచ్చిన మాట ప్రకారం చిన్న కొడుకుని మహారాజుని చేశారు. పెద్ద కొడుకు చిన్నకొడుకు ఇచ్చిన డబ్బుతో బతుకుతున్నాడు.
ఆధారం: నూతలపాటి సంధ్య.
చివరిసారిగా మార్పు చేయబడిన : 6/20/2020