నెల్లూరు జిల్లా కనిగిరి రిజర్వాయర్ ప్రక్కనే ఉన్న గాంధీ జన సంఘంలో జన్మించి విజయనగరం సైనిక పాఠశాలలో ఇంటర్ వరకు చదివాడు. విజయనగరం సైనిక పాఠశాలలో ఉన్న ఉదయకుమార్ విగ్రహం ద్వారా ఉత్సాహంతో తన చిన్నతనం నుంచి ఉన్న ప్రకృతి, పర్వాతాలు, పంటపొలాలు, పరిశీలనతో పాటు పర్వతాలు ఎక్కాలని కోరికకు పదును పెట్టుకొని అనంతరం జెంషెడ్ పూర్ ఎన్.ఐ.టి లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 1992-96 మధ్య పూర్తి చేసి, ఖరగ్ పూర్ ఐఐటి నందు ఎమ్.టెక్ విద్యనభ్యసించి, కలకత్తాలో ఐఐఎమ్ పూర్తిచేసి ఇదే సందర్భంలో డాక్టర్ బి.సి.రాయ్ అవార్డు పొందిన వ్యక్తి.
చిన్నతనం నుంచి విద్యతో పాటు ప్రకృతి పరిశీలన, స్థానికంగా ఉన్న కొండలు ఎక్కడంలో ముందుండే వ్యక్తి. ఈ మధ్య అండిస్ పర్వతాలలో మరణించిన ప్రముఖ పర్యతారోహితుడు మల్లిమస్తాన్ బాబు. సాహసమే ఆయన ఊపిరి. ప్రపంచంలోని అన్ని పర్వతాలను అధిరోహించాలనేది ఆయన లక్ష్యం. ఎన్నో రికార్డులు సాధించారు. ఎటువంటి శిక్షణలు లేకపోయినా తను అనుకొన్న లక్ష్యాన్ని పూర్తి చేయాలని తపన పడ్డారు. ఎవరూ కూడా ఇతని ఆశయాన్ని పట్టించుకోలేదు. కేవలం మస్తాన్ బాబు స్నేహితులు మాత్రం ఇతని పట్టుదలకు చేదోడుగా వ్యవహరించారు. సాధారణంగా పర్వతారోహకులు ప్రపంచంలోని ఎత్తైన శిఖరం ఎవరెస్టు అధిరోహించాలన్నది కలగా ఉంటుంది. కాని మస్తాన్ బాబు 2006లో ఈ పనిని పూర్తి చేశారు. కేవలం ఎవరెస్టు శిఖరం మాత్రమే కాకుండా ప్రపంచ ప్రధానమైన శిఖరాలను అధిరోహించి ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందారు.
2014 డిసెంబర్ 16వ తేదీ తన ఇంటి నుంచి అండీస్ శిఖరాలను అధిరోహించాలని బయలు దేరాడు. 2015 మార్చి 21న తను బృందంతో కలిసి అండీస్ పర్వాతాలను అధిరోహించడం ప్రారంభించారు. మార్చి 24వ తేది నుండి ఆయన నుంచి బేస్ క్యాంప్ కు సమాచారం లేదు. దీనితో అతని మిత్రులు, చిలీ దేశంలోని భారత రాయబార కార్యాలయం అన్వేషణ ప్రారంభం చేయగా ఏప్రిల్ 4వ తేదీ నాటికి మస్తాన్ బాబు మృతదేహం కనిపించింది.
మస్తాన్ బాబు సామాన్య కుటుంబంలో జన్మించి ఉన్నత విద్య చదివి ఎక్కడ కూడా తన ఆలోచనకు, తన లక్ష్యానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, తన లక్ష్యానికి చేరే దశలో పెళ్లి అడ్డుపడుతుందని, పెళ్లి మానుకొని తన లక్ష్యసాధనలో ప్రకృతి మాత పర్వత శిఖరాలలో మస్తాన్ బాబు మరణించడం చూశాము. ఈయన జీవిత అంశాన్ని పిల్లల పాఠ్య గ్రంథాల్లో చేర్చాలని జెవివి కోరుతుంది.
ఆధారం: ఎన్. శంకరయ్య.
చివరిసారిగా మార్పు చేయబడిన : 6/20/2020