ఆజాద్ జననం 1905 వ సంవత్సరం మధ్యప్రదేశ్ లలోని "బావరా" గ్రామంలో జరిగింది. తండ్రి పేరు సీతారాంజి తివారి. తల్లి పేరు జుగరాని. వీరిది నీరు పేద కుటుంబము.
ఈయన కాశీలి సంస్కృతం చదవటానికి వెళ్లాడు. గాంధీజీ ప్రారంభించిన సహాయ నిరాకరణ ఉద్యమంలో దూకాడు. ఆయనకు పోలీసులు నిర్బంధించారు. కోర్టులో జడ్జి "నీ పేరు?" అని సమాధానం ఇచ్చాడు. ఇదివిన్న మేజిస్ట్రేట్ 15 బెత్తం దెబ్బలు కొట్టమని అజపించాడు. దెబ్బ దెబ్బకు "వందేమాతరం" "మహాత్మ గాంధీకి జై" అని అయన నినదించాడు. కకోరి రైలు దోపిడీలో పాల్గొన్న నలుగురిలో ఈయన ఒకడు. అయన, సర్దార్ భగత్ సింగ్ తో కలిసి పనిచేశారు. వీరితో రామ ప్రసాద్ బిస్మిల్, రాజేంద్రనాధ్ లోహిడి, అస్సాక్ ఉలాఖాన్, రోషన్ సింగ్ లు ఉన్నారు.
ఈయన ఒక నేర్పరియైన విప్లవకారుడు. కకోరి ఉదంతానికి నేత ఆయనే. భగత్ సింగ్ నీ తప్పించి తానే పట్టుబడదలచాడు. రామప్రసాద్ బిస్మిల్ తో కలిసి ప్రభుత్వ ఖజానాలు దోచాడు. ఈయన జవహర్ లాల్ నెహ్రూతో కూడా కలిశాడు. ఈయన జీవితాంతం ఆంగ్లేయులకు పట్టుబడకుండా "ఆజాద్" గా ఉంటానని ప్రతిజ చేశాడు. ఈయన జీవితం "ఆజాద్" గానే సమాప్తమైంది.
దారిద్రంతో గడిచిన ఉత్తమ శీల సంపన్న జీవితం ఆయనది. ఈయనను నిర్భంధించడానికి పోలీసులు వెంటపడ్డారు. 1931 సంవత్సరం ఫిబ్రవరి 27 వ తేదీన అలాహాబాదులో ఆల్ ప్రేడ్ పార్కులో కూరుచుండి ఉండగా ఈయన్ని పోలీసులు చుట్టుముట్టారు. నాట్ వపర్ అనే వాడు గుండు పేల్చాడు. అది ఇతని పిక్క ఎముకను చిత్తు చేసింది. రెండవది కుడి భుజానికి తగిలింది. ఇంతలో ఆజాద్ కూడా పిస్తోలుతో వాణ్ణి కాల్చాడు. వాడు పరిగెత్తి చెట్టు చాటున దాక్కున్నాడు. ఆజాద్ కూడా చెట్టును చాటు చేసుకున్నాడు. తిట్టుతూ వచ్చిన ఎస్.పి.నీ క్రంద పడేటట్టు కొట్టాడు. చివరకు పోలీసులకు ప్రాణాలతో చిక్కకుండా తనను తాను పీల్చుకొని అక్కడే చనిపోయాడు. ప్రాణంతో పోలీసులకు దొరకానన్నాడు. అందుకే తనను తాను పేల్చుకున్నాడు. విప్లవవీరులు మాకురంగా జీవించాడు చంద్రశేఖర్ ఆజాద్.
చివరిసారిగా మార్పు చేయబడిన : 6/16/2020