వాహనాల్లో తరచుగా ఒక ఇంధనంగా వాడే మిథనాల్ ను గాలిలోని ఆక్సిజన్ ఉపయెగించుకుని తయారుచేసే విధానాన్ని బ్రిటన్ లోని కార్డిఫ్ యూనివర్సిటీ శాత్రవేత్తలు కనుగొన్నారు. ప్రస్తుతం మిథనాల్ తయారీకి సహజవాయువును అధిక ఉష్టోగ్రత వద్దనే మిథనాల్ ను సంశ్లేషణ చేసారు. ఇందుకు ఆక్సిజన్ ను , హైడ్రోజన్ పెరాక్ససిడ్ ను ఉపయోగించారు. ఈ పద్ధతి వివరాలు 'సైన్స్' జర్నల్ లో ప్రచురించబడ్డాయి. ప్రస్తుతం సహజ వాయువు ఉత్పత్తి ఏడాదికి 2.4 బిలియన్ టన్నులుండగా అందులో 4 శాతం అంటే సుమారు 100 మిలియన్ టన్నులను వృధాగా మండిస్తునారు. శాస్త్రజ్ఞులు కనుగొన్న కొత్త విధానంలో ఇలా వృధా అవుతోన్న సహజ వాయువును, గాలిలోని ఆక్సిజన్ ను ఉపయోగించుకుంటారు. దీనివల్ల గాలిలోకి CO2 ఉద్గరాలూ తగ్గుతాయని స్వచ్ఛమైన, పరియావరణ హితమైన పారిశ్రామిక పద్ధతులకు ఇది దోహదం చేస్తుందని చెబుతున్నారు.
ఆధారం: చెకుముకి
చివరిసారిగా మార్పు చేయబడిన : 6/20/2020