భారతీయ ఆధునిక వైజకులలో జగదీష్ చంద్రబోసు తలమానికం వంటివారు. క్రి.శ. 1858 నవంబర్ 30 వ తేదీన బెంగాల్ లోని మైమెన్ సింగ్ లో జనమించారు. ఇంగ్లండులో విద్యాభ్యాసం పూర్తి చేసుకొని కలకత్తాలోని ప్రెసిడెన్సీ కళాశాలలో భౌతికశాస్త్ర అధ్యాపకునిగా పనిచేశారు. వృక్షశాస్త్రంలోను, భౌతిక శాస్త్రంలోనూ అధ్యయనం చేసేవారు. ప్రకృతిని పరిశీలించారు. మార్కొని కనిపెట్టాడని చెప్పబడుతున్న ఎలక్ట్రోమాగ్నటిక్ రేడియే వేవ్స్ ఆధారంగా పనిచేసే వైర్ లెస్ టెలిగ్రాఫ్ ను అతను 1894 లోనే కనిపెట్టి ప్రయేగాత్మకంగా నిరూపించారు. రేడియే వేవ్స్ ను తెల్సుకునే కామెరర్ పరికరాన్ని కూడా అతను కనిపెట్టారు.
మొక్కలకు కూడా ప్రాణం ఉంది. అవి సవందిస్తాయి. దీనిని బుజువు పరిచేందుకు జగదీష్ చంద్రబోసు ఇంగ్లండు వెళ్ళారు. శాస్త్రాలతో కూడిన సభలో ఆవిషయాన్ని నిరూపించాలనుకున్నారు. బోసు ఒక మొక్కకు ఇంజెక్షన్ ఇచ్చి దానిని బుజువు చేయాలనుకున్నారు. విషప్రభావం చెట్ల పై కూడా ఉంటుందని, ఇతర ప్రాణుల్లో వాలే వారిలో కూడా ప్రతిక్రియ ఉంటుందని చెప్పదల్చుకున్నాడు. ఒక మొక్కకు విషపు ఇంజెక్షన్ ఇచ్చారు కానీ దానిలో మార్పు కనిపించలేదు. మొదట ఎలా ఉందొ అలాగే ఉంది. అప్పుడు జగదీష్ చంద్రబోసు అదే ఇంజెక్షన్ తాను కూడా చేసున్నాడు. బోసుకు కూడా ఏమి కాలేదు. అప్పుడు ఇంజెక్షన్ పరిశీ స్తే అది విషం కాదని తేలింది. తరవాత నిజమైన విషపు ఇంజెక్షన్ మొక్కకు చేస్తే దాని ప్రభావం తెలియవచ్చింది. దాంతో చంద్రబోసు చెట్లకు ప్రాణం ఉందన్న విషయాన్నీ సునాయాసంగా నిరూపించి అందరి ప్రశంసలు పొందారు.
చివరిసారిగా మార్పు చేయబడిన : 6/16/2020