భారతదేశ చరిత్రలో ఎందరో వీరులు, శూరులు ఉన్నారు. బ్రిటిష్ వారిని ఎదిరించిన వీరనారీమణులలో ఝన్సీ రాణి లక్ష్మీబాయి గొప్ప పేరు పొందినది.
ఝన్సీ లక్ష్మీబాయి 1827 వ సంవత్సరం బనారస్ లో జనమించింది. ఆమె తల్లిదండ్రులు - మేరోపంత్ తాంబే, బటిరారదీబాయి, లక్ష్మిబాయిని ముద్దుగా మను అని పిలిచేవారు. అమ్మ చెప్పే రామాయణ, మహాభారత కథలంటే మానుకి చాలా ఇష్టం.
మానుకి 4 సంవత్సరాల వయసులో అకస్మాత్తగా తల్లి చనిపోయంది. మేరోపంతే తన నివాసాన్ని బనారస్ నుండి బీరూర్ కు మార్చాడు. మనుకు తన బాధను మరిచిపోఎందుకు ఎక్కువకాలం పట్టలేదు. ఆమెకు అక్కడ నానాసాహెబ్, తాంతియాతోపేలతో స్నేహం లభించింది. వారితో కలిసి ఆమె గుర్రపుస్వారీ, తుపాకీ పేల్చడం వంటిని నేర్చుకుంది. వాళ్ళతో పాటె బడికి వెళ్ళి చదువుకునేది.
ఝన్సీని పాలించే గంగాధర్ రావు మానుని పెండ్లి చేసుకొన్నాడు. అప్పటి నుండి మను పేరు లక్ష్మీబాయి, ఝన్సీరాణిగా మారిపోయంది. భర్త చనిపోయిన తరువాత ఆమె ఝన్సీ కి రాణి అయంది. ఆ సమయంలో ఆంగ్లేయులు మన దేశాన్ని మొత్తం ఆక్రమించేశారు. వీరు ఝన్సీ ప్రాంతాన్ని కుడు ఆక్రమించాలనుకొన్నారు. అప్పుడు లక్ష్మీబాయి తాను కోటాలో రహస్యంగా దాచిన ఆయుధాలను వెలికి తీయంచింది. తుఫాకులు, కత్తులు తయారుచేసి కర్మాగారాలను ఏర్పాటుచేసింది. వేలాది మంది స్త్రీ పురుషులకు యుద్ధ విద్యలో శిక్షణ ఇప్పించింది. సైనాన్ని పెంపుచేసింది.
ఆంగ్ల సైనికులు 'ఝన్సీ' రాజ్యాన్ని ముట్టడించడానికి వచ్చారు. ఆంగ్లేయుల ఫిరంగులు కోట గోడలను పేల్చివేశాయి. గోడలు పగిలిపోయాయి. బ్రిటిష్ సేనలు కోటలోకి దూసుకుపోయాయి.
ఝన్సీ ప్రజలకు, బ్రిటిష్ వారికి గొప్ప యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో లక్ష్మీబాయి సైనికులు చాలా మంది చనిపోయారు. రాణి శత్రువుల కళ్ళు గప్పి తప్పించుకొంది. తన బిడ్డ డామేదార్ ను శాలువాతో తన వీపుకు కట్టుకొని గుర్రం పైకి దూకి కోట కింది భాగం నుండి వెళ్ళిపొయంది.
మరొకసారి ఆంగ్లేయులకు లక్ష్మిబాయికి యుద్ధ జరిగింది. లక్ష్మీబాయి రెండు చేతులతో రెండు కత్తులు పట్టుకొంది.
గుర్రం పగ్గలను నోటితో పట్టుకొని ఒక్కక్కరిని చీల్చి చెండాడసాగింది. ఇలా రెండు రోజులు భయంకరమైన యుద్ధం జరిగింది. మూడవ రోజున ఒక అనామక సైనికుని కాల్పులకు గాయపడింది. ఆమె గ్వాలియర్ కోటవద్ద సారాయి ప్రాంతంలో పడిపోయంది. ఆమె సైనికులు వెంటనే అక్కడికి చేరుకొన్నారు. "నా వజ్రాల నగలను సైనికులకు ఇవండీ. నా బిడ్డ డామేదార్ ను చక్కగా పెంచండి అని చెబుతూ చనిపోయంది."
చివరిసారిగా మార్పు చేయబడిన : 6/16/2020